-
ఓ వైపు కరోనా.. మరోవైపు ఇన్ఫ్లూయెంజా.. మాస్కులు ధరించకపోతే అంతే..!
న్యూఢిల్లీ: హెచ్3ఎన్2 వైరస్ కారణంగా దేశంలో ఇన్ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో వైద్య నిపుణులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఏటా ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. అలా అయితే ఫ్లూ బారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. దేశంలో మార్చి 9 వరకు హెచ్3ఎన్2 సహా మొత్తం 3,038 ఇన్ఫ్లూయెంజా ఉపరకాల కేసులు నమోదయ్యాయి. ఇందులో జనవరిలో 1,245, ఫిబ్రవరిలో 1,307, మార్చిలో 9 రోజుల్లోనే 486 కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇన్ఫ్లూయెంజా బారినపడకుండా కనీస జాగ్రత్తలు పాటించాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటున్నారు. బస్సులు, రైళ్లు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లు, జనం గుంపులుగా ఉన్న చోట్ల కచ్చితంగా మాస్కు పెట్టుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ ఇన్ఫ్లూయెంజా ఎక్కువగా తుంపర్ల ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే ముక్కు, నోటిని చేతులతో ఎక్కువగా తాకకుండా చూసుకుంటే వైరస్ లోనికి ప్రవేశించే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెబతున్నారు. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో కోవిడ్-19తో పాటు స్వైన్ ఫ్లూ(హెచ్1ఎన్1), హెచ్3ఎన్2, సీజనల్ ఇన్ఫ్లూయెంజా- బీ వైరస్ల కాంబినేషన్లు వెలుగుచూస్తున్నాయి. హెచ్3ఎన్2, హెచ్3ఎన్1 ఇన్ఫ్లూయెంజా- ఏ రకాల కిందకు వస్తాయి. వీటినే ఫ్లూగా పిలుస్తారు. లక్షణాలు ఇలా.. ఇన్ఫ్లూయెంజా బారినపడేవారిలో జ్వరం ఎక్కువరోజులు ఉండటం, దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఒకవేళ ఆరోగ్యం బాగా క్షీణిస్తే శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. మరోవైపు దేశంలో కోవిడ్ కేసుల్లో కూడా చాలా రోజుల తర్వాత పెరుగుదల కన్పిస్తోంది. ఆదివారం కొత్తగా 524 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో, జనసమూహాల్లో తిరిగేవారు మాస్కులు ధరించండ చాలా ఉత్తమం అని, లేకపోతే వైరస్ల బారినపడే ముప్పు ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదవండి: ప్రియాంక గాంధీ పెయింటింగ్కు రూ.2 కోట్లా? కాంగ్రెస్ అవినీతిలో రోజుకో కొత్త మోడల్ -
సీపీఆర్ చేస్తే బతికేవారేమో
కోల్కతా/ముంబై: గుండెపోటుతో మరణించిన ప్రఖ్యాత బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (కేకే)కు సకాలంలో సీపీఆర్ చేసుంటే ప్రాణాలు నిలిచేవని కోల్కతా వైద్యులు అభిప్రాయపడ్డారు. ‘‘ఆయన గుండెలో ఎడమవైపు ధమనిలో 80 శాతం బ్లాకేజీ ఉంది. మిగతా ధమనులు, రక్తనాళాల్లోనూ చిన్నచిన్న బ్లాక్లున్నాయి. చాలా రోజులుగా ఈ సమస్య ఉన్నట్టుంది. దీనికి తోడు లైవ్ షోలో ఉద్విగ్నంగా గడపటంతో గుండెకు రక్తం సరిగా అందక మరణానికి దారితీసింది. స్పృహ కోల్పోగానే సీపీఆర్ చేసుంటే బతికేవారు’’ అని ఒక వైద్యుడు పీటీఐకి చెప్పారు. కేకే యాంటాసిడ్ ట్యాబ్లెట్లు ఎక్కువగా తీసుకున్నట్టు పోస్టుమార్టంలో తేలింది. గుండెనొప్పిని అజీర్తిగా భావించి వాటిని వాడి ఉంటారని వైద్యులు చెప్పారు. కోల్కతా నుంచి భార్యతో ఫోన్లో మాట్లాడుతూ ఛాతిలో నొప్పిగా ఉందని, చేతులూ భుజాలూ లాగుతున్నాయని చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. అభిమానుల కన్నీటి నడుమ కేకే అంత్యక్రియలు ముంబై వెర్సొవా హిందు శ్మశానవాటికలో గురువారం జరిగాయి. కుమారుడు నకుల్ అంతిమ సంస్కారం నిర్వహించారు. శ్రేయఘోషల్, అల్కాయాజ్ఞిక్, హరిహరన్, సలీమ్ మర్చంట్ వంటి సింగర్లు నివాళులర్పించారు. -
BMI: బీఎంఐతో ఆందోళన వద్దు!
బీఎంఐ... బాడీ మాస్ ఇండెక్స్.. ఈ నంబరు పెరిగితే అనారోగ్యమని నమ్ముతూ, భయపడుతూ బతుకుతున్నాం! అయితే ఆరోగ్యాన్ని బీఎంఐ ఆధారంగా అంచనా వేయడం సరికాదంటున్నారు నిపుణులు. ఆరోగ్యం గురించి ప్రాథమిక అవగాహన కల్పించే పలు కొలతల్లో బీఎంఐ ఒకటి మాత్రమేనంటున్నారు... నంబర్లు మనిషి జీవితాన్ని శాసించే స్థితికి వచ్చాయి. అటు చదువు నుంచి ఇటు ఆరోగ్యం వరకు జీవితమంతా నంబర్లాటతోనే సరిపోతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఆరోగ్యంగా ఉండాలంటే ఇన్ని కేలరీల భోజనం చేయాలి, ఇన్ని అడుగులు నడవాలి, ఇన్ని గంటలు పడుకోవాలి అంటూ ప్రతి ఒక్కరిలో జ్ఞానం పెరిగిపోయింది. ఉరుకులు పరుగుల జీవితంలో శరీరంపై శ్రద్ధ పెట్టేందుకు సమయం సరిపోనివాళ్లంతా ఇలాంటి నంబర్లను నమ్ముకొంటున్నారు. రోజుకు ఎన్ని అడుగులు నడిచాం, హృదయ స్పందన రేటు ఎలాఉంది, ఆక్సిజన్ స్థాయి ఎంత, ఎంతసేపు నిద్రించాం.. అనేవి లెక్కించడానికి స్మార్ట్ డివైజ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో ప్రతిఒక్కరం తెలియకుండానే నంబర్ల రేసులో పరిగెడుతున్నాం. ఇలాంటి నంబర్లలో అందరినీ బెంబేలెత్తించేది బీఎంఐ.. బాడీ మాస్ ఇండెక్స్. సింపుల్గా చెప్పాలంటే మీ ఎత్తుకు మీరెంత బరువుండాలో చెప్పే కొలత. ఇది కాస్త ఎక్కువైతే మనిషి పడే ఆరాటం అంతా ఇంతాకాదు. కానీ తాజా పరిశోధనలు మాత్రం బీఎంఐకి అంత సీన్ లేదంటున్నాయి. అసలు దీన్ని ఆరోగ్యంతో లింకు పెట్టి చూసే ధోరణి మానుకోవాలంటున్నారు పరిశోధకులు. ఇది అనేక ప్రాథమిక కొలతల్లో ఒకటని చెబుతున్నారు. ప్రభుత్వానికి సాయం కోసం బీఎంఐ అనే భావనను 1832 సంవత్సరంలో బెల్జియన్ గణాంకవేత్త లాంబెర్ట్ అడోల్ఫ్ క్విటెలెట్ రూపొందించారు. అప్పటి ప్రభుత్వానికి దేశ జనాభాలో అధిక బరువున్నవారి జనాభాను గుర్తించేందుకు క్విటెలెట్ ఈ బీఎంఐకి రూపకల్పన చేశారు. తర్వాత రోజుల్లో మనుషుల బరువు ఆధారంగా వారి బీమా ప్రీమియం లెక్కించేందుకు అవసరమైన సులభమైన కొలత అమెరికా బీమా కంపెనీలకు కావాల్సివచ్చింది. ఈ కంపెనీలు జనాభాలో సగటు బరువును లెక్కించేందుకు అనేక అశాస్త్రీయ పద్ధతులు వాడేవి. వీటితో విసుగొచి్చన యాన్సెల్ కీస్ అనే డాక్టరు దాదాపు 7వేల మందిపై క్విటెలెట్ సమీకరణంతో ప్రయోగం చేశారు. ఈ సమీకరణంతో సగటు జనాభా బరువు కనుక్కోవడం సులభమని గుర్తించి దీనికి బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) అని నామకరణం చేశారు. తర్వాత రోజుల్లో మనిషి బరువు పెరిగితే అనారోగ్యమని గుర్తించడంతో పలువురు డాక్టర్లు తమ పేషెంట్ల సాధారణ ఆరోగ్య సూచీగా బీఎంఐని వాడడం ఆరంభించారు. ప్రస్తుతం డాక్టర్ల నుంచి జిమ్ ట్రైనర్ల వరకు అంతా దీన్ని నమ్ముకొని ఆరోగ్యంపై అంచనాలు వేస్తున్నారు. అదే ఫైనల్ కాదు.. ఎందుకంటే? బీఎంఐ ఎక్కువున్నంత మాత్రాన అనారోగ్యంతో ఉన్నట్లు భావించవద్దని తాజా పరిశోధనలు సూ చిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నామనేందుకు బీఎం ఐ గుర్తించని కొన్ని అంశాలున్నాయంటున్నాయి. - బీఎంఐలో బీఎఫ్పీ (బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్– శరీరంలో కొవ్వు శాతం) లెక్కింపు ఉండదు. ఇది కేవలం శరీర బరువును సూచించే కొలత మాత్రమే! అయితే అనారోగ్యమనేది బరువు వల్ల కాదు, శరీరంలోని కొవ్వు వల్ల వస్తుందని గుర్తించాలి. బీఎంఐ కొవ్వుకు, కండకు తేడాను గుర్తించదు. ఉదాహరణకు ప్రఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్ బీఎంఐ ఓవర్వెయిట్ రేంజ్లో, ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు టామ్ బ్రాడీ బీఎంఐ ఒబేస్ రేంజ్లో ఉన్నాయి. వీరిలో కొవ్వుకు, కండకు తేడాను బీఎంఐ గుర్తించకపోవడమే ఇందుకు కారణం. - శరీరంలో బాడీ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ (శరీరంలో కొవ్వు వ్యాప్తి)ని కూడా బీఎంఐ లెక్కించదు. శరీరంలో అన్ని కొవ్వు పదార్థాలు ఒకటి కాదు, వీటిలో చెడువి, మంచివి ఉంటాయి. ఉదాహరణకు పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్నవారి బీఎంఐ, తుంటి వద్ద కొవ్వు ఎక్కువగా ఉన్నవారి బీఎంఐ అధికంగానే ఉంటాయి. కానీ వీరిలో పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువున్నవారు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు అధికం. - బీఎంఐ జనాభా వైరుద్ధ్యాలు గుర్తించదు. ఆంగ్లోశాక్సన్లను ఉదాహరణగా తీసుకొని క్విటెలెట్ ఈ సమీకరణం రూపొందించారు. కానీ ప్రకృతి సహజంగా ఆయా భౌగోళిక ప్రాంతాల్లో మనుషుల మధ్య వైరుద్ధ్యాలు సహజం. ఉదాహరణకు ఆసియా జనాభాలో బీఎంఐ పెరిగితే అనారోగ్యం పాలయ్యే అవకాశాలున్నాయి, కానీ పాలినేసియన్ జనాభాలో(పసిఫిక్ సముద్రంలోని కొన్ని దీవుల సముదాయాన్ని పాలినేసియా అంటారు) అధిక బీఎంఐ ఉన్నా ఆరోగ్యంగానే ఉంటారు. అందువల్ల బీఎంఐ అనేది ఆరోగ్యానికి సింగిల్ సూచిక కాదని, అనేక ప్రాథమిక కొలతల్లో ఇదిఒకటని నిపుణులు నిర్ధారిస్తున్నారు. మీ బీఎంఐ ఓవర్వెయిట్ లేదా ఒబేస్ రేంజ్లో ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. అంతమాత్రాన పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం కూడా లేదు. బీఎంఐ బాగా ఎక్కువుంటే ఇతర పరీక్షలు (లిపిడ్ ప్రొఫైల్ తదితరాలు) చేయించుకొని ఆరోగ్యంపై నిర్ధారణకు రావాలి. అంతేకానీ బీఎంఐ ఎక్కువైందన్న కంగారులో అనవసర డైట్ పద్ధతులు పాటించి కొత్త అనారోగ్యాలు కొనితెచ్చుకోవద్దన్నది నిపుణుల సలహా. ఇలా లెక్కిస్తారు.. ఆన్లైన్లో బీఎంఐని లెక్కించేందుకు పలు ఉచిత అప్లికేషన్లున్నాయి. బీఎంఐ లెక్కించేందుకు మీ బరువు, ఎత్తు తెలిస్తే చాలు! బరువును కిలోల్లో, ఎత్తును మీటర్లలో అప్లికేషన్లో ఎంటర్ చేస్తే మీ బీఎంఐ ఎంతో సెకన్లలో తెలుస్తుంది. బీఎంఐ 18.5 కన్నా తక్కువుంటే అండర్వెయిట్ (ఉండాల్సినదాని కన్నా తక్కువ బరువు), 18.5– 24.9 ఉంటే నార్మల్, 25– 29.9 ఉంటే ఓవర్వెయిట్ (ఉండాల్సినదాని కన్నా అధిక బరువు), 30పైన ఉంటే ఒబేస్ (ఊబకాయం)గా వర్గీకరిస్తారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
యువతలో ఇడియట్స్.. గూగుల్నే నమ్ముతున్న వైనం!
లబ్బీపేట (విజయవాడతూర్పు): యువత, విద్యావంతుల్లో ఇడియట్స్ పెరిగిపోతున్నారు. ఇడియట్ అంటే తిట్టు కాదు. ఇంటర్నెట్ డెరీవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్స్ట్రక్షన్ ట్రీట్మెంట్ సిండ్రోమ్తో బాధపడుతున్న వారని అర్థం. వీరిని డాక్టర్ గూగుల్గా కూడా పిలుస్తారు. వారికి ఏదైనా జబ్బు చేస్తే, ఆ లక్షణాలను గూగుల్లో సెర్చ్ చేసి జబ్బు, దానికి చికిత్స ఏమిటో తెలుసుకుంటారు. అనంతరం డాక్టర్ వద్దకు వెళ్లి, తనకు ఫలానా జబ్బు అని, చికిత్స చేయాలని అడుగు తారు. జబ్బు లక్షణాలు ఏమిటో చెప్పాలని అడిగితే, తాను గూగుల్లో పరిశీలించి, తెలుసుకున్నానంటూ బదులిస్తారు. ఇటీవల కాలంలో వైద్యుల వద్దకు ఇలాంటి వారు ఎక్కువగా వస్తున్నారు. డాక్టర్ మందులు రాసిన తర్వాత కూడా వాటి గురించి గూగుల్లో శోధిస్తున్నారు. అక్కడ ఆ ముందుకు సంబంధించి ఏవైనా దుష్ఫలితాలు ఉంటా యని పేర్కొంటే, వాడకుండా మానేస్తున్నారు. డాక్టర్ల వద్దకు వస్తున్న 100 మంది చదువుకున్న వారిలో 60 శాతం మంది డాక్టర్ చీటీలోని మందుల సమాచారం కోసం గూగుల్లో శోధిస్తున్నారు. మరో 15 శాతం మంది ఇడియట్సేనని వైద్యులు పేర్కొంటున్నారు. చదవండి: కన్నతండ్రే కాలయముడు.. ఆస్తిలో వాటా.. కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడమే.. ప్రతి విషయాన్నీ గూగుల్లో శోధించడం ద్వారా కొత్త సమ స్యలను కొని తెచ్చుకుంటున్నారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మందులు, జబ్బు విషయంలో సందేహం ఉంటే వైద్యుడిని అడిగి నివృత్తి చేసుకోవాలే కానీ, గూగుల్లో చూడటం సరైన విధానం కాదని పేర్కొంటున్నారు. ఒక మందు వాడిన వారిలో లక్ష మందిలో ఒకరికి దుష్ఫ లి తాలు వచ్చినా, గూగుల్లో పెడుతుంటారని, దానిని చూసి మందు వాడకుంటే, జబ్బు ముదిరి ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వాడే క్రోసిన్కు కూడా దుష్ఫలితాలు ఉన్నట్లు గూగుల్లో ఉంటుందని వైద్యులు తెలిపారు. ప్రతి మందు గురించీ గూగుల్లో శోధించడం సరికాదని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. డాక్టర్ గూగుల్గా మారిన వైనం ఇప్పుడు కొంత మంది ఏదైనా జబ్బు చేస్తే, గూగుల్లో శోధించి సొంతగా మందులు వాడేస్తున్నారు. మందులను కూడా ఆన్లైన్లోనే తీసుకుంటున్నారు. అది సరి కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జబ్బుకు చికిత్స సరిగ్గా జరగక పోతే ప్రాణాల మీదకు వస్తుందని పేర్కొంటున్నారు. గూగుల్ డాక్టర్గా మారిన వారు కూడా ఇడియట్ అనే సిండ్రోమ్తో బాధపడుతున్నట్లు గుర్తించాల్సి ఉందన్నారు. రోగి వ్యవహారశైలి, మానసిక పరిస్థితిని కుటుంబ సభ్యులు అంచనా వేయాల్సి ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని రకాల మానసిక జబ్బులు, సెక్స్ సామర్థ్యం పెరిగేందుకు వాడే వయగ్రా వంటి వాటి గురించి కూడా ఎక్కువగా గూగుల్లో శోధిస్తున్నారని వివరించారు. చదవండి: అమ్మఒడిపై లఘు చిత్రం ఆవిష్కరణ -
నా పెళ్లి ఫిక్సైంది, ఆ ఆలోచన తప్పా డాక్టర్!
మెనోపాజ్ వచ్చి నాలుగేళ్లవుతోంది. ఈ మధ్య తరచుగా మూత్రంలో మంట, దురదగా ఉంటోంది. షుగర్ టెస్ట్ చేయించుకున్నాను. లేదు. థైరాయిడ్ కూడా లేదు. అయినా ఎందుకిలా అవుతోంది. వేడి చేసిందేమో అనుకున్నాను. కానీ ఎక్కడో చదివాను వేడి చేయడమంటూ ఉండదని. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – జి. రాజేశ్వరి, తర్లికొండ ఆడవారిలో గర్భాశయం ఇరువైపులా ఉండే అండాశయాల నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదలవుతూ ఉంటుంది. దీని ఉత్పత్తి 45 ఏళ్ల వయసు దాటే కొద్ది క్రమంగా తగ్గుతూ, పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ దశకు చేరుకోవడం జరుగుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల యోని భాగంలో మూత్రం బయటకు వచ్చే యురెత్రా ద్వారంలో మ్యూకస్ పొర ఎండిపోకుండా, అందులో ద్రవాలు ఊరేట్లు చేస్తుంది. అలాగే ఈస్ట్రోజన్ యోనిలో ల్యాక్టోబ్యాసిలై అనే మంచి బ్యాక్టీరియా పెరగడానికి దోహదపడుతుంది. ఈ బ్యాక్టీరియా నుంచి విడుదలయ్యే యాసిడ్ యోని స్రావాలను ఆమ్లగుణం కలిగేటట్లు చేస్తుంది. ఈ యాసిడ్ వల్ల వేరే ఇన్ఫెక్షన్ క్రిములు పెరగకుండా ఉంటాయి. అలాగే ఈస్ట్రోజన్ యురెత్రా, యోని భాగంలో ఉండే కండరాలు వదులు కాకుండా, దృఢంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. మీకు మెనోపాజ్ వచ్చి నాలుగు సంవత్సరాలు దాటింది కాబట్టి మీ శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ చాలావరకు తగ్గిపోయి ఉంటుంది. ఈస్ట్రోజన్ లోపం వల్ల యురెత్రా, వజైనా కణజాలానికి రక్తప్రసరణ తగ్గిపోయి మ్యూకస్ పొర పల్చబడి, మ్యూకస్ స్రావాలు ఆగిపోయి ఎండిపోయినట్లు అయిపోతుంది. దీనివల్ల యోనిభాగంలో పొడిబారేటట్లయి మంటగా అనిపిస్తుంది. అవసరమైతే యూరిన్ కల్చర్ పరీక్షలు చేయించి, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఎంత ఉన్నదీ, ఎలాంటి బ్యాక్టీరియా పెరుగుతున్నదీ తెలుసుకుని, దానిని బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ మందులతో పాటు మెనోపాజ్తో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల వచ్చే ఈ సమస్యలను నివారించడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ క్రీమ్, జెల్, ఆయింట్మెంట్ లేదా వజైనల్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రీమ్ను మొదటి రెండు వారాలు రోజూ రాత్రిపూట యోని లోపల మూత్ర భాగంలో పెట్టుకోవాలి. తర్వాతి నుంచి వారానికి రెండుసార్లు వాడుకోవచ్చు. అలాగే రోజుకు మూడు లీటర్ల మంచినీళ్లు తాగడం, మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనకాలకు మంచినీళ్లతో శుభ్రపరచుకోవాలి. ల్యాక్టోబ్యాసిలై ఇంటిమేట్ వాష్తో రోజుకొకసారి జననేంద్రియాలను శుభ్రపరచుకోవచ్చు. అవసరాన్ని బట్టి ల్యాక్టోబ్యాసిలైతో కూడిన ప్రోబయోటిక్ మందులను కొన్ని రోజులు డాక్టర్ సలహాపై తీసుకోవచ్చు. రోజూ కొద్దిగా క్యాన్బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల కొందరిలో ఈ–కోలి బ్యాక్టీరియా మూత్రాశయానికి అంటుకోకుండా, ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకుండా తరచుగా మూత్రవిసర్జన చేస్తూ ఉండటం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆడవారిలో మలద్వారం యోనిభాగానికి, మూత్రద్వారానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మలద్వారం నుంచి వచ్చే ఈ–కోలి బ్యాక్టీరియా, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు యోనిలోకి, మూత్రద్వారంలోనికి సులువుగా పైకి పాకి యూరినరీ ఇన్ఫెక్షన్లు, వజైనల్ ఇన్ఫెక్షన్లు అతి త్వరగా, తరచుగా వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. దీని వల్ల మూత్రం పోసేటప్పుటు మంట, దురద వంటి లక్షణాలు ఏర్పడుతుంటాయి. కొందరిలో ఈస్ట్రోజన్ లోపం వల్ల మూత్రాశయం కిందకు జారడం, దానివల్ల మూత్రం పూర్తిగా బయటకు రాకుండా ఉండటం, కొంచెం మూత్రాశయంలోనే ఉండిపోవడం, దానివల్ల అక్కడ బ్యాక్టీరియా పెరిగి, యూరినరీ ఇన్ఫెక్షన్లు వచ్చి, మూత్రంలో మంట వంటి లక్షణాలు ఏర్పడతాయి. అశ్రద్ధ చేసి, చికిత్స తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ మూత్రాశయం నుంచి యురెటర్స్ ద్వారా కిడ్నీలకు పాకి ఇన్ఫెక్షన్ తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి గైనకాలజిస్ట్ను సంప్రదించి, పరీక్ష చేయించుకుంటే, వారు స్పెక్యులమ్ పరీక్ష చేసి, మూత్రం ద్వారా యోనిభాగంలో బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయా, మూత్రాశయం జారడం వంటి సమస్యలేమైనా ఉన్నాయా అనేది చూసి, సమస్యను బట్టి యాంటీఫంగల్, యాంటీబయోటిక్ మందులు, క్రీములు సూచించడం జరుగుతుంది. మేడమ్... మా పెళ్లి ఖరారైంది. నిశ్చితార్థానికి ముందు మా రెండు కుటుంబాల హెల్త్ హిస్టరీ చూసుకోవాలనుకున్నాం. పుట్టబోయే పిల్లల ఆరోగ్య దృష్ట్యా. అమ్మాయీ ఒప్పుకుంది. కానీ వాళ్ల కుటుంబ సభ్యులకు నా తీరు నచ్చక సంబంధం కేన్సిల్ చేసుకోవాలని చూస్తున్నారు. పైగా నా మీద అభాండాలూ వేస్తున్నారు. నా ఆలోచన తప్పా డాక్టర్ గారూ... – రాఘవకృష్ణ, ప్రొద్దుటూరు నీ ఆలోచనలో తప్పేమీ లేదు. కానీ ప్రాక్టికల్గా అది అందరికీ నచ్చకపోవచ్చు. కొందరు దాన్ని వెర్రి ఆలోచనగా పరిగణించవచ్చు. జన్యుపరమైన కారణాల వల్ల జన్యు సమస్యలు, అవయవ లోపాలు, మానసిక ఎదుగుదల లోపాలు, మెటబాలిక్ డిజార్డర్స్, థలసీమియా, హీమోఫీలియా, సికెల్సెల్ ఎనీమియా వంటి రక్త సమస్యలు వంటి అనేక సమస్యలతో పిల్లలు పుట్టవచ్చు. ఈ సమస్యలకు మూలాలు తల్లిదండ్రుల్లో గాని, వారి తల్లిదండ్రులు, ఇంకా దగ్గరి రక్తసంబంధీకులలో గానీ కొన్ని జన్యువులలో లోపాలు ఉండవచ్చు. కొన్ని జన్యుపరమైన సమస్యలతో పుట్టిన పిల్లలతో పాటు, వారి తల్లిదండ్రులు జీవితాంతం ఇబ్బంది పడవలసి ఉంటుంది. కొన్ని సమస్యలు ఏ కారణం లేకుండా కూడా పిల్లల్లో ఏర్పడవచ్చు. కొందరిలో కొన్ని జన్యువులు బలహీనంగా ఉండటం జరుగుతుంది. అలాంటి ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు రెండు బలహీన జన్యువులు బిడ్డకు సంక్రమించినప్పుడు జన్యలోపాలు ఏర్పడతాయి. కాబట్టి పెళ్లికి ముందు ఇద్దరి తరఫు దగ్గరి బంధువుల ఆరోగ్య చరిత్ర తెలుసుకోవడం వల్ల వారిలో ఏవైనా సమస్యలు ఉంటే, అవి పుట్టబోయే బిడ్డకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో ఒక అంచనాకు రావచ్చు. అవసరం అనుకుంటే జెనెటిక్ కౌన్సెలింగ్కు వెళ్లవచ్చు. ఇందులో జెనెటిసిస్ట్ డాక్టర్ కుటుంబ చరిత్రను బట్టి పుట్టబోయే పిల్లల్లో జన్యుసమస్యలు ఎంతశాతం వరకు రావచ్చనేది అంచనా వేసి చెప్పడం జరుగుతుంది. డా.వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ చదవండి: కరోనా కాలంలో పిల్లలకు సీజనల్ జ్వరాలు.. జాగ్రత్తలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement