-
అఫీషియల్: జిమ్లు, పార్కుల్లో మహిళలకు నో ఎంట్రీ
కాబూల్: మహిళా హక్కులను, స్వేచ్ఛను హరిస్తూ అఫ్గానిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని జిమ్లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించింది. ఈ వారం నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించకపోవడం, పార్కులు, జిమ్లలో మహిళలు, పురుషులు విభజనను పాటించకపోవడం వల్లే తాజాగా ఈ ఆంక్షలను తీసుకువచ్చినట్లు ప్రభుత్వ ప్రతినిధి గురువారం చెప్పారు. 2021 ఆగస్ట్లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. మాధ్యమిక, ఉన్నత విద్యా పాఠశాలల్లో బాలికల ప్రవేశాన్ని నిషేధించారు. అనేక రంగాల్లో మహిళా ఉద్యోగులను తొలగించారు. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధారణ తప్పనిసరి చేశారు. -
కరోనా బీభత్సం: రేపటి నుంచి సినిమాహాళ్లు బంద్
సాక్షి, చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం కోవిడ్ ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలు, మాల్స్, బార్స్, సెలూన్లను మూసేయనుంది. ఈ నెల 26 నుంచి ఇది అమల్లోకి వస్తుందని శనివారం ప్రభుత్వం ప్రకటించింది. ఇక రెస్టారెంట్లు, ఇతర కాఫీ షాపుల నుంచి టేక్ అవేలకి మాత్రమే అనుమతి ఉంది. పెళ్లిళ్లకి 50 మంది, అంత్యక్రియలకి 25 మంది మాత్రమే హాజరవాలి. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా తమిళనాడుకు రావాలనుకుంటే ఇ–రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూ 10 నుంచి ఉదయం 4 వరకు, ఆదివారం లాక్డౌన్ కొనసాగుతుంది. -
ఇలా చెమటోడ్చి ఎన్ని రోజులైందో...
హైదరాబాద్: నాలుగు నెలల తర్వాత జిమ్లో శ్రమించడం పట్ల ప్రపంచ చాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సంతోషం వ్యక్తం చేసింది. అన్లాక్– 3 మార్గదర్శకాల్లో భాగంగా ఆగస్టు 5 నుంచి వ్యాయామశాలలు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో... సింధు బుధవారం జిమ్లో చెమటోడ్చింది. పూర్తిస్థాయి జిమ్ సెషన్లో పాల్గొన్న ఆమె ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేసింది. చాలా కాలం తర్వాత ఇలా కసరత్తులు చేయడం ఆనందంగా ఉందని పేర్కొంది. ట్రైనర్ సహాయంతో బరువులు ఎత్తడం, స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలు చేసింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆటలకు అంతరాయం ఏర్ప డిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సెప్టెంబర్లో జరగాల్సిన నాలుగు టోర్నీలను రద్దు చేసింది. -
జిమ్లు రేపట్నుంచే..
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: నాలుగున్నర నెలల విరామం తర్వాత దేశవ్యాప్తంగా జిమ్లు, యోగా కేంద్రాలు బుధవారం నుంచి తెరుచుకోనున్నాయి. అన్లాక్–3.0లో వీటిని తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘యోగా కేంద్రాలు, జిమ్లలో కరోనా వ్యాప్తి నివారణ మార్గదర్శకాలను’ సోమవారం జారీ చేసింది. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వారిని మాత్రమే యోగా కేంద్రాలు, జిమ్లలోకి అనుమతించాలని తేల్చిచెప్పింది. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లలోని యోగా కేంద్రాలు, జిమ్లు మూసి ఉంటాయి. ఈ జోన్ల వెలుపల ఉన్న వాటిని మాత్రమే తెరిచేందుకు అనుమతిస్తారు. మార్గదర్శకాలివే.. ► స్పాలు, స్టీమ్ బాత్, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలి. ► యోగా సెంటర్లు, జిమ్లలో అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకోవాలి. వ్యక్తుల మధ్య కనీసం 4 మీటర్ల దూరం ఉండేలా రీడిజైనింగ్ చేయించాల్సి ఉంటుంది. ► జిమ్లో సెంట్రలైజ్డ్ ఏసీ లేదా సాధారణ ఏసీ ఉంటే గది ఉష్ణోగ్రత 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉంచాలి. వెంటిలేషన్ అధికంగా ఉండేలా చూడాలి. ► 65 ఏళ్ల వయసు పైబడినవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు జిమ్లకు వెళ్లకపోవడమే మంచిది. ► హ్యాండ్ శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకున్న తర్వాతే ఎవరైనా యోగా సెంటర్/జిమ్ లోపలికి ప్రవేశించాలి. ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ టెస్టు కూడా చేయించుకోవడం తప్పనిసరి. ► ఫేస్ మాస్కు/కవర్ ధరించిన వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి. ► యోగా కేంద్రం/జిమ్లో ఉన్నంత సేపు ఆరోగ్యసేతు యాప్ ఉపయోగించాలి. ► జిమ్/యోగా కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందితో పాటు విజిటర్స్ తప్పకుండా ఫేస్ షీల్డ్లు ధరించాలి. ► కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ వంటి కఠినమైన వ్యాయామాలు చేసేముందు పల్స్ ఆక్సీమీటర్తో ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించుకోవాలి. -
హైటెక్ రాముడు
సాక్షి, రామచంద్రపురం(తూర్పుగోదావరి) : సామాన్య మధ్య తరగతి వ్యక్తి. చదివింది ఏడో తరగతే. అయినా ఆరితేరిన మెకానికల్ ఇంజినీర్లా యంత్రాలు తయారుచేస్తాడు జిల్లాలోని రామచంద్రపురం మండలం ద్రాక్షారామకు చెందిన రెడ్డి రాము. ఆ ఊరిలో బియ్యంపేటకు చెందిన అతన్ని అంతా ఇంజినీరూ అని పిలుస్తారు. ఎవరొచ్చి ఏ అవసరం చెప్పి తన పని సులువు చేయమని అడిగినా తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఓ యంత్రం చేసి ఇచ్చేస్తాడు. 16 ఏళ్ల వయసు చిత్ర నిర్మాత అంగర సత్యానికి చెందిన ట్రాక్టర్ ట్రక్కులు తయారు చేసే ఇంజినీరింగ్ వర్క్స్లో రాము పనికి కుదిరాడు. అప్పటికి అతడి వయసు 14. తరువాత తోటపేటలో ఉన్న చెల్లూరి భూరికి చెందిన లేతు వర్కుషాపులో, అనపర్తి మండలం పందలపాకలో కిలపర్తి సూర్యారావు చెందిన లేతు వర్కుషాపులో పనిచేశాడు. చివరిగా ఆ అనుభవంతో ద్రాక్షారామలో ఇంటి కిటికీలకు మెష్లు, మెట్లకు గ్రిల్స్ తయారు చేసే వెల్డింగ్ షాపును సొంతంగా ప్రారంభించాడు. జీవనోపాధికి వెల్డింగ్ వర్కు చేస్తున్నా బుర్ర నిండా ఇంజినీంగ్ ఆలోచనలే. ఇవి చాలవన్నట్టు మరోవైపు బాడీ బిల్డింగ్. ఈ ఆసక్తితో స్థానిక శాకా వీరభద్రరావుకు వ్యాయామశాలలో చేరాడు. అక్కడ అతని దృష్టి వ్యాయామ పరికరాలపై పడింది. విడివిడిగా ఉన్న పరికరాలపై పడింది. వాటి స్థానంలో బహుళ ప్రయోజనకరమైన పరికరాల తయారీ ప్రారంభించాడు. ఇతని దగ్గర వ్యాయామ పరికరాలు కంపెనీ పరికరాలకు దీటుగా, తక్కువ ధరలోనే దృఢంగా ఉంటున్నాయని ఆనోటా ఈనోటా పాకి జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆర్డర్లు రావడం మొదలుపెట్టాయి. రాము రూపొందించిన మల్టీపర్పస్ అబ్డామిన్ మెషీన్, ఇటుక తయారీ యంత్రం రాజమహేంద్రవరంలోని గౌతమి వ్యాయామశాల వంటి అనేక వ్యాయామశాలలు రాముతో అనేక వ్యాయామ పరికరాలు తయారు చేయించుకున్నారు. రాము అక్కడితో ఆగలేదు. ఇలా ఎవరి అవసరాలకు తగ్గట్టు వారికి ఎన్నో పరికరాలు చేసి ఇచ్చేవాడు. రామచంద్రపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్టణాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు తమ ప్రాజెక్టుల కోసం రామును సంప్రదించి వారి ప్రాజెక్టులు తయారు చేయించుకుని వెళ్తుండడం ద్రాక్షారామకే గర్వకారణం. రాము తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఇటుకల తయారీ యంత్రం కోసం ఏళ్ల తరబడి శ్రమించాడు. కంపెనీలు తయారు చేసే ఇటుకల తయారీ మెషీన్లు ఉన్నా, మరింత సులువుగా పని జరిగేలా పలు నమూనాల్లో ఇటుకల తయారీ యంత్రాలను రూపొందించడంలో ఆరితేరాడు. నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, విశాఖపట్నం తదితర జిల్లాల నుంచి ఇటుకల తయారీదారులు వచ్చి రాముతో ఆ యంత్రాలు తయారు చేయించుకుంటున్నారు. మోటారు సైకిల్ ఇంజిన్తో చిన్నపాటి జీపు పొలం గట్లపై వాడుకోవడానికి అనువుగా చిన్నపాటి జీపును రూపొందిస్తున్నాడు రాము. పాత వాహనాల్లోని పార్టులు ఉపయోగించుకుని రూపొందించే పనిలో ఉన్నాడు. మోటారు సైకిల్ ఇంజిన్ను ఉపయోగిస్తున్నా దీనికి రివర్స్ గేర్ కూడా ఏర్పాటు చేస్తుండటం విశేషం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement