-
బంగారు నాణేలంటూ రూ.40 లక్షలు మస్కా
కర్ణాటక: ఇంటి నిర్మాణానికి పునాది తీస్తుండగా పురాతన బంగారు నాణేలు దొరికాయని నమ్మించి కాంట్రాక్టర్కు రూ.40 లక్షలు మోసం చేసిన ఘటన దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా లింగదహళ్లి గ్రామంలో జరిగింది. ఈ విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్లి తాలూకా చీమనహళ్లికి చెందిన కాంట్రాక్టర్ గోవర్ధన్ బాధితుడు. కుమార్, మాదకప్ప అనే ఇద్దరు పునాది తీస్తుండగా బంగారు నాణేలు దొరికాయని గోవర్ధన్ను మభ్యపెట్టారు . ఈయన చన్నగిరి తాలూకాలో కాంట్రాక్ట్ పనులు చేసే సమయంలో వీరిద్దరూ పరిచయమయ్యారు. నిజమేననుకున్న అతడు సెప్టెంబర్ 23న వారికి రూ. 40 లక్షలు ముట్టజెప్పారు. వారు 2.5 కేజీల బరువైన నాణేలను అతనికి ఇచ్చారు. అదృష్టమంటే నాదేననే సంతోషంతో గోవర్ధన్ ఒక బంగారు అంగడికి వెళ్లి వాటిని పరీక్షింపజేశాడు. అవి బంగారు నాణేలు కాదని తేలింది. దీంతో బాధితుడు చన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ నిరంజన్ తెలిపారు. -
ఆ ముగ్గురికి కార్లు.. ఈ 300 మందికి గోల్డ్ కాయిన్స్
సూపర్స్టార్ రజనీకాంత్ 'జైలర్' హిట్ కావడం మాటేమో గానీ.. నిర్మాత కళానిధి మారన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు. ఎందుకంటే పెట్టిన బడ్జెట్కి రెండు మూడు రెట్లు లాభాలు వచ్చేసరికి ఆయన ఆపడం ఎవరి తరం కావట్లేదు. దీంతో అందరికి గిఫ్ట్స్ ఇస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు ఏకంగా 300 మందికి గోల్డ్ కాయిన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. (ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి శ్రియ సినిమా.. తెలుగులోనూ రిలీజ్!) సాధారణంగా ఏ సినిమా హిట్ అయినాసరే నిర్మాత ఫుల్ హ్యాపీగా ఫీలవుతారు. తెలుగు ప్రొడ్యూసర్స్లో కొందరు మాత్రం హీరోకి లేదా దర్శకుడికి ఖరీదైన కారు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంటారు. 'జైలర్' నిర్మాత కళానిధి మారన్ కూడా అలానే చేశారు. హీరో రజనీ బీఎండబ్ల్యూ, డైరెక్టర్ నెల్సన్-మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్కి ఖరీదైన పోర్సే కార్లని గిఫ్ట్స్గా ఇచ్చాడు. ఇది ఇక్కడితో అయిపోలేదు. ఓ సినిమా తీయాలంటే హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కష్టపడితే పని అయిపోదు కదా. ఈ క్రమంలోనే 'జైలర్' కోసం పనిచేసిన 300 మందికి.. నిర్మాత కళానిధి మారన్ తలో గోల్డ్ కాయిన్ చొప్పున ఇచ్చారు. తాజాగా జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!) Mr.Kalanithi Maran felicitated more than 300 people who worked for #Jailer with gold coins today. #JailerSuccessCelebrations pic.twitter.com/qEdV8oo6dB — Sun Pictures (@sunpictures) September 10, 2023 -
కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే..
అహ్మదాబాద్: గుజరాత్లో ఒక నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న గిరిజన కార్మికులకు బ్రిటిష్ కాలం నాటి 240 బంగారు నాణేలు లభ్యమవగా వాటిని దొంగిలించిన ఆరోపణలపై ఒక ఇన్స్పెక్టర్తో సహా నలుగురు పోలీసులను మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో అరెస్టు చేశారు. సంఘటనా స్థలంలో కూలీలు రామ్కు భయ్డియా అతని మేనకోడలు బవారి తవ్వకాలు చేస్తుండగా వారికి ఒక కాసుల మూట కనిపంచిందని.. చడీ చప్పుడు చేయకుండా ఆ మూటతో సహా గుజరాత్ సరిహద్దులో వారు నివాసముండే సోండ్వా గ్రామానికి చేరుకున్నారని.. వారు 20 నాణేలను తీసుకుని మిగిలినవాటిని వారి ఇంట్లోనే పాతి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ నోటా ఈ నోటా వార్త చేరి మెల్లగా ఊరంతా వ్యాపించింది. ఇదే క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు జులై 19న రామ్కు భయ్డియా ఇంటికి చేరుకున్నారని గ్రామస్తులు తెలపగా నిధిని తవ్వించి మొత్తంగా వారి వద్ద నుండి మొత్తం 239 నాణేలను లాక్కుని తమకి ఒకే ఒక్క నాణెం ఇచ్చారని రామ్కు తెలిపాడు. ఆ మరుసటి రోజే రామ్కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారుల దృష్టికి విషయం చేరి ఆ నలుగురు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జరీ చేశారు. ఈ మొత్తం తతంగంలో ఇప్పటికింకా ఆ బంగారు నాణేల ఆచూకీ తెలియకపోవడం కొసమెరుపు. ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉపాధ్యాయుడితో భార్యకు వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య -
కేంద్రం బంగారం అమ్ముతోంది.. ఇలా కొనుగోలు చేయండి!
హిందూ పురాణాల ప్రకారం, అక్షయ తృతీయ పర్వదినాన బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. అందుకనే రేటు ఎంతైనా ఉండనీ, చిన్నమెత్తు బంగారమైనా ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తారు. అయితే అక్షయ తృతీయ సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పలు మింట్ కార్యాలయాల్లో సామాన్యులు బంగారం, వెండి కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. తద్వారా ఎవరైనా గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్లను కొనుగోలు చేయాలంటే కేంద్రం ఏర్పాటు చేసిన మింట్ కేంద్రాలను సందర్శించవచ్చు. మింట్ ఔట్లెట్లలో 5 గ్రాములు, 10 గ్రాములు, 50 గ్రాములు ఇలా ఫిజికల్గా, లేదంటే ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. India Government Mint Wishes you a very happy Akshaya Tritya. On this auspicious day of Akshaya Tritiya, don't forget to purchase some gold and pray to Lord Vishnu. Buy now- https://t.co/DcRBC0Ukya#akshayatritiya #BuyGold #auspacious pic.twitter.com/V0HJYLKHLm — India Government Mint (@SPMCILINDIA) April 22, 2023 మింట్ అంటే ఎమిటీ? దేశంలో డబ్బులను తయారు చేసే కేంద్రాలను మింట్ కేంద్రాలు అని పిలుస్తారు. దేశ వ్యాప్తంగా 5 మెట్రో నగరాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మింట్ కేంద్రాలు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే? భారత ప్రభుత్వం, ఆర్బీఐ ఆధ్వర్యంలో మింట్ కార్యాలయాల్లో నోట్లు, కాయిన్స్ తయారవుతాయి. ♦ఢిల్లీలో జవహార్ వాయిపర్ భవన్ జన్ పథ్, న్యూఢిల్లీ ♦నోయిడా డీ-2 సెక్టార్ 1 ♦ముంబైలో షాహిద్ భగత్ సింగ్ రోడ్డు ♦హైదరాబాద్లో ఐడీఏ ఫేజ్ 2, చర్లపల్లి ♦కోల్కతా అలిపోరిలో ఉత్పత్తి కొనసాగుతుంది. మింట్ కేంద్రాల్లో బంగారం, వెండి ఎలా కొనుగోలు చేయాలంటే ఎవరైనా సిల్వర్, గోల్డ్ కొనుగోలు చేయాలంటే పైన పేర్కొన్న కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అయితే www.indiagovtmint.in.లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ కొనుగోళ్లను క్యాష్, డెబిట్కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు చెల్లించి మీకు కావాల్సిన మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చు. బీఐఎస్ హాల్ మార్క్తో సహా కేంద్రం మింట్ అవుట్లెట్లలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) హాల్ మార్క్ పొందినగోల్డ్ కాయిన్స్ మాత్రమే విక్రయాలు జరుపుతున్నట్లు ట్వీట్ చేసింది. అంతేకాదు కాయిన్స్ 24క్యారెట్ల గోల్డ్తో 99.9 శాతం స్వచ్ఛమైందని పేర్కొంది. గోల్డ్పై లోన్ కూడా దశాబ్దాల తర్వాత కూడా బంగారు నాణేలు వాటి మెరుపును కోల్పోవు. వాటి మార్కెట్ విలువ వాటి వయస్సుతో సంబంధం లేకుండా పెరుగుతూనే ఉందని భారత ప్రభుత్వ మింట్ ట్విట్టర్లో పేర్కొంది. బంగారు నాణేలను సులభంగా విక్రయించవచ్చు. లేదా బంగారు రుణాల కోసం తాకట్టుగా ఉపయోగించవచ్చు’ అని వెల్లడించింది. చదవండి👉 అవధుల్లేని అభిమానం అంటే ఇదేనేమో..టిమ్ కుక్కు ఇంతకన్నా ఏం కావాలి! -
అక్షయ తృతీయ ప్రత్యేక బంగారు నాణేలు.. ఆఫర్లు!
రాబోయే అక్షయ తృతీయ పండుగ కోసం టాటా గ్రూప్ ఆభరణాల బ్రాండ్ తనిష్క్ ప్రత్యేక బంగారు నాణేలను ఆవిష్కరించింది. చోళ రాజవంశం స్ఫూర్తితో ఈ ప్రత్యేక నాణేలను రూపొందించింది. పరిమితంగా అందుబాటులోకి తెచ్చిన ఈ నాణేలను ఆభరణాల కోసం కాకుండా సేకరణ కోణంలో ఆసక్తి ఉన్నవారు కొనుగోలు చేయవచ్చు. చోళ సామ్రాజ్య వైభవం, సాంస్కృతిక శోభను చాటేలా నటరాజ నానయం, వెట్రియిన్ కారిగై నానయం, కరంతై విక్టరీ నానయం, రాజేంద్ర చోళ నానయం పేరుతో ప్రత్యేక నాణేలను తనిష్క్ రూపొందించింది. ఇదీ చదవండి: Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి... కాగా అక్షయ తృతీయ సందర్భంగా బంగారు, వెండి, వజ్రాల ఆభరణాలపై పలు కంపెనీలు వివిధ రకాల ఆఫర్లు అందిస్తున్నాయి. తనిష్క్ ఏప్రిల్ 24 వరకు బంగారు, వజ్రాభరణాల తయారీ ఛార్జీలపై 20 శాతం తగ్గింపును అందిస్తోంది. కస్టమర్లు ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా గోల్డ్ రేట్ ప్రొటెక్షన్ని కూడా పొందవచ్చు. అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వస్తోంది. ఈ పర్వదినం హిందువులకు అత్యంత పవిత్రమైనది. ఈ రోజున బంగారం కొనడం వల్ల ఐశ్వర్యం, అదృష్టం కలుగుతాయని నమ్ముతారు. అక్షయం అనేది అమరత్వాన్ని సూచిస్తుంది. అక్షయ తృతీయ నాడు మనం సాధించేదేదైనా శాశ్వతంగా నిలిచి ఉంటుందని హిందువుల నమ్మకం. కాబట్టి ఈ రోజున ఇల్లు, ఆస్తి లేదా ఆభరణాలు వంటివి కొంటే అవి శాశ్వతంగా ఉంటాయని, తమకు అదృష్టాన్ని తెస్తాయని భావిస్తారు. ఇదీ చదవండి: నెట్ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన సబ్స్క్రిప్షన్ చార్జీలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement