-
ఎంఐఎం ఎంట్రీతో ప్రధాన పార్టీల బెంబేలు
సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎంఐఎం రెండు సీట్లు గెలుచుకోవడంతో ఇప్పటివరకు ముస్లిం ఓట్లపై ఆధారపడిన వివిధ పార్టీలు ఇబ్బందుల్లో పడిపోయాయి. హైదరాబాద్కు చెందిన ఎంఐఎం పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 24 మంది అభ్యర్థులను బరిలో దింపింది. ఇందులో ఇద్దరు అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. మిగతా చోట్ల కూడా ఆ పార్టీ అభ్యర్థులు రెండు, మూడో స్థానంలో నిలి చారు. ఈ ఫలితాలవల్ల రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి మంచి పట్టు సంపాదించిందని స్పష్టమైంది. దీంతో ఇప్పటివరకు మైనార్టీల ఓట్లపై ఆధారపడుతున్న పార్టీలు ఖంగుతిన్నాయి. తమ పార్టీకి ఎవరు ఓటు వేసినా...వేయకపోయినా మైనార్టీల ఓట్లు మాత్రం తప్పకుండా వస్తాయనే ధీమాతో ఉన్న పార్టీలు వచ్చే ఎన్నికల నుంచి మైనారిటీ ఓట్లపై ఆశ వదులుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ముఖ్యంగా దీని ప్రభావం కాంగ్రెస్ పార్టీపై చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బైకలా, ఔరంగాబాద్ శాసన సభ నియోజక వర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు భారీగా ఓట్లు వేయడంతో రాష్ట్రంలో ఖాతా తెరిచారు. అలాగే ముంబాదేవి, తూర్పు బాంద్రా, కుర్లా, వర్సోవా, తూర్పు భివండీ, ముంబ్రా-కల్వా, ఉత్తర నాందేడ్, దక్షిణ నాందేడ్, షోలాపూర్ సిటీ తదితర నియోజక వర్గాలలో ఆ పార్టీ అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. దీని బట్టి చూస్తే వచ్చే ముంబై, ఠాణే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం ప్రభావం చూపే అవకాశముంది. -
రెండుచోట్ల రెండు రకాల పొత్తులు
సీపీఐ ఎన్నికల వ్యూహం తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్లతో పొత్తు సీమాంధ్రపై నేడు సమావేశం: నారాయణ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలోని రెండు ప్రాంతాలలో రెండు రకాల పొత్తులతో ముందుకు వెళతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. రెండు ప్రాంతాలలో ఒకే రకమైన ఎత్తుగడతో ఎన్నికలకు వెళ్లడం సాధ్యం కాదని రాష్ట్ర పార్టీ భావించినట్టు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు శనివారం సీపీఐ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి నాయకత్వంలో ఆ ప్రాంత ఎన్నికల కమిటీ సమావేశమైంది. అనంతరం నారాయణ ఇతర నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్తో కలిసి పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తాము అంటరాని పార్టీగా చూడడం లేదన్నారు. శుక్రవారం యూదృచ్ఛికంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ను కలిశానని, పొత్తుల అంశం చర్చకు రాగా సానుకూల వైఖరి వ్యక్తమైనట్టు చెప్పారు. సీపీఎంను కూడా తమతో కలుపుకొనిపోయే విధంగా చర్చిస్తున్నామన్నారు. కేసీఆర్తోనూ పొత్తుల అంశంపై ఫోనులో సంప్రదించినట్టు తెలిపారు. సీపీఐ, సీపీఎంల మధ్య మున్సిపల్, స్థానిక ఎన్నికలలో కలిసి పనిచేసే విషయంపైనే అవగాహన కుదిరిందని, రాష్ట్ర స్థాయి ఎన్నికల పొత్తుపై చర్చించేందుకు ఈ నెల 21న తాము మరోసారి భేటీ కానున్నట్టు చెప్పారు. సీమాంధ్రలో పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఆ ప్రాంత ఎన్నికల కమిటీ సభ్యులతో ఆదివారం విజయవాడలో సమావేశం కానున్నట్టు వివరించారు. 20 అసెంబ్లీ, 3 లోక్సభ సీట్ల గుర్తింపు తెలంగాణ ప్రాంతంలో పొత్తులపై చర్చ సందర్భంగా ఆయా పార్టీల వద్ద ఎలాంటి ప్రతిపాదనలు ఉంచాలన్న దానిపై శనివారం నాటి పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో నేతలు చర్చించారు. 20 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాలను ప్రతిపాదించి, సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని నిర్ణయించారు. గత ఎన్నికలలో పార్టీ పోటీ చేసిన తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు కనీసం ఒక్క లోక్సభ సీటుకైనా పార్టీ పోటీ చేసేలా ఆయా పార్టీలతో అవగాహనకు రావాలని నిర్ణయించారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, మాన కొండూరు, రామగుండం.. ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్.. నల్లగొండ జిల్లా మునుగోడు, దేవరకొండ.. ఖమ్మం జిల్లా వైరా, పినపాక, కొత్తగూడెంలతో పాటు వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి, మహబూబ్నగర్ జిల్లాలో రెండు, ఇతర అసెంబ్లీ స్థానాలను కలుపుకుని మొత్తం 20 అసెంబ్లీ సీట్లకు, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ సీట్లకు ఆయా పార్టీల ముందు ప్రతిపాదనలు ఉంచాలని సమావేశంలో నిర్ణయించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement