-
ఎక్సైజ్ కానిస్టేబుల్ బలవన్మరణం.. కారణం అదేనా?
శంషాబాద్(హైదరాబాద్): రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ కార్యాలయంలో రాత్రి పూట రక్షణగా విధులు నిర్వర్తించడానికి వచ్చిన కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. వికారాబాద్ జిల్లా ఎన్కతల గ్రామానికి చెందిన ఆశయ్య(48) చేవెళ్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. శంషాబాద్ పట్టణంలోని జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ కార్యాలయంలో సెంట్రీ విధులు నిర్వర్తించడానికి ఆయా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు చెందిన కానిస్టేబుళ్లకు రోజువారీగా కేటాయిస్తారు. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు డ్యూటీ నిమిత్తం ఆశయ్య శంషాబాద్ ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చాడు. సాయంత్రం ఉద్యోగులంతా వెళ్లిన తర్వాత ఒక్కడే ఉన్నాడు. ఆదివారం ఉదయం మరో ఎక్సైజ్ కానిస్టేబుల్ కార్యాలయానికి వచ్చే సరికి ఓ గదిలో ఆశయ్య ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆశయ్యకు అతిగా మద్యం తాగే అలవాటున్నట్లు గుర్తించారు. ఆదివారం రాత్రి కూడా మద్యం తాగిన తర్వాతే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు అతడికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉండడంతో బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా గుండె ఆపరేషన్ చేసుకున్న తనకి సెంట్రీ విధులు వేయడంపై కూడా మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కత్తులు పట్టుకొని బాలీవుడ్ డైలాగులు.. వాట్సాప్ స్టేటస్ -
ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, కృష్ణా : మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా కంచికచర్లలో చోటుచేసుకుంది. వివరాలు.. నీలవేణి అనే మహిళ కంచికచర్ల ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తోంది. అదే డిపార్ట్మెంట్లో నీలవేణి భర్త కూడా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా నీలవేణి శనివారం తన నివాసంలో అనుమానాస్పద స్థతిలో ఉరివేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా నీలవేణి భర్త పోలీసుల అదుపులో ఉన్నాడు. -
ఎక్సైజ్ హెచ్సీపై ఎమ్మెల్యే రజని ఆగ్రహం
సాక్షి, చిలకలూరిపేట: ‘మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వ సంకల్పాన్ని దెబ్బతీయాలని చూస్తారా?’ అంటూ ఎమ్మెల్యే విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తూ లంచాలు అడుగుతున్న ఎక్సైజ్ హెడ్కానిస్టేబుల్ డి.రామ్ప్రసాద్ మాట్లాడిన కాల్ రికార్డింగులు ఎమ్మెల్యే దృష్టికి రావటంతో ఆమె చిలకలూరిపేట ఎక్సైజ్ స్టేషన్ను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అధికారులను ప్రశ్నించగా ఎక్సైజ్ ఎస్ఐ ఆర్.వి.వి.ప్రసాద్ రికార్డింగ్లోని వాయిస్ హెడ్కానిస్టేబుల్ రామ్ప్రసాద్దని తెలపగా తనదేనని అతను కూడా అంగీకరించారు. ప్రభుత్వ స్ఫూర్తిని కాపాడాల్సిన వారే ఇలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడటం తగదని హితవు పలికారు. అనంతరం ఎక్సైజ్ ఉన్నతాధికారులకు హెడ్కానిస్టేబుల్ తీరుపై చర్యలు తీసుకోవాలని ఫోన్ చేసి చెప్పారు మద్యం నిల్వలు మాయం! నరసరావుపేట టౌన్: మద్యం దుకాణాల్లో తనిఖీలు చేసే కొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. అక్కడ పనిచేసే వర్కర్లు, పోలీస్ సిబ్బంది కుమ్మక్కై లక్షల రూపాయల విలువైన మద్యం నిల్వలను దారిమళ్లించారు. ఎక్సైజ్ అధికారులు మంగళవారం సీల్ వేసి ఉన్న నాలుగు మద్యం దుకాణాలను పరిశీలించగా అందులో సుమారు రూ.13 లక్షల రూపాయల మద్యం బాటిళ్లు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వివరాల్లొ కెళితే.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మద్యం దుకాణాలను ప్రభుత్వం గత నెల 22వ తేదీన సీల్ వేసింది. అయితే నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణం, రొంపిచర్లలోని దుకాణంలో ఇటీవల మద్యం నిల్వలు చోరీ జరిగిన విషయం విదితమే. రెండు సంఘటనలతో ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమై మిగిలిన మద్యం దుకాణాలను మంగళవారం పరిశీలించారు. రైల్వేస్టేషన్ రోడ్డులోని మద్యం దుకాణంలో రూ.6.80 లక్షల మద్యం నిల్వలు కనిపించలేదు. గుంటూరు రోడ్డులోని మద్యం దుకాణంలో తనిఖీ చేయగా రూ.4.92 లక్షల మద్యం బాటిళ్లు అపహరణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ములకలూరు, రావిపాడు గ్రామాల పరిధిలో ఉన్న రెండు మద్యం దుకాణాలను పరిశీలించగా రూ.64 వేల రూపాయల మద్యం బాటిళ్లు చోరీకి గురైనట్లు తేల్చారు. నాలుగు మద్యం దుకాణాల్లో సుమారు రూ.13 లక్షల విలువైన మద్యం నిల్వలు మాయమైనట్లు ప్రాథమికంగా తేల్చారు. ఆయా దుకాణాల్లో పనిచేసే సూపర్వైజర్లను బాధ్యులను చేసి వారి నుంచి నగదు రాబట్టి, క్రిమినల్ కేసులు నమోదుకు చర్యలు తీసుకుంటామని ఈఎస్ మహేష్కుమార్ తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్ సీఐలు కర్ణబాబు, మారయ్యబాబు, ఎస్ఐ ప్రసాద్, టూటౌన్ ఎస్ఐ నాగరాజు పాల్గొన్నారు. ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుళ్లు సస్పెన్షన్ సాక్షి, గుంటూరు: అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో స్టాక్ దొంగిలించిన వారికి సహకరించిన కారణాలతో ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ డీసీ (ఎఫ్ఏసీ) శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఇటీవల నరసరావుపేటలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో కొందరు స్టాక్ను దొంగిలించారు. ఈవ్యవహారానికి సహకరించిన సత్యనారాయణ, చిలకలూరిపేటలో బెల్టుషాపుల నుంచి డబ్బు వసూలు చేస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డి.రామ్ప్రసాద్పై నేరం నిర్ధారణ కావడంతో సస్పెన్షన్ వేటు వేశారు. -
మత్తెక్కించే అవినీతి
చిత్తూరు అర్బన్: ప్రభుత్వ ఉద్యోగంలో ఓ సాధారణ కానిస్టేబుల్గా చేరిన వ్యక్తి 26 ఏళ్ల సర్వీసులో ఏం సాధించావని ఎవరైనా అడిగితే మంచి పేరు అనో, నిజాయితీ ఉన్న వ్యక్తనో, ఎవ్వరికీ తలవంచడనో సమాధానాలు రావాలి. కానీ చిత్తూరుకు చెందిన విజయ్కుమార్ మాత్రం ఈ 26 ఏళ్ల సర్వీసులో దాదాపు రూ.35 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టాడు. కల్తీ మద్యం తయారు చేసిన కేసులో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. సీఐడీ పోలీసుల చేత అరెస్టయి జైల్లో ఉన్నాడు. అయినా మార్పు రాలేదు. ఈసారి ఏకంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. ఇప్పటికీ ట్రాక్టర్ నడుపుతూ.. చిత్తూరు నగరంలోని కాజూరుకు చెందిన విజయ్ కుమార్ను చూస్తే ఎవరైనా ఇన్ని రూ.కోట్ల విలు వైన ఆస్తులున్నాయంటే నమ్మరు. ఎందుకంటే ఆబ్కారీ శాఖలో ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాఓ సాధారణ వ్యక్తిలానే ఇతని దినచర్య ఉంటుంది. కర్నూలు నుంచి చిత్తూరులోని తన ఇంటికి వచ్చినప్పుడు ఉదయాన్నే నీటి ట్యాంకరున్న ట్రాక్టర్ నడుపుతూ వీధుల్లో తాగునీరుఅమ్ముతుంటాడు. ఇక్కడున్న పెట్రోలు బంకు వద్ద తనకు చెందిన శుద్ధినీటి ప్లాంటులో కూర్చుని నీళ్ల క్యాన్లు విక్రయిస్తుంటాడు. ఇలాంటి వ్యక్తి ఇన్ని రూ.కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నాడంటే స్థానికులు ఆశ్యర్యంగా చూస్తున్నారు. పాఠం నేర్పని గతం.. జిల్లాలోని తిరుపతిలో ప్రభుత్వ మద్యం బాటిళ్ల సరఫరా డిపోలో పనిచేస్తున్నప్పుడే విజయ్కుమార్పై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఎన్నికల్లో కల్తీ మద్యం జిల్లాలోకి తీసుకొచ్చారనే ఆరోపణలతో సీఐడీ పోలీసులు 2014లో విజయ్కుమార్ను అరెస్టు చేశారు. బెయిల్ రాకపోవడంతో ఆరు నెలల వరకు జైల్లో ఉన్నాడు. అప్పటికీ ఆయనలో మార్పు రాలేదు. జిల్లా నుంచి కర్నూలుకు బదిలీ అయినప్పటికీ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో అన్ని ఆధారాలతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. వామ్మో ఇన్ని ఆస్తులా.. విజయ్కుమార్ అక్రమ సంపాదన, ఆస్తుల గురించి సొంత శాఖలోని ఓ వ్యక్తి నుంచి ఆధారాలతో కూడిన పక్కా సమాచారం ఏసీబీకి వెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పొద్దుపోయే వరకు తిరుపతి ఏసీబీ అదనపు ఎస్పీ తిరుమలేష్, సీఐలు చంద్రశేఖర్, విష్ణువర్దన్, ప్రసాద్రెడ్డి, గిరిధర్, విజయశేఖర్, రమేష్, శివకుమార్, ఎస్ఐ విష్ణువర్దన్, కడప, కర్నూలుకు చెందిన ఏసీబీ అధికారులు చిత్తూరు, యాదమరి, తమిళనాడులోని కాట్పాడి, తిరుపతి ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇందులో విజయ్కుమార్ భార్య మీన పేరిట మూడంతస్తుల భవనం, రెండంతస్తుల భవనం, మరో రెండు భవనాలకు సంబంధించి పత్రాలు దొరికాయి. ఇరువారం, కాజూరు ప్రాంతాల్లో ఎనిమిది ప్లాట్లు, కాజూరులో ఓ ఇల్లు, తమిళనాడులోని కాట్పాడిలో ఓ ఇల్లుకు సంబంధించిన పత్రాలు, విజయ్కుమార్ పేరిట కాజూరులో ఓ శుద్ధినీటి ప్లాంటుకు చెందిన ఖాళీ స్థలం, ఇరువారం వద్ద ఓ స్థలాన్ని, ఇతని కొడుకు పేరిట ఉన్న ఆస్తుల పత్రాలను అధికారులు సీజ్ చేశారు. ఇక బంగారు ఆభరణాల్లో ఆడవాళ్లు పెట్టుకునే చెవి కమ్మల్లో 10 రకాలు, చేతి కడియాలు, ఐదు రకాల గొలుసులు, పదికి పైగా ఉంగరాలు, రాళ్ల హారాలు, వెండి ఆభరణాలు చూసిన అధికారులే ఆశ్చర్యానికి గురయ్యారు. టీడీపీ నేతల భరోసా... విజయ్కుమార్ను సీఐడీ అధికారులు అరెస్టు చేసినప్పుడు చిత్తూరు నగరానికి చెందిన ఓ టీడీపీ నేత అండగా నిలిచినట్లు బహిరంగంగా చెబుతున్నారు. జైల్లో ఉన్న విజయ్కుమార్ను బయటకు తీసుకురావడంతో పాటు మళ్లీ పోస్టింగ్ ఇప్పించడం, పదోన్నతి కల్పించడంలో టీడీపీ నేత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు ఎక్సైజ్ స్థాయిలో పనిచేసిన ఓ మంత్రి అండదండలు కూడా ఉన్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. మరోవైపు విజయ్కుమార్ ఆస్తులపై జరిగిన ఏసీబీ దాడులు జిల్లాలోని ఎక్సైజ్ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. తిరుపతిలోనూ తనిఖీలు తిరుపతి క్రైం: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చిత్తూరు ఎక్సైజ్ శాఖ ఎస్ఐ విజయ్కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. తిరుపతి వివేకానందనగర్లో ఎస్ఐ చెల్లెలు విశాలాక్షి ఇంట్లో కూడా అధికారులు తనిఖీ చేశారు. ఏసీబీ డీఎస్పీ మల్లేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ చేయగా ఎలాంటి ఆస్తులూ పట్టుబడలేదు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఆయనకు సంబంధించిన ఆస్తుల కోసం ఆరా తీస్తున్నారు. -
ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 8న పీఈటీ టెస్టు
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా ఆగస్టు 8వ తేదీన ఉదయం 5 గంటలకు పీఈటీ, ఈవెంట్స్ టెస్టు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీలో ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. టెస్టులకు ఎంపికైన వారి జాబితాను వెబ్సైట్లో పొందవచ్చని సూచించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
Advertisement