-
Doctor Death: పెళ్లయి చిన్నపాప ఉందన్నా వినలేదు.. పచ్చబొట్లు వేయించుకొని..
సాక్షి, హిందూపురం: పట్టణంలోని జీఆర్ లాడ్జీలో కొన్ని రోజుల క్రితం అనుమానాస్పదంగా మరణించిన డాక్టర్ అక్షిత కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె వెంట వచ్చిన యువకుడే హంతకుడిగా తేల్చారు. దిశ పోలీసుస్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు ఆదివారం స్థానిక టూటౌన్ పోలీసుస్టేషన్లో సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏటూరి నాగరం పట్టణానికి చెందిన పిసింగి మహేశ్ వర్మ 6 నెలల క్రితం బస్సులో ప్రయాణిస్తుండగా వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన దేంతనపల్ల డాక్టర్ అక్షిత పరిచయమైంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె ఫోన్ నెంబర్ తెలుసుకున్న మహేశ్ వర్మ ఆమెకు వీడియో కాల్స్ చేసేవాడు. ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. ఉన్నత విద్య కోసం కొన్నిరోజుల క్రితం అక్షిత చిక్బళ్లాపురం వెళ్లగా.. అక్కడికే వెళ్లి వేధింపులు మొదలుపెట్టాడు. అరెస్ట్ వివరాలు వెల్లడిస్తున్న ‘దిశ’ డీఎస్పీ శ్రీనివాసులు చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్ విద్యార్థితో జంప్) తనకు పెళ్లయి చిన్నపాప ఉందని తిరస్కరించినా వినలేదు. ఒంటిపై ఆమె పేరు, ఫొటోలతో పచ్చబొట్లు వేసుకోవడమే కాకుండా ప్రేమ ఒప్పుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించినా అక్షిత ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేసిన మహేష్ వర్మ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించి బెంగళూరు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మళ్లీ ఆ ఫొటోలను అడ్డం పెట్టుకుని ఈ నెల 24న హిందూపురంలోని జీఆర్ లాడ్జీకి రప్పించి అత్యాచారం చేశాడు. ఫొటోలు డిలీట్ చేయాలని కోరితే.. ఆమె ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేశాడు. అనంతరం లాడ్జీ నిర్వాహకుల వద్ద ఆమెకేమైందో తెలియదని అమాయకుడిలా నటిస్తూ తనే 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా సమాచారంతో ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. మహేష్వర్మపై గతంలో కూడా ఆ రాష్ట్రంలో వేధింపుల కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. జైలు శిక్ష కూడా అనుభవించాడన్నారు. -
Doctor Death Mystery: ‘అశ్లీల చిత్రాలతో బెదిరించి చంపేశాడు’
సాక్షి, హిందూపురం (శ్రీసత్యసాయి జిల్లా): తన సోదరి చిత్రాలను మార్ఫింగ్ ద్వారా అశ్లీల చిత్రాలు మార్చి బెదిరించి లాడ్జికి వచ్చేలా చేసి ఆమెను చంపేశాడని పట్టణంలోని జీఆర్ లాడ్జిలో బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందిన డాక్టర్ అక్షిత సోదరుడు శషాంక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన దేంతనపల్లి అక్షిత కర్ణాటక రాష్ట్రం చిక్బళ్లాపూర్ జిల్లాలోని ఓ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతోంది. ఈమెకు 6 నెలల క్రితం మెదక్ జిల్లా పటాన్ చెరువుకు చెందిన మహేష్ వర్మ బస్సులో పరిచయమయ్యాడు. అక్షిత ఇన్స్ట్రాగామ్ ఫాలో అయ్యి ఆమె ఫొటోలు డౌన్లోడ్ చేసుకున్నాడు. వాటిని అశ్లీలంగా మార్చిన అనంతరం అక్షితకు చూపి బెదిరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే బుధవారం ఆమెను హిందూపురంలోని జీఆర్ లాడ్జికి వచ్చేలా చేశాడు. లాడ్జిలోని ఓ రూంలో గొంతు నులిమి హత్య చేశాడు. ఈ మేరకు మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. నిందితుడు మహేష్ వర్మ పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. చదవండి: (లాడ్జిలో ప్రియుడితో దిగిన అక్షిత.. దారుణ హత్య) -
హైదరాబాద్లో వైద్యుడి అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లో వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంత్రుల నివాసాల ఎదురుగా హోటల్లో ఆరో అంతస్తు నుంచి నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ గుంత కింద పడి వైద్యుడు మరణించారు. కూతురు పెళ్లి సంబంధం గురించి మాట్లాడటం కోసం ఇండోర్ నుంచి వచ్చిన డాక్టర్ పంకజ్కుమార్ జైన్ అనే వైద్యుడి కుటుంబం.. మూడు రోజుల క్రితం బంజారాహిల్స్లో హోటల్లో దిగింది. చదవండి: అమ్మాయిలను రప్పించి.. లాడ్జీ రూంలో గుట్టుగా వ్యభిచారం.. ఆరో అంతస్తు మీద నుంచి లిఫ్ట్ గుంతలో నుంచి కింద పడిన పంకజ్ జైన్.. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తూ కింద పడి మృతి చెంది ఉంటారని ఆయన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విజృంభిస్తున్న విష జ్వరాలు.. డెంగీతో యువ డాక్టర్ మృతి
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు కలవరపెడుతున్నాయి. ఒకపక్క ప్రజలు జలుబు, దగ్గుతో బాధపడుతుండగా.. మరోవైపు విష జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటివి ప్రాణాలు తీస్తున్నాయి. ప్రబలుతున్న వ్యాధులపై సాక్షి ప్రత్యేక కథనం. – కుత్బుల్లాపూర్ ► కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో చెత్తా చెదారాలకు తోడు ఆయా ప్రాంతాల్లో పందులు, దోమల బెడద అధికంగా ఉంది. ► మలేరియా సిబ్బంది తూతూ మంత్రంగా కాలనీల్లో పర్యటిస్తూ పనులు చేస్తున్నా దోమలు విజృంభిస్తున్నాయి. ► దీంతో అనేకమంది డెంగీ జ్వరాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ► ఓ యువ డాక్టర్ ప్రస్తుతం డెంగీతో మరణించడంతో స్థానికంగా ఇప్పుడు కలకలం రేపుతోంది. ► నిజామాబాద్కు చెందిన అర్పిత రెడ్డి (32) జీడిమెట్ల డివిజన్ మీనాక్షి ఎస్టేట్స్లో ఉంటూ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తోంది. 5 రోజుల క్రితం త్రీవమైన జ్వరం రావడంతో నగరంలోని గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించగా డెంగీగా తేలింది. చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మృత్యువాత పడడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈమెకు ఒక కూతురు ఉంది. ఓ డాక్టర్ విధంగా డెంగీతో చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. పత్తాలేని వైద్యాధికారులు... చదవండి: ఆడ దోమలే ఎందుకు కుడతాయి.. వాళ్లను ప్రేమిస్తాయి! ► ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలం మురికివాడల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాల్సిన వైద్య ఆరోగ్య అధికారులు పత్తా లేకుండా పోవడంతో రోగాలు విజృంభిస్తున్నాయి. ఒకవైపు విషజ్వరాలు సోకి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు అధికం అవుతోంది. స్థానికంగా పారిశుద్ధ్యం విషయంలో జంట సర్కిల్ వైద్యాధికారులు తమ పరిధి కాదన్నట్లు వ్యవహరిస్తూ ఉండడంతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా గాజులరామారం సర్కిల్ పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ విభాగం పనితీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం ఫొటోలకే పరిమితం అన్నట్లుగా స్థానికంగా విధులు నిర్వహించే వైద్యాధికారి తీరుపై పలు మురికివాడ ప్రాంత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న డెంగీ కేసులు.. ► కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ కేసులు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో విష జ్వరాలు సోకడం వల్ల మరింత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు వాపోతున్నారు. మీనాక్షి ప్రాంతానికి చెందిన ఓ మహిళ సుచిత్ర సమీపంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఐసీయూలో చికిత్స పొందుతుండగా, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీకి చెందిన ఓ విద్యార్థిని ఇటీవల పేట్బషీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు సమీపంలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయట పడింది. -
పాపం.. కరోనా కాటుకు డాక్టర్ మృతి
మొరదాబాద్(యూపీ): కరోనా పోరాటంలో ముందుండి పోరాడుతున్న వైద్యులను కూడా మహమ్మారి బలి తీసుకుంటోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో ఓ వైద్యుడు కరోనా కాటుకు బలైయ్యారు. కోవిడ్-19 సోకిన వైద్యుడొకరు.. తీర్థంకర్ మహవీర్ యూరివర్సిటీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ప్రాణాలు కోల్పోయినట్టు మొరదాబాద్ ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎంసీ గార్గ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లో కరోనా వైరస్ కారణంగా వైద్యుడు మృతి చెందడం ఇదే మొదటిసారి. మొరదాబాద్ నుంచి తబ్లిగీ జమాత్ సమ్మేళనానికి హాజరైన వారిని గుర్తించడానికి నిర్వహించిన సర్వేలో సదరు డాక్టర్ కూడా పాల్గొన్నారు. ఏప్రిల్ 10న ఆయనకు కోవిడ్ సోకినట్టు గుర్తించారు. పరిస్ధితి విషమంగా మారడంతో తర్వాతి రోజు ఆయనను ఐసీయూకు తరలించారు. గత ఐదు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, చికిత్స కూడా ఆయన స్పందించలేదని వైద్యులు తెలిపారు. కాగా, కేంద్ర వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లో ఇప్పటివరకు 1176 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18 మంది మృత్యువాత పడ్డారు. కోవిడ్-19 సోకినప్పటికీ 129 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 17,656 కాగా, మృతుల సంఖ్య 559గా తేలింది. 2,842 మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర వైద్యారోగ్య తాజాగా వెల్లడించింది. మా నాన్న మరణ వార్త విని బాధపడ్డా.. అంత్యక్రియలకు వెళ్లను
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement