-
ముంబై పీఠంపై ప్రతిష్టంభన
► బీజేపీ–శివసేన దోస్తీయే ప్రత్యామ్నాయమన్న గడ్కరీ ► సామ్నాలో కమలంపై నిప్పులు చెరిగిన శివసేన ముంబై: బీఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవటంతో మేయర్ ఎవరనే దానిపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎక్కువ సీట్లు గెలుపొందిన శివసేన.. బీజేపీతో కలవబోమంటూ గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఎన్నికలు అయిపోయాక కూడా అధికార పత్రిక సామ్నాలో బీజేపీపై విమర్శలు గుప్పించింది. కాగా, బీజేపీ–శివసేన కలిసిరావటం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ‘రెండు పార్టీలకు ఒకరితో ఒకరు కలవటం తప్ప వేరే దారిలేదు. తుది నిర్ణయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కలసి తీసుకుంటారు’ అని గడ్కరీ తెలిపారు. అయితే, ఈ దోస్తీ కలకాలం ఉండాలని శివసేన కోరుకుంటే తన అధికార పత్రిక సామ్నాలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాలపై అవమానకరంగా రాస్తున్న వార్తలపై ఆలోచించాలని సూచించారు. కాగా, కాంగ్రెస్ మద్దతుతో శివసేన మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోనుందనే వార్తలను ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ ఖండించారు. కలవటం కష్టమే: శివసేన బీజేపీ స్నేహహస్తాన్ని అందిస్తున్నప్పటికీ.. వీరితో దోస్తీకి సుముఖంగాలేమని శివసేన తెలిపింది. బీజేపీతో తమ పోరు కొనసాగుతుందని.. మహారాష్ట్ర సమగ్రత కోసం యుద్ధం కొనసాగుతుందని.. అధికారం కోసం కాదని ‘సామ్నా’లో పేర్కొంది. ‘మేం (శివసేన) 25 ఏళ్లుగా బీఎంసీని ఏలుతున్నాం. వారు (బీజేపీ) కుయుక్తులతో మా పాలనను అస్థిరపరిచే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఉన్నపుడు కూడా ఇలా జరగలేదు’ అని సామ్నా వెల్లడించింది. శనివారం పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు, ఎన్నికైన కార్పొరేటర్లతో సమావేశమయ్యాక తదనంతర పరిస్థితులపై ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకోనున్నారు. అటు, ఈ అంశంపై చర్చించేందుకు రెండు మూడు రోజుల్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది. -
పాక్ నటులను తీసుకోం!
బాలీవుడ్ ప్రకటన ముంబై: ఇక నుంచి బాలీవుడ్ తెరక్కెకించబోయే ఏ చిత్రాల్లోను పాకిస్తాన్ నటులను తీసుకోబోమంటూ బాలీవుడ్ శనివారం సంచలన ప్రకటన చేసింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడితో బాలీవుడ్ ఈ నిర్ణయం తీసుకుంది. ముంబైలో శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నివాసంలో జరిగిన కీలక భేటీలో.. ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం విడుదలకు అంగీకారం కుదిరింది. ఉడీ దాడిపై బాలీవుడ్ నటులు అందరూ పాక్ చర్యలను ఖండించినా, బాలీవుడ్లో పనిచేస్తున్న పాక్ నటులు మాత్రం దాడిపై నోరు మెదపలేదు. దీంతో పాక్ న టులను బహిష్కరించాలని ఎంఎన్ఎస్ అంటోంది. ఎంఎన్ఎస్ డిమాండ్ల మేరకు ఈ చిత్రంలో నటించిన ఐశ్వర్యరాయ్, రణబీర్కపూర్, అనుష్కశర్మలు సైనిక సంక్షేమ నిధికి రూ. 5 కోట్లు విరాళంగా ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో పాకిస్తాన్కు చెందిన నటుడు ఫవద్ఖాన్ 4 నిమిషాల పాటు కనిపించనున్నారు. -
చేతులు విరిచి..గొంతు నులిమి..
-
చేతులు విరిచి..గొంతు నులిమి..
మహారాష్ట్రలో బాలికపై సామూహిక అత్యాచారం, హత్య ముంబై : మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఓ 15 ఏళ్ల బాలికను ముగ్గురు మృగాళ్లు సామూహిక అత్యాచారం చేసి, చేతులు విరిచి, ఆమె శరీరం మొత్తం గాయాలు చేసి గొంతు నులిమి చంపేశారు. సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు విషయం వెలుగుచూడటం తీవ్ర చర్చనీయాంశమైంది. హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పోలీసులు ప్రధాన నిందితుడు జితేంద్ర షిండే అలియాస్ ‘పప్పు’ను ఘటన జరిగిన మరుసటి రోజున, నేరంలో సహాయపడిన సంతోష్ భవ్, నితిన్ ధైల్యూమ్లను తర్వాత అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త బైక్ కొన్న జితేంద్ర షిండే జూలై 13న ఇద్దరు మిత్రులతో కలసి చెట్టుకింద మద్యం సేవిస్తున్నాడు. అదే సమయంలో బాలిక తన తాతను కలిసి తిరిగి వెళ్తోంది. ఆమెతో ముగ్గురు నిందితులు మాటలు కలిపారు. తర్వాత అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపారు. స్థానికులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మరణించింది. జితేంద్ర ఇటుకల బట్టీలో పనిచేసేవాడనీ, ఆమె వెంటపడి వేధించే వాడని తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ రూ.3 లక్షల చెక్కును ఎక్స్గ్రేషియాగా బాలిక కుటుంబానికి ఇచ్చారు. -
‘మహా’ ఒప్పందాల ప్రక్రియ వాయిదా!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి రష్యా పర్యటనలో ఉండటంతో ఆలస్యం సాక్షి, హైదరాబాద్ : గోదావరి, ప్రాణహిత, పెన్గంగ నదులపై నిర్మించే మూడు బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఈ నెల 15న జరగాల్సిన ఒప్పందాల ప్రక్రియ వాయిదా పడినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రష్యా పర్యటనలో ఉండటం, మరో మూడు, నాలుగు రోజులు ఆయన పర్యటన కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఒప్పందాల ప్రక్రియ వాయిదా పడినట్లుగా తెలిసింది. దీనిపై ఇప్పటికే మహారాష్ట్ర అధికారులు తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిజానికి ముంబైలోని సహ్యాద్రి గెస్ట్హౌస్ వేదికగా ఈ నెల 15న బ్యారేజీ నిర్మాణాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంది. దీనిపై గత నెల చివరి వారంలోనే ఒప్పందాల తేదీలను ఖరారు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సమాచారం పంపింది. తమ్మిడిహెట్టి, మేడిగడ్డ, ఛనాఖా-కొరట, మహారాష్ట్ర పింపర్డ్ వద్ద నిర్మించే బ్యారేజీలపై ఒప్పందాలు ఉంటాయని తెలిపింది. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ రష్యా పర్యటనలో ఉన్నందున ఈ నెల 15న ఒప్పందాల ప్రక్రియ ఉండదని, మరో తేదీని తర్వాత తెలియజేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులకు సమాచారం ఇచ్చారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement