-
కోర్టులవి ద్వంద్వ ప్రమాణాలు: జైట్లీ
ముంబై: పార్లమెంట్ చట్టరూపంలో రూపొందించిన టైమ్లైన్స్ని పాటించడం కార్యనిర్వాహక వ్యవస్థకు తప్పనిసరి కాగా, న్యాయ వ్యవస్థకు అలా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. భారత కోర్టులు ద్వంద్వ ప్రమాణాలను అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘సంప్రదాయంగానే మన కోర్టులవి ద్వంద్వ ప్రమాణాలు. టైమ్లైన్స్కు కార్యనిర్వాహక శాఖ కట్టుబడి ఉంటుంటే, కోర్టులు మాత్రం అవి తమకు మార్గదర్శకాలు మాత్రమే అని పేర్కొంటున్నాయి’ అని జైట్లీ తెలిపారు. న్యాయశాఖ మంత్రిగా తనకు ఎదురైన అనుభవాల్ని వివరిస్తూ... సివిల్ ప్రొసీజర్ కోడ్ను సవరించినా ఎలాంటి మార్పు రాలేదన్నారు. -
‘స్కైప్’ సాక్ష్యం చెల్లుతుంది!
హైకోర్టు స్పష్టీకరణ సాక్షి వ్యక్తిగతంగా హాజరు కానక్కర్లేదు సాంకేతిక ఉపకరణాల ద్వారా సాక్ష్యం నమోదు చేయవచ్చు ఓ విడాకుల కేసులో కింది కోర్టు తీర్పునకు సమర్థన సాక్షి, హైదరాబాద్: ఒక విడాకుల కేసులో ఇంటర్నెట్ వీడియో కాలింగ్ విధానమైన ‘స్కైప్’ ద్వారా సాక్ష్యం నమోదుకు అనుమతిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. సివిల్, క్రిమినల్ కేసుల్లో సాక్షుల విచారణ, సాక్ష్యాల నమోదుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం చట్టప్రకారం ఆమోదయోగ్యమేనని పేర్కొంది. సివిల్ ప్రొసీజర్ కోడ్ (సీపీసీ) ప్రకారం సివిల్ కేసుల్లో ముఖ్యంగా వైవాహిక సంబంధిత కేసుల్లో సాక్షి హాజరు అంటే వ్యక్తిగత హాజరు కానక్కరలేదని తెలిపింది. హాజరు కింద ఆడియో, వీడియో లింక్ల ద్వారా గానీ, స్కైప్ లేదా తత్సమాన సాంకేతిక విధానాల ద్వారాగానీ సాక్ష్యాన్ని నమోదు చేయవచ్చని పేర్కొంది. సత్వర, సమర్థవంతమైన న్యాయాన్ని అందించేందుకు సాంకేతిక ఆవిష్కరణలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని.. అయితే వాటి ద్వారా సాక్షుల విచారణ, సాక్ష్యాలు నమోదు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యాఖ్యానించింది. అమెరికా నుంచి సాక్ష్యం! శ్రీరంగి మురళీధరరావు, శోభ భార్యాభర్తలు. మురళీధరరావు అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్నారు. వారి మధ్య విభేదాలతో కోర్టుకెక్కారు. దీనికి సంబంధించి ఆఫీసులో అత్యవసర ప్రాజెక్టుల వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నానని, అందువల్ల తన సాక్ష్యాన్ని స్కైప్ ద్వారా నమోదు చేసేందుకు అనుమతినివ్వాలని కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టును మురళీధరరావు కోరారు. అందుకు కోర్టు అంగీకరిస్తూ స్కైప్ ద్వారా సాక్ష్యం నమోదుకు ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ శోభ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు ఇటీవల తీర్పునిచ్చారు. క్రిమినల్ కేసు నుంచి తప్పించుకునేందుకే వ్యక్తిగతంగా హాజరుకాకుండా స్కైప్ ద్వారా సాక్ష్యం నమోదుకు అనుమతి కోరారంటూ శోభ చేసిన వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ‘‘స్వాతంత్య్రం తరువాత దేశ జనాభా పెరిగినట్లే.. పెండింగ్ కేసుల సంఖ్య అసాధారణ స్థాయిలో పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక భారతదేశ న్యాయవ్యవస్థ సమర్థవంతంగా న్యాయాన్ని అందించేందుకు అవకాశం ఏర్పడింది. స్కైప్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతుల ద్వారా సాక్షులను విచారిస్తే న్యాయమూర్తికి స్పష్టమైన అవగాహన వస్తుంది. అవసరమైతే మరోసారి సాక్షిని విచారించవచ్చు..’’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
సివిల్ కేసులంటే..!
పాలకోడేరు రూరల్ : సివిల్ కేసులు అంటే ఏమిటీ, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి. కేసు ఎలా పెట్టాలి. న్యాయ సహాయం ఎలా పొందాలి వంటి విషయాలు మనలో చాలామందికి తెలియదు. ఈ అంశాలను ఓ సారి పరిశీలిస్తే.. ఎలాంటి సివిల్ కేసులవుతాయి? ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన సమస్యలు సివిల్ కేసుల పరిధిలోకి వస్తాయి. ఉదాహరణకు మన ఆస్తులను ఇతరులు ఆక్రమించుకుని ఇబ్బంది పెడుతుంటే, ప్రామిసరీ నోటు హామీతో ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకుంటే సివిల్ కేసులు దాఖలు చేయవచ్చు. పోలీసులకు సంబంధం లేదు ఈ సివిల్ కేసులతో పోలీసులకు సంబంధం ఉండదు. వీటిని కోర్టులో సీపీసీ (సివిల్ ప్రొసీజర్ కోడ్) ప్రకారం నేరుగా గానీ లేదా న్యాయవాది ద్వారా గానీ బాధితులు దాఖలు చేయాలి. సివిల్ కేసులను పోలీసులు అసలు పట్టంచుకోరు. ఒకవేళ సివిల్ తగాదాల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగితే మాత్రం పోలీసులు జోక్యం చేసుకుంటారు. నేర తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటారు. కోర్టు ద్వారానే అరెస్టులు సివిల్ కేసుల విచారణ కోర్టు పరిధిలోనే జరుగుతుంది. నిందితులు కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలి. వారు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే కోర్టు వారి అరెస్టుకు పోలీసులను ఆదేశిస్తుంది. ఉచితంగా న్యాయ సాయం సివిల్ కేసులో ఉచిత న్యాయ సాయం పొందే అవకాశాన్ని కోర్టులు కల్పిస్తాయి. కోర్టులో న్యాయవాదిని పెట్టుకోవడానికి స్తోమత లేనివారు ఉచితంగా ప్రభుత్వ న్యాయవాది ద్వారా సివిల్ కేసు వేసుకోవచ్చు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement