-
కొందరికే లబ్ధి
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు చేసే రుణాల రీషెడ్యూల్ ప్రకటన అన్నదాతలకు ఊరటనిస్తుంది. కానీ హుద్హుద్ తుఫాన్ నేపథ్యంలో ప్రకటించిన రీషెడ్యూల్ వల్ల లబ్ది పొందే అవకాశం లేకపోవడంతో జిల్లాలోని మెజార్టీ రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో నాలుగులక్షలఎనిమిదివేలమంది రైతులున్నారు. ఖరీఫ్ సీజన్లో 3.79 లక్షల హెక్టార్లలో వరితో పాటు వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. 2.70లక్షల ఎకరాల్లో వరి, 75వేల ఎకరాల్లో చెరకు, అపరాలు పండిస్తుంటారు. ఈ ఏడాది ఖరీఫ్-రబీ సీజన్లకు కలిపి రైతులకు రూ.950కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయిస్తే ఇప్పటి వరకు అందించింది రూ.320 కోట్లు మాత్రమే. అది కూడా అతికష్టమ్మీద 50వేల లోపు రైతులకు మాత్రమే ఇవ్వగలిగారు. రుణమాఫీ వల్ల రూ.1040కోట్ల మేర రుణాలు మాఫీ అవుతాయని సుమారు 2.50లక్షల మంది రైతులు ఆశించారు. కానీ రు ణమాఫీ వల్ల మిగిలిన రైతులకు ఖరీఫ్ సీజన్లో రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముఖం చాటేశారు. దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, దళారీల వద్ద అం దినకాడికి రూ.10లు.. రూ.15లవడ్డీలకు అప్పులు చేసి మరీ సాగు చేసారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో హుదూద్ విరుచుకుపడింది. జిల్లాలో 882 గ్రామాల పరిధిలో 1,35,184 మంది రైతులు సాగు చేసిన 82,385.681 ఎకరాల్లో పంటలు 50 శాతానికి పైగా దెబ్బతిన్నాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో జిల్లాలోని 43 మండలాలను తుఫాన్ ప్రభావిత మండలాలుగా ప్రకటించి ఆయా మండలాల్లో రైతులు తీసుకున్న రుణాలన్నింటిని రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన హుదూద్ తుఫాన్ వల్ల పంటలు దెబ్బతిన్న లక్షా35వేల మంది రైతులకు రుణాల రీషెడ్యూల్ వర్తించాలి. కానీ ఆ పరిస్థితి లేదు. సాధారణంగా ఏప్రిల్ నుంచి జూలై వరకు ఖరీఫ్సీజన్లో రుణాలు ఇస్తుంటారు. ఈ ఏడాది సాగు ఆలశ్యమవడం..రుణ లక్ష్యాలు చేరుకోకపోవడంతో గడువును తొలుత ఆగస్టు, తర్వాత సెప్టెంబర్ వరకు పొడిగించారు. అయినా 40 శాతం రైతులకు మించి బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయలేకపోయారు. ఈ లెక్కన 50వేలలోపు రైతులు మాత్రమే ఖరీఫ్ రుణాలు పొందగలిగారు. సగం మందికి పైగా బ్యాంకులు రుణాలు మంజూరు చేయలేదు. దీంతో పంట పూర్తిగా నష్టపోయిన రైతుల్లో ఎంతతక్కువ లెక్కేసుకున్నా 80వేల మందికి రీషెడ్యూల్ ద్వారా లబ్ది పొందే అవకాశం లేకుండా పోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. ఒక పక్క పంటల బీమా సౌకర్యాన్ని కోల్పోయి..మరొక పక్క రీషెడ్యూల్ వల్ల కలిగే లబ్దిని కోల్పోవడంతో వీరి పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇంకొక పక్క పరిహారం ఇప్పుడు ఎంత వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. రీషెడ్యూల్ వల్ల లబ్దిపొందే అవకాశం లేకపోవడంతో మరింత అప్పుల ఊబిలో కూరకుపోవాల్సి వస్తుందంటూ రైతులు కలవరపడుతున్నారు. రుణమాఫీ విషయంలో సర్కార్ కాలయాపన చేయడం వలనే తమకీ దుస్థితి పట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ గద్దెనెక్కిన వెంటనే ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసి ఉంటే ఖరీఫ్లో తామంతా రుణాలు పొందేవారమని,,ఆమేరకు పంటల బీమా వర్తించడంతో పాటు ఇప్పుడు రీషెడ్యూల్ పరిధిలోకి వచ్చేవారమని అంటు న్నారు. రీషెడ్యూల్ పొందిన రైతులకు గత ఖరీఫ్ సీజన్లో వారు పొందిన రుణాలన్నీ 3 నుంచి ఐదేళ్ల కాలపరిమితిలో రీషెడ్యూల్ అవుతాయి. అంతేకాకుండా రబీ సాగు చేసే రైతులకు జనవరి నుంచి కొత్త రుణాలు మంజూరవుతాయి. రుణాల రీషెడ్యూల్కు సంబంధించి స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలపై చర్చించి.. జిల్లా పరిధిలో ఎన్ని కోట్ల మేర ఎంతమంది రైతులు రీషెడ్యూల్ వల్ల లబ్ది పొందుతారో గుర్తించేందుకు వచ్చే వారంలో డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేషన్ కమిటీ (బ్యాంకర్స్) సమావేశం నిర్వహించి తుది జాబితా ప్రకటించే అవకాశాలు న్నాయని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి. -
వామ్మో.. ఆగస్టు!
ఒంగోలు : ఆగస్టు నెల రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఇప్పటికే రుణమాఫీ, రుణాల రీషెడ్యూల్ వంటి అంశాలు సీఎం చంద్రబాబుకు తలబొప్పి కటిస్తున్నాయి. రైతుల ఆందోళనలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇవి చాలవన్నట్టు సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు ఒకటో తేదీన విద్యార్థులు రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమించేందుకు ఆ సంఘ నేతలు సమాయత్తమవుతున్నారు. మరో వైపు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెకు పిలుపునిచ్చారు. రెండో తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఇంకో వైపు ఆర్టీసీలో గుర్తింపు పొందిన కార్మిక సంఘం ఆందోళన బాట పట్టింది. ఎంప్లాయీస్ యూనియన్ ఈ నెల 2వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. ఇక మాటలు చాలు.. పనులు చేసి చూపండి.. అంటూ పాలకపక్షాన్ని కార్మిక, విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల్లో ఆగ్రహం జిల్లా వ్యాప్తంగా ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఐటీఐ వంటి కోర్సులు చదువుకున్న విద్యార్థులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన విద్యార్థులను ఫీజులు చెల్లించాలని కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇచ్చేదిలేదంటూ హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విద్యార్థి సంఘాలు శుక్రవారం బంద్ నిర్వహించనున్నాయి. కార్మికుల హెచ్చరిక మున్సిపల్ ఉద్యోగులతో పాటు వివిధ రంగాలకు చెందిన కార్మికులు కూడా ఆందోళనకు దిగుతున్నారు. సమస్యల పరిష్కారానికి సహకరించని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు పిడికిలి బిగిస్తున్నాయి. అందులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేయనున్నారు. వీరికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అండగా నిలవనుంది. ఆర్టీసీ బస్సులకు బ్రేకులు ఆర్టీసీలో గుర్తింపు పొందిన ఎంప్లాయీస్ యూనియన్ ఆగస్టు 2వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు సమాయత్తమవుతోంది. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏటా జూన్ వస్తుందంటే కార్మికులు సీసీఎస్ వైపు దృష్టిసారిస్తారు. సీసీఎస్కు సంబంధించి కార్మికులకు కొన్ని అభ్యంతరాలున్నాయి. యాజమాన్యంతో యూనియన్ నాయకులు చర్చలు జరిపినా ఉపయోగం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో జూలై 30వ తేదీ నుంచి యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీ రావులు ఆయా ప్రాంతాల్లో నిరవధిక దీక్షకు పూనుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement