-
చైనా సంచలన నిర్ణయం: బిలియనీర్కు భారీ షాక్
బీజింగ్: బిలియనీర్, అగ్రికల్చరల్ టైకూన్ సన్ దావూకు (66) చైనా భారీ షాక్ ఇచ్చింది. ఇటీవల పలువురు ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు జైలు శిక్ష విధించిన జిన్పింగ్ ప్రభుత్వం తాజాగా సన్దావూకు 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టడం, ప్రభుత్వ పరిపాలనను అడ్డుకోవడం, అక్రమ మైనింగ్, వ్యవసాయ భూముల ఆక్రమణ, అక్రమ నిధుల సేకరణ లాంటి నేరాల్లో సన్ దావూ దోషిగా తేలారని బీజింగ్ సమీపంలోని గావోబీడియన్ కోర్టు ప్రకటించింది. దీనిపై సన్ న్యాయవాదులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. గ్రామీణ సంస్కరణల మద్దతుదారుడుగా పేరొందిన సన్ను రహస్యంగా విచారించిన అనంతరం చైనా కోర్టు అతనికి 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతేకాదు 3.11 మిలియన్ యవాన్ల (475,000 డాలర్ల) జరిమానా విధించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనుభవజ్ఞుడైన సన్, తన సొంత సంస్థను స్థాపించడానికి ముందు ప్రభుత్వ యాజమాన్యంలోని అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనాలో పనిచేశారు. ఆ తరువాత భార్యతో కలిసి 1980లలో అగ్రికల్చరల్ అండ్ యానిమల్ హస్బెండరీ గ్రూప్ అనే భారీ సంస్థను నెలకొల్పారు. ఇందులో ప్రస్తుతం వేలాది మంది ఉద్యోగులున్నారు. అలాగే హెబీ ప్రావిన్స్లో 1,000 పడకల ఆసుపత్రి, ఇతర సౌకర్యాలతో దావు సిటీ అనే నగరాన్ని కూడా నిర్మించారు సన్ దావూ. ప్రభుత్వ బ్యాంకులపై విమర్శలు గుప్పిస్తూ 2000లో ఒక వెబ్సైట్ను ప్రారంభించారు. ప్రధానంగా గ్రామీణ పెట్టుబడులను నిర్లక్ష్యం చేస్తూ, గ్రామీణుల పొదుపు సొమ్మును పట్టణ ప్రాజెక్టులవైపు మళ్లిస్తున్నారని సన్ ఆరోపించారు. దశాబ్దాలుగా చైనా గ్రామీణ విధానాలను తీవ్రంగా విమర్శించడంతోపాటు, రైతుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు వారికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలనేవారు. గ్రామీణ సంస్కరణలపై గొంతెత్తే సన్ 2019లో చైనాలో స్వైన్ ఫీవర్ విజృంభణపై కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2003లో అక్రమ నిధుల వసూళ్లు ఆరోపణలతో సన్ను అరెస్ట్ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పలువురు మానవహక్కుల నేతలు, న్యాయవాదులు, విద్యావేత్తలు, పాత్రికేయుల నిరసనల కారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే 2021 మేలో సన్ను మరోసారి అరెస్ట్ చేసిన ప్రభుత్వం, అతని వ్యాపారాలను సీజ్ చేసింది. కాగా రియల్ ఎస్టేట్ మొగల్ రెన్ జికియాంగ్కు గత సంవత్సరం చైనా 18 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
కన్యత్వానికి రూ.3.5 లక్షల ఖరీదు
బూటకపు వాగ్దానాలతో తన కన్యత్వాన్ని దోచుకున్న ప్రియుడిపై ఓ చైనా మహిళ దావా వేసింది. తన కన్యత్వ హక్కుకు భంగం కలిగించాడంటూ కోర్టుకు ఎక్కింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఆమెకు 5 వేల డాలర్ల(సుమారు రూ.3.5 లక్షలు) పరిహారం ఇప్పించిందని షాంఘై మీడియా పేర్కొంది. లీ అనే వ్యక్తి తన వివాహ విషయాన్ని దాచిపెట్టి షిన్ అనే మహిళతో డేటింగ్ చేశాడు. షిన్ ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సర్వస్వాన్ని దోచుకున్నాడు. తర్వాత ముఖం చాటేశాడు. దీంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. తనను మానసికంగా, ఆరోగ్యపరంగా కుంగదీసినందుకు లీ నుంచి 81 వేల డాలర్లు పరిహారం ఇప్పించాలని షిన్ దావా వేసింది. మగువ మానాన్ని కాపాడాల్సిన నైతిక బాధ్యత తమపై ఉందంటూ కోర్టు ఆమెకు 5 వేల డాలర్ల పరిహారం ఇప్పించింది. ఆమె డిమాండ్ చేసిన మొత్తం చాలా ఎక్కువని న్యాయస్థానం అభిప్రాయపడింది. శీలాపహరణ స్త్రీ ఆరోగ్యాన్ని, స్వేచ్ఛను, ప్రతిష్టను దెబ్బతీస్తుందని కోర్టు పేర్కొంది. -
చైనా కమ్యూనిస్టు పార్టీ నేతకు జీవితఖైదు
జినాన్/బీజింగ్: అవినీతి ఆరోపణలపై కమ్యూనిస్టు పార్టీ మాజీ అగ్రనేత బోగ్జిలాయ్కి చైనా కోర్టు జీవితఖైదు విధించింది. షాన్డాంగ్ కోర్టు ఆది వారం బోగ్జిలాయ్ని అవి నీతి, అధికార దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం అభియోగాల్లో దోషిగా తేల్చింది. బోగ్జిలాయ్కు లంచం తీసుకున్నారన్న అభియోగాలపై జీవితఖైదు, నిధుల దుర్వినియోగం అభియోగాలపై 15 ఏళ్లు, అధికార దుర్వినియోగం అభియోగంలో ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. -
చైనా కమ్యూనిస్టు పార్టీ నేతకు జీవితఖైదు
జినాన్/బీజింగ్: అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై కమ్యూనిస్టు పార్టీ మాజీ అగ్రనేత బోగ్జిలాయ్కి చైనా కోర్టు జీవితఖైదు విధించింది. షాన్డాంగ్ ప్రావిన్స్లోని జినాన్ ఇంటర్మీడియెట్ కోర్టు ఆదివారం బో గ్జిలాయ్ని అవినీతి, అధికార దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం అభియోగాల్లో దోషిగా తేల్చింది. బో గ్జిలాయ్కు లంచం తీసుకున్నారన్న అభియోగాలపై జీవితఖైదు, నిధుల దుర్వినియోగం అభియోగాలపై 15 ఏళ్లు, అధికార దుర్వినియోగం అభియోగంలో ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రజాప్రతినిధిగా పని చేసిన బో అవినీతికి పాల్పడ్డం వల్ల దేశానికి, ప్రజలకు తీరని నష్టం జరిగిందని చెప్పింది. 64 ఏళ్ల బోగ్జిలాయ్ కమ్యూనిస్టు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడిగా, ఛాంగ్కింగ్ సిటీ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. అంతేకాక ప్రజాదరణ కలిగిన నాయకుడిగా గత ఏడాది జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పోటీదారుల్లో ఒకరిగా నిలిచారు. అయితే అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలు రావడంతో ఆయనను పార్టీ నుంచి తప్పించారు. బోగ్జిలాయ్ డాలియాన్ సిటీ అధిపతిగా ఉండగా నగర సుందరీకరణ పేరుతో 33 లక్షల అమెరికా డాలర్ల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వెలువడ్డాయి. అయితే తనపై మోపిన అభియోగాలను తోసిపుచ్చిన బోగ్జిలాయ్.. జినాన్ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement