-
అక్కడ ఖాతా తెరవని బీజేపీ.. అందుకే బరిలో ఆమె
చంఢీగర్ : హరియాణలోని దాద్రి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న తన చెల్లెలు బబితా ఫోగాట్ (29) విజయం తథ్యమని ఆమె సోదరి గీతా ఫోగాట్ ధీమా వ్యక్తం చేశారు. రెజ్లింగ్లో మాదిరిగానే రాజకీయాల్లోను బబితా సత్తా చాటుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, జాట్ల ప్రాబల్యం ఉన్న దాద్రి నియోజకవర్గకంలో బీజేపీ ఇప్పటి వరకు ఖాతా తెరవకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో ఈస్థానం నుంచి రాజ్దీప్ ఫోగాట్ (ఐఎన్ఎల్డీ) విజయం సాధించారు. అనంతరం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండటంతో బీజేపీ బబితాను బరిలో నిలిపింది. మోదీ ర్యాలీ కలిసొస్తుందా.. బబితతో పాటు దాద్రి స్థానానికి జేజేపీ నుంచి సత్పాల్ సంగ్వాన్, కాంగ్రెస్ నుంచి మేజర్ నిర్పేందర్ సంగ్వాన్, స్వతంత్ర అభ్యర్థిగా సోమ్వీర్ సంగ్వాన్ పోటీలో ఉన్నారు. ఇక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన బబితా ఎంతమేరకు ప్రత్యర్థులను ఢీకొడుతుందో చూడాలి. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించడం బీజేపీకి కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ‘నా చెల్లెల్ని ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. బబితా దేశానికి చేసిన సేవల పట్ల అందరికీ గౌరవం ఉంది. ఆమె రాజకీయాల్లో కూడా రాణిస్తుంది. అయితే, గెలుపోటములు ఎక్కడైనా సహజం. మేము క్రీడాకారులం. చమత్కారమైన లేక జాలి, సానుభూతితో కూడిన రాజకీయాలు చేతకావు’ అని గీతా చెప్పుకొచ్చారు. ఇక ఈ ఇద్దరు రెజ్లర్ సోదరీమణుల ఇతివృత్తంగా తెరకెక్కి దంగల్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. -
దాద్రి నిందితుడు జైలులో మృత్యువాత
-
దాద్రి నిందితుడు జైలులో మృత్యువాత
నోయిడా: దేశంలో సంచలనం సృష్టించిన దాద్రి ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒక యువకుడు చనిపోయాడు. ప్రస్తుతం జైలులోనే ఉన్న అతడు మృత్యువాత పడ్డాడు. డెంగ్యూ లేదా చికెన్ గునియావంటి వ్యాధుల కారణంగా అతడు చనిపోయి ఉండొచ్చని పోలీసులు చెబుతుండగా తమ కుమారుడిని పోలీసులే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని దాద్రిలో ఇంట్లో గోమాంసం ఉందని, గోహత్యకు పాల్పడ్డాడని మహ్మద్ అక్లాక్ అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి 15మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో బిసదా ప్రాంతానికి చెందిన రవీణ్ 22 ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడు. అతడిని గ్రేటర్ నోయిడాలోని లుక్సార్ జైలులో వేశారు. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ యువకుడు చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. పలు ఆస్పత్రులకు తిప్పినా అతడు కోలుకోలేదని అన్నారు. -
దాద్రీలో మళ్లీ ఉద్రిక్తత
నిషేధాజ్ఞలు విధించిన జిల్లా కలెక్టర్ గ్రేటర్ నోయిడా: ఉత్తరప్రదేశ్లోని దాద్రీలో 9 నెలల తరువాత మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గోవధకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహ్మద్ అఖ్లాక్ కుటంబంపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలనే డిమాండ్తో దాద్రీ తాలూకాలోని బిషాదా గ్రామస్తులు సోమవారం నిరసన సమావేశం నిర్వహించారు. గత ఏడాది సెప్టెంబర్ 28న మహ్మద్ అఖ్లాక్ కుటుంబంపై దాడి జరిగిన సమయంలో స్వాధీనం చేసుకున్నేది గోమాంసమేనని ఇటీవల ఫోరెన్సిక్ నివేదికలో బహిర్గతం కావడం తాజా డిమాండ్కు తెరతీసింది. అఖ్లాక్ కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు కోసం ఒత్తిడి పెంచడానికి తొలుత గ్రామస్తులు మహాపంచాయతీ నిర్వహించాలని అనుకున్నారు. అయితే పోలీసులు నిషేధాజ్ఞలు, గట్టి భద్రతా చర్యల కారణంగా ఆ ప్రయత్నం విరమించుకున్నారు. నిరసన కార్యక్రమానికి పలువురు స్థానిక శివసేన పార్టీ నాయకులు హాజరైనట్లు తెలిసింది. ఉద్రిక్తత నివారించడానికి గౌతం బుద్ధ్నగర్ జిల్లా మెజిస్ట్రేట్ ఎన్పీ సింగ్ సెక్షన్ 144 విధించారు. న లుగురు లేదా ఐదుగురికి మించి గుమిగూడకుండా నిషేధాజ్ఞలు జారీచేశారు. -
ఫోరెన్సిక్ నివేదికపై మండిపడ్డ అఖిలేష్
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని దాద్రి ఘటనలో మరణించిన అఖ్లాక్ ఇంట్లో దొరికింది ఆవు మాంసమేనని ఫ్లోరెన్సిక్ లెబొరేటరీ నివేదిక ఇవ్వడాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ తప్పు పట్టారు. నివేదిక ప్రామాణికతను ఆయన ప్రశ్నించారు. శాంపిల్లను ఎవరు పంపారు? దానిని ఎవరు తీసుకున్నారు? అఖ్లాక్ ఇంట్లో అభ్యతరకరమైనదేదీ దొరకలేదని యాదవ్ పేర్కొన్నారు. ఈ విషయం తర్వాత ఏం తినాలి, ఏం మాట్లాడాలి అనే అంశంపై ప్రపంచమంతా చర్చ జరిగిందని అన్నారు. వ్యక్తిగత విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోరాదని సీఎం తెలిపారు. దీనిపై విచారించిన ఉత్తరప్రదేశ్ వెటర్నరీ డిపార్ట్ మెంట్ అఖ్లాఖ్ ఇంట్లో ఉంది మేక మాంసమని నివేదిక ఇవ్వడంపై బీజేపీ ఎంపీ యోగి ఆదిత్య నాథ్ మండిపడ్డారు. అఖ్లాక్ కుటుంబంపై గోహత్య కింద కేసును నమోదు చేయాలని, ప్రభుత్వం అఖ్లాఖ్ కుటుంబానికి కల్పించిన సౌకర్యాలను వెనకకు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement