-
హాల్ ఆఫ్ ఫేమ్లోకి వినయ్ కుమార్.. గేల్, ఏబీడీ సరసన చోటు
ఆర్సీబీ తమ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో మరో ఆటగాడికి చోటు కల్పించింది. ఫ్రాంచైజీ మాజీ ఆటగాడు వినయ్ కుమార్ కొత్తగా ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చేరాడు. గతేడాది (2023) మాజీ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్లను హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలోకి చేర్చిన ఆర్సీబీ.. ఈ ఏడాది వినయ్ కుమార్ను ఆహ్వానించింది. నిన్న (మార్చి 19) జరిగిన అన్బాక్స్ ఈవెంట్ సందర్భంగా ఆర్సీబీ వినయ్ కుమార్ను హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలోకి ఆహ్వానించి, సత్కరించింది. వినయ్ను సత్కరించిన వారిలో ఆర్సీబీ యజమానితో పాటు విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధన ఉన్నారు. వినయ్కు హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఆహ్వానిస్తున్న విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం ట్విటర్ వేదికగా వెల్లడించింది. Vinay Kumar joins the elite company of RCB icons 𝑪𝒉𝒓𝒊𝒔 𝑮𝒂𝒚𝒍𝒆 and 𝑨𝑩 𝒅𝒆 𝑽𝒊𝒍𝒍𝒊𝒆𝒓𝒔✨ pic.twitter.com/mJ8OdaeH6U— CricTracker (@Cricketracker) March 20, 2024 40 ఏళ్ల వినయ్ ఆర్సీబీ తరఫున 2008, 2009, 2010, 2012, 2013 సీజన్లలో ఆడాడు. వినయ్ ఆర్సీబీ తరఫున మూడో అత్యధిక వికెట్ టేకర్గా (80) ఉన్నాడు. ఓవరాల్గా తన ఐపీఎల్ కెరీర్లో 105 మ్యాచ్లు ఆడిన వినయ్ 105 వికెట్లు పడగొట్టాడు. వినయ్ 2012 (19), 2013 (23) సీజన్లలో ఆర్సీబీ తరఫున లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఐపీఎల్లో మొత్తం 11 సీజన్లు ఆడిన వినయ్.. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, కేకేఆర్ ఫ్రాంచైజీలకు ఆడాడు. దేశవాలీ క్రికెట్లో కర్ణాటక తరఫున రంజీ అరంగ్రేటం (2004) చేసిన వినయ్.. రంజీ చరిత్రలో 400 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏకైక పేసర్గా రికార్డు నెలకొల్పాడు. దేశవాలీ క్రికెట్లో వినయ్ను దావణగెరె ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు. ఐపీఎల్, దేశవాలీ క్రికెట్లో ఘనమైన రికార్డు కలిగిన వినయ్.. టీమిండియాకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. వినయ్ భారత జట్టు తరఫున 9 టీ20లు, 31 వన్డేలు, ఏకైక టెస్ట్ ఆడి 49 వికెట్లు పడగొట్టాడు. -
బిలియర్డ్స్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో పంకజ్ అద్వానీ
న్యూఢిల్లీ: భారత క్యూ స్పోర్ట్స్ (స్నూకర్, బిలియర్డ్స్) దిగ్గజం పంకజ్ అద్వానీ తన విజయవంతమైన కెరీర్లో మరో మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ బిలియర్డ్స్లో విశిష్ట క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. బిలియర్డ్స్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో పంకజ్కు స్థానం కల్పించారు. చైనాలోని షాంగ్రావొ నగరంలోని ప్రపంచ బిలియర్డ్స్ మ్యూజియంలో హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాను పొందుపరిచారు. ప్రపంచ విశిష్ట క్రీడాకారుల సరసన తన పేరు ఉండటం చాలా సంతోషంగా ఉందని పంకజ్ చెప్పాడు. ‘అరుదైన గౌరవానికి అర్హుడినైనందుకు ఆనందంగా ఉంది. సుదీర్ఘమైన కెరీర్లో అభిమానులు, శ్రేయోభిలాషుల మద్దతు వల్లే అత్యున్నత శిఖరాలను అధిరోహించాను’ అని అద్వానీ అన్నాడు. గత నవంబర్లో 38 ఏళ్ల వయసులోనూ భారత విఖ్యాత ఆటగాడు అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ప్రపంచ చాంపియన్షిప్లలో ఓవరాల్గా 26వ టైటిల్ను గెలుపొందాడు. ఇందులో పాయింట్ల ఫార్మాట్, లాంగ్ ఫార్మాట్, ప్రపంచ టీమ్ చాంపియన్షిప్ విభాగాల్లో టైటిళ్లున్నాయి. -
హాల్ ఆఫ్ ఫేమ్లోకి భారత టెన్నిస్ దిగ్గజాలు
టెన్నిస్కు సంబంధించి ప్రతిష్టాత్మకమైన హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోకి ఇద్దరు భారత దిగ్గజాలు ప్రవేశించారు. వేర్వేరు జమానాల్లో భారత టెన్నిస్కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన లియాండర్ పేస్, విజయ్ అమృత్రాజ్ టెన్నిస్ క్రీడకు సంబంధించి అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆసియా నుంచి హాల్ ఆఫ్ ఫేమ్కు ఎంపికైన తొలి పురుష టెన్నిస్ క్రీడాకారులుగా లియాండర్ పేస్, విజయ్ అమృత్రాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరితో పాటు ప్రముఖ పాత్రికేయుడు, రచయిత రిచర్డ్ ఎవాన్స్ కూడా టెన్నిస్లో అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్నారు. పేస్, అమృత్రాజ్లకు హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కడంతో ఈ జాబితాలో ప్రాతినిథ్యం లభించిన 28వ దేశంగా భారత్ రికార్డుల్లోకెక్కింది. 50 ఏళ్ల లియాండర్ పేస్ పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మాజీ నంబర్ వన్గా చలామణి అయ్యాడు. 90వ దశకంలో పేస్ కెరీర్ పీక్స్లో ఉండింది. పేస్ తన కెరీర్లో డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో 18 గ్రాండ్స్లామ్ టైటిళ్లు సాధించాడు. పేస్ 1996 ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం కూడా సాధించాడు. ఓవరాల్గా పేస్ 1990-2020 మధ్యలో 54 డబుల్స్ టైటిళ్లు సాధించాడు. విజయ్ అమృత్రాజ్ విషయానికొస్తే.. ఈ 70 ఏళ్ల భారత టెన్నిస్ లెజెండ్ 70, 80 దశకాల్లో భారత్కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చాడు. కెరీర్లో ఓవరాల్గా 15 టైటిళ్లు సాధించిన అమృత్రాజ్ ఆతర్వాత టెన్నిస్ ప్రమోటర్గా, వ్యాఖ్యాతగా మంచి గురింపు తెచ్చుకున్నాడు. -
ICC Cricket World Cup: ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో సెహ్వాగ్, ఎడుల్జీ
దుబాయ్: భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకున్నారు. ఈ ఇద్దరు భారత క్రికెటర్లతో పాటు శ్రీలంక దిగ్గజం అరవింద డిసిల్వాను కూడా తాజాగా ఐసీసీ ఈ విశిష్ట క్రికెటర్ల జాబితాలో చేర్చింది. భారత్ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇప్పటి వరకు తొమ్మిది మందికి చోటు లభించగా... ఎడుల్జీ ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ కావడం విశేషం. ఆయా జట్లకు అందించిన సేవలు, నడిపించిన తీరు, గెలిపించిన ఘనతలు అన్నీ పరిగణించే ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లోకి ఎంపిక చేస్తారు. డయానా ఎడుల్జీ: భారత్లో అమ్మాయిల క్రికెట్వైపు కన్నెత్తి చూడని రోజుల్లోనే క్రికెటరై తర్వాత సారథిగా ఎదిగింది. 1976 నుంచి 1993 వరకు భారత జట్టుకు ఆడి స్పిన్ ఆల్రౌండర్గా రాణించింది. 20 టెస్టులాడి 63 వికెట్లు తీసి, 404 పరుగులు చేసింది. 34 వన్డేల్లో 211 పరుగులు సాధించి 46 వికెట్లు పడగొట్టింది. సెహ్వాగ్: భారత టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా సెహ్వాగ్ రికార్డుల్లోకెక్కాడు. భారత్ 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. సెహ్వాగ్ 104 టెస్టులు ఆడి 8586 పరుగులు సాధించాడు. 23 సెంచరీలు చేశాడు. 40 వికెట్లు తీశాడు. 251 వన్డేలాడి 8273 పరుగులు, 15 సెంచరీలు సాధించాడు. 96 వికెట్లు కూడా తీశాడు. 19 టి20లు ఆడి 393 పరుగులు సాధించాడు. అరవింద డిసిల్వా: ఆ్రస్టేలియాతో జరిగిన 1996 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో డిసిల్వా వీరోచిత సెంచరీతో జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. 308 వన్డేల్లో 9284 పరుగులు చేశాడు. 106 వికెట్లు పడగొట్టాడు. 93 టెస్టుల్లో 6361 పరుగులు సాధించాడు. -
క్వార్టర్ ఫైనల్లో సాకేత్ జోడీ
‘హాల్ ఆఫ్ ఫేమ్’ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. అమెరికాలోని న్యూపోర్ట్లో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 3–6, 6–1, 10–8తో టామీ పాల్–స్పిజిరి (అమెరికా) జంటను ఓడించింది. హైదరాబాద్కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట కూడా క్వార్టర్ ఫైనల్ చేరింది. అనిరుధ్–ప్రశాంత్ 6–4, 6–3తో జూలియన్ క్యాష్ (బ్రిటన్)–మాక్సిమి క్రెసీ (అమెరికా)లపై గెలిచారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
ఓసీపీ..ఉక్కిరిబిక్కిరి
‘నల్లసూరీడు’పై నజర్
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement