-
ఫన్ఫుల్
ఫుల్లుగా ఫన్ మూడ్లో ఉన్నారు విశ్వక్ సేన్, మీనాక్షీ చౌదరి. మరి.. నటిస్తున్న సినిమా ఫన్ ఎంటర్టైనర్ అయితే ఆ షూటింగ్ లొకేషన్లో మొత్తం ఫన్నే కదా. విశ్వక్, మీనాక్షీ జంటగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. ఫన్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోలను త్వరలో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. -
SSMB28: మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్! అసలు కారణమిదేనా?
సూపర్ స్టార్ మహేశ్ బాబు-స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డె హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రీప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్పైకి వచ్చింది. అంతేకాదు ఈ సినిమా కోసం మేకోవర్ కూడా అయ్యాడు మహేశ్. ఆయన న్యూలుక్కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ స్టార్ట్స్ అంటూ సెప్టెంబర్ 13న సెట్స్లోని ఓ సన్నివేశాన్ని షేర్ చేసింది చిత్ర బృందం. చదవండి: ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్మెంట్ బ్రేక్.. అసలు కారణమిదే! అయితే యాక్షన్ సీన్స్తో ఈ మూవీ షూటింగ్ను ప్రారంభించాడట త్రివిక్రమ్. ఈ క్రమంలో తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుందని, సెకండ్ షెడ్యూల్ దసరా తర్వాతే అంటూ తాజాగా మూవీ యూనిట్ ప్రకటన ఇచ్చింది. ఇదిలా ఉంతే రెండు, మూడు రోజుల్లోనే తొలి షెడ్యూల్ పూర్తి కావడంపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. దీని వెనక ఓ కారణం ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ తాజా బజ్ ప్రకారం ఫస్ట్ షెడ్యూల్ను కావాలనే ఆపేసారంటున్నారు. ఇప్పటి వరకు చేసిన యాక్షన్ సీక్వెన్స్ విషయంలో మహేష్బాబు, త్రివిక్రమ్ సంతృప్తిగా లేరట. అనుకున్న విధంగా ఈ ఫైట్ సీన్లు రావడం లేదని, అందుకే షూటింగ్కు కావాలనే బ్రేక్ ఇచ్చినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: విషాదం.. స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ మృతి నిజానికి ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం తొలి షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు జరగాల్సి ఉందట. కానీ, యాక్షన్ సీన్స్ అనుకున్నట్టుగా రాకపోవడంతో ఆర్థాంతరంగా షూటింగ్ను నిలిపివేయాల్సి వచ్చిందని సినీవర్గాల నుంచి సమాచారం. కాస్తా సమయం తీసుకుని ప్రస్తుత ఫైట్ మాస్టర్ని కొనసాగించాలా? కొత్త మాస్టర్ని తీసుకోవాలా? అనే కీలక నిర్ణయం తీసుకొనున్నాడట దర్శకుడు. ఆ తర్వాతే తిరిగి షూటింగ్ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. అందుకే దసరా వరకు త్రివిక్రమ్ టైం తీసుకుంటున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించేవరకు వేచి చూడాల్సిందే. First schedule of #SSMB28 has been completed with some kick-ass high octane epic action scenes 🔥 Thank you @anbariv masters for amazing stunt choreography 🤗 The second schedule will start post Dussehra with our Superstar @urstrulyMahesh garu & butta bomma @hegdepooja. — Naga Vamsi (@vamsi84) September 21, 2022 -
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న వివాదాస్పద చిత్రం
విమర్శలు, వివాదాలు, కేసుల మధ్య మహా చిత్రం ఒక ఘట్టాన్ని దాటింది. నటి హన్సిక నటిస్తున్న తాజా చిత్రం మహా. ఇది ఈ అమ్మడి 50వ చిత్రం అన్న విషయం తెలిసిందే. ఎక్స్ట్రా ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై వి. మదియళగన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జమీల్ దర్శకత్వం వహిస్తున్నారు. మహ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో తెలిసిందే. హన్సిక కాషాయ వాస్త్రాలు ధరించి, నోటీ నిండా పొగతో చేతిలో సిగరెట్తో కాశీ పట్టణం తీరంలో సింహాసనంలో దర్జాగా కూర్చున్న దృశ్యంపై తీవ్ర దుమారం రేపింది. ఇవన్నీ అసలు పట్టనట్లు ఆ చిత్ర నిర్మాత వి.మదియళగన్ శనివారం ఒక ప్రకటనను విడుదల చేస్తూ, మాగ్నెటింగ్, అలూరింగ్, హిడ్డన్, అగ్రెస్సీవ్ వంటివి మహా చిత్రంలో ఇంకా చాలా ఉంటాయని పేర్కొన్నారు. ఈ చిత్రం మొత్తం తమిళ చిత్రపరిశ్రమ దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుందన్నారు. సాధారణంగా నిర్మాతలు స్టార్ తారాగణాన్ని, ప్రముఖ దర్శకులను, ప్రముఖ సాంకేతిక నిపుణులను తమ చిత్రాల్లో ఉండాలని కోరుకుంటారన్నారు. తనకు మాత్రం ప్రణాళిక ప్రకారం, నిబద్ధతతో పనిచేసే చిత్ర టీమ్ లభించడం ఆనందంగా ఉందన్నారు. మహా చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ సంతృప్తిగా పూర్తి చేశారని చెప్పారు. అందుకు నటి హన్సిక, దర్శకుడు జలీల్, ఛాయాగ్రాహకుడు లక్ష్మణ్ ఇలా అందరి సహకారం చాలా సంతోషాన్నికలిగిస్తోందని అన్నారు. ఈయన నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న కొలైయుధీర్ కాలం, అరుణ్ విజయ్ హీరోగా బాక్సర్ చిత్రాలను నిర్మిస్తున్నారు. వీటిలో నయనతార నటించిన కొలైయుధీర్ కాలం చిత్రం త్వరలో రిలీజ్కు రెడీ అవుతోంది. -
గోదారి నుంచి వచ్చేసినా..
గోదావరి గట్టున... పాపికొండల మధ్యలో... కొల్లేటి సరస్సులో... ఆల్మోస్ట్ నెల రోజులు రామ్చరణ్ అండ్ టీమ్ గోదావరి పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేశారు. రామ్చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ శుక్రవారం పూర్తయింది. విపరీతమైన వేడి, ఎండల మధ్య షూటింగ్ చేశారు. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న సమంత అయితే... షెడ్యూల్ కంప్లీట్ కావడానికి ఒక్కరోజు ముందు వేడి, ఎండ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయారు. అంత కష్టపడుతూ షూటింగ్ చేశారన్న మాట. అయితే... గోదారి నుంచి వచ్చేసినా టీమంతా ఆ షెడ్యూల్ గురించే మాట్లాడుతున్నారు. ఎండల గురించో, తాము పడిన కష్టం గురించో కాదు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత సుకుమార్ అండ్ కో రషెస్ చూశారు. అవుట్పుట్ చూసి హ్యాపీగా ఉన్నారట. ఫస్ట్ షెడ్యూల్లో హీరో హీరోయిన్లపై ఓ సాంగ్, కీలక టాకీ పార్ట్ షూట్ చేశారు. త్వరలో సెకండ్ షెడ్యూల్ మొదలు కానుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రత్నవేలు, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి. -
పూరి స్పీడు మామూలుగా లేదు..!
రోగ్ సినిమా తరువాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లిన ఈ సినిమా.. అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుందట.. అది కూడా ఏదో డైలాగ్ సీన్స్ కాదు సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ సీక్వన్స్ను పూర్తి చేశారు పూరి, బాలయ్య. నమ్మటానికి కాస్త కష్టంగా ఉన్న పూరి స్పీడు తెలిసి వారు నిజమే అయి ఉంటుందంటున్నారు. మార్చి 16న షూటింగ్ ప్రారంభించి పూరి ఆ రోజు బాలకృష్ణ ఎనర్జీ సూపర్బ్ అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చేసి వారం రోజులు కూడా గడవక ముందే మరో ట్వీట్ తో షాక్ ఇచ్చాడు. ' ఎన్బికె 101 ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. భారీ సెట్ లో యాక్షన్ సీక్వన్స్.. ఈ సీన్స్ అందరినీ అలరిస్తాయి' అంటూ ట్వీట్ చేశాడు. పూరి స్పీడు చూస్తుంటే నిజంగానే అనుకున్న సమయం కన్నా ముందే సినిమా పూర్తి చేసేలాగే ఉన్నాడు. Completed my 1st schedule of #NBK101 in a massive set n action sequence .. it's gonna be feast for all #NandamuriBalakrishna fans 👍🏼👍🏼 — PURI JAGAN (@purijagan) 22 March 2017
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ
వేద విజ్ఞానం కలిగిన భూమి భారత్
కాంగ్రెస్లో మున్సిపల్ కౌన్సిలర్ల చేరిక
పేదల సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం
ఓటేసిన ఆర్వో
ధాన్యం దిగదు.. లారీ కదలదు
● జనసంద్రంగా ఐబీ చౌరస్తా ● మంచిర్యాలలో రోడ్షో
నేడు నీట్
డీఏవోగా సురేఖ బాధ్యతల స్వీకరణ
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement