-
ఈసీవాగు వెలవెల
⇒ వానాకాలంలో ఇప్పటి వరకు వాగులో చేరని వరద ⇒ హిమాయత్సాగర్ సైతం ఎండుముఖం ⇒ పెరగని భూగర్భజలాలు శంషాబాద్ రూరల్ : వర్షాకాలంలో వరదతో కళకళలాడాల్సిన ఈసీవాగు నీరు లేక వెలవెలబోతోంది. జంట నగరాలకు తాగునీటిని అందించే జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్సాగర్లోకి వరదను చేర్చే ఈ ప్రధాన వాగులో ఇప్పటి వరకు చుక్కనీరు పారలేదు. వర్షాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నా ఆశించిన వానలు కురవలేదు. జిల్లాలోని వికారాబాద్ ప్రాంతంలో మొదలై ఈ వాగు చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంషాబాద్ మండలాల పరిసరాల నుంచి హిమాయత్సాగర్కు చేరుకుంటుంది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిస్తే వాగులో వరద పారుతుంది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు ఆశించిన వర్షాలు లేక వాగులో వరద రాలేదు. గత ఏడాది సైతం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గత రెండేళ్ల నుంచి వాగులోకి పెద్దగా నీరు పారలేదు. వాగులో వరద పారితే భూగర్భజలాలు పెరిగి సమీప గ్రామాల్లోని బోర్లలో నీరు పుష్కలంగా వస్తాయి. కానీ.. ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాగు పరిసర ప్రాంతాల్లో రైతులు బోర్ల కింద ఎక్కువగా వరి, కూరగాయల పంటలు సాగు చేస్తుంటారు. వర్షాభావ పరిస్థితులతో గతేడాది డిసెంబరు నుంచి బోర్లు ఎండిపోతూ వచ్చాయి. సరైన వర్షాలు లేక భూగర్భజలాలు పెరగక నేటికీ బోర్లు రీచార్జ్ కాలేదు. దీంతో వరిసాగుకు తీవ్రఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు హిమాయత్సాగర్లో నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరుకోవడమే కాకుండా నగరానికి నీటి సరఫరా కూడా నిలిచిపోయింది. వర్షాకాలంలో నీటితో కళకళలాడి పర్యాటకులను ఆకర్షించే హిమాయత్సాగర్ నేడు నీరు లేక వట్టిపోతోంది. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
►పంటలను కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది ►రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి మొయినాబాద్ రూరల్: లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అమ్డాపూర్ ఈసీవాగును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఈసీ, కాగ్నా, మూసీవాగులతో పాటు కుంటలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని చెప్పారు. వరదనీరు ప్రవహిస్తున్న తీరును గమనించి ప్రజలు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, ప్రయాణికులు చిన్నచిన్న కాలువలను దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. భారీవర్షాలతో వాగులు, కుంటలు నిండి చుట్టుపక్కల ఉన్న పంటపొలాలు నీట మునిగాయని చెప్పారు. పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా పలికారు. ఈసీవాగును సందర్శించిన వారిలో ఎమ్మెల్యే కాలెయాదయ్య, ఆర్ఐ రాజు, వీఆర్ఓ విష్ణుగౌడ్, సర్పంచ్ సిద్ధయ్య, ఎంపీటీసీ సామరాంరెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింహ్మరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్థన్రెడ్డి, నాయకులు అనంతరెడ్డి, నర్సింహ్మచారి, శ్రీహరియాదవ్, సామ రవీందర్రెడ్డి, రవీందర్చారి, సంజీవరెడ్డి, కొండల్గౌడ్ తదితరులున్నారు. రాకపోకలు బంద్ పరిగి పరివాహక ప్రాంతాల నుంచి మూడు రోజులుగా భారీగా వరదనీరు రావటంతో ఈసీవాగు ప్రవాహం జోరందుకుంది. ఈ వాగు మండల పరిధిలోని నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, అమ్డాపూర్ల మీదుగా హిమాయత్సాగర్కు చేరుతుంది. వాగులోకి భారీగా వరదనీరు రావటంతో చుట్టపక్కల పంటపొలాలు, రోడ్లు కొట్టుకుపోయాయి. అమ్డాపూర్ వద్ద ఉన్న ఈసీవాగు వంతెన సమీపంలో లోతట్టుగా ఉన్న కంచెమడుగు ప్రదేశం పూర్తిగా నీటితో నిండిపోవడంతో ప్రయాణికుల రాకపోకలు నిలిచిపోయాయి. మొయినాబాద్, శంకర్పల్లి నుంచి శంషాబాద్కు ఎంతో మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కాని వరదనీటితో రాకపోకలకు ఆటంకం కలిగింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
వివాహితపై అత్తింటివారి దాడి
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
వేడుకునేది ఓటర్ని కాదు! సూర్యుడ్ని!!
సాంఘిక విప్లవ నాయకుడు
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను: సుహాస్
జాలీ రైడ్
తప్పక చదవండి
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
Advertisement