-
కేలో..కేలో..కేలోరే...!
ఉత్కంఠంగా రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు మెయిన్ డ్రాలో ఆడుతున్న క్రీడాకారులు కంబాలచెరువు(రాజమహేంద్రవరంసిటీ): రాజమహేంద్రవరంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గురువారం ఉత్కంఠతతో కొనసాగాయి. క్రీడాకారులు మెయిన్డ్రాలో తమ సత్తాను చాటుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 600 మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. అండర్ 13, 15 విభాగాల్లో సింగిల్స్, డబుల్స్తో బాలురు, బాలికల జట్ల మ«ధ్య హోరాహోరీగా సాగుతోంది. నగరంలోని ఆఫీసర్స్ క్లబ్, కాస్మోపాలిటన్ క్లబ్, కేఎస్ఎన్ ఇండోర్ స్టేడియం, భాను ఇండోర్ స్టేడియంలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. బాలురు, బాలికల విభాగంలో సింగిల్స్ జరుగుతుండగా, డబుల్స్ శుక్రవారం జరగనున్నాయి. వీటిలో విజేతలుగా నిలిచిన వారు త్వరలో జరగబోయే నేషనల్స్ టోర్నమెంటోలో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. నేషనల్స్కు వెళ్లాలి నాకు చిన్నప్పటినుంచి షటిల్ అంటే తెలీని ఇçష్టం, దాంతో స్కూలులో ఎక్కువగా ఆడుతుండేవాడిని. అదే నాకు మంచి తోడ్పాడునిచ్చింది. ఇప్పటివరకు అండర్ 13లో నాలుగు టోర్నమెంట్లు ఆడాను. నేషనల్స్కు వెళ్లి రాష్ట్రం తరఫున ఆడాలన్నదే నా లక్ష్యం. - అభిరామ్, షటిల్ క్రీడాకారుడు. శ్రీకాకుళం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో షటిల్ బ్యాడ్మింటన్లో రాణిస్తున్నాను. వారిచ్చే ప్రోద్బలంతో రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలుస్తాననే నమ్మకం ఉంది. నేషనల్ ర్యాంకింగ్ కొయంబత్తూర్ ఆడాను. రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించి విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉన్నాను. -కె.సాత్విక్ కోర్, షటిల్ క్రీడాకారుడు. ఒంగోలు ఒలింపిక్ సాధనే లక్ష్యం.. ఒలింపిక్ సాధనే లక్ష్యంతో ఆడుతున్నాను. నేషనల్ ర్యాంకింగ్ సెవెన్తో పాటు తెనాలి స్టేట్ విన్నర్గా నిలిచాను. అండర్ 13లో ఆడుతున్నాను. ఇక్కడ సదుపాయాలు బాగున్నాయి. ఆసక్తికరంగా పోటీలు సాగుతున్నాయి. విజేతగా నిలిచేందుకు కృషి చేస్తున్నాను. - బాబారావ్, షటిల్ క్రీడాకారుడు. కడప. నేషనల్స్కు ఆటగాళ్లను పంపుతాం రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు 13 జిల్లాల నుంచి 600 మంది క్రీడాకారులు వచ్చారు. వీరందరికీ భోజన, వసతి సదుపాయలు కల్పించాం. క్రీడాకారులు పోటాపోటీగా ఆడుతున్నారు. 19న జరిగే పోటీల్లో విజేతలను ఎంపిక చేసి వారిని నేషనల్స్కు పంపుతాం. ఈ పోటీలు రాజమహేంద్రవరంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. - జి.సాయిబాబా, ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ -
ఆ పద, స్వరాలకు అవార్డులు
-యునెస్కో పోటీల్లో ‘రాధాకృష్ణ’ విద్యార్థినుల ప్రతిభ -నాట్య, సంగీత విభాగాల్లో బహుమతుల పంట రాజమహేంద్రవరం కల్చరల్ : జిల్లాలోని ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థినులు హిమాచల్ప్రదేశ్లోని సిమ్లాలో జరిగిన దారోహర్ అంతర్జాతీయ సంగీత నృత్యపోటీలలో పలు అవార్డులను కైవసం చేసుకున్నారు. శుక్రవారం స్థానిక ప్రకాష్ నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు గోరుగంతు బదరీ నారాయణ అవార్డులను ప్రదర్శించి, వివరాలను వెల్లడించారు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో రాధాకృష్ణ విద్యార్థినులు అన్ని విభాగాలలో బహుమతులను గెలుచుకున్నారు. అద్భుతమైన కొరియోగ్రఫీని అందించినందుకు రాధాకృష్ణ అధ్యాపకురాలు గోరుగంతు ఉమాజయశ్రీ ‘కళాకుంజ్’ అవార్డును, అన్ని విభాగాలలో ప్రధాన పాత్ర పోషించిన కళాక్షేత్ర విద్యార్థిని లక్ష్మీదీపిక ‘కళాప్రభ’ అవార్డును గెలుచుకున్నారు. మరో విద్యార్థిని మాధురి లలితసంగీతంలో తృతీయ బహుమతిని, లక్ష్మీదీపిక, సునంద కూచిపూడి విభాగంలో ప్రథమ బహుమతిని సాధించారు. జూనియర్స్ విభాగంలో వినాయక కౌతం బృందం కళాకారులు ప్రథమ బహుమతిని, వీణ ఫ్యూషన్లో ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. గోదావరి హారతి, నవరాగమాలికా వర్ణాలకు ప్రథమ బహుమతి కూడా లభించింది. అన్ని విభాగాలలో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థినులు మొత్తం 15 బహుమతులను గెలుచుకుని, రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటారని నారాయణ చెప్పారు. ఏ వేదికపై ప్రదర్శనలు ఇచ్చినా సనాతన భారతీయ వైభవాన్ని ప్రచారం చేయడమే తమ లక్ష్యమన్నారు. విలేకరుల సమావేశంలో కళాక్షేత్ర అధ్యాపకురాలు ఉమాజయశ్రీ, పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ ఖాన్, సభ్యులు పి.సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. -
నృత్యాంజలి సేవలు ప్రశంసనీయం
కాకినాడ కల్చరల్ : నాట్యరంగానికి నృత్యాంజలి కళానిలయం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జయలక్ష్మి కో- ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రాయవరపు సీతారామాంజనేయులు అన్నారు. స్థానిక సూర్యకళామందిర్లో నృత్యాంజలి కళానిలయం ఆధ్వర్యంలో ‘పద ఝురి–2017’ నాట్య కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముందుగా నటరాజ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి శాస్త్రీయ, జానపద నాట్య పోటీల్లో విద్యాంజలి నికేతన్ (కాకినాడ), లలిత కళానికేతన్ ( అన్నవరం), మంజీర నృత్యాలయం(కాకినాడ), భగవత్ నృత్యాలయం (విజయనగరం) వారే కాకుండా పలువురు పాల్గొన్నారు. టి. సౌమ్య, బి.వాణిశ్రీ, నటరాజ రామకృష్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యహరించారు. తదుపరి నాట్యాచార్యులు డాక్టర్ కృష్ణకుమార్, డాక్టర్ పసుమర్తి శ్రీనివాసశర్మ, డాక్టర్ వేదాంతం వెంకట దుర్గా భవానిలను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సభలో నృత్యాంజలి కళానిలయం వ్యవస్థాపకుడు హరి లోకేష్ శర్మ మాట్లాడుతూ నాట్య రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు. నర్తకీమణులు వి.మోహన్ సత్య, రమణ కుమారి, మధుస్మిత, శర్వాణి, సౌమ్యలకు ‘నృత్యవతంస’ పురస్కారాలను అందజేశారు. నాట్యాచార్య వీఎన్ వరప్రసాద్, శ్రీరామ్ భగవ్ గురుస్వామి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే కూచిపూడి నృత్యం : సబ్ జూనియర్స్ విభాగం ఎన్.నికిత (ప్రథమ), దీపిక (ద్వితీయ). జూనియర్స్ విభాగం ఆరది (ప్రథమ), వర్షిత (ద్వితీయ). సీనియర్స్ విభాగం జి. మేఘన (ప్రథమ), వి.శ్రీను (ద్వితీయ) స్థానాల్లో నిలిచారు. భరత నాట్యం : సబ్ జూనియర్స్ విభాగంలో డి. దివ్య హాసిని (ప్రథమ), గాయిత్రి ఆశ్రిత (ద్వితీయ), జూనియర్స్ విభాగంలో కె. సంజన (ప్రథమ), నాగశ్రీ (ద్వితీయ), సీనియర్స్ విభాగంలో పి.ప్రసజ్ఞ (ప్రథమ), సిరిజా రెడ్డి (ద్వితీయ) బహుమతులు గెలుచుకున్నారు. జానపద నృత్యం : సబ్ జూనియర్స్ విభాగంలో కె.సంస్కృతి (ప్రథమ), వినీల (ద్వితీయ), జూనియర్స్ విభాగంలో జ్ఞాపిక (ప్రథమ), సీనియర్స్ విభాగంలో భ్రమరాంబిక (ప్రథమ) బహుమతులు పొందారు. శాస్త్రీయ నృత్యం : గ్రూపు విభాగం రోషిని గ్రూపు (ప్రథమ), అన్నవరం గ్రూపు (ద్వితీయ) బహుమతులు గెలుచుకున్నారు. జానపద నృత్యం : గ్రూపు విభాగంలో మౌనిక గ్రూపు ప్రథమ బహుమతి, అక్షయ గ్రూపు ద్వితీయ బహుమతి పొందారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. -
పిల్లలను క్రీడల్లోనూ ప్రోత్సహించాలి
– రూ 4.50 కోట్లతో రాజమహేంద్రవరం స్టేడియం నిర్మాణానికి కృషి చేయాలి –ముగిసిన టేబుల్ టెన్నిస్ స్టేట్ ర్యాంకింగ్ పోటీలు తాడితోట,(రాజమహేంద్రవరం సిటీ) : తమ పిల్లలను విద్యతో పాటు క్రీడల్లో ప్రోత్సహించాలని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ మేయర్ పంతం రజనీ శేషసాయి అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని గోదావరి గట్టున ఉన్న త్యాగరాయ నారాయణదాస సేవాసమితి పం„క్షన్ హాలులో రాష్ట్ర స్థాయి రెండోవ టేబుల్ టెన్నిస్ పోటీలు మూడు రోజుల పాటు జరిగాయి. పురుషులు, మహిళ, యూత్బాయ్స్, యూత్ గరల్స్, జూనియర్ బాయ్స్, జూనియర్ గరల్స్, సబ్ జూనియర్, మినీకెడిట్, డబుల్ తదితర 14 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఆదివారం వేడుకల్లో మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించి నగరానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. నగరంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు కార్పొరేటర్లతో చర్చించి స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. స్టేడియం నిర్మాణానికి ఏపీ స్టేట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కరరామ్ రూ.మూడు కోట్ల నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చారని పేర్కొన్నారు. దాతల సహకారంతో ప్రభుత్వం ఇచ్చే నిధులతో స్టేడియం అభివృద్ధి చే స్తామని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కరరామ్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రావు చిన్నారావు, కార్పొరేటర్ కొమ్మ శ్రీనివాస్, నన్నయ్య యూనివర్సీటీ పీడి ఏ. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా టీటీ పోటీలు
ఫైనల్కు చేరిన ఛార్వీపల్గున్ నేటితో పోటీల ముగింపు కంబాలచెరువు(రాజమహేంద్రవరంసిటీ) : ఏపీ స్టేట్ రెండో ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ పోటీలు శనివారం హోరాహోరీగా సాగాయి. స్థానిక గోదావరి గట్టు వద్ద ఉన్న త్యాగరాయ దాసాసేవా సమితి హాల్లో నిర్వహించిన రెండో రోజు పోటీల్లో రాష్ట్రంలోని 39 మంది పురుషులు, 80 మంది బాలికలు తలబడ్డారు. వీరిలో కేడెట్ బాలికల విభాగంలో రాజమహేంద్రవరానికి చెందిన ఛార్వీపల్గున్ ఫైనల్కు చేరుకుంది. ఆదివారంతో ఈ పోటీలు ముగియనున్నాయి. ఏపీ స్టేట్ ప్రథమ ర్యాంకింగ్ పోటీలు గత నెలలో విజయవాడలో నిర్వహించారు. త్వరలో గుంటూరు, విశాఖపట్నంలో కూడా పోటీలు నిర్వహించనున్నారు. అనంతపురంలో ఫైనల్స్ నిర్వహించి నేషనల్కు క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. క్రీడాకారులకు ఉచిత శిక్షణ రాజమహేంద్రవరం నుంచి ఎందరో ఆటగాళ్లను తయారుచేసే అవకాశం ఉంది. దేశం తరఫున ఆడే సత్తాగల క్రీడాకారులు ఇక్కడ ఉన్నారు. ఒక్క టేబుల్ టెన్నిస్కే కాదు ఏ క్రీడాలోనూ శిక్షణ పొందేందుకు ఇక్కడ స్టేడియం లేదు. ఆటగాళ్లను తయారు చేయాలంటే అన్ని వనరులు ఉండాలి. నగరంలో టౌన్హాలు ఎదురుగా ఉన్న టీటీ అకాడమీలో 72 మందికి టేబుల్ టెన్నిస్లో శిక్షణ ఇస్తున్నాం. రాజమహేంద్రవరంలో సొంతంగా 15 టేబుళ్లతో స్టేడియం నిర్మించనున్నాం. అక్కడ ఉచితంగా టీటీ శిక్షణతో పాటు యోగా, జిమ్ వంటివి ఎన్నో అందుబాటులోకి తీసుకువస్తాం –వి.భాస్కర్రామ్, ఏపీ టేబుల్ టెన్నిస్ రాష్ట్ర అధ్యక్షుడు బాగా ఆడుతున్నారు టేబుల్ టెన్నిస్లో క్రీడాకారులు మంచి ప్రతిభ కనపరుస్తున్నారు. వీరిలో ప్రతిభగల వారిని ప్రోత్సహించి శిక్షణ ఇచ్చి నేషనల్స్, ఒలింపిక్కు పంపేందుకు సిద్ధంగా ఉన్నాం. రాజమహేంద్రవరంలో జరుగుతున్న రెండో ర్యాంకింగ్ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాకారులు వచ్చారు. వారందరికీ తగు ఏర్పాట్లు చేసి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. మంచి టీటీ క్రీడాకారులను తయారుచేస్తాం. - ఎస్.ఎం.సుల్తాన్, ఏపీ టీటీ రాష్ట్ర కార్యదర్శి నా కుమార్తెను ప్రోత్సహిస్తున్నాం నా కుమార్తె ఆశ్రిత సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో తలపడుతోంది. చిన్నప్పటి నుంచే టేబుల్ టెన్నిస్పై ఎంతో ఆసక్తి చూపుతోంది. దీంతో మేము ఆమెను ప్రోత్సహిస్తున్నాం. ఎక్కడ టోర్నీ జరిగినా అందులో పోటీ పడుతోంది. ఆమె జాతీయ స్థాయిలో పోటీల్లో రాణించాలని కోరుకుంటున్నాం. - టి.సునీల, టీటీ క్రీడాకారిణి తల్లి, వైజాగ్ ఒలింపిక్ పతకం సాధిస్తా ఏలూరులో జరిగిన టోర్నమెంట్ కేడెట్లో గోల్డ్ మెడల్ సాధించా. చిన్నప్పటి నుంచి టీటీ అంటే చాలా ఇష్టం. మా నాన్న గారు మంచి టీటీ క్రీడాకారుడు. ఆయన స్ఫూర్తితో ఈ ఆటపై మక్కువ ఏర్పడింది. ఒలిపింక్ పతకం తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నా. - ఛార్వీపల్గున్, టీటీ క్రీడాకారిణి, రాజమహేంద్రవరం టీటీ అంటే ఎంతో ఇష్టం టేబుల్ టెన్నిస్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఇప్పటికే చాలా టోర్నమెంట్లలో ఆడాను. పలు పతకాలు వచ్చాయి. వాటన్నింటికన్నా దేశానికి పేరు తెచ్చేలా ఒలింపిక్ పతకం సాధించాలనే ధృడ నిశ్చయంతో ఉన్నా. - శైలునూర్ బాషా, టీటీ క్రీడాకారిణి, విజయవాడ 15 గోల్డ్ మెడల్స్ సాధించా ఇప్పటి వరకూ ఎన్నో టోర్నీల్లో పాల్గొన్నా. 12 నేషనల్స్ ఆడాను. రాష్ట్ర స్థాయిలో 15 ప్రథమ స్థానాలు సాధించి గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నా. జాతీయ స్థాయి పోటీలంటే చాలా ఇష్టం. మరింత ముందుకు వెళ్లాలని ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆగిపోయాను. - డి.రాహుల్, టీటీ క్రీడాకారుడు, రాజమహేంద్రవరం స్పోర్ట్ కోటాలో ఉద్యోగం చిన్నప్పటి నుంచి టీటీ అంటే ఎంతో ఇష్టం. ఇçప్పటి వరకూ 300 పైగా టోర్నీలు ఆడాను. ఆటలపై నాకున్న మక్కువతోనే నాకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చింది. టేబుల్ టెన్నిస్లో ఇండియా తరఫున ఆడాలనే లక్ష్యంతో ఉన్నాను. - చల్లా ప్రణీత, టీటీ క్రీడాకారిణి, విజయవాడ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'ది ఇండియన్ స్టోరీ' సినిమా రివ్యూ
ఆజానబాహుడిలా ఉండే బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఫిట్నెస్ రహస్యం ఇదే!
నవీన్ పట్నాయక్ లక్ష్యం అదే.. వీకే పాండియన్
పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్
అకాయ్ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్డే సెలబ్రేషన్స్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)
చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్
Betel Leaf: తమల పాకులతో హెయిర్ ఫాల్ సమస్యకు చెక్!
‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
తప్పక చదవండి
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- Black Salt Benefits : బ్లాక్ సాల్ట్తో ఇన్ని లాభాలా?
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
Advertisement