-
తండ్రి సహా 12 మందిని చంపేశాడు!
టెహ్రాన్: ఇరాన్లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి, సోదరుడు సహా మొత్తం 12 మంది కుటుంబసభ్యులను పొట్టనబెట్టుకున్నాడు. కెమ్రాన్ ప్రావిన్స్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఇరాన్ మీడియా శనివారం తెలిపింది. 30 ఏళ్ల వ్యక్తి తన తండ్రి, సోదరుడితోపాటు మొత్తం 12 మందిని ఏకే రైఫిల్తో కాల్చి చంపాడని, అనంతరం పోలీసులు అతడిని కాల్చి చంపారని తెలిపింది. మారుమూల గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణానికి కుటుంబకలహాలే కారణమని పేర్కొంది. మృతుల్లో చిన్నారులు ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం. అయితే, మృతుల వివరాలు, ఘటనకు కారణాలను మాత్రం మీడియా వెల్లడించలేదు. -
నిజామాబాద్: ఒకే ఇంట్లో ఆరుగురు హత్య.. స్నేహితుడే కారణం!
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చారు. అయితే, వీరి హత్యకు ఆస్తి తగదాలే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల ప్రకారం.. డిచ్పల్లి మండలంలోని మాక్లుర్కు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్ళిపోయి స్థిరపడింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్కు మాక్లుర్లో ఓ ఇల్లు ఉంది. ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఆ ఇంటిపైన కన్నేశాడు. లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్పై ప్రసాద్ ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో ఎలాగైనా ఆ ఇంటిని ప్రశాంత్ తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. దీంతో, ప్లాన్ ప్రకారం ప్రసాద్ను బయటకు తీసుకెళ్ళి నిజామాబాద్–కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. మరుసటి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్ళి మీ భర్తను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి ఆమెను బయటకు తీసుకెళ్ళాడు. ఆమెను కూడా హతమార్చి బాసర నదిలో వదిలేశాడు. ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని హత్య చేశాడు. అనంతరం.. ఇద్దరు పిల్లలను సోన్ బ్రిడ్జి సమీపంలో, ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో హత్య చేసినట్లు సమాచారం. అయితే, మాక్లుర్కు చెందిన నిందితుడు ప్రశాంత్ వయసు 20 ఏళ్లు. మొదటి మూడు హత్యలు ఒక్కడే చేశాడని.. మిగిలిన మూడు హత్యల్లో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య కాబడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఎక్కడా కూడా మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. కాగా, నమ్మిన స్నేహితుడే ఇలా వారిని హత్య చేయడంతో స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనలో నిందితులకు తగిన శిక్ష విధించాలని కోరుతున్నారు. మరోవైపు.. వీరి హత్యలకు సంబంధించి పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నట్లు సమాచారం. -
నూతన దంపతులు సహా అయిదుగురిని చంపి..
మెయిన్పురి: ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నూతన దంపతులతోపాటు మరో ఇద్దరు కుటుంబసభ్యులను, ఓ స్నేహితుడిని ఓ వ్యక్తి గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోను యాదవ్(22), సోని(20)లకు శుక్రవారమే వివాహమైంది. రాత్రి బారాత్ వేడుక జరిగింది. అనంతరం అందరూ నిద్రిస్తుండగా సోను సోదరుడు శివ్ వీర్ యాదవ్(28) గొడ్డలితో నూతన దంపతులతోపాటు మరో సోదరుడు, బావ మరిది సౌరభ్, స్నేహితుడిని చంపేశాడు. తన భార్య, అత్తపైకి తుపాకీతో కాల్పులు జరపగా వారు గాయపడ్డారు. అనంతరం నిందితుడు శివ్ వీర్యాదవ్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘాతుకానికి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. -
విధిరాత అంటే ఇదేనేమో.. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
ముందువెళ్తున్న బస్సుడ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం.. వెనుక వస్తున్న కారు బస్సును ఢీకొనడం.. ఆ వెంటనే వాటిపైకి లారీ దూసుకురావడం.. క్షణాల్లో ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం.. అచ్చం సినిమాను తలపిస్తున్న ఈ ఘటన మంగళవారం తిరుచ్చి– చెన్నై హైవేపై చోటు చేసుకుంది. ఈఘటన విధిరాతను విధాత అయినా తప్పించలేడనే సామెతను అక్షరాల నిజం చేసిందని కొందరు ఆవేదన వ్యక్తం చేయగా.. దయలేని దేవుడు నా అనే వారే లేకుండా ఓ కుటుంబాన్ని చిదిమేశాడంటూ మరికొందరు వాపోయారు. ఇరుగుపొరుగు వారే అంతిమ సంస్కారాలు చేయాలేమో అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సాక్షి, చెన్నై: దైవ దర్శనానికి వెళ్లొస్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ హృదయ విదారక ఘటనలో ఒకే కుటుంబంలోని మొత్తం అయిదుగురూ మరణించడం చూపరులను కంటతడి పెట్టించింది. వివరాలు..చెన్నై శివారులోని కాంచీపురం జిల్లా నంగనల్లూరుకు చెందిన విజయ వీర రాఘవన్(41) ఐటీ ఉద్యోగి. ఆయనకు భార్య వత్సల (37), కుమారులు విష్ణు(12), అదిర్థ్(8) ఉన్నారు. భార్య పిల్లలు, తల్లి వసంతలక్షి్మ (58)తో కలిసి కారులో నూతన సంవత్సరం సందర్భంగా కేరళలోని ఆలయాల సందర్శనకు రెండు రోజుల క్రితం వెళ్లారు. కారును విజయ వీర రాఘవన్ నడిపాడు. దైవ దర్శనాన్ని ముగించుకుని సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. వరుసగా వాహనాల ఢీ.. తిరుచ్చి – చెన్నై హైవేలోని కడలూరు జిల్లా వేపూరు అయ్యనార్ పాళయం వద్దకు మంగళవారం వేకువ జామున 2.45 గంటలకు ఘోరం జరిగింది. ఈ ప్రాంతంలో వంతెన నిర్మాణ పనులు జరుగుతుండడంతో వాహనాలను సరీ్వసు రోడ్డుకు అధికారులు మరల్చా రు. అక్కడ ముందు వెళ్తున్న ప్రైవేటు ఆమ్నీ బస్సు డ్రైవర్ సడెన్గా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న కారును విజయ వీరరాఘవన్ ఒక్కసారిగా ఆపే ప్రయ త్నం చేశాడు. అప్పటికే వెనుక వస్తున్న లారీలు ఒక దానికి మరొకటి కారును వేగంగా ఢీకొట్టాయి. దీంతో లారీ – బస్సు మధ్య చిక్కుకున్న కారు నామరూపాల్లేకుండా పోయింది. అందులో ఉన్న వారందరూ ఘటనా స్థలంలోనే శరీరాలు ఛిద్రమై విగత జీవులయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు అతికష్టం మీద కారులో నుంచి మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు. కుటుంబం అంతా ఈ ప్రమాదంలో మరణించడంతో నంగనల్లూరులోని ఇరుగు పొరుగువారు విల్లుపురం ముండియంబాక్కం ఆస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. కాగా విచారణలో వీర రాఘవన్ సోదరి వసుధారాణి మదురైలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు సమాచారం అందించారు. ఆమె వచ్చాక అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు. -
కుటుంబలోని ఐదుగురిని హత్య చేసి తానూ..
సాక్షి, చెన్నై: తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. కుటుంబంలోని ఐదుగురిని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఓరంతాడి గ్రామంలోని పళని అనే రైతు కొద్ది రోజులుగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కొద్ది రోజుల క్రితం తన భార్య వల్లి అనారోగ్యంతో చనిపోవడంతో మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన బిడ్డలను దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. మృతుల్లో త్రిష(15), మోనిషా (14), శివశక్తి (6), ధనుష్(4), భూమిక(9 నెలలు)గా గుర్తించారు. స్థానికులు గమనించి వారిని హుటాహుటిన తిరువణ్ణామలై జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం నిందితుడు పళని తన పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: అమ్మానాన్నకు ఏమైంది అన్నయ్య?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement