-
అంచనా వేయండి.. అందరూ పంచుకోండి..!
సాక్షి, హైదరాబాద్: దేశంలో గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో చాలా రాష్ట్రాలు అతలాకుతలం అయిన నేపథ్యంలో..ఈ ఏడాది అలాంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నదీ బేసిన్ల పరిధిలో గుర్తించిన వరద ప్రభావిత ప్రాంతాల పరీవాహక రాష్ట్రాలను ముందుగానే మేల్కొలిపే చర్యలకు దిగింది. గతేడాది మాదిరే ఈసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అందుకు తగ్గట్టే ముందు జాగ్రత్తలు తీసుకోవాలంది. వాతావరణ పరిస్థితి, వర్షపాతం, ప్రాజెక్టుల్లో చేరుతున్న ప్రవాహాలు, నదుల్లో నమోదవుతున్న వరద, రిజర్వాయర్లలో నిల్వల సమాచారాన్ని పరీవాహక రాష్ట్రాలతో పంచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిద్వారానే విపత్తు నిర్వహణ సాధ్యమవుతుందని వెల్లడించింది. గత భయానక అనుభవాల దృష్ట్యానే.. దేశ వ్యాప్తంగా గతేడాది భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర, అస్సోం, కేరళ, ఉత్తరాఖండ్, పంజాబ్, బిహార్ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నదులు, రిజర్వాయర్లు అధిక వర్షాలతో ఉప్పొంగాయి. అధికంగా నమోదైన ఈ వర్షపాతాన్ని అంచనా వేయడంలో విఫలం కావడంతో చాలా రాష్ట్రాల్లో ప్రాజెక్టుల కింద తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సం భవించింది. దీంతోపాటే ఎగువ రాష్ట్రాలు ఎప్పటికప్పుడు వరద సమాచారాన్ని దిగువ రాష్ట్రాలకు ఇవ్వడంలో చూపిన నిర్లక్ష్యం, పూర్తిగా ప్రాజెక్టుల గేట్లు ఎత్తేవరకు దిగువ ప్రాజెక్టుల అధికారులను అప్రమత్తం చేయకపోవడం, ప్రధాన నదుల్లో కలిసే ఉపనదుల ప్రవాహా సామర్థ్య లెక్కలు గణించే యంత్రాంగం లేకపోవడంతో ముంపు ప్రభావం దిగువ రాష్ట్రాలపై అధికంగా పడింది. దక్షిణాదిలో కృష్ణా బేసిన్లోనే ఆల్మట్టి రిజర్వాయర్కు ఒకే రోజులో 10 లక్షలకు మించి వరద రావడం, ఎగువ మహారాష్ట్ర నుంచి వచ్చే వరదలపై సరైన అంచనా లేకపోవడంతో దిగువ ప్రాం తాలు ముంపునకు గురయ్యాయి. తుంగభద్ర నదిలోనే అకస్మాత్తుగా వచ్చిన వరదతో మహ బూబ్నగర్ జిల్లాలో, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. కృష్ణాబేసిన్లోని శ్రీశైలం ప్రాజెక్టుకు గతం కంటే భిన్నంగా ఆగస్టు నెలలో కేవలం 25 రోజుల్లో ఏకంగా 865 టీఎంసీల మేర వరద వచ్చింది. దీన్ని నియంత్రించేందుకు ఎగువ రాష్ట్రాలతో సమన్వయం అత్యంత కీలకమైంది. సమాచారం ఇచ్చిపుచ్చుకునేలా... ఈ నేపథ్యంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ గుర్తించిన నదీ బేసిన్లు, ప్రాజెక్టులతోపాటు ఏవైనా ముప్పు ప్రాంతాలు ఉన్నట్లయితే వాటి వివరాలను తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ముఖ్యంగా వారం కిందట కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ బేసిన్లోని కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో ఇక్కడి హైదరాబాద్లో సీడబ్ల్యూసీ అధికారులు సమీక్షించారు. వరదలపై పొరుగున ఉన్న, లేక ఆ బేసిన్ పరీవాహకం ఉన్న రాష్ట్రాలతో మిగతా రాష్ట్రాలు సమాచార మార్పిడి చేసుకోవాలని, ప్రాజెక్టుల నీటి నిల్వ, ప్రవాహాల పరిస్థితులను ఎగువ రాష్ట్రాలు దిగువ రాష్ట్రాలకు తెలియజేయాలని ఆదేశించారు. వాతావరణ, విపత్తు నిర్వహణ, నీటి పారుదల శాఖల మధ్య సమన్వయం ఉండేలా లైసెన్సింగ్ అధికారులను నియమించాలని, వారి ఫోన్ నంబర్లను అన్ని రాష్ట్రాల అధికారులకు అందు బాటులో ఉంచాలని సూచించారు. ఇక రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి, కడెం, మూసీ, మున్నేరు, ప్రాణహిత, ఇంద్రావతి తదితర బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టుల వరదపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, నిజాంసాగర్, సింగూరు, శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి, తుపాకులగూడెం, మూసీ ప్రాజెక్టులపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఆటోమేటిక్ రెయిన్ గేజ్ స్టేషన్లు, ఆటోమేటిక్ వాటర్ లెవల్ రికార్డులు, డిజిటల్ వాటర్ లెవల్ రికార్డుల ఏర్పాటు పక్కాగా ఉండాలని తెలిపారు. కాళేశ్వరం పరిధిలో 15 గేజ్ మీటర్లు.. ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో ఏడాదికి కనీసం 530 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళిక వేస్తోంది. ఇందులో ప్రధానంగా వరద అంచనా, మోటార్ల ఆపరేషన్కు వీలుగా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సెన్సార్ల ద్వారానే గోదావరి ప్రవాహ సామర్థ్యాన్ని అంచనావేసేలా 15 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. సీడబ్ల్యూసీ వద్ద జరిగిన సమీక్షలో మేడిగడ్డ బ్యారేజీతో పాటు కంతనపల్లి వద్ద నమోదయ్యే ప్రవాహ లెక్కలను ఎప్పటికప్పుడు తెలిపేందుకు తెలంగాణ అధికారులు అంగీకరించారు. -
ప్రాజెక్టుల్లోకి ‘గోదావరి’
వర్షాలతో కడెం, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ, నిజాంసాగర్లోకి ప్రవాహాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరి ప్రాజెక్టుల్లోకి ఈ ఏడాదిలో తొలిసారి గరిష్ట ప్రవాహాలు నమోదవు తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, కడెం, నిజాంసాగర్లో చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. గోదావరి బేసిన్లో ఎగువ మహారాష్ట్రలో ఉన్న గైక్వాడ్ ప్రాజెక్టులకు గరిష్టంగా 9,238 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో ఇక్కడ 102 టీఎంసీల సామర్థ్యానికి గానూ 64.6 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ఇక దిగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 5,116 క్యూసెక్కుల నీటి ప్రవాహాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ 90 టీఎంసీలకు గానూ ప్రస్తుత లభ్యత 9.66 టీఎంసీలు మాత్రమే ఉంది. ఎగువ మహారాష్ట్రలో అధిక వర్షాలు కురిస్తేనే శ్రీరాంసాగర్కు మరింత ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. ఇక కడెం ప్రాజెక్టుకు సైతం 5,214 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. అక్కడ 7.6 టీఎంసీలకుగానూ 4.7 టీఎంసీల లభ్యత ఉంది. నిజాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోకి 2,600 క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఇదే బేసిన్లోని లోయర్మానేరు డ్యామ్కు చుక్క కూడా చేరలేదు. సింగూరులోకి 290 క్యూసెక్కుల మేర నీరొస్తోంది. కృష్ణాలో అంతంతే... ఇక కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో ఎక్కడా ప్రవాహాలు పెద్దగా కనిపించడం లేదు. ఎగువ ఆల్మట్టి నుంచి 29వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదలడంతో నారాయణపూర్కు 27,600 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నారాయణపూర్ నుంచి దిగువకు చుక్క విడువకపోవడంతో పెద్దగా ప్రవాహాలు లేవు. అయితే జూరాల పరీవాహకం పరిధిలో కురుస్తున్న వర్షాలతో ఆ ప్రాజెక్టులోకి 2,052 క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైంలంకి కూడా 2,238 క్యూసెక్కులు వస్తోంది. సాగర్లోకి 705 క్యూసెక్కులు మాత్రమే ప్రవాహం ఉంది. ఇవేవీ ప్రాజెక్టుల పరిధిలోని తాగు, సాగనీటి అవసరాలను తీర్చేలా లేవు. -
ఉగ్ర గోదారి
కుండపోత వర్షాలతో భారీ వరద - శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 4.69 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు - 42 గేట్లు ఎత్తి నీటి విడుదల.. పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తం - సింగూరు, నిజాంసాగర్, ఎల్ఎండీల్లోకీ భారీగా నీటి చేరిక - శ్రీశైలానికి లక్షా 26 వేల క్యూసెక్కుల వరద - నిండుకుండల్లా 25 వేలకు పైగా చెరువులు.. 147 చోట్ల గండి - వరదల పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్రావు - జల సౌధలో కంట్రోల్ రూమ్.. ప్రాజెక్టుకో పర్యవేక్షణాధికారి సాక్షి, హైదరాబాద్, బాల్కొండ: భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పరవళ్లు తొక్కుతోంది. భారీగా వస్తున్న వరదతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండిపోగా దిగువకు ఉరకలెత్తుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉప నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ జల కళను సంతరించుకున్నాయి. చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు శని వారం రాత్రికి ఏకంగా 4.69 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో 42 గేట్లు ఎత్తి 3.29 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మరోవైపు భారీగా వరదలు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వరదలు, ప్రాజెక్టుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేం దుకు పర్యవేక్షణాధికారులను నియమించింది. సమన్వయం, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు స్వయంగా కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యామ్ వద్ద మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శని వారం ఉదయం సిద్దిపేట కోమటి చెరువు అలుగు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన హరీశ్.. మధ్యాహ్నం లోయర్ మానేరు డ్యామ్ వద్దకు చేరుకున్నారు. వరదల పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. ఎగువన భారీ వర్షాలతో.. మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. శనివారం ఉదయం లక్షా 32 వేల క్యూసెక్కుల వరద రాగా.. రాత్రికి అది ఏకంగా 6 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (90 టీఎంసీలు)కాగా.. శనివారం రాత్రి 11 గంటలకు 1089.7 అడుగుల (84.01 టీఎంసీల)కు చేరినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వరద ఇంకా భారీగా కొనసాగుతుండడంతో 42 గేట్లను ఎత్తి.. 3.29 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఆదివారం ఉదయంకల్లా ప్రాజెక్టు పూర్తిగా నిండిపోతుందని అధికారుల అంచనా. ఇక భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలవారిని సురక్షిత ప్రాంతా లకు తరలిస్తున్నారు. ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా 15 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నిండుకుండల్లా గోదావరి ప్రాజెక్టులు గోదావరిపై ఉన్న మరో ప్రధాన ప్రాజెక్టు ఎల్లంపల్లి ఇప్పటికే నిండుకుండలా మారింది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 72,832 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక శ్రీరాంసాగర్ నుంచి విడుదలవుతున్న నీరు ఆదివారం ఉదయానికి ఎల్లంపల్లికి చేరనుంది. దీంతో 57,388 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇక కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో మానేరు, మోయతుమ్మెద వాగు, మూలవాగులు ఉప్పొంగుతున్నాయి. లోయర్ మానేరు డ్యాంలోకి 60 వేల క్యూసెక్కులకుపైగా వరద వచ్చి చేరుతోంది. శనివారం సాయంత్రానికి డ్యాంలో 9.26 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు మంజీరా నది పొంగి ప్రవహిస్తుండడంతో సింగూరు ప్రాజెక్టు నిండు కుండలా మారింది. నిజాంసాగర్లో ప్రస్తుతం 1.42 టీఎంసీల నిల్వ ఉంది. 17.80 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు ఆదివారం సాయంత్రానికి పూర్తిగా నిండిపోయే అవకాశముంది. మొత్తంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులన్నీ నిండటంతో రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇంద్రావతి, శబరి, సీలేరుల నుంచి పెద్ద ఎత్తున వరద గోదావరిని చేరుతోంది. శనివారం సాయంత్రానికి 3,06,473 క్యూసెక్కుల వరద ధవళేశ్వరం బ్యారేజీకి చేరింది. మహారాష్ట్రలో భారీ వర్షాలతో.. మహారాష్ట్రలో భారీ వర్షాలతో గోదావరి ఉరకలెత్తుతోంది. దీంతో విష్ణుపురి బ్యారేజీ నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు శనివారం రాత్రి ఎస్సారెస్పీ అధికారులకు మహారాష్ట్ర అధికారులు సమాచారం అందించారు. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరదకు అనుగుణంగా ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాల్సిందిగా అధికారులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ఆదివారం సాయంత్రానికి గోదావరి వరద భారీగా పెరిగే అవకాశం ఉండడంతో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిగా ఆదేశించారు. ముంపునకు గురయ్యే అవకాశమున్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. నిండిన చెరువులు రాష్ట్రంలోని 45 వేల చెరువులకు గాను 25 వేలకు పైగా చెరువులు పూర్తి స్థాయిలో నిండినట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు 7 వేల చెరువులు 75శాతం నిండాయని, మరో 5 వేల చెరువులు 50 శాతం, 6 వేల చెరువులు 25 శాతం నిండాయని పేర్కొన్నారు. ఇక 147 చోట్ల గండ్లు పడ్డాయని, వాతావరణం అనుకూలించిన చోట మరమ్మతులు ప్రారంభించామని తెలిపారు. జూరాలకు భారీగా వరద ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు ఇప్పటికే నిండిపోవడంతో భారీగా వస్తున్న వరదను అదే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. దీంతో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జూరాల ప్రాజెక్టుకు 1.2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శనివారం సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్లో నీటి నిల్వ 170.66 టీఎంసీలకు చేరుకుంది. మరో 45.12 టీఎంసీలు వస్తే శ్రీశైలం పూర్తిగా నిండనుంది. ఇక శ్రీశైలం దిగువన, నాగార్జున సాగర్కు ఎగువన వర్షాలు కురవకపోవడంతో సాగర్ డ్యామ్లోకి ప్రవాహాలేమీ రావడం లేదు. శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్న 7,063 క్యూసెక్కులు మాత్రమే సాగర్లో చేరుతోంది. ప్రస్తుతం ఈ డ్యామ్లో 139.44 టీఎంసీల నిల్వ ఉంది. సాగర్ నిండాలంటే మరో 172.61 టీఎంసీలు అవసరం. హైదరాబాద్, నల్లగొండ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో మూసీ, మున్నేరు, పాలేరు వంటి ఉప నదులు, వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. దాంతో పులిచింతల ప్రాజెక్టుకు భారీగా ప్రవాహాలు వస్తున్నాయి. జలసౌధలో కంట్రోల్ రూమ్ (040-23390794) రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో నీటి పారుదల శాఖ ప్రజలను అప్రమత్తం చేసే చర్యలు చేపట్టింది. వరదల పరిస్థితి, రిజర్వాయర్లలో నీటిమట్టాలపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించేందుకు ఆ శాఖ ప్రధాన కార్యాలయం ‘జలసౌధ’లో కంట్రోల్ రూం (040-23390794) ఏర్పాటు చేసింది. శనివారం మధ్యాహ్నం నుంచి ప్రతి గంటకోమారు ప్రత్యేక బులెటిన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్రావు ప్రకటించారు. నీటి పారుదల శాఖ ఈఎన్సీ విజయప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ కంట్రోల్రూం పనిచేస్తుంది. నీటిపారుదల శాఖకు చెందిన వివిధ వాట్సప్ గ్రూపుల ద్వారా అందే సమాచారాన్ని విశ్లేషిస్తూ మంత్రి హరీశ్రావు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతుండటంతో నీటి విడుదలపై ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతున్నారు. నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు, మిడ్ మానేరు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల వద్ద పరిస్థితిపై సమాచారం అందించేందుకు ఆయా ప్రాజెక్టుల వారీగా పర్యవేక్షణ అధికారులను నియమించారు. రాష్ట్రస్థాయిలో తీసుకునే నిర్ణయాల అమలు బాధ్యతను వారికి అప్పగించారు. నిజాంసాగర్కు సీఈ మధుసూదన్, ఎల్ఎండీకి సీఈ శంకర్, ఎల్లంపల్లికి సీఈ అనిల్, ఎస్సారెస్పీకి ఎస్ఈ సతీశ్, సింగూరుకు ఎస్ఈ శ్రీకాంత్ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. జలసౌధ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరంగా వరద పరిస్థితిని పర్యవేక్షించే బాధ్యతను ఈఎన్సీ విజయప్రకాశ్, చీఫ్ ఇంజనీర్లు నాగేందర్, సురేశ్లకు అప్పగించారు. -
‘ఊత పదాలు కాదు...హుందాగా వ్యవహరించాలి’
హైదరాబాద్ : ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో టీఆర్ఎస్ సర్కారు ప్రతిపక్ష కాంగ్రెస్ను విమర్శించడాన్ని తెలంగాణ శాసనసభాపక్ష నేత జానారెడ్డి తప్పుపట్టారు. ప్రశ్నిస్తే జైలుకు పంపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం సరికాదని ఆయన అన్నారు. జానారెడ్డి గాంధీభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని ఆయన అన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలని తాను ఇరిగేషన్ మంత్రికి, కార్యదర్శికి లేఖ రాస్తే ఇప్పటి వరకూ సమాధానం లేదన్నారు. రెండేళ్లలో రెండు పంటలకు నీరిస్తామని చెప్పిన కేసీఆర్ అది చేసి చూపించగలరా అని ప్రశ్నించారు. అంచనాలు పెంచి ప్రాజెక్టులు కట్టిస్తున్న టీఆర్ఎస్ సర్కారు తీరును ప్రజలు గమనిస్తున్నారని.. సరైన సమయంలో బుద్ధి చెబుతారని జానారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రాజెక్టుల రీ డిజైన్ వల్ల రాష్ట్రంపై 50 నుంచి 60వేల కోట్ల భారం పడుతుందన్నారు. గతంలో తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టును తాము ప్రతిపాదించామన్నారు. తమ ప్రతిపాదనను మహారాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తామందని, ఆ ప్రతిపాదనపై కేసీఆర్ చర్చించకుండా 148 అడుగులకు ఒప్పందం కుదుర్చుకోవడం చారిత్రక తప్పిదం కాదా? అని జానారెడ్డి ప్రశ్నించారు. లోపాలను ఎత్తిచూపే బాధ్యత ప్రతిపక్షంగా తమకు హక్కు ఉందన్నారు. టెండర్లు పారదర్శకంగా జరగకపోవడంతో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం తన పాదర్శకతను నిరూపించుకోవాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చెప్పిన అంశాలను నివృత్తి చేయకుండా కేసీఆర్ ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారన్నారు. వ్యక్తులను టార్గెట్ చేయడం సరికాదని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అధికార దర్పంతో మాట్లాడటం సీఎం హోదాకు తగదన్నారు. సీఎం ఉన్న వ్యక్తి ఊతపదాలు కాదని, హుందాగా వ్యవహరించాలన్నారు. గతం అంటూ గందరగోళం చేయడం కాదని, ఇప్పుడేమి చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నీళ్ళు ఇస్తే ప్రభుత్వానికి ప్రచారం చేస్తానని మాట నిలబెట్టుకుంటానని..మాటకు మాట మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనన్నారు. కేసీఆర్ చేస్తున్న అవక తవకలను సరిదిద్దడం దేవుడి తరం కూడా కాదన్నారు. గద్వాల పై ప్రజల అభిప్రాయం బలంగా వినిపిస్తున్నారని, పెద్ద జిల్లా అయిన పాలమురును 4 జిల్లాలు చేయలని జానారెడ్డి సూచించారు. -
చంద్రబాబును ఎందుకు క్షమించాలి?
హైదరాబాద్ : గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడరని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఆమె శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టులు పూర్తయితే గోదావరి డెల్టాకు ఒక్క చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టేలా తెలంగాణ సీఎం కేసీఆర్ ఒప్పందాలు చేసుకుంటుంటే చంద్రబాబు కనీసం స్పందించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా.. కేంద్రంలో భాగస్వామి అయిన చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. రాష్ట్రానికి నీళ్లే తేలేని సీఎం అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఏం పట్టనట్లు చిదానందస్వామిలా, చంద్రబాబు స్వామిగారు టెక్నాలజీ, యాప్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కనబడని పాలన గురించి టెక్నాలజీని అడ్డుపెట్టుకుని ప్రజలను మెప్పించే యత్నం చేస్తున్నారన్నారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా గురించి కూడా కేంద్రం వద్ద రాజీపడ్డారన్నారు. ఎగువ రాష్ట్రాలు చుక్కనీరు రాకుండా దిగ్బంధనం చేసేలా జలాశయాలపై ప్రాజెక్టులు కట్టేస్తుంటే చంద్రబాబు నాయుడు నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయించుకుంటున్నారన్నారు. ఇటువంటి వ్యక్తి సీఎంగా ఉన్న చంద్రబాబును ప్రజలు ఎందుకు క్షమించాలని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అనాధలా మార్చేశారని ఆమె మండిపడ్డారు. ఏపీ ప్రజలకు ఎందుకింత ఖర్మ?, చంద్రబాబు మీ పౌరుషం ఏమైంది? ఇప్పటికైనా కళ్లు తెరవాలని, లేదంటే చరిత్ర హీనులవుతారన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ప్రాజెక్టులు నిర్మాణంపై అనుమతి తీసుకోవాలని స్పష్టంగా ఉందన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement