-
ఫోన్ స్విచ్ ఆఫ్.. పరారీలో బోండా ఉమా !
-
వైఎస్సార్సీపీ ఎంపీటీసీపై హత్యాయత్నం
తిరుపతి రూరల్: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ. రంగంపేట వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు బోస్చంద్రారెడ్డిపై శనివారం రాత్రి కొందరు దుండగులు హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఎంపీటీసీ సభ్యుడిని కత్తితో పొడిచేందుకు యత్నించడంతోపాటు అతని కారును కాల్చివేసేందుకు వేసిన పథకం విఫలమైంది. ఈ ఘటనలో కత్తితో సహా ఓ సినీహీరో వద్ద బౌన్సర్గా పనిచేసిన వ్యక్తి పట్టుబడ్డాడు. ఓ ప్రైవేటు యూనివర్సిటీ మాజీ పీఆర్వో సతీష్, ఓ సినీ హీరో అభిమాన సంఘం అధ్యక్షుడు సునీల్చక్రవర్తి సూచనల మేరకే ఈ ఘటనకు పాల్పడినట్లు పట్టుబడిన వ్యక్తి మీడియాతో చెప్పడం విశేషం. బాధితుడు బోస్చంద్రారెడ్డి తెలిపిన వివరాలు.. సతీష్, సునీల్చక్రవర్తి గతంలో బోస్చంద్రారెడ్డి, రంగంపేట ఉప సర్పంచ్ మౌనిష్రెడ్డితో గొడవపడ్డారు. ఓ భూమి, షాపు విషయంలోనూ ఎంపీటీసీ, ఉప సర్పంచ్తో సతీష్, సునీల్చక్రవర్తిలు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో బోస్చంద్రారెడ్డిపై కక్ష పెంచుకున్న సతీష్, సునీల్చక్రవర్తిలు ఓ సినీహీరో వద్ద బౌన్సర్గా పనిచేసిన హేమంత్తో ఒప్పందం చేసుకున్నారు. దీంతో శనివారం రాత్రి హేమంత్ మరో ఐదుగురు కలిసి రాడ్లు, కత్తులు, పెట్రోల్ బాటిల్స్తో మారుతీనగర్లోని బోస్చంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించి.. జన సంచారం ఉండటంతో ఆఖరి నిమిషంలో పరారయ్యారు. అనంతరం మళ్లీ రాత్రి 11 గంటలకు ఇలానే దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు. ఆదివారం వేకువజామున 3 గంటలకు మళ్లీ కత్తులు, రాడ్లు, పెట్రోల్తో దాడికి రావడంతో వారిపై బోస్చంద్రారెడ్డి అనుచరులు తిరగబడ్డారు. హేమంత్ కత్తితో సహా పట్టుబడగా.. మిగిలినవారు పారిపోయారు. అతన్ని పట్టుకుని విచారించిన బోస్చంద్రారెడ్డి వర్గీయులు, రంగంపేటలోనూ మరో బ్యాచ్ ఉన్నారని చెప్పడంతో కారులో అతన్ని ఎక్కించుకుని రంగంపేటకు వచ్చారు. అప్పటికే వారు కూడా పారిపోయారు. ఈ హత్యాయత్నానికి సతీష్ కీలకసూత్రధారి అని, అతనే బోస్చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డిలపై దాడి చేయమన్నారని, దీనిలో సునీల్చక్రవర్తి పాత్ర కూడా ఉందని హేమంత్ మీడియాకు తెలిపాడు. హత్యచేయడం లక్ష్యం కాదని, కారును కాలి్చవేసి భయపెట్టాలని యత్నించినట్టు చెప్పాడు. నిందితులకు సతీష్ ఫోన్పే ద్వారా నగదు పంపించడం, అర్ధరాత్రిళ్లు కూడా సునీల్చక్రవర్తి ఫోన్లో మాట్లాడుతుండటంతో బాధితులు నిజనిర్ధారణకు వచ్చారు. హేమంత్ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఘటన జరిగిన ప్రదేశం తిరుపతి యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలో ఉండటంతో బోస్చంద్రారెడ్డి అక్కడే ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, కొన్ని మీడియాల్లో సినీనటులు మోహన్బాబు, విష్ణువర్ధన్బాబుపై అసత్య ప్రచారం చేయడాన్ని బోస్చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డిలు ఖండించారు. చంద్రగిరిలో విలేకరుల సమావేశం పెట్టి జరిగిన ఘటనలతో వారికి ఎలాంటి సంబంధం లేదని, అసత్యప్రచారాలు మానుకోవాలని స్పష్టం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బోస్చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డితోపాటు గ్రామస్తులు ధర్నా చేశారు. -
తేనెటీగల ‘చంద్రారెడ్డి’
రాజాపురం(పాల్వంచ రూరల్) : వ్యవసాయ కుటుంబమే అయినా సాగుపై అవగాహన లేదు.. అయినా సేంద్రియ సాగుపై మక్కువ పెంచుకున్నాడు.. తనకున్న భూమిలో పూల మొక్కలు.. కూరగాయలు పండించడం.. చేపల పెంపకం చేపట్టాడు.. దిగుబడి రాకున్నా నిరాశ చెందలేదు.. మలి ప్రయత్నంలో రకరకాల చేపల పెంపకంతోపాటు తేనెటీగల పెంపకం నిర్వహిస్తున్నాడు. ఒక దశకు వచ్చిన చేపలను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ.. తేనె ద్వారా మంచి లాభాలు గడిస్తున్నాడు ఖమ్మం జిల్లా రాజాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కందుల చంద్రారెడ్డి. అనంతపురం నుంచి తెచ్చిన నైజీరియా తేనెటీగల ట్రేలను తెచ్చి ఇంటి పరిసరాల్లో వాటిని పెంచుతున్నాడు. విషయం తెలిసిన పలువురు రైతులు వాటి పెంపకం గురించి అడిగి మరీ తెలుసుకుంటున్నారు. తేనెటీగల్లో నాలుగు రకాలు కొండ, పుట్ట, నైజీరియా, ముసురు తేనెటీగలు. నైజీరియా తేనెటీగల పెంపకం వల్ల ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువ. పెంపకం కూడా తేలికగా ఉంటుందని అనుభవం కలిగిన పలువురు రైతులు అంటున్నారు. బాక్స్లో ఉండే నైజీరియా తేనెటీగలను ఇంటి పరిసరాల్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో బాక్స్(ట్రే)లో రాణి ఈగతోపాటు వంద మగ ఈగలు ఉంటాయి. వాటికి తోడు రెండు లక్షల చిన్న చిన్న ఈగలు ఉంటాయి. ఈగలకు ఆహారంగా రోజు బాక్సుల్లో పంచదారతో కలిపిన ద్రావకం పోస్తే సరిపోతుంది. పొప్పడి పూలు పూచే సమయంలో నవంబర్ నుంచి జనవరి నెలల్లో ఈగలు వాటిని తిని.. తేనెను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటాయి.30 బాక్సుల్లో తేనెటీగలను పెంచుకున్న రైతుకు ఒక్కో బాక్స్ ద్వారా నెలకు 3 నుంచి 5 కేజీల తేనె దిగుబడి వస్తుంది. రెండు నెలల్లో రైతు పెంచిన తేనెటీగల ద్వారా 90 కేజీల తేనె దిగుబడి వస్తుంది. తేనె తీసే పద్ధతులు బాక్స్లో ఉండే తేనె బయటకు తీసేందుకు కొన్ని పద్ధతులున్నాయి. బాక్స్లోని తేనెను నెలకోసారి లేదా రెండు నెలలకోసారి తీయాలి. దీనికోసం ముఖానికి మాస్కులు ధరించి మరో చేతిలో పొగ పట్టుకుని తేనెటీగల బాక్సును తెరవాలి. అందులో ఉన్న తేనెతుట్టెను బయటకు తీసి ఒక యంత్రంలో వేయాలి. అప్పుడు ఈగలు కుట్టకుండా తేనెతుట్టె నుంచి తేనె బయటకు వస్తుంది. మార్కెట్లో మంచి గిరాకీ తేనెకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. కల్తీ లేని నైజీరియా తేనెటీగల ద్వారా లభించే తేనె కేజీ రూ.450 నుంచి రూ.500 చొప్పున ధర పలుకుతోంది. -
యోగా..మంచుదేగా
అందమైన మేని కోసం కుందేలులా పరుగెత్తాల్సిన అవసరం లేదు.దృఢమైన దేహం కోసం జిమ్లో చెమటోడ్చాల్సిన పని అంతకన్నా లేదు.ఆరడుగుల నేల చాలు.. ఆయుష్షున్నంత కాలం మిమ్మల్ని ఆరోగ్యంగాఉంచడానికి. పతంజలి ఆసనాల శాసనాలు అక్షరాలా అనుసరిస్తే చాలు ఈడు ముడతలు మీ దరి చేరవు. పరగడుపునే కాసేపు విల్లులా ఒళ్లు వంచి చూడండి.. వయసు పైబడినా మీ నడుం వాలితే ఒట్టు. మయూరాసనం వేయగలిగితే.. జాతక చక్రంలో మాలవ్య యోగం పట్టిన వారిలా మీ మేను నిగనిగలాడుతుంది. అదీ యోగా పవర్. యోగాసనాలు వాటి వల్ల కలిగే యోగాల గురించి సాక్షి సిటీప్లస్ తరఫున నటి, నిర్మాత మంచు లక్ష్మియోగాభ్యాసకులను పలకరించారు. మంచు లక్ష్మి: యోగా.. ఈ దేశం మనకిచ్చిన గిఫ్ట్. నేను అమెరికాలో ఉండగా నేర్చుకున్నాను. అమెరికన్స్ని చూసి నేర్చుకున్నందుకు చాలా బాధగా ఉంది. యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది మన దేశమే. చిత్రం ఏంటంటే.. పొరుగు దేశాల్లో యోగాకు ఉన్నంత క్రేజ్ మన దగ్గర లేకపోవడమే. అందుకే యోగా అందరి జీవితంలో తప్పనిసరి అవ్వాలనే ఉద్దేశంతో స్టార్ రిపోర్టర్గా ఈ రోజు ఇక్కడికి వచ్చి కాసేపు ముచ్చటిస్తున్నాను. చెప్పండి సార్.. అసలు యోగా అంటే ఏమిటి? అది ఎప్పుడు పుట్టింది? చంద్రారెడ్డి: కీస్త్రు పూర్వం ఐదువేల సంవత్సరాల క్రితమే మన దేశంలో యోగా అనే పదం ఉందంటారు. యోగాకు సంబంధించి పూర్తి హక్కులు మన దేశానికే ఉన్నాయి. రుషులు అందించిన విద్య యోగ. మనస్సుని, దేహాన్ని కలిపి చూడటమే యోగా అంటే. మంచు లక్ష్మి: అవును.. కానీ మహర్షుల జీవితాల్లో యోగా ముఖ్యమైన భాగం. ఈ హైటెక్ కాలంలో యోగా చేసే తీరిక, ఓపిక చాలా తక్కువ మందికి ఉంటుంది. వారి సంఖ్య పెంచడానికి మార్గం ఏంటి? చంద్రారెడ్డి: ఏం లేదు.. యోగా ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే. మంచు లక్ష్మి: ఇక్కడ మీ సెంటర్లో వారం రోజుల కిందట యోగాక్లాస్లోని చేరినవారైనా ఉన్నారా? కైవల్య: నేనున్నానండి. మంచు లక్ష్మి: వావ్. నువ్వు చూస్తే స్కూల్ స్టూడెంట్ వి. ఎందుకు యోగాలో చేరావు? కైవల్య: నాకు ఏదో ప్రాబ్లమ్ వల్ల మోకాళ్ల నొప్పి వచ్చింది. ఎన్ని రకాల మందులు వాడినా తగ్గడంలేదు. యోగావల్ల రిజల్ట్ ఉంటుంది అంటే వన్ వీక్ బ్యాక్ ఇక్కడ చేరాను. కొంచెం చేంజ్ కనిపించింది. మంచు లక్ష్మి: గుడ్.. కానీ మన దగ్గర చాలామంది ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటే కానీ యోగా దగ్గరికి రారు. దటీజ్ గుడ్ అండ్ బ్యాడ్. భార్గవి: కనీసం అలాగైనా రావడం మంచిదేకదా మేడమ్. మంచు లక్ష్మి: అవును.. కానీ యోగా శారీరక, మానసిక సమస్యలు తీర్చేది మాత్రమే కాదు. మనని రోజంతా యాక్టివ్గా ఉంచుతుంది. అనారోగ్య సమసల్ని దరి చేరనీయదు. అమ్మా.. మీరు ఎన్నాళ్ల నుంచి యోగా చేస్తున్నారు. సరస్వతి: ఆరేళ్లుగా చేస్తున్నాను. నాకు 59 ఏళ్లు. ఈ వయసులో సాధారణంగా ఉండే ఏ సమస్యలూ నాకు లేవు. మంచు లక్ష్మి: వావ్.. మీరు అంత వయసున్నట్టు లేరు. మీ ముఖం కూడా చాలా తేజస్సుగా ఉంది. సార్.. యోగాతో ఆర్యోగంతో పాటు ముఖంలో ప్రశాంతత, గ్లో వస్తుంది కదా! చంద్రారెడ్డి: కచ్చితంగా.. ముందుగా డల్నెస్ పోతుంది. ముఖంలో తేజస్సు, చురుకుదనం, బాగా ప్రాక్టీస్ చేసిన వారిలో పాజిటివ్ థింకింగ్ కూడా పెరుగుతుంది. మంచు లక్ష్మి: మరో ముఖ్యమైన ప్రశ్న. బరువు తగ్గడానికి యోగానే సరైన మార్గం. వారంలో, రోజులోనూ బరువు తగ్గించే వైద్య సదుపాయాలు వచ్చాయనుకోండి. కానీ యోగాతో బరువు తగ్గడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? చంద్రారెడ్డి: ఓ 20 ఏళ్ల పాటు పెంచిన కాయాన్ని.. 20 రోజుల్లో తగ్గించాలనుకోవడం చాలా తప్పు. దాని వల్ల దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యోగాతో బరువు మెల్లిగా తగ్గినా, ఎనర్జీ లెవల్స్లో ఏ మార్పూ ఉండదు. 20 కిలోల అదనపు బరువుంటే నెలకు నాలుగైదు కిలోలు తగ్గడం మంచిది. అది యోగా వల్ల మాత్రమే సాధ్యం. డైట్ కంట్రోల్ కూడా ఉండాలి. మంచు లక్ష్మి: దాని గురించీ నాలుగు ముక్కలు చెప్పండి. నాకు తెలిసి హెల్దీబాడీకి ఫైవ్ వైట్ ఫుడ్స్ ఎనిమీస్ అంటారు. చంద్రారెడ్డి: అవును.. రైస్, సాల్ట్, మైదా, షుగర్, పాలు. మంచు లక్ష్మి: పాలుకూడానా? చంద్రారెడ్డి: మనిషి ఆరేళ్ల వయసులోపు మాత్రమే పాలు తాగాలి. ఆ తర్వాత అవసరం లేదు. కచ్చితంగా చెప్పాలంటే అమ్మపాలు చాలు. మీరు చూడండి.. ఈ భూమ్మీద 84 లక్షల జీవరాశులున్నాయి. అవన్నీ వాటి తల్లి పాలు తాగుతాయి కానీ మరో జంతువు పాలు తాగాలని అనుకోవు. మనం మాత్రమే గేదె, ఆవు, మేకపాలు తాగడానికి ఇష్టపడతాం. మంచు లక్ష్మి: మరి పెరుగు? చంద్రారెడ్డి: పెరుగు కాదు.. మజ్జిగ మంచిది. దానివల్ల ప్రయోజనాలుంటాయి. మంచు లక్ష్మి: మహిళలకు యోగా తప్పనిసరి అని నా అభిప్రాయం. ఎందుకంటే వారు నేర్చుకుంటే ఇంట్లో పిల్లలకి కూడా అలవాటవుతుంది. అదొక్కటే కాదు మహిళ ఆరోగ్యంగా ఉంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. దీనికి ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పండి? భార్గవి: నేను ఏడేళ్ల నుంచి యోగా చేస్తున్నానండి. నేను ప్రెగె ్నంట్గా ఉన్నప్పుడు కొన్ని యోగాసనాలు వేశాను. దానివల్ల ఆ సమయంలో వచ్చే బీపీ, ఒంట్లో నీరు చేరడం వంటి సమస్యలేమీ రాలేదు. కవలలైనప్పటికీ నార్మల్ డెలవరీ అయింది. పాపలు పుట్టిన రెండు వారాల తర్వాత నా పనులు నేను చేసుకున్నాను. ఇది కేవలం యోగా వల్లే సాధ్యమైంది. మంచు లక్ష్మి: మరి మీ పిల్లలకు యోగా నేర్పుతున్నారా? భార్గవి: ప్రత్యేకంగా నేర్పడమంటూ ఏం లేదండి. నేను చేస్తుంటే చూసి వాళ్లే చేసేస్తున్నారు. మంచు లక్ష్మి: గ్రేట్.. చాలామంది యోగా చేయొచ్చు కదా అంటే.. టైం లేదంటారు. ఇది నిజమైన సమాధానం అంటారా ? రంజన: టైం మన చేతిలో ఉంటుంది. యోగా విలువ తెలిస్తే దానికి ఎంత టైమైనా కేటాయించగలరు. మంచు లక్ష్మి: యా.. రోజూ ఇన్ని గంటలని చేయక్కర్లేదు. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఒళ్లు వంచితే చాలు. శ్వేత: మేడమ్.. మిమ్మల్ని రెండు ప్రశ్నలడగాలి. మంచు లక్ష్మి: డెఫినెట్లీ... శ్వేత: మీరు ఎప్పుడు యోగా నేర్చుకున్నారు? మంచు లక్ష్మి: నేను అమెరికాలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో మొదలుపెట్టాను. చాలా సాధన చేశాను. తెల్లవారుజామున 4:30 గంటలకు మొదలుపెడితే ఉదయం 10 గంటల వరకూ చేసేదాన్ని. అలా రెండు నెలలు చేసిన తర్వాత నాకు కుదిరిన టైంలో చేయడం మొదలుపెట్టాను. చాలామంది గురువుల దగ్గర యోగా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాను. శ్వేత: మీ ప్రొఫెషన్లో ఒత్తిడి ఉంటుందంటారు కదా! దానికిది ఉపయోగపడిందంటారా? మంచు లక్ష్మి: ఒత్తిడిని అధిగమించడం ఒక్కటే కాదు...నేను ఐరేంద్రీ క్యారెక్టర్ అంత ఫర్ఫెక్ట్గా చేయగలిగానంటే.. దానికి కారణం యోగానే. షూటింగ్ గ్యాప్లో యాక్టివ్గా ఉండడం కోసం ఆసనాలు ప్రాక్టీస్ చేసేదాన్ని. సరస్వతి: బిజీగా ఉంటారు కదా! యోగా టైమింగ్స్ ఎలా ఎడ్జెస్ట్ చేసుకుంటున్నారు? మంచు లక్ష్మి: నాకు ఏదైనా యోగా తర్వాతే. దీని రుచి తెలిసినవారెవరూ దీన్ని వదులుకోరు. థ్యాంక్యూ సో మచ్. ఈ కథనం చూసి మరికొంతమంది యోగా చేయడానికి సిద ్ధపడతారని ఆశిస్తున్నాను. సాక్షి తరఫున రిపోర్టర్గా మిమ్మల్ని కలసినందుకు సంతోషంగా ఉంది. -
జీవ వైవిధ్యంతోనే రైతుకు రక్షణ
ఏపీ జీవ వైవిధ్య మండలి చైర్మన్ హంపయ్య వెల్లడి హైదరాబాద్: జీవ వైవిధ్య చట్టం కళ్లుగప్పి తరలిపోతున్న జీవవనరుల పరిరక్షణతోనే రైతుకు లబ్ధి చేకూరుతుందని ఏపీ జీవ వైవిధ్య మండలి చైర్మన్ డాక్టర్ ఆర్.హంపయ్య, సభ్య కార్యదర్శి ఎన్.చంద్రమోహన్రెడ్డి చెప్పారు. జీవ వైవిధ్య చట్టం, నియమావళి, వినియోగంపై వారు మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఈ చట్టం 2002లో వచ్చినప్పటికీ అవగాహన లేకపోవడం వల్ల వన్యప్రాణులు, ఔషధ మొక్కల ఉత్పత్తులు, జల సంపద వంటివి ఎటువంటి అనుమతులు లేకుండానే తరలిపోతున్నాయని వివరించారు. గిరిజనులు సేకరించే సహజ ఉత్పత్తులనేకానికి కనీస ధర కూడా ఇవ్వకుండానే పెద్దపెద్ద కంపెనీలు తరలించుకుపోతున్నాయన్నారు. మున్ముందు జీవ వైవిధ్య చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ప్రపంచ పర్యావరణ సౌలభ్య సంస్థ (జీఇఎఫ్) కింద గ్రామీణ ప్రాంతాల్లోని జీవ వనరుల సమాచారాన్ని సేకరిస్తున్నట్టు ఆ సంస్థ రాష్ట్ర సమన్వయకర్త జి.సాయిలు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
టీమిండియా కెప్టెన్కు టాలీవుడ్ స్టార్ హీరో విషెస్..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ప్రియాంకాజీ మీ ప్రభుత్వం ఏం చేస్తోంది.. అమిత్ ప్రశ్నల వర్షం
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
Advertisement