-
నిరుద్యోగులకు బస్పాస్లో 20 శాతం రాయితీ
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు బస్ పాస్ల్లో ఆర్టీసీ రాయితీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో మూడు నెలల పాస్లపై 20 శాతం చొప్పున రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మూడు నెలల (క్వార్టర్లీ) ఆర్డినరీ బస్పాస్ రూ.3,450 ఉండగా.. 20 శాతం రాయితీ రూ.2800కు పాస్లు ఇస్తారు. మెట్రో మూడు నెలల పాస్ (క్వార్టర్లీ) ప్రస్తుతం రూ.3900. 20 శాతం డిస్కౌంట్ అనంతరం రూ.3120. రౌండెడ్ ఆఫ్తో రూ.3200కు పాస్లను పొందవచ్చు. పాస్ల కోసం తీసుకొనే గుర్తింపు కార్డుకు రూ.30 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ తాత్కాలిక బస్షెల్టర్లు రహదారుల విస్తరణ కారణంగా తొలగించిన బస్షెల్టర్ల స్థానంలో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసింది. తొలగించిన బస్షెల్టర్లను జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు పునర్నిర్మించకపోవడంతో ప్రయాణికులు మండుటెండల్లో పడిగాపులు కాస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సదుపాయం కోసం 24 బస్టాపుల్లో తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి తెలిపారు. భరత్నగర్ (ఎర్రగడ్డ వైపు), ప్రగతినగర్, ఎల్లంపేట్ క్రాస్రోడ్, ఆర్సీపురం, ఉప్పల్ (రేణుక వైన్స్), యాప్రాల్, కాచిగూడ క్రాస్రోడ్స్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, కొత్తగూడ ఎక్స్రోడ్స్, జియాగూడ గాంధీ విగ్రహం, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, అడిక్మెట్, నారాయణగూడ (హిమాయత్నగర్ వైపు), బర్కత్పురా పీఎఫ్ ఆఫీస్, అఫ్జల్గంజ్, జిల్లెలగూడ, జైపురికాలనీ, మన్నెగూడ, ఎల్బీనగర్, ఉప్పల్ క్రాస్రోడ్స్, ఉప్పల్ డిపో తదితర ప్రాంతాల్లో టెంట్లు వేసి తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: పుట్టగానే ఆధార్!) -
ఫలితమివ్వని ‘స్టడీ’
సాక్షి, ఆదిలాబాద్: పైకి పటారం.. లోన లొటారం అన్నట్టుంది స్టడీ సర్కిళ్ల వ్యవహారం. వీటికి లక్షలు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం అంతంతే ఉంటోంది. ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు ఈ స్టడీ సర్కిళ్ల – పనితీరుకు అద్దం పడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఇందుకోసం ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో నిరుద్యోగులకు వీటి ద్వారా శిక్షణ ఇచ్చారు. కాని ఫలితాలను చూసి విస్తు పోవాల్సి వచ్చింది. వందలాది మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తే.. 19 శాతం మాత్రమే ఖాకీ కొలువులు సాధించారంటే వీటి పనితీరు ఎలా అర్థమవుతోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు రాగానే హంగామ సృష్టించే స్టడీ సర్కిళ్లు, శిక్షణ కేంద్రాలు ఫలితాల్లో డాబు చూపలేకపోతున్నాయి. వైఫల్యం ఎక్కడ ఉందో మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే నిరుద్యోగ యువత నష్టపోవాల్సి వస్తోంది. లక్షల రూపాయల ఖర్చు స్టడీ సర్కిళ్లకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చిస్తోంది. 2017–18 సంవత్సరంలో బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణం కోసం రూ.3.75 కోట్లు విడుదలయ్యాయి. బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఈ నిధులు ఖర్చుచేశారు. అయితే ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా బీసీ నిరుద్యోగులకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. మరి లోపం ఎక్కడ జరుగుతుందా? అనేది అవగతం కాని ప్రశ్న. నిరుద్యోగ అభ్యర్థుల పరంగా మెరిట్ ఆధారంగానే ఎంపిక జరుగుతుందా.. శిక్షణ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఫ్యాకల్టీ నియామకంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తున్నారు. అసలు విషయ నిపుణులైన వారిని నియమిస్తున్నారా.. లేదంటే ఇందులో ఏమైన లోపాయికారికంగా వ్యవహారాలు సాగుతున్నాయా? అనే అనుమానాలు లేకపోలేదు. ఎస్సీ స్టడీ సర్కిల్ అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ సర్కిల్లోనూ ఫలితాలు తక్కువగా రావడం వెనక ఎలాంటి కారణాలు ఉన్నాయనే విశ్లేషణ సంక్షేమ శాఖ చేపడుతుందా.. లేదా అన్నది ప్రశ్నార్థకం. జిల్లా అధికారులు వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేదంటే మున్ముందు ఎలాంటి నోటిఫికేషన్లు పడ్డా నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోవాల్సిందే. ఇక ఎస్సీ, బీసీ అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లలో శిక్షణ ఇవ్వగా, గిరిజన అభ్యర్థులకు పోలీసు శాఖ పరంగా ఐటీడీఏ నుంచి పోలీసు శిక్షణ కేంద్రం (డీటీసీ)లో ట్రైనింగ్ ఇచ్చారు. అయితే ఇందులోనూ జిల్లా పరంగా ఫలితాలు నామమాత్రంగానే వచ్చినట్లు సమాచారం. శిక్షణ అవతారం.. జిల్లా యువజన, క్రీడల శాఖ తీరు మరోరకం. ఈ శాఖ అసలు లక్ష్యం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి యూనిట్ల స్థాపన కోసం బ్యాంక్ లింకేజీతో ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించేందుకు దోహదపడాలి. తద్వారా యువత స్వయం ఉపాధి పొందగలుగుతారు. అదేవిధంగా యువజన సంఘాలను ఏర్పాటు చేసి వివిధ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. అంతేకాకుండా క్రీడలకు సంబంధించి వ్యవహారాలను పర్యవేక్షించాలి. వీటన్నింటిని కాదని కొత్త బాధ్యతలను నెత్తిన వేసుకుంది. అలా అని ఉన్నవాటిని సమర్థవంతంగా మోస్తుందనుకుంటే పొరపాటే. అసలు లక్ష్యాలు సాధించలేకపోగా, లేని లక్ష్యం కోసం వెంపర్లాడుతున్నట్టు కనబడుతోంది ఈ శాఖ తీరు. అవగాహన లేనిదాంట్లో వేలు పెట్టి సాధించిది ఏమీ లేదు. లక్షల రూపాయలు మాత్రం వృథా చేస్తోంది. స్టడీ సర్కిళ్ల కంటే ఇందులోనే నిరుద్యోగ అభ్యర్థుల కోసం అధికంగా వెచ్చించడం గమనార్హం. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ యువజన, క్రీడల శాఖ ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను తీసుకోలేదని స్వయంగా ఆ శాఖాధికారులే చెబుతున్నారు. అలాంటప్పుడు వీటిని భుజాన వేసుకోవడంలో ఏదో ఆంతర్యం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ పేరిట భోజన, స్టడీ మెటీరియల్, ఫ్యాకల్టీ నియామకాల పరంగా ఓ అధికారి కమీషన్ వ్యవహారంతోనే దీంట్లో ఆసక్తి కనబర్చుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. పోటీ ఏది? ఉద్యోగ నియామకాలు అంటేనే పోటీ పరీక్ష.. ఒక్క పోస్టు కోసం వందలాది మంది ప్రయత్నం చేస్తారు. అలాంటి దాంట్లో ప్రతిభ చూపేందుకు పలువురు శిక్షణ సంస్థలకు వెళ్తారు. అయితే శిక్షణ సంస్థల్లో వ్యవహారాలు ఈ విధంగా ఉంటే నిరుద్యోగుల ఆశలు మాత్రం అడియాసలవుతున్నాయి. ప్రభుత్వ కొలువులకు సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే చాలూ స్టడీ సర్కిళ్లు, ఇతర శిక్షణ సంస్థలు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కాజేసేందుకే వ్యవహారాలు సాగిస్తున్నారే తప్పించి నిరుద్యోగులకు మేలు చేయాలన్న తపన ఎక్కడా కనిపించడం లేదు. మండలాలు, దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి శిక్షణ పొందే నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వమే వసతి కల్పిస్తుంది. ఇక భోజన సదుపాయం, స్టడీ మెటీరియల్ కొనుగోలు, ఫ్యాకల్టీ నియామకం, స్నాక్స్, టీ, తదితర ఖర్చులకు సంబంధించి బిల్లులు పెట్టి ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్నారు. దీంట్లో కమీషన్ కోసమే తాపత్రాయపడే అధికారులు అసలు లక్ష్యాన్ని నీరుగార్చుతున్నారు. మరోపక్క శిక్షణ పొందిన అభ్యర్థుల సంఖ్యను హెచ్చుగా చూపడం ద్వారా కూడా తమ స్వార్థ ప్రయోజనాలతో కొంతమంది అధికారులు తమ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. -
‘సాక్షి’ ఆధ్వర్యంలో పోటీపరీక్షలపై అవగాహన
హైదరాబాద్: ‘సాక్షి’, వనితా సివిల్స్ అకాడమీ ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని వనితా కళాశాలలో ఆదివారం ఉదయం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ హాజరై మాట్లాడారు. సివిల్స్, గ్రూప్ పరీక్షలకు హాజరయ్యే వంద మందికి పైగా అభ్యర్థులు సదస్సులో పాల్గొన్నారు. ఆ అభ్యర్థులకు అవగాహన కల్పించారు. హాజరైన వారంతా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నట్టు ఆయన తెలిపారు. -
ఎడ్యుకేషన్ యాప్స్.. అరచేతిలో సమస్త విజ్ఞానం!
స్మార్ట్ ఫోన్స్... మరెన్నో స్మార్ట్ ఫీచర్స్.. రోజుకో కొత్త అప్లికేషన్..! నేటి హైటెక్ యుగంలో అత్యాధునిక టెక్నాలజీ, ఆకట్టుకునే ఫీచర్స కలిగిన స్మార్ట్ ఫోన్స్ను వినియోగించని యువత అరుదు. స్మార్టఫోన్స వాడే యువతరం సగటున ప్రతి పది నిమిషాలకు కనీసం ఒక్కసారైనా కీప్యాడ్-అన్లాక్ చేస్తున్నట్లు అంచనా! ఇంతలా దైనందిన జీవితంలో చొచ్చుకు వచ్చాయి స్మార్ట్ ఫోన్స్. ఇవి ఇప్పుడు విద్యార్థులకు విజ్ఞానాన్ని,సబ్జెక్ట్ పరిజ్ఞానాన్ని సైతం అందించే అద్భుత సాధనాలుగా మారుతున్నాయి. ఆల్ఫాబెట్స్ మొదలు అత్యున్నత పోటీ పరీక్షలైన సివిల్స్, జీమ్యాట్, జీఆర్ఈ, క్యాట్, జేఈఈ వంటి ఎగ్జామ్స్కు సిద్ధం చేసే మొబైల్ ఎడ్యుకేషన్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట ఫోన్ ఆధారంగా ఎడ్యుకేషన్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకుంటే.. సమస్త విజ్ఞానం మీ అరచేతిలో ఉన్నట్లే!! ఎడ్యుకేషన్ యాప్స్తో విద్యార్థులు, ఉద్యోగార్థులకు ప్రయోజనాలపై టాప్ స్టోరీ.. ఎం-లెర్నింగ్.. మొబైల్ లెర్నింగ్. అంటే అరచేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్నే అధ్యయన సాధనంగా మార్చుకునే వీలు కల్పిస్తున్న విధానం. స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు ఉపయోగపడే పలు మొబైల్ ఎడ్యుకేషన్ యాప్స్ను రూపొందిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణి పరీక్షలైన జీమ్యాట్, జీఆర్ఈ, టోఫెల్, క్యాట్, సీశాట్, సివిల్స్, జేఈఈ వంటి పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని అందించే యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ యాప్స్ కెరీర్ గెడైన్స్ మొదలు పలు పోటీ పరీక్షల్లో సక్సెస్ టిప్స్ వరకు ఎన్నో అంశాలను తెలుసుకునే వీలు కల్పిస్తున్నాయి. వేగంగా కదిలే కాలాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకు చేయూతనిస్తున్నాయి. ఈ-లెర్నింగ్న్, మూక్స్ వంటి ఆన్లైన్ లెర్నింగ్ విధానాల మాదిరిగానే ఎం.లెర్నింగ్ పేరిట మొబైల్ ఎడ్యుకేషన్ యాప్స్ సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నాయి. ఎడ్యుకేషనల్ మొబైల్ యాప్స్ పట్ల ఇటీవల కాలంలో విద్యార్థులు, ఉద్యోగార్థుల ఆదరణ పెరుగుతోంది. 2012 నుంచి సగటున 29.3 శాతం వృద్ధి నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. 2017 నాటికి ఇది 34 నుంచి 37 శాతం మధ్యలో ఉంటుందని అంచనా. అప్లికేషన్స్.. అనేక రకాలు ఇప్పుడు విద్య, ఉద్యోగ పరీక్షలకు సంబంధించి సమాచారం విషయంలో మొబైల్ అప్లికేషన్స్లో పలు రకాలు అందుబాటులోకి వస్తున్నాయి. సదరు పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ మొదలు ప్రిపరేషన్ గెడైన్స్, సక్సెస్ టిప్స్, సక్సెస్ స్టోరీస్, పాత ప్రశ్నపత్రాల విశ్లేషణ వంటి అప్లికేషన్స్ రూపొందిస్తున్నారు. పరీక్ష ప్రిపరేషన్ కోణంలో సబ్జెక్ట్ వారీగా, సెక్షన్ల వారీగా మోడల్ కొశ్చన్స్, ప్రాక్టీస్ కొశ్చన్స్ అందిస్తున్నాయి. సబ్జెక్ట్ నిపుణుల లెక్చర్స్ సారాంశాన్ని తెలుసుకునే అవకాశం కూడా లభిస్తోంది. అభ్యర్థులు తమ సందేహాలు నివృత్తి చేసుకునే విధంగా కౌన్సెలింగ్ యాప్స్ సైతం ఆవిష్కృతమవుతున్నాయి. పరీక్ష నిర్వాహక సంస్థలు సైతం మొబైల్ యాప్స్ ద్వారా నైపుణ్యాలను అందించేందుకు ఆయా పరీక్షల నిర్వాహక సంస్థలు సైతం సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయంగా పలు విదేశీ విశ్వవిద్యాలయాల్లో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు మార్గమైన జీమ్యాట్ను నిర్వహించే జీమ్యాక్ తాజాగా జీమ్యాట్ రివ్యూ పేరిట మొబైల్ ఎడ్యుకేషన్ యాప్ను విడుదల చేసింది. ఔత్సాహిక విద్యార్థులు స్లాట్ల వారీగా పరీక్ష శైలి, ప్రశ్నల క్లిష్టత స్థాయి, అభ్యర్థులు పరీక్షలో తమ పనితీరు ఆధారంగా ఆశించదగిన స్కోర్స్ తదితర సమాచారం తెలుసుకోవచ్చు. జీమ్యాక్తోపాటు మన్హటన్, ప్రిన్స్టన్ రివ్యూ, మెక్గ్రాహిల్ వంటి ఇతర ప్రముఖ సంస్థలు సైతం తమ అధికారిక వెబ్సైట్స్ ద్వారా పలు మొబైల్ ఎడ్యుకేషన్ యాప్స్ను రూపొందించి డౌన్లోడ్ సౌకర్యం కల్పిస్తున్నాయి. అధిక శాతం ఈ-లెర్నింగ్ ట్యూటర్స్ ఈ-లెర్నింగ్ వెబ్సైట్స్ ఎడ్యుకేషన్ యాప్స్ను ఎక్కువగా రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ ట్యుటోరియల్స్ పేరుతో వర్చువల్ క్లాస్రూమ్స్, రిఫరెన్స్, ఆన్లైన్ లెక్చర్స్ వంటి సేవలు అందిస్తున్న ‘ఈ-లెర్నింగ్’ సంస్థలు.. తాజాగా మొబైల్ యాప్స్ను అందిస్తున్నాయి. నామమాత్రం రుసుంకే పలు అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని ఈ-లెర్నింగ్ సంస్థలు తమ యాప్స్ను డౌన్లోడ్ చేసుకున్న వారికి ప్రతిరోజూ ఉచితంగా నిర్దిష్ట సంఖ్యలోని ప్రశ్నలను చూసుకోవడానికి, సమాధానం ఇవ్వడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఉదాహరణకు ఐౌ్కఝౌ వెబ్సైట్ పలు పోటీ పరీక్షల సమయంలో గుడ్నైట్ టెస్ట్ పేరిట ప్రతిరోజూ పది నిమిషాల పాటు ఉచితంగా 20 ప్రశ్నలతో కూడిన యాప్స్ సర్వీస్ను అందించింది. ప్రతి పరీక్షకు ప్రత్యేకంగా మొబైల్ యాప్స్ను రూపొందిస్తున్న వెబ్సైట్స్ ప్రతి పరీక్షకు ప్రత్యేకంగా వాటిని రూపొందిస్తుండటం గమనార్హం. ఉదాహరణకు ఇంజనీరింగ్ పోటీ పరీక్షలకు, మేనేజ్మెంట్ పోటీ పరీక్షలకు వేర్వేరుగా యాప్స్ అందించే సంస్థలు ప్రత్యేకంగా ఏర్పాటవుతున్నాయి. ఐఐఎంలలో ప్రవేశానికి నిర్వహించే క్యాట్కు సంబంధించి ఇఅఖీ్కైఉఖ వెబ్సైట్ ప్రత్యేక మొబైల్ యాప్స్ను సిద్ధం చేసింది. అదే విధంగా జిప్మర్ తదితర మెడికల్ ఎంట్రెన్స్లకు సంబంధించి ఐఞౌఝౌ, జీఞటౌజ తదితర వెబ్సైట్స్ ప్రత్యేకించి ఉన్నాయి. జేఈఈకి కూడా ప్రత్యేకంగా పలు వెబ్సైట్స్ మొబైల్ అప్లికేషన్స్ను రూపొందిస్తున్నాయి. ఉద్యోగ పరీక్షలకు సైతం ఎడ్యుకేషన్ యాప్స్ కేవలం ప్రవేశ పరీక్షలకే కాకుండా నియామక పరీక్షలకు సైతం అందుబాటులో ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ మొదలు బ్యాంకుల్లో కొలువులకు నిర్వహించే ఐబీపీఎస్ క్లరికల్ కేడర్ వర కూ.. పలు పరీక్షలకు సంబంధించి ఇప్పుడు ఎన్నో సంస్థల మొబైల్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి కేవలం ప్రాక్టీస్ కొశ్చన్స్కే పరిమితం కాకుండా ప్రిపరేషన్ మెటీరియల్, టిప్స్ అండ్ టెక్నిక్స్ వంటి ఇతర సదుపాయాలు కల్పిస్తున్నాయి. కజీజ్ఛఛౌ్ఠ, ్టఛిడౌజ్ఛీ వంటి ప్రొవైడర్స్ సీశాట్, ఐబీపీఎస్ ప్రిపరేషన్ అప్లికేషన్స్లో ముందు ఉన్నాయి. ఒక్కసారి డౌన్లోడ్తో నిరంతర అధ్యయనం మొబైల్ యాప్స్లో ప్రత్యేకత.. ఒకసారి నిర్దిష్ట సదుపాయాలు ఉన్న అప్లికేషన్స్ ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే ఆ తర్వాత ఇంటర్నెట్ అవసరం లేకుండానే దీర్ఘకాలం సదరు అప్లికేషన్లో పొందుపరచిన సమాచారాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. ఆన్లైన్ ట్యూటర్స్తో పోల్చితే మొబైల్ యాప్స్ ద్వారా కలిగే అదనపు ప్రయోజనం ఇదే. ఆన్లైన్ ట్యూటర్స్ వెబ్సైట్స్ సదుపాయాన్ని పొందాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ ఉండాల్సిందే. కానీ మొబైల్ యాప్స్ విషయంలో మాత్రం డౌన్లోడ్ చేసుకునే సమయంలోనే ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. మొబైల్ ఆపరేటర్స్ కూడా ఎం-లెర్నింగ్ ఆవశ్యకత, పెరుగుతున్న ఆదరణను గమనించిన మొబైల్ ఆపరేటర్స్ సైతం పలు యాప్స్ను అందిస్తున్నాయి. ఎయిర్సెల్ సంస్థ ఝజఠటఠ్జజీ పేరుతో యాప్స్ను రూపొందించింది. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సివిల్ సర్వీసెస్, మెడిసిన్ తదితర పోటీ పరీక్షలకు సంబంధించి సమాచారం, ప్రాక్టీస్ కొశ్చన్స్, టిప్స్, మాక్ టెస్ట్ వంటి ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈకి సంబంధించి అకడమిక్ ప్రిపరేషన్ విషయాలు, స్కిల్ డెవలప్మెంట్ టెక్నిక్స్, వొకాబ్యులరీ బిల్డింగ్, జీకే ట్యుటోరియల్స్ను కూడా ఝజఠటఠ్జజీ నుంచి పొందొచ్చు. ఎయిర్టెల్ సంస్థ ఝ్ఛఛీఠఛ్చ్టిజీౌ అనే ఎడ్యుకేషన్ యాప్తో విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్, ఆయా పరీక్షల ప్రిపరేషన్ టిప్స్ను అందిస్తోంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యాలు పెంచుకునేందుకు మార్గంగా టాటా డొకోమో సంస్థ ఉజజీటజి ్ఛ్ఛజుజిౌ అనే మొబైల్ అప్లికేషన్ను రూపొందించింది. డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ మొబైల్ యాప్స్ను తమ ఫోన్లలోకి డౌన్లోడ్ చేసుకోవడం సులభమే. ఇందుకు కావలసిందల్లా మొబైల్ ఫోన్స్లో జీపీఆర్ఎస్, వాప్ సౌకర్యం ఉండటమే. స్మార్ట్ ఫోన్ల వినియోగం అధికంగా ఉన్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్స్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్స్, మైక్రోసాఫ్ట్ విండోస్ స్టోర్, బ్లాక్బెర్రీ యాప్ వరల్డ్, శాంసగ్ యాప్ స్టోర్ వంటి మార్గాలతోపాటు, యాపిల్ ఫోన్స్ వినియోగదారులు యాపిల్ ఐట్యూన్స్ స్టోర్స్ నుంచి అవసరమైన ఎడ్యుకేషనల్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా ప్రతి ఒక్కరు సొంతంగా లాగిన్ - ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం తప్పనిసరి. ఎడ్యుకేషన్ యాప్స్ను వినియోగించే క్రమంలో మొబైల్ ఫోన్స్లో వై-ఫై సదుపాయం లేదా జీపీఆర్ఎస్/డబ్ల్యుఏపీ (ఇంటర్నెట్ సదుపాయం కోసం), జావా స్క్రిప్ట్, బీటా వర్షన్స్, మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ టూల్స్, డేటా స్టోరేజ్ కెపాసిటీ టూల్స్ ఉండాలి. యాప్స్ ప్రయోజనాలు - స్వల్ప ఖర్చుతో విలువైన సమాచారం. - సమయం వృథా కాకుండా నిరంతరం నైపుణ్యం పెంచుకునే అవకాశం. - అకడమిక్ సమాచారాన్ని ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే సుదీర్ఘకాలం నిక్షిప్తం చేసుకునే సదుపాయం. - కొన్ని యాప్స్లో లభించే ప్రత్యేక సదుపాయాల ఫలితంగా ఎప్పటికప్పుడు తమ సామర్థ్యాన్ని తెలుసుకునే మార్గం. - బ్లూటూత్ సదుపాయం ద్వారా లెక్చర్స్ వినేందుకు అవకాశం. ఆయా పరీక్షల వారీగా ముఖ్యమైన మొబైల్ యాప్స్ ప్రొవైడర్స్ వివరాలు.. జీఆర్ఈ www.ets.org princetonreview.com www.manhattanprep.com www.yourteacher.com www.magoosh.com జీమ్యాట్ www.beatthegmat.com www.mba.com www.gmac.com www.kaplan.com www.veritasprep.com ఐఈఎల్టీఎస్ www.ieltstestonline.com www.britishcounsil.it www.mcmillaneducationapps.com www.freemanmobile.com www.udemy.com సీశాట్ www.minglebox.com www. prepzone.in www.tcyonline.com www.clearias.com www.wiziq.com జేఈఈ www.edusolutions.com www.toppr.com www.plancessjee.com www.edtechreview.in www.meritnation.com క్యాట్ www.catapp.in www.testfunda.com www.gradestack.com www.cat.jumbotests.com www.cat.learnhub.com అవసరాలకు సరితూగేలా మొబైల్ యాప్స్ ఎడ్యుకేషన్ విభాగంలోనూ ప్రవేశించడం ఆహ్వానించదగిన పరిణామం. నేడు యువతలో దాదాపు 50 శాతం మేర స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. కొత్తగా వస్తున్న మొబైల్ అప్లికేషన్స్ ద్వారా నెపుణ్యాలను పెంచుకోవడానికి మరింత మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి. ఈ యాప్స్ను ఎంపిక చేసుకునేముందు తమ అవసరాలకు సరితూగే విధంగా సదుపాయాలు ఉన్నాయా? లేవా? అని గుర్తించి ఎంచుకోవాలి. - జి.హేమంత్, కో-ఫౌండర్, టాపర్ డాట్ కామ్ సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు మొబైల్ ఫోన్స్ నాలెడ్జ్ రిసోర్స్గా కూడా ఉపయోగపడుతున్నాయని గుర్తించాలి. గత రెండు, మూడేళ్లుగానే ఎడ్యుకేషన్ మొబైల్ యాప్స్కు రూపకల్పన జరిగినప్పటికీ వీటిపై అవగాహన చాలా కొద్ది మందికే ఉంటోంది. ఇంటర్నెట్ సదుపాయంతో ఉన్న మొబైల్ ఫోన్ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. - వంశీచంద్ రెడ్డి, డెరైక్టర్, బ్రేవ్మౌంట్ సొల్యూషన్స్ లెర్నింగ్లో సరికొత్త విప్లవం విద్యార్థుల లెర్నింగ్ కోణంలో సరికొత్త విప్లవం ఎం-లెర్నింగ్. ఇదిదినదిన ప్రవర్థమానం అవుతోంది. ఇప్పటికే డెస్క్టాప్, ల్యాప్ టాప్ల ద్వారా ఆన్లైన్ ట్యూటర్ వెబ్సైట్స్ సహకారంతో పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మొబైల్ ఫోన్స్ ఆధారంగా ఎడ్యుకేషన్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకుంటూ మరింతగా నైపుణ్యాలను పెంచుకోవచ్చు. - ఆదిల్ ఉస్మాన్, బిజినెస్ హెడ్, iprof
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement