-
శాంతి స్వరూప్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: దూరదర్శన్ మొదటి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, పరిమిత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజుల నుండి శాంతి స్వరూప్ మార్గదర్శక ప్రయత్నం చాలా మంది వార్తా ప్రసారకులకు స్పూర్తినిచ్చిందని సీఎం జగన్ అన్నారు. ఈ సందర్భంగా శాంతి స్వరూప్ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఇది కూడా చదవండి: దూరదర్శన్ శాంతి స్వరూప్ కన్నుమూత -
న్యూజెర్సీలో తెలంగాణ ఉద్యమ నేత కడియం రాజుకు ఘనంగా నివాళులు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ డాక్టర్ కడియం రాజు గారి శ్రద్ధాంజలి సభ అమెరికాలో న్యూజెర్సీ రాష్ట్రంలో ఏబీవీపీ పూర్వ కార్యకర్తల మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ శ్రద్ధాంజలి కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు, ఏబీవీపీ పూర్వ విద్యార్థులు విలాస్ జంబుల, అమర్ జునూతుల, సంతోష్ మైకా, రాజేష్ రెడ్డి, సమరసింహా రెడ్డి బొక్క, కిరణ్, మధుసుధన్ రెడ్డి, ప్రదీప్ కట్ట, సుధీర్ గుత్తికొండ , సురేష్ సోమిశెట్టి, ప్రీతం , ప్రేమ్ కాట్రగడ్డ, పూర్వ కార్యకర్తలు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, స్వర్గీయ డా కడియం రాజన్న ఆత్మీయ మిత్రులు పెద్ద ఎత్తున హాజరై కడియం రాజన్న గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. బండి సంజయ్ కూడా గతంలో అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పని చేశారు. ఉస్మానియా పూర్వ విద్యార్థి, అఖిల భారతీయ విద్యార్థి ఫెడరేషన్ నాయకుడు ,తన ఉద్యమాల ద్వారా ఎందరికో ఆదర్శంగా నిలిచిన జాతీయ స్థాయి లీడర్, కడియం రాజు మాకు (విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ తుమ్మల ) సహచరుడు కావడం మా పూర్వ జన్మ సుకృతం. విలాస్ రెడ్డి జంబుల అనే వ్యక్తి ఈ రోజు అమెరికాలో ఉన్నత స్థాయిలో ఉన్నాడు అంటే దానికి కారణం మనం అందరం ముద్దుగా పిలుచుకునే ఉస్మానియా దిక్సూచి కడియం రాజు అని సగర్వంగా చెబుతాను. ఒక సిద్ధాంతం కోసం , తనని నమ్ముకున్న వారి కోసం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టైనా పోరాడే యోధుడితో కలిసి చదివే అవకాశం వచ్చినందుకు, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. దేశ భక్తి , సేవాభావం ,ఉద్యమస్ఫూర్తి ,నాయకత్వ లక్షణాలు, పోరాడేతత్వం ఇవన్నీ కలగలిపిన ఆదర్శ వ్యక్తి కడియం రాజు. అసలు ఎవరు ఈ "రారాజు", అయన గురించి, ప్రజలను చైతన్య పరిచిన అయన విధానాలు గురించి, ఒక్క మాటలో చెప్పాలంటే అయన ప్రయాణం గురించి మా మాటల్లో.....,కాదు కాదు ,మాలాగా అభిమానించే ఎంతోమంది కోసం ఆయన ప్రయాణం గురించి వారి మాటల్లో దేశాన్ని ప్రేమించే జాతీయ భావాలు కలిగిన విద్యార్థి.. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన ఉద్యమ నేత.. సమాజాన్ని ప్రేమించే నవతరం నాయకుడు.. ఎంతో భవిష్యత్ ఉన్న ఆ డైనమిక్ లీడర్ను విధి కాటేసింది.. సమాజం చిన్నబోయేలా ఒక నాయకుడిని కోల్పోయింది.. ప్రజల కోసం ఆయన చేసిన ఉద్యమాలను ఆయన ఆదర్శ వ్యక్తిత్వం గుర్తు తెచ్చుకుని తల్లడిల్లుతున్నారు ఎంతో మంది.. ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ చరిత్రలో 108 రోజుల జైలు జీవితం గడిపి, అన్న, బాబాయ్, మామగా విద్యార్థులచే ముద్దుగా పిలుచుకునే ఉస్మానియా యూనివర్సిటీ దిక్సూచి డాక్టర్ కడియం రాజు ఇటీవల మార్చి 20న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన నల్లగొండ జిల్లాలోని కొత్తగూడెం గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. తన పాఠశాల విద్య కొండ్రపోల్ గ్రామంలో, ఇంటర్ నాగార్జున జూనియర్ కళాశాల, మిర్యాలగూడ కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో బీఏ డిగ్రీ పూర్తిచేశారు. పేదరికం వెక్కిరిస్తున్నా ఆ తర్వాత ఎంఏ హిస్టరీ విభాగంలో ఎంఫిల్, పీహెచ్డీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేశారు. ఆయనకు ఇంటర్ నుంచే దేశభక్తి, జాతీయ భావాలు కలిగిన విద్యార్థిగా ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ డిగ్రీలో కళాశాల ఎబీవీపీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2002 సంవత్సరం నుండి ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ సైద్ధాంతిక పోరులో ముందుండి క్రియాశీలకంగా పనిచేశారు. ఏబీవీపీ చేపట్టిన ఎన్నో విద్యారంగ సమస్యలపై ముందుండి పోరాడి, ఎన్నో లాఠీ దెబ్బలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి 108 రోజులు జైలు పాలయ్యారు. కుట్రలను, అవినీతిని సహించని వ్యక్తిత్వం ఆయనది. ఏబీవీపీ చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ భూముల పరిరక్షణ ఉద్యమంలో ముందుండి, అనేక ఆక్రమణ భూముల విషయంలో కోర్టులలో కేసులు వేశారు, నిరుద్యోగం, విద్యారంగ సమస్యలు మెస్ బిల్లులు, స్కాలర్షిప్పులు, మౌలిక వసతులు, నూతన హాస్టళ్ల నిర్మాణం కోసం పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఏబీవీపీలో డాక్టర్ కడియం రాజు తన సుదీర్ఘ ప్రయాణంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంచార్జ్గా, సిటీ సెక్రెటరీగా, స్టేట్ సెక్రెటరీగా, నేషనల్ సెక్రెటరీగా, సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా అనేక విద్యార్థి ఉద్యమాలకు నేతృత్వం వహించారు. అలాగే జాతీయ ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల విద్యా నియంత్రణ కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో సైతం ఏబీవీపీ చేపట్టిన అనేక ఉద్యమాలను ముందుండి నడిపించారు. ఏబీవీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన లక్ష మందితో ‘తెలంగాణ రణభేరి’లో సుష్మాస్వరాజ్ ఆహ్వానించిన సభకు సభాధ్యక్షత వహించారు. అలాగే ఏబీవీపీ తెలంగాణ సాధనకై మహా పాదయాత్రలో కోదాడ నుండి హైదరాబాద్ వరకు నేతృత్వం వహించారు. నా రక్తం- నా తెలంగాణ, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరాహార దీక్షలు... ఇలా తెలంగాణ సాధనలో అనేక ఉద్యమాలలో క్రియాశీలకంగా పోరాడారు. జాతీయ భావాలు కలిగిన దేశభక్తుడిగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన డాక్టర్ కడియం రాజు మరణం విద్యార్థి లోకానికి, దేశానికి తీరని లోటు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల కోసం ఆయన చేసిన ఉద్యమాలను ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం, మరెంతో మందికి స్పూర్తి. (చదవండి: అమెరికాలో తెలుగు భాషకున్న స్థానం అంత ఇంత కాదు!: డా ప్రసాద్ తోటకూర) -
గద్దర్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: తెలంగాణలో ఉద్యమ గళం, ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో గద్దర్ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్..‘బడుగు, బలహీనవర్గా విప్లవ స్పూర్తి గద్దర్. ఆయన పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణ పాటే. గద్దర్ నిరంతరం సామాజిక న్యాయం కోసమే బ్రతికారు. గద్దర్ మరణం ఊహించలేనిది. సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయి. గద్దర్కు తెలుగు జాతి సెల్యూట్ చేస్తోంది. గద్దర్ కుటుంబ సభ్యులకు మనమంతా బాసటగా ఉందాం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత.. ఆయన ప్రస్తానం ఇదే.. -
షింజో అబే మృతి.. అమెరికా అధ్యక్షుడి ప్రగాఢ సంతాపం, భావోద్వేగ నోట్
వాషింగ్టన్: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. వేదికపై ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులకు జరపడంతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఈ క్రమంలో జపాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి అబేకు సంతాపం తెలిపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ విషాద సంఘటనపై తన సానుభూతిని వ్యక్తం చేస్తూ.. జపాన్ అంబాసిడర్ కోజి టొమితాకు భావోద్వేగ నోట్ను అందజేశారు. షింజో అబే అంటే శాంతి, తీర్పు అంటూ అందులో రాసుకొచ్చారు బైడెన్. 'షింజో అబే కుటుంబం, జపాన్ ప్రజలకు బైడన్ కుటుంబం, అమెరికా ప్రజల తరుపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. గతంలో ఉపాధ్యక్షుడి నివాసంలో ఆథిత్యమిచ్చినప్పుడు, జపాన్ పర్యటనలో ఆయనను కలుసుకోవటం నాకు గర్వకారణం. షింజో మరణం ఆయన భార్య, కుటుంబం, జపాన్ ప్రజలకు మాత్రమే లోటు కాదు.. యావత్ ప్రపంచానికి తీరని లోటు. శాంతి, సామరస్యానికి అబే ప్రతిరూపం.' అని పేర్కొన్నారు జో బైడెన్. అంతకు ముందు.. దుండగుడి కాల్పుల్లో షింజో అబే మరణించారన్న వార్త తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అధ్యక్షుడు బైడెన్. ఇది జపాన్ తోపాటు ఆయన గురించి తెలిసిన వారందరికీ ఓ విషాద సంఘటన అని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత ఇండోపసిఫిక్ కోసం ఆయన విజన్ కొనసాగుతుందన్నారు. ఆయన జీవితాన్ని జపాన్ ప్రజలకు సేవ చేసేందుకే అంకితం చేశారని గుర్తు చేసుకున్నారు. -
పాటలు పాడడానికే పుట్టాడు.. 'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'
‘ఎద లోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్ర లేస్తున్నాయి’... ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’లో ఇంత మధురంగా పాడిన కృష్ణకుమార్ కున్నత్ (కెకె) 53 ఏళ్ల వయసులో తన అభిమానులను దిగ్భ్రమ పరిచి ఇక పై తన పాటల్నే జ్ఞాపకాలుగా చేసుకోమన్నాడు. పాట పాడటానికి పుట్టిన కెకె కోల్కతాలో మంగళవారం రాత్రి పాడుతూనే తుదిశ్వాస విడిచాడు. సుందరమైన స్వరం గల ఆ గాయకుడికి నివాళి. కృష్ణకుమార్ కున్నత్ అను కెకె మామూలుగా బయట కనపడడు. ఇంటర్వ్యూలు ఇవ్వడు. సినిమా ఫంక్షన్స్లో పాల్గొనడు. అందుకని అతని పాట చెప్తే తప్ప అతణ్ణి నేరుగా గుర్తు పట్టేవారు తక్కువ. ‘ప్రేమదేశం’ లో ‘క..క..క... కాలేజీ స్టైలే’ పాడింది కేకేనే. ‘హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే’ పాడి కుర్రకారు హార్ట్ మిస్సయ్యేలా చేసింది అతడే. తెలుగులో ఒక కాలంలో కెకె ఎన్నో హిట్స్ పాడాడు. ఖుషీలో ‘ఏ మేరా జహా... ఏ మేరి ఆషియా’ పెద్ద హిట్టు. వెంకటేష్ ‘వాసు’లో ‘పాటకు ప్రాణం పల్లవి అయితే’ నేటికీ వింటున్నారు. ‘ఘర్షణ’లో ‘చెలియ.. చెలియా’ కూడా. కెకె మాతృభాష మలయాళం. కాని పుట్టి పెరిగిందంతా ఢిల్లీలో. సంగీతం శాస్త్రీయంగా నేర్చుకో లేదు. అమ్మమ్మ దగ్గర తప్ప. కాని బాగా పాడేవాడు. బ్యాండ్స్లో పని చేయాలని ఉండేది. చదువు పూర్తి కాగానే 1991లో జ్యోతికృష్ణను వివాహం చేసుకున్నాడు. ఢిల్లీలో మొదట అతను జింగిల్స్ పాడేవాడు. అలాగే హోటల్స్లో బ్యాండ్స్లో పెర్ఫార్మ్ చేసేవాడు. ఆ సమయంలోనే ఢిల్లీకి వచ్చిన హరిహరన్ అతడు పాడుతున్న హోటల్లో అతడి పాట విని ‘ఇక్కడేం చేస్తున్నావ్. నువ్వు ఉండాల్సింది ముంబైలో’ అని చెప్పాడు. అయినా కూడా కెకెకు సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. పాప్ సింగర్గానే ఉండాలని, ఆల్బమ్ రిలీజ్ చేయాలని ఉండేది. కాని భార్య అతణ్ణి ప్రోత్సహించింది. ఢిల్లీలో ఎంతకాలం ఉన్నా ఇంతే.. మనం ముంబై వెళ్దాం అంటే 1994లో ముంబైకి వచ్చాడు. అప్పటికే అతనికి విశాల్–శేఖర్ ద్వయంలోని విశాల్తో పరిచయం ఉంది. విశాల్ ‘మేచిస్’కు సంగీతం ఇస్తూ అందులో పెద్ద హిట్ అయిన ‘ఛోడ్ ఆయే హమ్ ఓ గలియా’ పాటలో ఒకటి రెండు లైన్లు ఇచ్చాడు. ఆ పాట హిట్ అయ్యింది. ఆ తర్వాత జింగిల్స్ పాడటం మొదలు పెట్టి జింగిల్స్ సింగర్గా చాలా బిజీ అయ్యాడు. 1994 నుంచి 1998 వరకూ నాలుగేళ్లలో 11 భాషల్లో 3,500 జింగిల్స్ పాడాటంటే అది అతని గొంతు మహిమ. ఏఆర్. రహెమాన్ కూడా జింగిల్స్ చేసేవాడు కాబట్టి వెంటనే కెకెను పాటల్లోకి తెచ్చాడు. ‘ప్రేమదేశం’, ‘మెరుపుకలలు’ (తమిళం) సినిమాల్లో పాడించాడు. 1999లో ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమాలో ‘తడప్ తడప్ కే’... పాట సూపర్డూపర్ హిట్ అయ్యింది. సల్మాన్ఖాన్కు పాడటంతో కెకెకు ఇక తిరుగు లేకుండాపోయింది. 1999లోనే సోనీ అతనితో ‘పల్’ అనే ఆల్బన్ తెచ్చింది. ఆ ఆల్బమ్ కూడా హిట్. కెకె మొత్తం పది భారతీయ భాషల్లో 700 పాటలు పాడాడు. వందల సంగీత ప్రదర్శనలు చేశాడు. అతడు అయితే స్టూడియోలో ఉంటాడు. లేదంటే ఇంట్లో. ఎక్కడా తిరగడానికి ఇష్టపడడు. కొడుకు నకుల్ కృష్ణ, కూతురు తామ్రకృష్ణ అతడి లోకం తెలుగులో చిరంజీవికి ‘దాయి దాయి దామ్మా’, తరుణ్కు ‘అయామ్ వెరీ సారీ’, పవన్ కల్యాణ్కు ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్’, అల్లు అర్జున్కు ‘ఫీల్ మై లవ్’– ‘ఉప్పెనంత ఈ ప్రేమకు’, మహేశ్ బాబుకు ‘అవును నిజం’... ఎన్నో హిట్స్ కెకె ఖాతాలో ఉన్నాయి. సెవన్బైజి బృందావన్ కాలనీలో పాడిన ‘తలచి తలచి చూస్తే’ పాటకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఇక ‘గుర్తుకొస్తున్నాయి’ పాటకు కూడా. ఒక మంచి గాయకుడు దూరమయ్యాడు. పాడుతూ పాడుతూ నేలకొరిగిపోయాడు. అతని గొంతు మాత్రమే గడ్డ కట్టింది. పాడిన పల్లవి చరణాలు ప్రవహిస్తూనే ఉంటాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Viral Video: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్పై ప్రిన్సిపాల్ దాడి
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement