-
ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఆర్థికాభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపునకు, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేశారు. ఈ ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా తయారైంది. బ్యాంకింగ్ రంగం కీలక సూచికలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో డిపాజిట్లతో పాటు రుణాల మంజూరులో భారీగా వృద్ధి నమోదైనట్లు 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రజల జీవనోపాధికి సమస్యల్లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు సత్పలితాలు ఇస్తున్నాయనడానికి డిపాజిట్లలో భారీ వృద్ధి నిదర్శనం. గత ఐదేళ్లలో డిపాజిట్లలో ఏకంగా 58.23 శాతం వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి డిపాజిట్లు రూ.3,12,642 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.4,94,690 కోట్లు.. అంటే రూ.1,82,048 కోట్లు పెరిగాయి. అన్ని రంగాలకు బ్యాంకు రుణాల మంజూరులో ఏకంగా 96.64 శాతం భారీ వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి రుణాల మంజూరు రూ.3,97,350 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.7,81,313 కోట్లకు పెరిగాయి. అంటే రుణాలు రూ.3,83,963 కోట్లు పెరిగాయి. డిపాజిట్ల పెరుగుదల ప్రజల ఆదాయం పెరుగుదలకు నిదర్శనం కాగా రుణాలు ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా నేరుగా నగదు బదిలీని అమలు చేసింది. అలాగే బ్యాంకుల ద్వారా పేదలు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎంఎస్ఎంఈలు, ఇతర వర్గాలకు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా వారి ఆదాయం మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు విరివిగా లభించేలా చర్యలు చేపట్టింది. అందువల్లే గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాల్లో రుణాల మంజూరులో భారీ వృద్ధి నమోదైంది. ఆర్బీఐ నిబంధనలకన్నా అన్ని రంగాల్లో అత్యధికంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. బ్యాంకులు ఇచ్చిన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తోంది. వీధుల్లో, వాడల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా సున్నా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తోంది. వైఎస్సార్ చేయూత ద్వారా పేద మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు బ్యాంకు రుణాలను మంజూరు చేయించి, వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. ప్రజలు కూడా ప్రభుత్వం అందించిన చేయూతతో సకాలంలో రుణాలు చెల్లిస్తూ వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం గత ఏడాది డిసెంబర్ నాటికి క్రెడిట్ రేషియో 60 శాతం ఉండాల్సి ఉండగా దానికి మించి 157.94 శాతం నమోదైనట్లు బ్యాంకర్ల కమిటీ నివేదిక పేర్కొంది. సీడీ రేషియో అధికంగా ఉందంటే ఆ రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు అధికంగా జరగుతున్నాయనే అర్ధమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. -
2030కల్లా లక్ష కోట్ల డాలర్ల జమ
న్యూఢిల్లీ: కొత్తగా యూనికార్న్లుగా ఆవిర్భవించే స్టార్టప్ల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్లు జమయ్యే వీలున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ అంచనా వేసింది. 2030కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ 7 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు పేర్కొంది. ఈ కాలంలో కొత్తగా 5 కోట్ల ఉద్యోగాలకు తెరలేవనున్నట్లు తెలియజేసింది. బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్లను యూనికార్న్గా గుర్తించే సంగతి తెలిసిందే. మెకిన్సీ అండ్ కంపెనీతో రూపొందించిన ‘యూనికార్న్ 2.0: తదుపరి ట్రిలియన్ జమ’ పేరుతో సీఐఐ నివేదికను విడుదల చేసింది. రానున్న కాలంలో రిటైల్, ఈకామర్స్, ఆధునిక తరం ఫైనాన్షియల్ సర్వీసులు, తయారీ, ఎస్ఏఏఎస్(శాస్), డిజిటల్ తదితర రంగాలు భారీ వృద్ధికి దన్నుగా నిలవనున్నట్లు నివేదిక పేర్కొంది. శతకాన్ని దాటాయ్ నివేదిక ప్రకారం దేశీయంగా 2011లో తొలి యూనికార్న్ నమోదుకాగా.. దశాబ్దం తదుపరి 100 మార్క్ను యూనికార్న్లు చేరుకున్నాయి. 2024 జనవరికల్లా 113 యూనికార్న్ల ఉమ్మడి విలువ 350 బిలియన్ డాలర్లను తాకడం గమనార్హం! యూనికార్న్ల సంఖ్య 100ను అధిగమించడం చెప్పుకోదగ్గ విజయంకాగా.. ఇందుకు పలు కీలక అంశాలు సహకరించాయి. ఇందుకు యువత డిజిటల్ సేవలను అందిపుచ్చుకోవడం, విస్తారిత మొబైల్ ఇంటర్నెట్ వినియోగం, మధ్యతరగతి పుంజుకోవడం, దన్నుగా నిలిచిన మార్గదర్శకాలు కారణమయ్యాయి. -
ఆధ్యాత్నిక పర్యాటకం.. ఆర్థిక వృద్ధికి దోహదం
దేశ వ్యాప్తంగా ప్రధాన ఆలయాలకు దేశ విదేశాల నుంచి భక్తులు నిరంతరం పోటెత్తుతున్నారు. ప్రఖ్యాత ఆలయాలు, ప్రదేశాలు లక్షలాది మంది భక్తులు, పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. ఆలయాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి కూడా వేగంగా జరుగుతోంది. చిన్న చిన్న పరిశ్రమలకు, వృత్తి కళాకారులకు చేతినిండా పనిదొరుకుతోంది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవలప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కూడా ఆధ్మాత్నిక పర్యాటకానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఆధ్మాత్మిక పర్యాటకంతో స్థానిక వ్యాపారులకు పెద్దఎత్తున అవకాశాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన ప్రసంగంలో కూడా చెప్పారు. సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా ఏటా ఆధ్యాత్నిక పర్యాటకం పెరుగుతోంది. ప్రఖ్యాత ఆలయాలు, ప్రదేశాలు యాత్రికులను ఆకర్షించడమే కాకుండా ఆర్థిక వృద్ధికి ఉ్రత్పేరకంగా మారుతున్నాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత భారతీయుల్లో ఆధ్యాత్నిక భావనలు, భక్తి విశ్వాసాలు మరింత బలపడినట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది. 2022లో తీర్థయాత్ర కోసం ప్రయాణాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. దేశంలో ఆధ్యాత్నిక కేంద్రాలకు వచ్చే విరాళాల వాటా 14 శాతం పెరిగింది. ఈ క్రమంలోనే 2023–30 మధ్యకాలంలో దాదాపు 16 శాతానికిపైగా వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను అధిగమిస్తోందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని పురాతన ఆలయాలు, క్షేత్రాలు ఆధ్యాత్నిక పర్యటనలకు స్వర్గధామంగా మారాయి. విస్తృతంగా ఉద్యోగాల కల్పన ఆధ్యాత్నిక పర్యటన భక్తితో పాటు దేశంలోని నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది. ఆధ్యాత్నిక హాట్ స్పాట్స్లో భక్తుల అవసరాలను తీర్చేందుకు వీలుగా హోటళ్లు, రెస్టారెంట్లు వస్తున్నాయి. తద్వారా పాకశాస్త్ర కళలు, ఈవెంట్ ప్లానింగ్ వరకు ఆతిధ్య పరిశ్రమలో అనేక ఉద్యోగాలు వస్తున్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ లెక్కల ప్రకారం దేశంలో 2022లో వంద కోట్ల మంది పర్యాటకులు వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఇందులో ఆధ్యాత్మిక ప్రదేశాలు సుమారు రూ. 1.34 లక్షల కోట్లు ఆర్జించాయి. ఎక్కువగా విదేశీలు భారతీయ సంస్కృతి, ఆలయాల చరిత్రను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఇక్కడకి వస్తున్నారు. అందుకే ఈ రంగం 2030 నాటికి 14 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, బిహార్, పంజాబ్, ఉత్తరాఖండ్లలో ఉద్యోగాల సృష్టికి ఆలయాలు చోదక శక్తిగా ఉంటాయని విశ్వసిస్తున్నారు. ఆధ్యాత్నిక పర్యటనల్లో ప్రయాణం, ఆతిథ్యం, పర్యాటక పరిశ్రమల్లో చిన్న సంస్థలకు మేలు జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్డబ్ల్యూటీఓ)సైతం తరచుగా సంస్కృతి అన్వేషణలో భాగంగా ఆధ్యాత్నికతలో కొత్త అనుభవాలు కోరుకునేవారు పెరుగుతున్నట్టు గుర్తించింది. టాప్లో తిరుపతి.. దేశ ఆధ్యాత్నిక పర్యాటకంలో అయోధ్య రామ మందిరం రిలీజియస్ టూరిజంలో కీలక మార్పులు తీసుకొస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పర్యాటకులకు అదనంగా 5 నుంచి 10 కోట్ల మందికిపైగా భారత్ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. తాజ్ మహల్ (65 లక్షలు), రోమ్లోని వాటికన్ సిటీ (90 లక్షలు), సౌదీ అరేబియాలోని మక్కా (2 కోట్లు) వార్షిక సందర్శకుల సంఖ్యల కంటే అయోధ్య ప్రత్యేకంగా నిలుస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి దేవాలయం ఏడాదికి 2.50 కోట్ల మంది సందర్శకులతో టాప్లో నిలుస్తోంది. జమ్మూ కశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం 80 లక్షల మంది సందర్శకులతో అలరాలుతోంది. ఇలాంటి ఆలయాలు భారతదేశంలో బలమైన ఆధ్యాత్నిక, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఏపీలోనూ ప్రత్యేక సర్క్యూట్లు ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పర్యాటకంలో అతిపెద్ద విభాగంగా ఉంది.ం మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక ప్రభావాన్ని కలిగి ఉంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ), దేవదాయశాఖ సంయుక్తంగా ‘రిలీజియస్ టూరిజం’ను ప్రవేశపెట్టాయి. తిరుమల, మహానంది, శ్రీశైలం, అహోబిలం, యాగంటి, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం, విజయవాడ, మంగళగిరి, కోటప్పకొండ, మంత్రాలయం, లేపాక్షి, కదిరి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనలను ఒకే ప్లాట్ఫాంపైకి తీసుకొచ్చింది. నిత్యం ఆధ్యాత్నిక పర్యటనలను ప్రోత్సహించేలా భక్తులకు నచి్చన ఆలయాలను కలుపుతూ ప్యాకేజీలు అందిస్తోంది. తిరుపతిలో భక్తులకు చింతలేని దర్శనాన్ని కల్పించడం కోసం బ్యాకెండ్ సేవలను ప్రారంభించింది. సర్క్యూట్ టూరిజంలో భాగంగా 100కి పైగా ఆలయాల జాబితాను సిద్ధం చేసింది. దశల వారీగా ఆధ్యాత్నిక టూర్లను అందుబాటులోకి తెస్తోంది. -
బహీ ఖాతా తరహా పౌచ్లో బడ్జెట్ ట్యాబ్
న్యూఢిల్లీ: కట్టలకొద్దీ బడ్జెట్ ప్రతులతో పార్లమెంట్లోకి అడుగుపెట్టే సంస్కృతికి ఫుల్స్టాప్ పడి చాలా కాలమైంది. కాగితరహితమైన బడ్జెట్ను ఈసారీ విత్తమంత్రి నిర్మల విశిష్టమైన బహీ ఖాతా తరహాలో ఎరుపు రంగు పౌచ్లో ట్యాబ్ను తీసుకొచ్చారు. బ్రీఫ్కేస్ విధానాన్ని వదిలేసి గత మూడేళ్లుగా ఆమె ఇలాగే పౌచ్లోనే ట్యాబ్ను తీసుకొస్తున్నారు. బడ్జెట్ ప్రసంగం చేయడానికి పార్లమెంట్కు రావడానికి ముందు ఆమె కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం బయట సహాయ మంత్రులు, శాఖ ఉన్నతాధికారులతో ట్యాబ్ పట్టుకుని గ్రూప్ ఫొటో దిగారు. 2020 లోనూ ఆమె బహీ ఖాతానే తెచ్చారు. 2021లో తొలిసారిగా పౌచ్లో ట్యాబ్ను పట్టుకొచ్చారు. అదే సంస్కృతిని ఈసారీ కొనసాగించారు. 2019లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్తో కలుపుకుంటే 2014 ఏడాది నుంచి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 12వ బడ్జెట్ ఇది. నిర్మలకు ఇది ఆరో బడ్జెట్. దశాబ్దాలుగా బడ్జెట్ను సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశపెట్టేవారు. ఈ ఆనవాయితీకి వాజ్పేయీ చెల్లుచీటీ ఇచ్చారు. వాజ్పేయీ హయాంలో నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆనాటి నుంచి అదే సంస్కృతి కొనసాగుతోంది. బడ్జెట్ వివరాలను బ్రీఫ్కేస్కు బదులు బహీఖాతాలో తీసుకురావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం స్పందించారు. ‘‘ఈ సంస్కృతి ఇలాగే కొనసాగుతోంది. భవిష్యత్తులో మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయితే ఆర్థిక మంత్రి బడ్జెట్ను ఐప్యాడ్లోనే తీసుకొస్తారు’’అని వ్యాఖ్యానించారు. -
GYAN పద్దు!
న్యూఢిల్లీ: దేశ సుస్థిర, సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా, దేశాన్ని ‘వికసిత్ భారత్’గా మార్చే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలో పేదలు, యువత, రైతులు, మహిళల సాధికారత, సంక్షేమమే తమ ప్రాధాన్యత అని ప్రకటించారు. గత పదేళ్లలో అభివృద్ధి ఎంతో వేగం పుంజుకుందని పేర్కొన్నారు. ఆమె గురువారం పార్లమెంటులో 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సీతారామన్ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే.. ‘‘గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ సకారాత్మకంగా గణనీయ మార్పు సాధించింది. దేశ ప్రజలు ఎంతో ఆశగా, నమ్మకంతో భవిష్యత్తు వైపు చూస్తున్నారు. ప్రజల ఆశీర్వాదంతో, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఎన్నో సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంది. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ మంత్రంతో, ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందడుగు వేస్తోంది. ఆర్థిక వ్యవస్థ నూతన శిఖరాల దిశగా సాగుతోంది. రెండోసారి ఘన విజయం సాధించిన తర్వాత మోదీ సర్కారు.. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ మంత్రాన్ని చేపట్టి దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్నివర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి చర్యలు చేపట్టింది. అవినీతి, బంధుప్రీతి తగ్గాయి. సామాజిక న్యాయం అందుతోంది. ఆత్మనిర్భర్ భారత్తో అమృత కాలానికి.. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కొని.. ఆత్మనిర్భర్ భారత్తో అమృతకాలానికి పునాదులు వేసుకున్నాం. అద్భుతమైన భవిష్యత్తు దిశగా సాగుతున్నాం. అందరికీ ఇళ్లు, ప్రతి ఇంటికీ నీళ్లు, విద్యుత్, వంటగ్యాస్, బ్యాంకు ఖాతాలు వంటివాటితో దేశంలోని ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. వికసిత్ భారత్ దిశగా.. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రజలందరికీ సమాన అవకాశాలతో ప్రకృతితో కలసి సాగుతూ.. 2047 నాటికి ‘వికసిత భారత్’గా రూపొందే దిశగా అడుగులు వేస్తాం. వచ్చే ఐదేళ్లలో అనూహ్య ప్రగతి సాధించబోతున్నాం. మనకు అవకాశాలకు కొదవలేదు. ఆకాశమే హద్దు. ఈ అద్భుతమైన పనితీరు చూపిన మా ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. ‘వికసిత భారత్’ దిశగా చేపట్టే రోడ్మ్యాప్ను జూలైలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో వెల్లడిస్తాం. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నా.. కొన్నేళ్లుగా యుద్ధాలు, వివాదాలతో ప్రపంచ పరిణామాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. కీలక ఖనిజాలు, సాంకేతికతలు, సరుకుల రవాణాకు ఆటంకం కలుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అప్పుల భారం, పర్యావరణ సమస్యలు సవాలుగా మారుతున్నాయి. వీటిని దీటు గా ఎదుర్కొంటూ, సరైన పరిష్కారాలను అనుసరిస్తూ ముందుకు సాగుతున్నాం.ఇండియా–మధ్యప్రాచ్య దేశాలు– యూరప్ ఎకానమిక్ కారిడార్ మనదేశానికి ఒక గేమ్ చేంజర్. ప్రపంచ వాణిజ్యానికి కీలకంగా మారనున్న ఈ కారిడార్కు మూలం భారత్ అన్న విషయం చరిత్రలో నిలిచిపోతుంది. మరిన్ని సంస్కరణలు తెస్తాం సుస్థిర, సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి కోసం, అందరికీ అవకాశాలు అందించడం కోసం మరిన్ని సంస్కరణలు తెస్తాం. రాష్ట్రాలు, ఇతర భాగస్వాములతో చర్చించి అమలు చేస్తాం. ప్రపంచంతో పోటీపడేలా పరిశ్రమలకు తోడ్పాటుఅందిస్తాం. తూర్పు ప్రాంతం, అక్కడి ప్రజలు దేశ అభివృద్ధిని ముందుండి నడిపించేలా దృష్టిసారిస్తాం. లక్షాధికారులను చేసేలా.. 83 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలతో 9 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు. వారిలో కోటి మంది ఇప్పటికే లక్షాధికారులు (లక్పతి దీదీ) అయ్యారు. త్వరలో మూడు కోట్ల మందిని ‘లక్పతి దీదీ’గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జీడీపీ అంటే.. ఈ మూడు.. : స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దేశం దూసుకుపోతోంది. అదే సమయంలో కీలకమైన మరో మూడు అంశాల ‘జీడీపీ.. గవర్నెన్స్ (పరిపాలన), డెవలప్మెంట్ (అభివృద్ధి), పర్ఫార్మెన్స్ (పనితీరు)’పై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలే కేంద్రంగా పారదర్శక, బాధ్యతాయుతమైన పరిపాలన అందించేందుకు.. సమ్మిళిత అభివృద్ధి కోసం కృషి చేస్తోంది. నాలుగు వర్గాలకు ప్రాధాన్యత పేదలు, మహిళలు, యువత, రైతులు.. ఈ నాలుగు వర్గాల అవసరాలు, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ నాలుగు వర్గాల వారికి ప్రభుత్వ మద్దతు అవసరం. వారు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. పేదలకు మరో రెండు కోట్ల ఇళ్లు ► పీఎం ఆవాస్ యోజన ద్వారా గత ఐదేళ్లలో మూడు కోట్ల ఇళ్లను నిర్మించాలన్న లక్ష్యానికి దాదాపు పూర్తి చేసుకుంటున్నాం. వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మిస్తాం. ► రూఫ్టాప్ సోలార్ ప్రాజెక్టు ద్వారా కోటి ఇళ్లకు ప్రతినెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుంది. ప్రజలకు ఏటా రూ.15 వేల నుంచి రూ.18 వేలు ఆదా అవుతాయి. దీనితో ఎంతో మందికి ఉపాధి కూడా లభిస్తుంది. ► అద్దె ఇళ్లలో నివసిస్తున్న మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు త్వరలో కొత్త పథకాన్ని ప్రారంభిస్తాం. ► దేశంలో మెడికల్ కాలేజీల సంఖ్యను గణనీయంగా పెంచుతాం. దీనిపై ప్రతిపాదనల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ► మహిళల్ల సర్వైకల్ కేన్సర్ నివారణ కోసం 9–14 ఏళ్ల మధ్య వయసు బాలికలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతాం. ► గర్భిణులు, శిశువుల సంక్షేమం, పోషకాహారం అందించడం కోసం అంగన్వాడీలను ‘సక్షం అంగన్వాడీ అండ్ పోషణ్ 2.0’గా అప్గ్రేడ్ చేస్తాం. ► చిన్నారుల్లో వ్యాధుల నివారణ కోసం టీకాల కార్యక్రమాన్ని విస్తృతం చేస్తాం. ► ఆశా, అంగన్వాడీ వర్కర్లకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తాం. ► రైతులకు ప్రయోజనం కలిగేలా ఫుడ్ ప్రాసెసింగ్, పంటల నిల్వ, రవాణా సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తాం. నానో డీఏపీ వినియోగాన్ని పెంచుతాం. ► వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఇతర నూనె గింజల దిగుబడి పెరిగేలా పరిశోధన, ఆధునిక వ్యవసాయ విధానాలపై పరిశోధనలను ప్రొత్సహిస్తాం. ► పశువుల్లో ఫుట్ అండ్ మౌత్ వ్యాధి నియంత్రణకు చర్యలు చేపడతాం. ► మత్య పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఐదు సమీకృత ఆక్వాపార్క్లను ఏర్పాటు చేస్తాం. ► సరికొత్త టెక్నాలజీల రూపకల్పన, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేస్తాం. ► రక్షణ రంగం కోసం డీప్–టెక్ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి కొత్త పథకాన్ని ప్రారంభిస్తాం. ► దేశంలో పర్యాటకాన్ని పెంచేందుకు ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఇందుకోసం రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు ఇస్తాం. పేదల సంక్షేమమే.. దేశ సంక్షేమం.. పేదలకు సాధికారత కోసం ప్రభుత్వం వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేసింది. ఫలితంగా గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద రూ.34 లక్షల కోట్లను నేరుగా జన్ధన్ ఖాతాల్లో జమ చేసింది. దీనిద్వారా వృధా వ్యయం, అక్రమాలకు చెక్పడి ప్రభుత్వానికి రూ.2.7లక్షల కోట్లు మిగిలాయి. పీఎం స్వానిధి పథకం ద్వారా 78 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించాం. పీఎం జన్మన్ యోజన ద్వారా ఆదివాసీలు, విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతివృత్తుల వారు ప్రయోజనం పొందారు. రైతులు మనకు అన్నదాతలు దేశంలో రైతు కేంద్రిత విధానాలు అమలు చేస్తున్నాం. పంటలకు మద్దతు ధరలను క్రమంగా పెంచుకుంటూ వస్తున్నాం. కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా 11.8కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఏటా నగదు జమ అవుతోంది. నాలుగు కోట్ల మంది రైతులకు ఫసల్ బీమా యోజన అందుతోంది. ఈనామ్ ద్వారా 1,361 మార్కెట్లతో 1.8 కోట్ల మంది రైతులకు సేవలు అందుతున్నాయి. యువత సాధికారతతోనే దేశ శ్రేయస్సు యువతకు తగిన ప్రోత్సాహాన్ని, సాధికారతను అందించడంపైనే దేశ శ్రేయస్సు ఆధారపడి ఉంది. ప్రభుత్వం తెచి్చన జాతీయ విద్యా విధానం–2020 దేశంలో గుణాత్మక సంస్కరణలకు మార్గం వేసింది. పీఎంశ్రీ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతోంది. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా 1.4కోట్ల మంది యువత శిక్షణ పొందారు. ప్రభుత్వం ఏడు ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఎయిమ్స్, 390 యూనివర్సిటీలతోపాటు 3 వేల కొత్త ఐటీఐలను నెలకొల్పింది. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు పీఎం ముద్రా యోజన ద్వారా 22.5 లక్షల కోట్ల రుణా లు అందించాం. స్టార్టప్ ఇండియా, స్టార్టప్ క్రెడిట్ గ్యారెంటీ పథకాలను అమలు చేస్తున్నాం. ఇప్పుడు వారు ‘ఉద్యోగ దాత’లు అవుతున్నారు. క్రీడలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహానికి.. ఆసియన్ గేమ్స్లో మన క్రీడాకారులు సాధించిన పతకాలే నిదర్శనం. నారీ శక్తి ముందడుగు.. గత పదేళ్లలో మహిళల సాధికారత, ఆత్మగౌరవం కోసం తీసుకున్న చర్యలతో ‘నారీ శక్తి’ ముందడుగు వేస్తోంది. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు 30 కోట్ల ముద్ర రుణాలు అందించాం. ఉన్నత విద్యను అభ్యసించే మహిళలు 28శాతం పెరిగారు. ‘స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథ్స్)’ కోర్సుల్లో చేరుతున్నవారిలో 43శాతం మంది మహిళలే. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఇవన్నీ ఉద్యోగాలు/ఉపాధిలో మహిళ భాగస్వామ్యం పెంచాయి. త్రిపుల్ తలాక్ రద్దు, లోక్సభ/అసెంబ్లీలలో మూడో వంతు రిజర్వేషన్లు, పీఎం ఆవాస్ యోజన కింద 70శాతం మహిళా లబ్ధిదారులకే మంజూరు వంటివి మహిళల ఆత్మగౌరవానికి తోడ్పడుతున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement