-
ఇక పీఎఫ్ విత్డ్రాయల్ 75 శాతమే!
న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) సభ్యులు తమ భవిష్య నిధి నుంచి గడువుకు ముందే విత్డ్రా చేసుకునే నగదును 75 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగతా మొత్తం(25%) ఆ సభ్యులు 58 ఏళ్ల వయసు వచ్చేంతవరకు ఈపీఎఫ్ఓ వద్దే ఉంటుంది. ఈ ప్రతిపాదనను కార్మిక శాఖ అనుమతి కోసం పంపించారు. ఉద్యోగ సంఘాలు కూడా ఈ ప్రతిపాదనను సమర్ధిస్తున్నందువల్ల 10-15 రోజుల్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తామని కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కేకే జలన్ వెల్లడించారు. గృహనిర్మాణం, పెళ్లి, పిల్లల చదువు తదితర కారణాలకు కూడా ఈ 75% పరిమితి వర్తిస్తుందన్నారు. పీఎఫ్ ఉద్దేశం వృద్ధాప్యంలో ఆర్థిక సాయం అందించడమని, దానికి కాకుండా మరే కారణానికి ఆ మొత్తాన్ని ఉపయోగించడం సరికాదని తాము భావిస్తున్నామని వివరించారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం.. 58 ఏళ్ల లోపు వయసున్న ఈపీఎఫ్ఓ సభ్యులు గత రెండు నెలలుగా తమకే ఉద్యోగం లేదన్న కారణం చూపుతూ మొత్తం పీఎఫ్ను విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. -
పీఎఫ్ సొమ్మును మింగేస్తారా...
క్రిమినల్ కేసులు పెడతాం! ఆర్టీసీకి పీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నోటీసులు పక్షం రోజుల్లో మొత్తం జమచేస్తామని అధికారుల విజ్ఞప్తి హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు చెందాల్సిన రూ. 160 కోట్ల భవిష్య నిధి మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా సొంత అవసరాలకు వాడుకున్న తీరుపై ఆర్టీసీకి షాక్ తగిలింది. ఈ వ్యవహారాన్ని భవిష్యనిధి విభాగం తీవ్రంగా పరిగణించింది. నిబంధనలకు విరుద్ధంగా సొంత అవసరాలకు వినియోగించిన మొత్తాన్ని వెంటనే ‘నిధి’కి జమ చేయకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ పీఎఫ్లోని ఎన్ఫోర్స్మెంట్ స్క్వ్యాడ్ ఆర్టీసీకి తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి కార్మికులతో పాటు సంస్థ జమ చేసే భవిష్య నిధి మొత్తాన్ని గుట్టుగా సొంతానికి వాడుకున్న తీరును ఇటీవల ‘పీఎఫ్నూ మింగేశారు’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనికి పీఎఫ్ విభాగం స్పందించి ఈ మేరకు ఆర్టీసీకి నోటీసులు జారీ చేసింది. పీఎఫ్ నిధులను మళ్లించ డమంటే కేంద్ర చట్టాలను అతిక్రమించినట్లేనంటూ క్రిమినల్ కేసులు నమోదు చేయటానికి సిద్ధం కావటంతో ఆర్టీసీ అధికారులు గతుక్కుమన్నారు. ఆ నిధులు మళ్లించటానికి దారితీసిన పరిస్థితులను తెలుపుతూ పీఎఫ్ కార్యాలయానికి వివరణ ఇచ్చారు. తమకు పక్షం రోజుల గ డువు ఇస్తే ఆ మొత్తాన్ని తిరిగి జమచేస్తామని విజ్ఞప్తి చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement