-
సత్పతీ... సలామ్!
వరంగల్ అర్బన్ :కొందరు అధికారులు పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తారు.. మరికొందరు పనిచేస్తూ, చేయిస్తూనే కింది స్థాయి సిబ్బంది శ్రేయస్సు కోసం కృషి చేసి వారిపై చెరగని ముద్ర వేస్తారు. ఆ కోవలోకే వస్తారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) కమిషనర్ పమేలా సత్పతి! బల్దియా సిబ్బంది కార్మికుల సంక్షేమానికి తన స్నేహితుల ద్వారా రూ.20లక్షలు సేకరించి ప్రత్యేక ని«ధిగా ఏర్పాటుచేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న ఆమె మనసున్న మహారాణిలా నిలుస్తున్నారు. రూ.వెయ్యి ఇస్తేనే ఫొటోలు పేపర్లలో వేయించుకునే వారు ఉన్న ఈ రోజుల్లో ఏకంగా భారీ మొత్తాన్ని సాయమందించేందుకు వెచ్చిస్తున్న ఆమెపై బల్దియా ఉద్యోగులు, సిబ్బంది నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. సిబ్బంది సేవలు వెలకట్టలేనివి వరంగల్లోని జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉత్తమ సేవలు అందిస్తున్న వివిధ విభాగాల సిబ్బంది, కార్మికులకు కమిషనర్ పమేలా సత్పతి గురువారం ప్రశంసాపత్రాలు, నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భయంకర కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు, సిబ్బంది సేవలు వెలకట్టలేనివన్నారు. కార్మికుల ఆరోగ్యం, శ్రమను దృష్టిలో పెట్టుకుని తన మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో వ్యక్తిగతంగా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విధినిర్వహణలో ఎవరికైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందడంలో ఆలస్యమైనా ఈ నిధులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.11లక్షలను ఆపదలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు సహాయార్థం ఖర్చు చేయగా మరో రూ.9లక్షలు నిధులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అయితే, అకారణంగా విధులను గైర్హాజరు కావొద్దని, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణతో పాటు విధి నిర్వహణ కూడా ముఖ్య మని గుర్తించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ విద్యాసాగర్, ఇన్చార్జ్ ఎంహెచ్ఓ జీ.వీ. నారాయణరావు, సెక్రటరీ విజయలక్ష్మి, సీహెచ్ఓ సునీత, డిప్యూటీ కమిషనర్ గోధుమల రాజు, టీఓ శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రజారోగ్య విభాగానికి చెందిన కార్మికులు మాదాసి కరుణాకర్, సంజీవ్, మల్లికార్జున్, బాబు, విజయ, సారయ్య, జవాన్లు సతీష్, సాంబయ్య, ఫీల్డ్ వర్కర్ ఆనంద్తో పాటు డీఆర్ఎఫ్ నుంచి సాయికుమార్, మాలి సురేష్, కంప్యూటర్ ఆపరేటర్ లింగనాథ్, కార్మికులు చందన్, లైన్మెన్ కరుణాకర్, హెల్పర్ సదానందం, బిల్ కలెక్టర్లు మొయిన్ పాషా, అటెండర్ సుజాతకు నగదు పురస్కారం, ప్రశంసాపత్రాన్ని అందశారు. -
చూద్దాం పూలదండన్నా మార్పు తీసుకొస్తుందేమో!
దండేశారు దండం పెట్టారు.. అయినా వినని వారికి ఫైన్ రాశారు... అప్పటికీ వినకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు.... వరంగల్ బల్దియా అధికారుల్లా ఆలోచిస్తారు. బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న వారికి జీడబ్ల్యూఎంసీ (గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్)ల అధికారులు వెరైటీ శిక్ష వేశారు. 200 వందల మందికి పైగా పూలదండలు వేసి సన్మానించారు. బహిరంగ మూత్ర విసర్జన కారణంగా... వరంగల్ ఏజీఎం ప్రాంతంలో రోడ్డుపై జనం నడవాలంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. బల్దియా అధికారులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎన్నోసార్లు శుభ్రం చేశారు. అయినా జనాల్లో మార్పు కనిపించకపోవడంతో ఈ దండ వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ చుట్టు ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని.. అలా చేసినప్పుడే రోగాల బారిన పడకుండా ఉంటారని అధికారులు అంటున్నారు. చూద్దాం పూలదండ కార్యక్రమమన్నా ప్రజల్లో మార్పు తీసుకొస్తుందేమో. -
పేద్ద భారం..
♦ మ్యూటేషన్ ఫీజు 4 రెట్లు పెంపు ♦ ఆస్తుల పేరు మార్పిడిపై విధింపు ♦ ఆమోదం తెలిపిన గ్రేటర్ స్టాండింగ్ కమిటీ ♦ త్వరలో రిజిస్ట్రేషన్ శాఖకు నిర్ణయ ఉత్తర్వులు ♦ ఆందోళనలో ఆస్తుల కొనుగోలుదారులు వరంగల్ అర్బన్ : ఆస్తుల కొనుగోలుదారులపై ‘మహా’ భారం పడింది. మ్యూటేషన్(ఆస్తుల పేరు మార్పిడి) ఫీజులను నాలుగు రెట్లు పెంచుతూ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆమోదముద్ర కూడా వేసింది. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో పెద్ద ఎత్తున భవనాలు, ఖాళీ స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతుంటాయి. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగిన కార్యకలాపాలకు సంబంధించి ఆస్తుల పేరు మార్పిడి ప్రక్రియ గ్రేటర్ ద్వారా కొనసాగుతోంది. గతంలో రిజిస్ట్రేషన్ దస్తావేజులతో పేరు మార్పిడి కోసం గ్రేటర్ కార్పొరేషన్లో ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసేవారు. అయితే ఎనిమిది నెలల కాలంగా పారదర్శకత, సమయ పాలన, సమన్వయ లోపం వంటి తదితర సమస్యల తలెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ నిబంధనలను సడలించింది. రిజిస్ట్రేషన్ శాఖలో కొనుగోళ్లు, అమ్మకాలు జరిగిన క్రమంలో ఆస్తుల పేరు మార్పిడి కోసం కూడా ఆ శాఖలోనే ఫీజులు వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ దస్తావేజుల్లో ఉన్న ఆస్తి విలువలో 0.20 శాతం అంటే రూ.లక్షకు రూ.200 చొప్పున రిజిస్ట్రేషన్ శాఖలోనే ఫీజు వసూలు చేస్తున్నారు. అక్కడి నుంచి గ్రేటర్ కార్పొరేషన్కు పేరు మార్పిడి కోసం బదలాయిస్తున్నారు. ఆస్తుల దస్తావేజుల ఆధారంగా కార్పొరేషన్ పన్నుల విభాగం సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేసి పేరు మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్తుల పేరు మార్పిడి ఫీజును పెంచుతూ గ్రేటర్ వరంగల్ మునిసిపల్ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 0.20 శాతం నుంచి 1.0 శాతానికి పెంచింది. త్వరలో నిర్ణయ ఉత్తర్వులను రిజిస్ట్రేషన్కు శాఖకు అందించనున్నారు. కొనుగోలుదారుల్లో ఆందోళన మొన్నటివరకు రూ.లక్షకు రూ.200 చెల్లించాల్సి ఉండగా, తాజాగా పెంచిన ఫీజులతో రూ.1,000 చెల్లించాల్సి వస్తుంది. దీన్ని ఆస్తుల కొనుగోలుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆస్తులకు సంబంధించి అమ్మకాలు, కొనుగోళ్లు నిత్యం సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రతిసారి పేరు మార్పిడిపై రూ.లక్షకు రూ.వెయ్యి చొప్పన చెల్లించడం భారమని ఆందోళన చెందుతున్నారు. మ్యుటేషన్ ఫీజు పెంపుపై పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ పాలక, అధికార వర్గాలు మాత్రం గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నో ఏళ్లుగా ఒక శాతం ఫీజు వసూలు చేస్తున్నారని, ఈ మేరకు వరంగల్ పరిధిలో పెంచినట్లు పేర్కొంటున్నారు. -
తూర్పులో ఎక్కువ!
టెండరు పనుల్లో 10 శాతం పక్కకు కీలక ప్రజాప్రతినిధి అండదండలు నాసిరకంగా సాగుతున్న పనులు సాక్షి, వరంగల్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో అభివృద్ధి పనులకు నాణ్యత సమస్య పట్టుకుంది. కాంట్రాక్టర్లు ఒక్కటై ఈ–ప్రొక్యూర్మెంట్ టెండరు ప్రక్రియను అభాసుపాలు చేస్తున్నారు. ప్రతి పనిలోనూ పోటీ లేకుండా పోతుండడంతో జీడబ్ల్యూఎంసీ నిధులు ఎక్కువగా ఖర్చవుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మొత్తంలో ఇదే పరిస్థితి ఉండగా... వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మరింత ఎక్కువగా ఉంది. గ్రేటర్ పరిధిలోని వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్షేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాలకు భిన్నమైన పరిస్థితి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉంది. జీడబ్ల్యూఎంసీ పనులు చేసే కాంట్రాక్లర్లలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ప్రత్యేకంగా మరో సిండికేట్ ఉన్నట్లు ప్రభుత్వ నిఘా వర్గాల నివేదిక చెబుతోంది. చట్టసభకు ప్రాతినిథ్యం వహించే కీలక ప్రజాప్రతినిధి సహకారంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాంట్రాక్టర్లు ఈ–ప్రొక్యూర్మెంట్ టెండరు స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారు. మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో కాంట్రాక్టర్లు ఒక్కటై పనులు తీసుకుంటున్నారు. ఈ నాలుగు సెగ్మెంట్లలో ప్రతి పనిలో ఎనిమిది శాతం చొప్పున మొత్తాన్ని పక్కనపెడుతున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పనులకు మాత్రం లెక్క ఇంకా ఎక్కువగా ఉంది. ప్రతి పనిలోనూ 10 శాతం మొత్తాన్ని పక్కనపెడుతున్నారు. నాణ్యతకు తిలోదకాలు... జీడబ్ల్యూఎంసీ చేపట్టే అభివృద్ధి పనుల్లో ఎక్కువ శాతం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాలతో పోల్చితే జనాభా ఎక్కువగా ఉండడం.. మౌలిక వసతుల పరంగా వెనకబడి ఉండడంతో ఎక్కువ నిధులు ఈ సెగ్మెంట్లోనే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనిని కొందరు కాంట్రాక్టర్లు అవకాశంగా తీసుకుంటున్నారు. పనుల్లో 10 శాతాన్ని పక్కనపెట్టేందుకు అంగీకరిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు 8 శాతం వరకు ముట్టజెప్పి మిగిలిన రెండు శాతాన్ని సంక్షేమ నిధికి మళ్లిస్తున్నారు. పది శాతం నిబంధన అమలు విషయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనీ కీలక ప్రజాప్రతినిధి తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు కొందరు కాంట్రాక్టర్లే చెబుతున్నారు. మిగిలిన నియోజకవర్గాలతో పోల్చితే కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఎక్కువ శాతం నిధులను పక్కనబెట్టాల్సి రావడంతో పనుల్లో నాణ్యత తగ్గిపోతోందని చెబుతున్నారు. జీడబ్ల్యూఎంసీలో గతంలో ఎప్పుడూ ఇలా లేదని అంటున్నారు. జీడబ్ల్యూఎంసీ నిధులతో చేపట్టే పనుల్లో నాణ్యతాలోపాలపై దృష్టి సారించి చక్కదిద్దాల్సిన ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లకు శాతాలు నిర్ణయించడం కొత్తగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నిధులు ఫోన్ల పాలు
గ్రేటర్ కార్పొరేటర్లకు స్మార్ట్ మెుబైళ్లు ప్రజాధనాన్ని పంచిన జీడబ్ల్యూఎంసీ ఒక్కో సెల్ ఖరీదు రూ.11,200 60 ఫోన్లకు రూ.6.72 లక్షల ఖర్చు సాక్షి, హన్మకొండ : గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి కార్పొరేటర్లుగా విజయం సాధించిన వారు.. ఆ తర్వాత చేసిన ఓ పని తీవ్ర విమర్శలకు దారి తీసింది. కార్పొరేటర్లుగా గెలవడానికి లక్షలు ఖర్చు చేసిన ప్రజాప్రతినిధులు... వరంగల్ మహానగరపాలక సంస్థ నిధులు తమ సొంతమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమాలకు పాల్పడడం అలవాటైన అధికారులు కూడా.. కార్పొరేటర్లను ‘సంతృప్తి’ పరిచే పనుల్లో నిమగ్నమయ్యారు. ఏదో ఒక రూపంలో ఈ పనులు చేస్తూనే ఉన్నారు. ఇలా కార్పొరేటర్ల మెప్పు పొందేందుకు వరంగల్ మహానగరపాలక సంస్థ అధికారులు మరో పని చేశారు. గ్రేటర్ వరంగల్లో 58 డివిజన్లు ఉన్నాయి. కార్పొరేటర్లుగా గెలుపొందిన వారిలో కొందరు కోటీశ్వరులు, మరి కొందరు లక్షాధికారులు ఉన్నారు. అందరికీ ఖరీదైన సెల్ఫోన్లు ఉన్నాయి. కార్పొరేటర్లుగా గెలిచి.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు జీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్లకు సిమ్కార్డులు ఇచ్చింది. అందరు ఫోన్లు ఉన్నవారే కావడంతో ఈ సిమ్కార్డులు ఉపయోగపడతాయని సామాన్యులు భావించారు. అయితే గ్రేటర్ అధికారులు, కార్పొరేటర్లు మాత్రం మరోలా ఆలోచించారు. ప్రజాధనం ఎలా వాడుకోవాలనే పథకాన్ని రచించారు. సిమ్కార్డులు ఇచ్చిన అందరికీ మొబైల్ ఫోన్లు కావాలని నిర్ణయించారు. గ్రేటర్ వరంగల్ అంటే హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం. మొబైల్ ఫోన్లు కూడా అదే స్థాయిలో ఉండాలని అధికారులు ‘ఉన్నతంగా’ ఆలోచించారు. కార్పొరేటర్లకు, గ్రేటర్ కమిషనర్ క్యాంపు క్లర్క్కు, పర్యావరణ విభాగం ఇంజనీర్కు ఒకటి చొప్పున 60 సామ్సంగ్–జే5 మోడల్ సెల్ ఫోన్లు కొనుగోలు చేశారు. ఒక్కో ఫోన్కు రూ.11,200 చొప్పున రూ.6.72 లక్షలు ఖర్చు చేశారు. సీల్డు కవరు టెండరు ద్వారా... కార్పొరేటర్లకు మొబైల్ ఫోన్ల కొనుగోలుపై విషయంలో అధికారులు తమకు నచ్చిన ప్రక్రియ అనుసరించారు. ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతి కాకుండా సీల్డ్ కవరు విధానంలో టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతి అయితే కార్పొరేషన్ ఖజనాపై భారం తగ్గేది. చీపుర్లు, స్టేషనరీ, రేడియం జాకెట్లు వంటి తక్కువ ఖర్చు అయ్యే వస్తువులకు ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో స్పందన లేదని పేర్కొంటున్న అధికారులు వాటికి సీల్డ్ కవరు టెండర్లు నిర్వహించారు. అయితే మార్కెట్లో డిమాండ్ ఉండే సామ్సంగ్ మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలోనూ సీల్డ్ కవర్ టెండర్లనే అమలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. కార్పొరేటర్లకు ఫోన్లు ఇచ్చినప్పుడు తమకూ ఏదో ఉండాలన్న ఉద్దేశంతోనే అధికారులు ఇలా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement