-
సైబర్ దబాయింపులు పెరుగుతున్నాయి
ఫోన్ రింగ్ అవుతూంటే మీ అబ్బాయి/అమ్మాయి ఆందోళనకు గురవుతున్నారా? సోషల్ మీడియా అకౌంట్లు అకస్మాత్తుగా డిలీట్ చేస్తున్నారా? స్కూల్ ఎగ్గొట్టేందుకు చిత్రవిచిత్రమైన సాకులు చెబుతున్నారా? ...అయితే వాళ్లు సైబర్ దబాయింపుల (సైబర్ బుల్లీయింగ్)కు గురవుతున్నట్లే లెక్క అంటోంది సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్. ఇంటర్నెట్ రంగంలో సైబర్ దబాయింపు ధోరణులు పెరిగిపోతున్నాయని, పిల్లలు ఆటస్థలంలోనే కాకుండా సైబర్ ప్రపంచంలోనూ దౌర్జన్యానికి బాధితులవుతు న్నారని తల్లిదండ్రులూ నమ్ముతున్నట్లు నార్టన్ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ద్వారా తెలిసింది. సంస్థ కంట్రీ మేనేజర్ ఈ అధ్యయన వివరాలను ‘‘2016: నార్టన్ సైబర్ సెక్యూరిటీ ఇన్సైట్స్ రిపోర్ట్’’రూపంలో విడుదల చేశారు. దాని ప్రకారం... దేశంలోని దాదాపు 40 శాతం మంది తల్లిదండ్రులు పదకొండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకూ ఇంటర్నెట్ను అందుబాటులోకి తెస్తున్నారని తేలింది. అదేసమయంలో సగం కంటే ఎక్కువమందిలో సైబర్ ప్రపంచం కారణంగా తమ పిల్లలు దబాయింపులకు గురవుతున్నారన్న ఆందోళన కూడా వ్యక్తమైంది. దీంతోపాటు వైరస్, దురుద్దేశపూరిత సాఫ్ట్వేర్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశాలపై 71 శాతం మంది ఆందోళన వ్యక్తం చేస్తే.. వ్యక్తిగత సమాచారం అపరిచితులకు అందిస్తారన్న ఆందోళన 69 శాతం మంది వ్యక్తం చేశారు. పిల్లల ఆన్లైన్ చర్యల వల్ల కుటుంబం మొత్తం ఇబ్బందులకు గురికావాల్సి రావచ్చునని 62 శాతం మంది భావిస్తే.. హ్యాకింగ్ వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవచ్చునని 61 శాతం మంది అంచనా వేస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు భారతీయ తల్లిదండ్రులు కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారని నార్టన్ ఇన్సైట్స్ రిపోర్ట్ తెలిపింది. తరచూ పిల్లలు ఉపయోగించిన బ్రౌజర్ హిస్టరీని వెతకడం వీటిల్లో ఒకటి. దాదాపు సగం మంది కేవలం తమ సమక్షంలో మాత్రమే ఇంటర్నెట్ వాడేలా, లేదంటే కొన్ని ఆంక్షలతో వాడటానికి అనుమతి ఇస్తున్నారని పేర్కొంది. సైబర్ దబాయింపులను నివారించేందుకు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నార్టన్ సూచిస్తోంది. సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సైబర్ బుల్లీయింగ్కు ‘రీ థింక్’తో చెక్
సైబర్ ప్రపంచంలో కూడా అమ్మాయిలను వేధించే, బెదిరించే యువకులు పెరిగిపోయారు. అలాగే వాళ్ల బెదిరింపులకు బెంబేలెత్తిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న అమ్మాయిల సంఖ్య కూడా పెరిగిపోతోంది. సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ సమస్య పరిష్కారానికి త్రిషా ప్రభు అనే 15 ఏళ్ల అమ్మాయి ఓ చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నది. ఆన్లైన్లో బెదిరింపులను, అసభ్య, అభ్యంతరకర పదజాలాన్ని ఫిల్టర్ చేసే ‘రీ థింక్’ (మరోసారి ఆలోచించండి) అనే యాప్ను రూపొందించింది. ఈ యాప్ను ఉపయోగిస్తే ‘టైప్ చేసిన మెసేజ్ లేదా మ్యాటర్’లో ఉన్న అభ్యంతరకర పదాలను గుర్తిస్తుంది. వెంటనే ‘రీ థింక్’ అనే మెసేజ్ను పంపిస్తుంది. ఈ యాప్ అభ్యంతరకర మెసేజ్ ఇచ్చేవారికి, అలాంటి మెసేజ్ల బాధితులకూ ఉపయోగపడుతోందని త్రిష చెబుతోంది. కీ బోర్డు కలిగిన అన్ని సాఫ్ట్వేర్ ప్లాట్ఫారాలపైనా, టెక్స్ట్ మెసేజ్ సహా అన్ని సామాజిక వెబ్సైట్లలో ఈ యాప్ పనిచేస్తోందని త్రిష తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్కు రెండేళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. త్రిషకు 13 ఏళ్లున్నప్పుడు, సైబర్ బెదిరింపులకు భయపడి 11 ఏళ్ల అమ్మాయి ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న కథనం చదివింది. త్రిషకు కూడా అనేక సైబర్ బెదిరింపులు వచ్చాయట. ఆమె మానసికంగా బలమైన అమ్మాయి కావడంతో అలాంటి బెదిరింపులను లెక్కచేయలేదు. బెదిరింపులకు భయపడి తనతోటి అమ్మాయిలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో అధ్యయనం చేయాలని అప్పుడే త్రిష ఓ నిర్ణయానికి వచ్చింది. టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిల మానసిక స్థితి ఎలా ఉంటుంది? వాళ్ల మెదళ్లు ఎలా పనిచేస్తాయి ? అన్న అంశంపై అనేక పుస్తకాలను అధ్యయనం చేసింది. టీనేజ్ దశ బ్రేకుల్లేకుండా దూసుకుపోయే కారు లాంటిదని అర్థం చేసుకుంది. వాటికే బ్రేకులేస్తే...అన్న ఆలోచన కలిగింది త్రిషకు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలకు బ్రేకులుంటే ఫలితం ఉంటుందని భావించింది. ఆ ఆలోచనలో నుంచే పుట్టుకొచ్చింది ‘రీ థింక్’ యాప్. 1500 యూజర్లపై ప్రయోగించి చూసింది. 93 శాతం ఫలితం వచ్చింది. ఈ యాప్ను రూపొందించిన త్రిషను 2014లో జరిగిన గూగుల్ సైన్స్ ఫేర్లో గూగుల్ సత్కరించింది. ఆ సందర్భంగా వచ్చిన డబ్బులను ఉపయోగించి యాప్ను మరింత అభివృద్ధి చేసింది త్రిష. త్వరలోనే ‘ఐట్యూన్స్’ ద్వారా కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకునేందుకు కృషి చేస్తున్నానని ప్రస్తుతం అమెరికాలోని నాపర్విల్లీలో చదువుకుంటున్న ఆమె తెలిపింది. మన చుట్టూ ఉన్న సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కరించేందుకు డాక్టర్లు, ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తలు కానవసరం లేదని, చిత్తశుద్ధి ఉంటే తనలాగా ఎవరైనా పరిష్కరించవచ్చని ఆమె చెబుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement