-
ముందస్తు ప్రణాళికతోనే చాందిని హత్య
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ప్రణాళికతోనే ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ను సాయికిరణ్ రెడ్డి హతమార్చాడని సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. ఈ కేసులో నిందితుడు సాయి కిరణ్ను బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీపీ సందీప్ శాండిల్య ప్రెస్మీట్ నిర్వహించారు. ‘ఈ నెల 9న చాందిని ఇంటి నుంచి వెళ్లింది. అదేరోజు సాయంత్రం ఆమె మిస్ అయినట్లు మాకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు రాగానే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. 11న అమీన్పూర్లో ఓ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే చాందిని తల్లిదండ్రులను పిలిపించాం. ఆ మృతదేహం చాందినిదేనని వారు నిర్థారించారు. అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవు. చాందినిది కేవలం హత్య మాత్రమే. పోస్టుమార్టం నివేదికలో వైద్యులు తేల్చారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే హత్య ఏ సమయంలో జరిగిందో చెప్పగలం. ఫిర్యాదు అందిన సమయానికి ముందే చాందిని హత్యకు గురైంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించాం. సీసీ పుటేజ్ను చాందిని తండ్రితో పాటు సాయికిరణ్ తండ్రికి చూపించాం. ఫుటేజ్ చూపిన తర్వాత నిందితుడి తండ్రి ఒప్పుకున్నారు. కాల్ డేటా వివరాలతో పాటు, స్నేహితులను విచారణ చేశాం. వారు ఆ సమయంలో ఎక్కడున్నారో ప్రశ్నించారు. అలాగే సాయి కిరణ్ను కూడా ప్రశ్నించాం. నిందితుడు మొదట తప్పించుకునేందుకు యత్నించాడు. హత్య జరిగిన సమయంలో తాను క్రికెట్ ఆడినట్లు తెలిపాడు. అయితే మా విచారణలో అతడు అసలు క్రికెట్ ఆడలేదని తేలింది. దీంతో అతడు అబద్ధం చెప్పాడని తేలిపోయింది. సాయికిరణ్ రెండు నెలల క్రితమే హత్య జరిగిన అడ్డగుట్ట ప్రాంతానికి వెళ్లి పరిశీలించి వచ్చాడు. చాందిని, నిందితుడు ఇద్దరూ ఆటోలో అక్కడకు వెళ్లారు. చాందిని స్నేహితులు ఎక్కువ. సెప్టెంబర్ 1 నుంచి 3 వరకూ జరిగిన గెట్ టు గెదర్లో మరో వ్యక్తితో చాందిని సన్నిహితంగా మెలిగింది. అలాగే 9న సోహైల్ అనే వ్యక్తితో పబ్కు వెళ్లాలని చాందిని అనుకుంది. కానీ సాయికిరణ్ పిలవడంతో పబ్కు రావడం లేదని సోహైల్కు చెప్పింది. ఇక తనతో పాటు మరో ఇద్దరితో చాందిని సన్నిహితంగా ఉండటం సాయికిరణ్కు నచ్చలేదు. అంతేకాకుండా పెళ్లి చేసుకోవాలని చాందిని...అతడిని ఒత్తిడి చేసింది. అయితే సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని సాయికిరణ్ చెప్పాడు. ఈ సందర్భంగా మాటా మాటా పెరిగింది. దీంతో కోపంతో చాందిని చెంప మీద కొట్టి మెడకు చున్నీ బిగించి ఉరి వేసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని గుట్ట మీద నుంచి కిందకు తోసేశాడు. హత్య చేసిన తర్వాత వేరే దారి నుంచి వెనక్కి వచ్చాడు.’ అని తెలిపారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు. ప్రతిదానికి ఫేస్బుక్పైనే ఆధారపడుతున్నారని, అంతేకాకుండా సోషల్ మీడియాపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఫేస్బుక్లో లైక్స్ తక్కువ వచ్చాయని కూడా బాధపడుతున్నారన్నారు. మృతి చెందిన చాందినితో పాటు సాయి కిరణ్ కూడా మైనరేనని సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. -
క్షణికావేశంలో హత్య చేశా: సాయికిరణ్
సాక్షి, హైదరాబాద్: క్షణికావేశంలో హత్య చేసినట్టు ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కేసులో నిందితుడు సాయికిరణ్ రెడ్డి వెల్లడించినట్టు తెలిసింది. చాందినిని తానే హత్య చేసినట్టు పోలీసులతో అతడు చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో మదీనాగూడలో ఉంటున్న సాయికిరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో తామిద్దరికీ గొడవ జరిగిందని, క్షణికావేశంలోఆమెను చంపానని నిందితుడు చెప్పినట్టు తెలిసింది. ‘ఆరేళ్ల నుంచి చాందినితో పరిచయం ఉంది. కొన్నాళ్ల క్రితం ఆమెను నాకు దూరం చేశారు. పెద్దవాళ్లకు తెలియకుండా మా స్నేహం కొనసాగింది. పెళ్లి చేసుకోవాలని పదేపదే ఒత్తిడి తెచ్చేది. 9వ తేదీ సాయంత్రం కలుద్దామని తానే ఫోన్ చేసింది. నేను చాందిని ఇంటికి వెళ్లాను. తర్వాత ఎప్పుడూ కలుసుకునే అమీన్పూర్ ప్రాంతానికి ఆటోలో వెళ్లాం. మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చింది. కెరీర్లో సెటిలైన తర్వాత చేసుకుందామని చెప్పినా వినకుండా గొడవకు దిగింది. కోపంతో ఆమెను కొట్టాను. గట్టిగా కేకలు పెట్టడంతో ఆమె గొంతు పట్టుకున్నాను. ఆమె స్పృహ తప్పిపడిపోయిందనుకుని స్నేహితులకు ఫోన్ చేశారు. ఫ్రెండ్స్ వచ్చి ఆమె చనిపోయిందని చెప్పారు. భయంతో అక్కడి నుంచి పారిపోయాన’ని పోలీసుతో సాయికిరణ్ చెప్పినట్టు సమాచారం. మరోవైపు హత్య జరిగిన అమీన్పూర్ గుట్టల్లోకి సాయికిరణ్ను పోలీసులు బుధవారం తీసుకెళ్లారు. హత్య జరిగిన తీరును సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా తెలుసుకున్నారు. హత్యకు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సాయికిరణ్ ఒక్కడే ఈ హత్య చేసివుండడని, మరికొందరు సహరించి ఉండొచ్చని చాందిని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దోషులకు కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు. కాగా, నిందితుడు సాయికిరణ్ను పోలీసులు నేడు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement