-
‘గురుకులం’లో రెండో రోజూ ఫుడ్ పాయిజన్
మెదక్ రూరల్: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు కలవరపడుతున్నారు. వరుసగా రెండో రోజూ మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు.. పాఠశాలలో 298 మంది విద్యార్థినులు చదువుతుండగా సోమవారం సుమారు 30 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్తో తీవ్ర కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం సైతం ఫుడ్ పాయిజన్ కారణంగా ఏకంగా 46 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాల య్యారు. విద్యార్థులు ఆస్పత్రి పాలుకావడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్య వైఖరి వల్లే తమ పిల్లలకు ఈ పరిస్థితి వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ నగేష్, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సుధాకర్లు హుటాహుటిన మెదక్ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థినుల పరిస్థితిని చూసి నిర్ఘాంత పోయారు. విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్కు సూచించారు. జేసీ నగేష్ మాట్లాడుతూ.. ఫుడ్ పాయిజన్కు గల కారణాలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే పాఠశాలలో భోజనాలకు వాడుతున్న సరుకులను పూర్తిగా తొలగించి, కొత్త వాటిని తీసుకు రావాలని, తాగే నీటిని పరీక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించామని చెప్పారు. -
గురుకుల సమస్యలకు త్వరలో పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొ న్నారు. బుధవారం మంత్రి నివాసంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ శాలల ఉద్యోగుల సంఘం రూపొందించిన 2018 డైరీ, క్యాలెండర్ను ఆయన ఆవిష్క రించారు. గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిం చటంతో పాటు 2007లో రెగ్యులర్ అయిన టీజీటీలకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని సంఘం అధ్యక్షులు కొల్లు వెంకట్రెడ్డి, యం.వెంకటేశ్వర్లు కోరారు. రూల్ 28ఏ కింద ఇంక్రిమెంట్ల కోతను నిలిపివేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సీఆర్కే శంకర్దాస్, రఘునందన్రావు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల గురుకులం!
♦ గురుకుల పాఠశాలల్లో వసతుల లేమి ♦ మంజూరు ఒకచోట.. నిర్వహణ మరోచోట ♦ చాలాచోట్ల అద్దె భవనాల్లోనే కొనసాగింపు ♦ సంఖ్యకు అనుగుణంగా గదుల్లేక ఇబ్బందులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపహాడ్లోని మూతబడిన ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని అద్దెకు తీసుకొని దామరచర్ల మండలానికి, నాగార్జునసాగర్ నియోజకవర్గం తుమ్మడం గ్రామానికి మంజూరైన బీసీ బాలికల గురుకులాలను నడుపుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో మూడు గురుకులాలు ఏర్పాటు చేశారు. మొత్తం 240 సీట్లకు ఇప్పటివరకు 190 మంది మాత్రమే అడ్మిషన్ పొందారు. సిబ్బంది కొరతతోపాటు దుస్తులు, మంచాల పంపిణీ లేకపోవడంతో విద్యార్థినులు ప్రవేశాలకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. సూర్యాపేట జిల్లాలో ఈ ఏడాది మంజూరైన ఆరు గురుకుల పాఠశాలల నిర్వహణ అధ్వానంగా ఉంది. జిల్లాకు నాలుగు బీసీ, రెండు మైనార్టీ గురుకులాలు మంజూరయ్యాయి. నాగారం, నేరేడుచర్లలో బీసీ బాలుర హాస్టల్స్.. సింగిరెడ్డిపాలెం, అనంతగిరి బీసీ బాలికల గురుకుల పాఠశాలలు.. హుజూర్నగర్, తుంగతుర్తిలో మైనార్టీ బాలుర హాస్టళ్లు ప్రారంభించారు. ఇందులో నాగారం గురుకులాన్ని అర్వపల్లిలో, సింగిరెడ్డిపాలెం గురుకులాన్ని సూర్యాపేటలో, అనంతగిరి గురుకుల పాఠశాలను కోదాడలో నిర్వహిస్తున్నారు. సూర్యాపేటలో నిర్వహిస్తున్న సింగిరెడ్డిపాలెం బాలికల గురుకుల పాఠశాలలో 180 మంది విద్యార్థులు ఉండగా మూడు తరగతి గదులు, నాలుగు హాస్టల్ గదులు మాత్రమే ఉన్నాయి. టాయిలెట్లు ఆరు మాత్రమే ఉండటంతో ప్రతిరోజు విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, నెట్వర్క్: గురుకులాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కేజీ టు పీజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అట్టహా సంగా ప్రారంభించిన గురుకులాలు తొలి ఏడాది ఒడిదొడు కులను ఎదుర్కొంటున్నాయి. ఎక్కడా సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో నడుపుతున్నారు. ఇప్పటివరకు విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్కూల్ యూనిఫాం అందలేదు. పలుచోట్ల నీటి వసతి లేక ఇబ్బందులు పడుతుండగా.. అద్దె భవనాల్లో స్నానాల గదులు, టాయిలెట్స్ లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. ఒక్క బోధన, భోజనం విషయంలో మాత్రం అన్ని చోట్ల విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు నెలలో నాలుగు రోజులు చికెన్, రెండ్రోజులు మటన్తో కూడిన భోజనం, ప్రతిరోజు గుడ్డు, అల్పాహారంగా పూరి, నూడుల్స్, ఇడ్లీ ఇవ్వడంతోపాటు సాయంత్రం చిరుతిళ్లనూ అందించాల్సి ఉంది. అయితే ఇందుల్లో కొన్ని ఐటమ్స్ మిస్ అవుతున్నా.. మొత్తంగా గురుకులాల్లో భోజనంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీగా గురుకులాలు.. పది జిల్లాల్లో కలిపి కేవలం 221 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం వాటి సంఖ్యను మూడింతలు పెంచేసింది. 2017– 18 విద్యా సంవత్సరంలో 170 బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, జనరల్ కేటగిరీలకు సంబంధించి 654 గురుకులాలు ప్రారంభమయ్యాయి. సరిపోని గదులు.. నేలపైనే నిద్ర విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు అందుబాటులో లేవు. అద్దెకు తీసుకున్న భవనాలు ఇరుగ్గా ఉండటంతో గదుల సంఖ్యను కూడా తగ్గించుకోవాల్సి వస్తోంది. కొన్నిచోట్ల రెండు తరగతులను ఒకే గదిలో నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేనిచోట మరో భవనాన్ని వెతుకుతున్నామని అధికారులు చెబుతున్నారు. తరగతి గదుల్లోకి ఫర్నీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. విద్యార్థులు పడుకునేందుకు బెడ్లు అందుబాటులోకి రాకపోవడంతో ఇళ్ల వద్ద నుంచి తెచ్చుకున్న చాపలు వేసుకుని నేలపైనే నిద్రిస్తున్నారు. టాయిలెట్లు.. అతిపెద్ద సమస్య అనుకున్న సమయానికి గురుకులాలను ప్రారంభించి విద్యాబోధన చేయించడంపై హర్షం వ్యక్తమవుతున్నా.. వసతుల లేమిపై విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగైదు స్నానాల గదుల్లో 40 మంది విద్యార్థులు స్కూల్ సమయానికి ముందే స్నానాలు చేసి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. టాయిలెట్ల సంఖ్య తక్కువ ఉండటం ఇబ్బందులను రెట్టింపు చేస్తోంది. హాస్టళ్ల గదులూ అరకొరే.. తరగతులు ప్రారంభం కాకముందే విద్యార్థుల సంఖ్య తెలిసినప్పటికీ అధికారులు పూర్తిస్థాయిలో వసతి కల్పించలేకపోయారు. ఒక్కో పాఠశాలలో చేరిన 180 మంది విద్యార్థులకు నాలుగు గదులే అందుబాటులో ఉండటంతో చాలా మంది విద్యార్థులు ఇళ్ల నుంచి వస్తున్నారు. మిగతా వారు ఇరుకు గదుల్లోనే ఉంటున్నారు. చిన్న గదుల్లో 40 నుంచి 50 మంది ఉండాల్సి వస్తుండటంతో ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఇక విద్యార్థులకు దుస్తులు కూడా ఇంకా ఇవ్వలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
రూరల్ యాక్షన్కి సై
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement