-
1998లో డీఎస్సీ రాశారు.. ఎన్నో ట్విస్ట్ ల తర్వాత .. కథ శుభం
గుంటూరు ఎడ్యుకేషన్: డీఎస్పీ– 1998 అభ్యర్థుల కల ఫలిచింది. పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అధికారం వచ్చిన వెంటనే క్వాలిఫైడ్ అభ్యర్థుల జీవితాల్లో వెలుగు నింపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా పరీక్షలు రాసి, అర్హత సాధించినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో, మంచి మనసున్న ఏ ముఖ్యమంత్రి తమ గోడు ఆలకించకపోతారా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ కల్పిస్తున్నట్లు గతంలో ప్రకటించిన ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా జిల్లాల వారీగా క్వాలిఫైడ్ అభ్యర్థుల వివరాలు సేకరించింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇచ్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వం ఈనెలలోనే దానిని పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఈనెల 13లోపు పోస్టింగ్స్ కల్పించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్కుమార్ విడుదల చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా విద్యాశాఖాధికారులు చర్యలు ప్రారంభించారు. కాగా ఉద్యోగ నియామక పరీక్షలు రాసిన 25 ఏళ్ల తరువాత ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంపై అభ్యర్థులు ఆనందోత్సాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా విద్యాశాఖాధికారులు గతేడాది అక్టోబర్లో గుంటూరు నగరంలో క్వాలిఫైడ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారు. డీఈఓ కార్యాలయంలో కౌన్సెలింగ్.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 229 మంది అభ్యర్థులకు పోస్టింగ్స్ కల్పించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ తెలిపారు. ఈనెల 12వ తేదీలోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిన దృష్ట్యా, అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మినిమం టైం స్కేల్పై ఉపాధ్యాయులుగా నియమితులైన అభ్యర్థులను అవసరమైన పాఠశాలల్లో నియమిస్తామని చెప్పారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితాను htts://doefnt.bofrpot.com సైట్లో ఉంచినట్లు చెప్పారు. అభ్యర్థులు ఈనెల 12న ఉదయం 10 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్కార్డు, ఐదు పాస్పోర్ట్ ఫోటోలు, డీఎస్సీ–1998 హాల్ టిక్కెట్ను తీసుకుని గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న డీఈవో కార్యాలయంలో నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. -
డిసెంబర్ 8న కోర్టులో హాజరుకండి
తెలంగాణ సీఎస్కు ‘సుప్రీం’ ఆదేశం డీఎస్సీ-98 కేసులో టీ సర్కారుపై ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ-1998 కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇచ్చేం దుకు డిసెంబర్ 8న వ్యక్తిగతంగా హాజరుకావాలని సీఎస్ రాజీవ్శర్మను ఆదేశించింది. డీఎస్సీ 98పై పాఠశాల విద్యాశాఖ అనుసరించిన వైఖరి రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ నెల 17న వెలువడిన సుప్రీంకోర్టు ఆదేశాలను పాఠశాల విద్యాశాఖ అధికారులు గోప్యంగా ఉంచారు. తదుపరి చర్యలపై ఏమిచేయాలో తోచక తర్జనభర్జన పడుతున్నారు. సీఎస్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ, సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసే యోచనలో పాఠశాల విద్యాశాఖ ఉన్నట్టు తెలిసింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎం.జగదీశ్వర్ ప్రభుత్వంతో ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నారు. అసలేం జరిగింది?: డీఎస్సీ-1998 నియామకాల విషయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై కరీంనగర్ జిల్లాకు చెందిన గోపు మహేందర్ రెడ్డితోపాటు, పలువురు నిరుద్యోగ అభ్యర్థులు గత ఏడాది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ రంజనా గగోయ్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్లతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ నెల 17న జరిగిన విచారణలో రాష్ట్రప్రభుత్వం తన వాదనను కోర్టుకు తెలపాల్సి ఉండగా, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు సరైన రీతిలో స్పందించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ధర్మాసనం సదరు అధికారి అందజేసిన పత్రాలను తిరస్కరించడంతోపాటు.. డిసెంబర్ 8న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సీఎస్ను ఆదేశించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మట్టపల్లిలో నిత్యకల్యాణం
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు
‘నీట్’కు 997 మంది హాజరు
కొనసాగుతున్న ‘పోస్టల్’ ఓటింగ్
ఉమ్మడి జిల్లాలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే..
ఉరుములు.. మెరుపులు
వంటింట్లో ధరల మంట!
తక్కువ పోలింగ్ నమోదైన కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
ప్రశాంతంగా ‘నీట్’
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement