-
హార్దిక్ పాండ్యా ఫిట్
ముంబై: భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ ఫిట్నెస్ అందుకున్నాడు. న్యూజిలాండ్ పర్యటననుంచి తిరిగొచ్చిన తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో టి20, వన్డే సిరీస్లకు దూరమైన అతను వెన్ను గాయంనుంచి కోలుకొని ఐపీఎల్కు సన్నద్ధమవుతున్నాడు. గురువారం అతను ముంబై ఇండియన్స్ జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. మరో వైపు కోల్కతా నైట్ రైడర్స్ పేస్ బౌలర్ కమలేశ్ నాగర్కోటి వరుసగా రెండో ఏడాది గాయం కారణంగా ఐపీఎల్ మొత్తం సీజన్కు దూరం కానున్నాడు. 2018లో కూడా కమలేశ్ గాయంతో చివరి నిమిషంలో ఐపీఎల్నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతని స్థానంలో కోల్కతా కేరళ పేసర్ సందీప్ వారియర్ను తీసుకుంది. ఈ ఏడాది రంజీల్లో 44 వికెట్లు తీసి కేరళ విజయాల్లో కీలక పాత్ర పోషించిన వారియర్... 2013–15 మధ్య ఐపీఎల్లో ఆర్సీబీ జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. -
హార్దిక్ పాండ్యా ఔట్
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్నకు వంద రోజుల సమయం కూడా లేని నేపథ్యంలో టీమిండియాకు అనుకోని దెబ్బ. పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఆస్ట్రేలియాతో టి20, వన్డే సిరీస్లకు పూర్తిగా దూరమయ్యాడు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న పాండ్యాను వైద్యుల బృందం సూచన మేరకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు పంపుతున్నట్లు బీసీసీఐ గురువారం తెలిపింది. వచ్చే వారం అతడికి ఎన్సీఏలో ప్రత్యేక చికిత్స ఉంటుంది. ఆసీస్తో ఐదు వన్డేల సిరీస్కు పాండ్యా స్థానాన్ని స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో భర్తీ చేయనున్నారు. టి20 జట్టులో మాత్రం పాండ్యా స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదు. స్పిన్నర్లే కీలకం సాక్షి, హైదరాబాద్: రానున్న వన్డే సిరీస్లో స్పిన్నర్లే గెలుపోటములను నిర్దేశిస్తారని ఆస్ట్రేలియా స్పిన్ కన్సల్టెంట్ శ్రీధరన్ శ్రీరామ్ అన్నా డు. గురువారం హైదరాబాద్లో ఆస్ట్రేలియా ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు. భారత్కు తగ్గట్లు తమకూ స్పిన్ బలం ఉన్న నేపథ్యంలో సిరీస్ హోరాహోరీగా జరుగనుందని శ్రీరామ్ పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్న భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై అతడు ప్రశంసలు కురిపించాడు. ప్రధాన పేసర్లు లేకున్నా కమిన్స్, కూల్టర్నైల్ రూపంలో ఆసీస్కు మెరుగైన వనరులున్నాయని అతడు అన్నాడు. భారత కెప్టెన్ కోహ్లిని అడ్డుకోవడానికి తమవద్ద ప్రణాళికలు ఉన్నాయని శ్రీరామ్ వివరించాడు. -
సస్పెన్షన్ ఎత్తివేత
న్యూఢిల్లీ: టీవీ షోలో మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు యువ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలపై విధించిన నిరవధిక నిషేధాన్ని క్రికెట్ పరిపాలక కమిటీ (సీవోఏ) గురువారం ఎత్తివేసింది. దీంతో వీరిద్దరు మళ్లీ క్రికెట్ మైదానంలోకి దిగే అవకాశం లభించింది. నిషేధం తొలగించడంతో హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్ వెళ్లి జట్టుతో కలుస్తాడని... రాహుల్ భారత ‘ఎ’జట్టు తరఫున బరిలోకి దిగుతాడని బీసీసీఐ ప్రకటించింది. ‘కోర్టు సహాయకుడి (అమికస్ క్యూరీ)గా నియమితులైన పీఎస్ నర్సింహ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నాం. దీని ప్రకారం ఇద్దరు క్రికెటర్లపై నిషేధం విధిస్తూ ఈ నెల 11న ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేస్తున్నాం. సుప్రీం కోర్టు అంబుడ్స్మన్ను నియమించిన తర్వాత వీరిద్దరిపై విచారణ కొనసాగుతుంది’ అని సీవోఏ తరఫున బీసీసీఐ అధికారి ఒకరు ప్రకటించారు. రెండు వారాల ఉత్కంఠకు తెర... మహిళలతో సంబంధాలపై టీవీ షోలో సరదాగా మాట్లాడే క్రమంలో మహిళలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో రాహుల్, పాండ్యాలను ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఈ నెల మొదట్లో అకస్మాత్తుగా స్వదేశానికి పిలిపించారు. తొలుత సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ రెండు మ్యాచ్ల నిషేధంతో సరిపెట్టాలని భావించినా, మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ న్యాయ సలహాకు పట్టుబట్టారు. దీంతో ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ ముందు యువ క్రికెటర్ల కెరీర్ సందిగ్ధంలో పడింది. అయితే, సీవోఏ అతిగా స్పందించి తీవ్ర చర్యలు తీసుకుందని విమర్శలు వచ్చాయి. దిగ్గజ ఆటగాళ్లు గంగూలీ, ద్రవిడ్ సైతం కుర్రాళ్లు తప్పులు తెలుసుకుని ముందుకుసాగే అవకాశం ఇవ్వాలని సూచించారు. ఇదే సమయంలో బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా సైతం విచారణ కొనసాగిస్తూనే రాహుల్, పాండ్యాలపై నిషేధాన్ని తొలగించాలని కోరారు. మొత్తానికి కోర్టు సహాయకుడి బాధ్యతల స్వీకారంతో కథ సుఖాంతమైంది. దీనిపై ఖన్నా మాట్లాడుతూ..‘రాహుల్, పాండ్యా ఇప్పటికే తగినంత శిక్ష అనుభవించారు. ఈ పరిణామంతో పరిణతి చెందుతారు. ఇకపై ప్రపంచకప్ సన్నాహం మీద దృష్టిపెడతారు. అక్కడ హార్దిక్ కీలకం కానున్నాడు. ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ కోర్టు కేసు ఎదుర్కొంటూ కూడా దేశానికి ఆడుతున్నాడు. దీనినే మన క్రికెటర్లకు ఎందుకు వర్తింపచేయకూడదు.’ అని పేర్కొన్నారు. -
త్రిశంకు స్వర్గంలో...
న్యూఢిల్లీ: టీవీ షోలో సరదాగా మాట్లాడే ప్రయత్నంలో నోరు జారడం ఎంత తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఊహించలేకపోయారు. నిషేధం కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్కు దూరమైన వీరిద్దరు మళ్లీ ఎప్పుడు క్రికెట్లో అడుగు పెడతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. బీసీసీఐ నియమావళి ప్రకారం ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే తుది అధికారం బోర్డు నియమించిన అంబుడ్స్మన్కే ఉంది. ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్మన్కే ఇవ్వాలి. అయితే ఇప్పటికిప్పుడు అంబుడ్స్మన్ను నియమించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. లోధా కమిటీ సిఫారసుల అమలు, బీసీసీఐ ఎన్నికలు తదితర అంశాలతో పాటు పాండ్యా–రాహుల్ల అంశంపై కూడా సుప్రీం కోర్టులో గురువారం వాదనలు జరిగాయి. క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) తరఫు న్యాయవాదులు పరాగ్ త్రిపాఠి, సీయూ సింగ్ దీనికి హాజరయ్యారు. బోర్డులో పలు సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే అంబుడ్స్మన్ను నియమించాల్సిందిగా వారు కోరారు. అయితే బీసీసీఐ గుర్తింపు ఉన్న ప్రభుత్వ సంస్థల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మాత్రం అంబుడ్స్మన్ను నియమించే అధికారం కేవలం బోర్డుకే ఉందని...అది ఎన్నికలు నిర్వహించి కార్యవర్గం ఏర్పడిన తర్వాత మాత్రమే సాధ్యమని వాదించారు. అనంతరం జస్టిస్ ఎస్ఏ బోబ్డె, ఏఎం సప్రే సభ్యులుగా గల ద్విసభ్య బెంచ్ మొత్తం కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అసలు దీనిపై వాదనలు కూడా కనీసం వారం రోజుల తర్వాత, అమికస్ క్యూరీ (కోర్టు సహాయకారి) బాధ్యతలు స్వీకరించిన తర్వాతే వింటామని తేల్చి చెప్పింది. ఇటీవలే గోపాల సుబ్రమణ్యం రాజీనామా చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి పీఎస్ నర్సింహను అమికస్ క్యూరీగా ఎంపిక చేసింది. అయితే ఆయన ఎప్పుడు బాధ్యతలు చేపడతారో తెలీదు. ఆయన లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోమని సుప్రీం స్పష్టం చేసింది. వాదనల తర్వాత తేదీ ఏమిటో కూడా కోర్టు ప్రకటించలేదు. దాంతో క్రికెటర్ల భవిష్యత్తు గందరగోళంలో పడింది. ‘నిజానికి వినోద్ రాయ్ సూచన మేరకు 2 మ్యాచ్ల నిషేధంతో పని అయిపోయేది. కానీ దానికి ఒప్పుకోని డయానా ఎడుల్జీ లీగల్ టీమ్ సూచన అడగడం, వారు అంబుడ్స్మన్ తప్పనిసరి అని చెప్పడంతో విషయం కోర్టు దాకా వెళ్లిపోయింది. ఇప్పుడు ఎవరూ ఏమీ చేయడానికి లేదు. క్రికెటర్ల పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు’ అని బీసీసీఐ సీనియర్ సభ్యుడొకరు అభిప్రాయ పడ్డారు. తప్పులు మానవసహజం! ముంబై: హార్దిక్, రాహుల్ల వివాదంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పరోక్షంగా స్పందించాడు. నేరుగా వారి పేర్లు చెప్పకపోయినా తప్పులు చేయడం మానవ సహజమని, ఇక దానిని వదిలేయాలని అభిప్రాయ పడ్డాడు. ‘నేను టీవీ షో చూడలేదు. అయితే అందరూ తప్పులు చేస్తారు. వాటి గురించి ఇంకా అతి అనవసరం. తప్పు చేసినవారు దానిని తెలుసుకొని సరిదిద్దుకుంటారని భావిస్తున్నా. అన్నీ పక్కాగా ఉండటానికి మనం యంత్రాలం కాదు మనుషులం. గతం వదిలి మళ్లీ అలాంటి తప్పు జరగకుండా మాత్రమే చూసుకోవాలి. ఎవరో ఒకరిద్దరు తప్ప నిజానికి క్రికెటర్లంతా మంచివాళ్లే. మధ్యతరగతినుంచి వచ్చి జీవితంలో ఎదిగేందుకు ఎంతో శ్రమిస్తారు కాబట్టి మంచితనం వచ్చేస్తుంది. కోట్లాది మందినుంచి 11 మంది సభ్యుల జట్టులోకి ఎంపిక కావడం మామూలు విషయం కాదు’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. 14 ఏళ్ల కుర్రాడిపై వేటు! లైంగికపరమైన ఆరోపణలు ఎదుర్కొన్న తమ ఆటగాడిపై ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) చర్య తీసుకుంది. ముంబై అండర్–16 జట్టు కెప్టెన్, 14 ఏళ్ల ముషీర్ ఖాన్పై మూడేళ్ల నిషేధం విధించింది. డిసెంబర్లో జాతీయ అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా కడపలో ముంబై–యూపీ మధ్య క్వార్టర్ ఫైనల్ జరిగిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అద్భుత ప్రతిభాపాటవాలు కలిగి భవిష్యత్తులో స్టార్ కాగలడని ముంబై క్రికెట్ వర్గాల్లో ముషీర్పై అంచనాలు ఉన్నాయి. స్కూల్నుంచి లీగ్ క్రికెట్ వరకు అన్ని దశల్లో పరుగుల వరద పారించడంతో త్వరలోనే అతను అండర్–19 టీమ్కు ఎంపికయ్యే అవకాశాలు కనిపించాయి. మరో యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్కు ముషీర్ సొంత తమ్ముడు కావడం విశేషం. -
మమ్మల్ని మన్నించండి!
న్యూఢిల్లీ: మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి నిషేధం ఎదుర్కొంటున్న భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తమకు కొత్తగా జారీ చేసిన రెండో షోకాజ్ నోటీసులకు బదులిస్తూ తమను మన్నించాలని వీరిద్దరు విజ్ఞప్తి చేశారు. అయితే సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ ఆదేశాలను అనుసరించి బోర్డు నిబంధన 41 (సి) ప్రకారం వీరిద్దరిపై సీఈఓ రాహుల్ జోహ్రి విచారణ కొనసాగిస్తారు. అయితే ఇటీవలే అమ్మాయిలను వేధించిన ఆరోపణలు ఎదుర్కొన్న జోహ్రితోనే విచారణ జరిపించడంపై సీఓఏ మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే విచారణ ‘కంటితుడుపు’గానే భావించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. దీనిపై వినోద్ రాయ్ వివరణ ఇస్తూ...ఎడుల్జీకి లేఖ రాశారు. ‘పాండ్యా, రాహుల్ను సరిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉంది. వారి కెరీర్ను నాశనం చేయాలనుకోవడం లేదు. బోర్డు నియమావళి ప్రకారమే సీఈఓ విచారణ చేస్తున్నారు తప్ప అది కంటితుడుపు కాదు’ అని రాయ్ స్పష్టం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement