-
నవీన్-ఉల్-హక్ పై కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు..
-
చిరంజీవి ఇంటికి భారీగా అభిమానులు
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఇంటి వద్ద శనివారం భారీగా పోలీసులను మొహరించారు. చిరంజీవి ఇంటిని ముట్టడిస్తామని అమరావతి పరిరక్షణ జేఏసీ పిలుపుఇచ్చినట్టుగా వార్తలు రావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు రవణం స్వామినాయుడు నాయకత్వంలో మెగా అభిమానులు చిరు ఇంటి వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన హీరోకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. చిరంజీవి ఇంటిని ముట్టిడించేందుకు వస్తే సరైన రీతిలో బుద్ధి చెబుతామని స్వామినాయుడు అన్నారు. మెగాస్టార్ ఇంటిని ముట్టడించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చిరంజీవి ఇప్పుడు రాజకీయాల్లో లేరని, సినిమాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఆయనపై ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా ఊరుకోమని హెచ్చరించారు. చిరంజీవి గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే గట్టిగా బుద్ధిచెబుతామన్నారు. తమకు పార్టీలతో సంబంధం లేదని, చిరంజీవి వెంటే ఉంటామని స్పష్టం చేశారు. మూడు రాజధానులకు చిరంజీవి మద్దతు పలికితే తప్పేంటని ప్రశ్నించారు. రాజకీయ ప్రోద్బలంతోనే చిరు ఇంటి ముట్టిడికి సిద్ధమయ్యారా అని అమరావతి జేఏసీని ప్రశ్నించారు. కాగా, చిరంజీవి ఇంటి ముట్టడికి తాము పిలుపునివ్వలేదని అమరావతి పరిరక్షణ సమితి తెలిపింది. (చదవండి: క్లారిటీ ఇచ్చిన అమరావతి జేఏసీ) -
ప్రభాస్ ఫ్యాన్స్ను కెలికిన సిద్ధార్థ్
భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఒక్కోసారి వివాదాలకు కారణమవుతున్నాయి. కొంత మంది స్టార్స్ సరదాగా చేసిన కామెంట్స్ కారణంగా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. తాజాగా దక్షిణాది హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. ప్రభాస్ పుట్టిన రోజుకు సంబంధించిన సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ పై రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమిళ సినీ విశ్లేషకుడు రమేష్ బాలా, ప్రభాస్ పుట్టిన రోజుకు మరో వంద రోజులు సమయముందంటూ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సిద్ధార్థ్ నెక్ట్స్ పుట్టిన రోజుకు 465 రోజులు ఉందంటూ కామెంట్ చేశాడు. అయితే సిద్ధార్థ్ చేసిన కామెంట్ వెటకారంగా ఉందంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కొంత మంది గంతలో ప్రభాస్, సిద్ధు కలిసి దిగిన ఫోటోను సిద్ధార్థ్కు ట్యాగ్ చేస్తూ ‘ఎందుకు భయ్యా నీ ఫ్రెండే కదా..’ అంటే మరి కొందరు ‘ టాలీవుడ్ ఫ్యాన్స్ జోలికి వస్తే చుక్కలు చూపించాల్సి వస్తుంది’ అంటూ కామెంట్ చేశారు. సిద్ధార్థ్ మాత్రం తన కామెంట్స్ను సమర్ధించుకున్నాడు. ‘అందుకే భయ్యా. ఫ్రెండు కాబట్టే ఫ్రీడం తీసుకున్నా. డార్లింగ్ కూడా నవ్వుతాడు జోక్ విని. ప్రతిదానికి టెన్షన్ పడితే లైట్ తీసుకోడానికి టైమ్ ఉండదు కద భయ్యా?’ అంటూ రిప్లై ఇచ్చాడు. మరి సిద్ధు ఇచ్చిన రిప్లైతో ఫ్యాన్స్ శాంతిస్తారేమో చూడాలి. anduke bayya. Friendu kabatte...Freedom teeskunna. Darling kooda navvuthadu joke vini. Pratidaaniki tension padithe lite theeskodaniki time undadhu kadha bayya? https://t.co/YuayXmayWd — Siddharth (@Actor_Siddharth) 16 July 2018 -
సెరీనా స్విమ్సూట్ ఫొటోపై అభిమానుల ఆగ్రహం
ఒక్క ఇన్ స్టాగ్రామ్ లోనే 31 లక్షల మంది ఫాలోవర్లు కలిగిన స్టార్ ప్లేయర్ సెరీనాను.. ఫేస్ బుక్, ట్విట్టర్ లను కలుపుకొంటే 87 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. గ్రాండ్ స్లామ్ లతోపాటు నెటిజన్ల అభిమానాన్ని కూడా చూరగొన్న ఈ నల్ల కలువకు 'సోషల్ మీడియా చాంపియన్'అని అవార్డులు కూడా వచ్చాయి. అలా సెరీనాను విపరీతంగా ఆరాధించే ఫ్యాన్స్ ఇటీవల ఆమె స్విమ్ సూట్ ధరించిన ఫొటో విషయంలో మాత్రం తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'మోస్ట్ బ్యూటిఫుల్ ఉమన్ ఆఫ్ 2016' శీర్షికతో ప్రఖ్యాత పీపుల్స్ మాగజైన్ ఓ సంచికను రూపొందిస్తోంది. అందులో భాగంగా 34 ఏళ్ల సెరీనా విలియమ్స్ హాట్ హాట్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఫొటోషూట్ విశేషాలను అభిమానులకు తెలియజేస్తూ నల్లని స్విమ్ సూట్ ధరించిన ఫొటో ఒకదానిని సెరీనా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. క్షణాల్లోనే లక్షల మందికి చేరిపోయిందా ఫొటో. అంతే, సెరీనా చర్యకు అభిమానులు నొచ్చుకున్నారు. ఇంతకీ ఆమె చేసిన పొరపాటు ఏంటంటే.. సెరీనా పోస్ట్ చేసిన ఫొటోలో ఆమె నడుము భాగం ఉన్నది ఉన్నట్లుగా కాకుండా, సన్నగా(ఫొటోషాప్ తో మార్పులు చేసి) కనిపించింది. అభిమాన క్రీడాకారిణి ఎలా ఉంటుందో తెలుసుకాబట్టి ఆ ఫొటో చూసి విస్తుపోయారు ఫ్యాన్స్! ఎందుకిలా ఫొటోషాప్ చేసిన ఫొటోను పోస్ట్ చేశావ్? అంటూ నిమిషాల వ్యవధిలోనే వందలమంది అభిమానులు సెరీనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. దీంతో కంగుతిన్న సెరీనా.. రెండు గంటల్లోపే మొదటి ఫొటోను డిలిట్ చేసి, ఒరిజినల్ ఫొటోను పోస్ట్ చేసింది. అయితే రెండో ఫొటోపైనా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పాపం సెరీనా!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement