-
గుమ్మడి సంధ్యారాణికి... తత్వం బోధపడింది!
నాడు: రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సాలూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన గౌరవానికి భంగం కలిగేలా టీడీపీ వారు సోషల్ మీడియాలో చాలా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టేవారు. అయినప్పటికీ రాజన్నదొర సంయమనం పాటించేవారు. దీన్ని అలుసుగా తీసుకొని టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ఆయన్ని వ్యక్తిగతంగానూ కించపరిచేలా పోస్టులుపెట్టారు. వీటిని చూసి విసిగిపోయిన రాజన్నదొర అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలోనూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డిని, ఆయన కుటుంబసభ్యులను కించపరుస్తూ టీడీపీ వారు అసభ్యకరమై పోస్టులతో పేట్రేగిపోయారు. వైఎస్సార్సీపీ అభిమానుల ఫిర్యాదులతో పోలీసులు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అహా... సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారా? అంటూ టీడీపీ నాయకులను గుమ్మడి సంధ్యారాణి సమర్థించేవారు. నేడు: ‘నేను గుమ్మడి సంధ్యారాణిని... మాజీ ఎమ్మెల్సీని... టీడీపీ పోలిట్బ్యూరో సభ్యురాలిని.. అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలిని, సాలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిని... కానీ నా గౌరవానికి భంగం కలిగించేలా, బయటకు చెప్పుకోలేని విధంగా నన్ను లక్ష్యంగా చేసుకొని ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాడు. అతడిపై కఠిన చర్యలు తీసు కోండి...’ అంటూ టీడీపీ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి సాలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుభవమైతే గానీ తత్వం బోధపడలేదు ఆమెకు! తనపై పోస్టులు పెట్టింది సొంత టీడీపీ వ్యక్తేనని తెలిసినా, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికీ సిద్ధమయ్యారు. ఆ వ్యక్తి టీడీపీలో తన ప్రత్యర్థి భంజ్దేవ్ వర్గీయుడేనని తెలిసి మరింత గరంగరం అవుతున్నారు. కొద్దిరోజులుగా తనను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న భంజ్దేవ్ వర్గీయులను పార్టీ నుంచి పొగపెట్టి అయినా బయటకు పంపించేయాలని రగిలిపోతున్నట్టు తెలిసింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాలూరు టీడీపీలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. తనపై, తన వర్గీయులపై సామాజిక మాధ్యమాల్లో తప్పు డు ప్రచారాలు చేస్తున్నారంటూ ఇటీవల ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గుమ్మడి సంధ్యారాణి సాలూరు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడం దీనికో నిదర్శనం. పోస్టులు పెట్టిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్దేవ్ అనుయాయుడని తెలిసింది. అయితే ఇప్పటివరకూ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. తలెగరేస్తే తొక్కేయడమే... టీడీపీలో తన వర్గీయులే కాదు వ్యతిరేక వర్గం వారైనా తలెగరేస్తే పాతాళానికి తొక్కేసేవరకూ సంధ్యారాణి నిద్రపోరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వద్ద పంచాయితీ జరిగినా సరే తన వైఖరిలో మార్పు ఉండదనే చెబుతున్నారు. పాచిపెంట మండల టీడీపీ అధ్యక్షుడి మార్పు అంశాన్ని సాలూరు ప్రజలు చర్చించుకుంటున్నారు. తనకు కొరకురాని కొయ్యగానున్న భంజ్దేవ్ విధేయుడు పిన్నింటి ప్రసాద్ను ఆ పదవి నుంచి ఇటీవల సంధ్యారాణి తప్పించేశారు. తన అనుచరుడిగాఉన్న ముఖే సూర్యనారాయణకు అధ్యక్ష పదవి అప్పగించారు. ఇది నచ్చని పాచిపెంట టీడీపీ నాయకులు ఈ పంచాయితీని నేరుగా చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. సాలూరు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఈ విషయం ప్రస్తావించారు. దీంతో చంద్రబాబు సంధ్యారాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారని సాలూరు టీడీపీ నాయకులు ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. చంద్రబాబు తీసుకున్న క్లాసు ఫలితంగా పిన్నింటి ప్రసాద్కు మళ్లీ పాచిపెంట టీడీపీ మండల అధ్యక్ష పదవి దక్కింది. కానీ ఇప్పటికీ ప్రసాద్తో సంధ్యారాణి ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. మక్కువ మండలంలోనూ మంటలు... బీజేపీ నుంచి ఇటీవలే టీడీపీలో చేరిన పెంట తిరుపతిరావు అన్నా సంధ్యారాణికి పొసగట్లేదు. మక్కువ మండలంలో కాస్త పలుకుబడి ఉన్న తిరుపతిరావు పట్ల తొలి నుంచీ ఆమెది అదే వైఖరి. అతను భంజ్దేవ్ అభిమానిగా ఉండటమే అసలు కారణం. దీంతో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సాలూరు మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ గొర్లి విజయకుమారి భర్త మధుతో కూడా సంధ్యారాణికి సయోధ్య లేదనేది బహిరంగ రహస్యమే. ఒంటెద్దు పోకడపై పోస్టులు... సంధ్యారాణి అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడ నచ్చకే భంజ్దేవ్ తదితర టీడీపీ నాయకుల అనుచరులు ఆమైపె పోస్టులు పెడుతూ వస్తున్నారు. పార్టీ గ్రూపుల్లోనూ రచ్చ రచ్చ చేస్తున్నారు. భంజ్దేవ్ మీద గతంలో సంధ్యారాణి వర్గీయులు పెట్టిన పోస్టులు, ఆయన వల్లనే పార్టీ అప్రతిష్ట పాలయిందంటూ చంద్రబాబుకు లేఖలు రాయడం దీనికి ఆజ్యం పోసింది. ఆ పోస్టులు, లేఖలు బయటకు లీక్ చేయడం వెనుక సంధ్యారాణి అనుచరుల పాత్ర ఉందని భంజ్దేవ్ వర్గీయులు రగిలిపోతున్నారు. -
కొత్తపల్లి గీత కులంపై సంధ్యారాణి యూటర్న్
► హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణ ► ముఖ్యమంత్రి ఆదేశాలతోనే నిర్ణయం! ►వ్యతిరేకిస్తున్న గిరిజన సంఘాల నేతలు కాకినాడ/సాలూరు: అరకు ఎంపీ కొత్తపల్లి గీత గిరిజన మహిళ కాదని, గిరిజనులకు రిజర్వ్ చేసిన పార్లమెంట్ నియోజకవర్గంలో ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో పోటీ చేసి గెలుపొందారని, ఆమె ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ను ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఉపసంహరించుకున్నారు. గీత అసలైన గిరిజన మహిళ కాదని, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఎన్నికల్లో పోటీ చేశారని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. తనపై దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలంటూ కొత్తపల్లి గీత చేసుకున్న దరఖాస్తును న్యాయస్థానం తిరస్కరించిన విషయం విదితమే. అంతేగాక దీనిపై విచారణ జరపాల్సిందేనని స్పష్టం చేసింది. ఎంపీ గీతపై కేసు బిగుసుకుంటున్న తరుణంలో సంధ్యారాణి తన పిటిషన్ను ఉపసంహరించుకోవడం గమనార్హం. దీనిపై ఎమ్మెల్సీ సంధ్యారాణిని మీడియా సంప్రదించగా... కేసు వాపసు తీసుకుంటున్న విషయం వాస్తవమేనని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? అని ప్రశ్నించగా.. ఆమె సమాధానం దాటవేశారు. 2014 ఎన్నికల్లో అరకు ఎంపీగా వైఎస్సార్సీపీ తరపున కొత్తపల్లి గీత, టీడీపీ తరపున విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ నేత గుమ్మడి సంధ్యారాణి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కొత్తపల్లి గీత విజయం సాధించారు. కానీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో గీతను టీడీపీ నాయకత్వం టార్గెట్ చేసింది. ఎస్టీ కాదని అప్పటికే గీతపై ఆరోపణలుండడంతో ఆమెపై పోటీ చేసి ఓటమి పాలైన గుమ్మడి సంధ్యారాణితో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగినట్లు ఆరోపణలున్నాయి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాలతోనే ఎంపీ గీతపై తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఎమ్మెల్సీ సంధ్యారాణి పలు సందర్భాల్లో చెప్పారు. కొత్తపల్లి గీత ఎస్టీ కాదని సవాల్ చేస్తూ... అందుకు తగ్గ ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. న్యాయ పోరాటానికయ్యే ఖర్చంతా పార్టీయే భరిస్తుందని అప్పట్లో సంధ్యారాణికి చంద్రబాబు భరోసా ఇచ్చారు. దీంతో ఖర్చుకు వెనుకాడకుండా ఆమె న్యాయపోరాటం చేశారు. పిటిషన్పై వాదనలు జరుగుతుండగానే ఎంపీ గీత వైఎస్సార్సీపీకి దూరమయ్యారు. అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే.. కొత్తపల్లి గీత టీడీపీకి మద్దతు ఇవ్వగానే చంద్రబాబు వైఖరి మార్చుకున్నారు. దీంతో గీతపై సంధ్యారాణి చేస్తున్న న్యాయ పోరాటానికి టీడీపీ నుంచి మద్దతు కరువైంది. అయిప్పటికీ పట్టు వదలకుండా ఆధారాలన్నీ సేకరించి ఆమె న్యాయస్థానంలో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రంగంలోకి దిగారు. ఐదు రోజుల క్రితం ఎమ్మెల్సీ సంధ్యారాణిని తన వద్దకు పిలుపించుకుని, గీతపై వేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. మీరు వదిలినా మేము వదలం ముఖ్యమంత్రి ఆదేశాలను కాదనలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ సంధ్యారాణి కోర్టులో పిటిషన్ను ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తపల్లి గీత కుల ధ్రువీకరణను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన ఉన్నత న్యాయస్థానంలోనే రెండు రోజుల క్రితం విత్డ్రా పిటిషన్ వేశారు. దీంతో కొత్తపల్లి గీతకు ఎంతో ఊరట లభించింది. పిటిషన్ను ఉపసంహరించుకున్న సంధ్యారాణి గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గిరిజన సంఘాల నేతలు ఆమె తీరును తప్పు పడుతున్నారు. అధినేత చెప్పారని కొత్తపల్లి గీతతో రాజీ చేసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. మీరు వదిలేసినా తాము వదిలేది లేదంటూ కొత్తపల్లి గీతపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
తప్పక చదవండి
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement