-
భూనిర్వాసితులపై మరో పిడుగు
సాక్షి, అమరావతి: రైతుల భూములను బలవంతంగా లాక్కునేందుకే ‘ఆంధ్రప్రదేశ్ భూసేకరణ సవరణ చట్టం–2018’ను టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయినా ప్రభుత్వం లెక్కచేయడం లేదు. మరో అడుగు ముందుకేసి ‘ఆంధ్రప్రదేశ్ భూసేకరణ సవరణ చట్టం–2018’ నిబంధనల పేరుతో జీఓఎంఎస్ నంబరు 390 కింద సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులోని అంశాల పట్ల రెవెన్యూ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మోసపూరిత వైఖరికి, దగాకోరు విధానానికి ఈ జీవో ప్రత్యక్ష నిదర్శనమని చెబుతున్నారు. ‘కేంద్ర భూసేకరణ చట్టం–2013’ను రాష్ట్ర ప్రభుత్వం సవరించడమే కాకుండా, ఈ సవరణ 2014 జనవరి నుంచే వర్తిస్తుందంటూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయడం దారుణమని అంటున్నారు. సర్కారు నియంతృత్వానికి నిదర్శనం ‘‘సామాజిక ప్రభావ అంచనా నుంచి మినహాయించడం అన్యాయం. పరస్పర ఆమోదం పేరుతో కన్సెంట్ అవార్డు ప్రకటించడం సరైంది కాదు. సరస్పర ఆమోదం అనే పదం కాగితాల్లో బాగానే ఉంటుంది. భూసమీకరణ కింద భూములు ఇవ్వడానికి అంగీకరించని రైతులను రాజధాని అమరావతిలో, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతంలో ప్రభుత్వం ఎలా వేధించిందో అందరికీ తెలుసు. కన్సెంట్ అంటే భవిష్యత్తులో జరిగేది ఇదే. అందుకే ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం–2018ని ఉపసంహరించుకోవాలని కోరితే ప్రభుత్వం పట్టించుకోకపోవడం నియంతృత్వ పోకడలకు నిదర్శనం. ఇది చాలదన్నట్లు ఇప్పుడు పాత తేదీ నుంచి ఈ చట్టం వర్తిస్తుందంటూ జీవో ఇవ్వడం ఏమిటి’’ అంటూ రైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ‘కేంద్ర భూసేకరణ చట్టం–2013’ను సవరిస్తూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందాక చట్టరూపం దాల్చిన తర్వాత జీవో జారీ చేసిన తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీనికి విరుద్ధంగా ‘డీమ్డ్’ అంటూ 2014 జనవరి ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు పరిగణిస్తున్నట్లు ప్రాథమిక నోటిఫికేషన్లో పేర్కొంది. ఇలా చేయడం సరికాదని రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టుకు వెళతాం... కేంద్ర భూసేకరణ చట్టం–2013కు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా... ప్రజల వ్యక్తిగత జీవనానికి, జీవనోపాధికి విఘాతం కలిగేలా ఉన్నాయని న్యాయ నిపుణులు విమర్శిస్తున్నారు. కేంద్ర చట్టానికి 12 సవరణలు చేసి రూపొందించిన ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం–2018లోని అంశాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయాలని పేర్కొంటున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పెద్ద ఎత్తున లేఖలు రాయాలని, వీటిని ఆధారంగా చూపుతూ తాము ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం–2018ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళతామని పలువురు న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. తక్షణమే ఉపసంహరించుకోవాలి: సీపీఎం కేంద్ర భూసేకరణ చట్టం–2013కు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. భూములు కోల్పోయే వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులకు నష్ట పరిహారాన్ని నిరాకరించేలా సవరణలు చేయడం దారుణమని మండిపడింది. ‘‘కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడడం కోసమే చేసిన ఈ చట్ట సవరణలను సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సవరణ చట్టం 2014 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందంటూ జీవో ఇవ్వడం రైతుల భూములను బలవంతంగా గుంజుకోవడానికే. కేంద్ర చట్టంలో రైతులకు ఉన్న రక్షణ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం సవరణల ద్వారా తొలగించింది. నిర్వాసితుల హక్కులను నిరంకుశంగా కాలరాసేందుకు పూనుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా రైతులు, నిర్వాసితులు ఆందోళనలు చేపట్టాలి’’ అని సీపీఎం మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. -
ఇక భూములు లాక్కోవడమే!
సాక్షి, అమరావతి : భూ యజమానుల అభిప్రాయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూములు తీసుకునేందుకు మార్గం క్లియరైంది. విలువైన భూములను చౌకగా, బలవంతంగా లాక్కుని అస్మదీయులకు కట్టబెట్టి వాటాలు పంచుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు సర్కారు రూపొందించిన ఏపీ భూసేకరణ చట్ట సవరణ–2017కు ఎట్టకేలకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ఈ సవరణ వల్ల ఏపీలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, కొత్త రాష్ట్రమైన ఏపీకి ఇది ఏమాత్రం ఉపయుక్తం కానందున దీనిని ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం పంపిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేసింది. కేంద్ర ప్రభుత్వం పంపిన మార్గదర్శకాలను కాలరాస్తూ మళ్లీ అవే సవరణలతో గత ఏడాది నవంబరులో అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం మళ్లీ కేంద్రానికి పంపింది. ఈ చట్ట సవరణకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే జరిగే నష్టాన్ని వివరిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉన్నతాధికారులను పంపించి.. రాష్ట్రంలో కొత్తగా 12 లక్షల ఎకరాలను సాగులోకి తెస్తున్నామని, అందువల్ల ఈ భూసేకరణ చట్ట సవరణవల్ల ఆహార భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదంటూ పదేపదే వివరించడం, పలుమార్లు లేఖలు రాయడం ద్వారా రాష్ట్రపతికి అనుకూల నివేదిక పంపించేలా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. 2013 కేంద్ర చట్టానికి తూట్లు ఇదిలా ఉంటే.. ఏపీ భూసేకరణ చట్టం–2017 సవరణలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ( భూసేకరణ చట్టం)–2013కు తూట్లు పొడించినట్లయింది. ఇప్పటివరకూ ఏ ప్రాంతంలోనైనా పారిశ్రామికీకరణ ఇతర అవసరాల కోసం భూమిని సేకరించాలంటే ఆ ప్రాంతంలో 80 శాతం మంది ప్రజల ఆమోదం తప్పనిసరని కేంద్ర భూసేకరణ చట్టం–2013 స్పష్టంగా పేర్కొంది. ఆమోదం లభించని పక్షంలో భూసేకరణ ప్రక్రియ చేపట్టడానికి వీల్లేదు. దీనినే సామాజిక ప్రభావ అంచనా సర్వే తప్పనిసరి అని అంటారు. ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంతంలో భూసమీకరణ కింద భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటూ కోర్టుకెళ్లిన వారి గ్రామాల్లో ఈ సర్వే నిర్వహిస్తే 70 శాతం మందికి పైగా వ్యతిరేకిస్తారు. అందువల్ల ఇక్కడ భూములు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యంకాదు. బహుళ పంటలు పండే ఈ భూములను ఎలాగైనా రాజధాని పేరుతో లాక్కోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టి కేంద్ర భూసేకరణ చట్టం–2013కు సవరణలు తీసుకువచ్చింది. సవరణలతో వచ్చే నష్టాలివీ.. ఏపీ భూసేకరణ చట్టం–2017వల్ల భూయజమానులకు వివిధ రకాలుగా నష్టం జరుగనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద చేపట్టే ప్రాజెక్టులు, రహదారులు, గృహ నిర్మాణ ప్రాజెక్టులు, ప్రభుత్వ అవసరాలకు ఇకపై సామాజిక ప్రభావ మదింపు అంచనా అవసరంలేదు. నచ్చిన పారిశ్రామికవేత్తలకు విలువైన భూములను సేకరించి ఇవ్వొచ్చు. - ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే భూ యజమానులు ప్రేక్షకుల్లా మిగిలిపోవాల్సి వస్తుంది. - కలెక్టరు, ఇతర అధికారులు సంప్రదింపుల ద్వారా నిర్ణయించిన ధరే ఇక ఫైనల్. దీనిపై కోర్టుకు వెళ్లడానికి కూడా అవకాశంలేదు. ఉదాహరణకు.. రాజధాని అమరావతి కోసం భూములు ఇవ్వడానికి తిరస్కరించిన గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో ఎకరా అధికారిక ధర రూ.కోటి వరకు (మార్కెట్ ధర రూ.రెండు నుంచి నాలుగు కోట్లకు పైగా) ఉందనుకుందాం. 2013 కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం దీనికి రెండున్నర రెట్లకు పైగా రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సవరించిన చట్ట ప్రకారమైతే సంప్రదింపుల్లో నిర్ణయించిన ధరను రైతులు తప్పకుండా అంగీకరించాల్సిందే. తక్కువ ధరకే భూములు ఇచ్చేందుకు అంగీకరించినట్లు రైతుల నుంచి బలవంతంగా సంతకాలు సేకరించి భూములు తీసుకోవచ్చు. -
రాష్ట్ర చట్టం ప్రకారం భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మరో తీపి కబురు వినిపించింది. కేంద్ర భూసేకరణ చట్టం–2013 ప్రకారం పునరావాసం, పరిహారం నిబంధనలు అమలు చేశాకే ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టాలంటూ కేంద్ర ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ (ఈఏసీ) కమిటీ గతంలో జారీచేసిన ఆదేశాల్లో మరిన్ని సడలింపులిచ్చింది. కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రం తెచ్చిన భూసేకరణ చట్టం–2017 ప్రకారం భూసేకరణ చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ డైరెక్టర్ కెరికెట్టా ఉత్తర్వులు వెలువరించారు. ఈ నెల 18న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఈఏసీ పర్యావరణ అనుమతులు మంజూరు చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగానే పలు షరతులను విధించింది. వాటి ప్రకారం ప్రాజెక్టుకు ముంపు ప్రాంతం ఎక్కువగా ఉన్నందున.. నిర్మాణ దశలో, నిర్మించిన తర్వాత వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలను నివేదించాలి. అటవీ శాఖ సమన్వయంతో గ్రీన్బెల్ట్ అభివృద్ధి, రిజర్వాయర్ రిమ్ ట్రీట్మెంట్ చేపట్టాలి. దేశీయ మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలి. ఘన వ్యర్థాల నిర్వహణ పక్కాగా ఉండాలి. ప్రధానంగా ప్లాస్టిక్ వ్యర్థాలను శాస్త్రీయ విధానంతో రీసైక్లింగ్ చేయాలి. భూసేకరణ చట్టానికి అనుగుణంగా భూమిని కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వాలి. -
భూసేకరణ ‘చట్ట సవరణ’కు బ్రేక్!
⇒ చట్టంలో సామాజిక ప్రభావ మదింపు తొలగించాలన్న రాష్ట్ర ప్రభుత్వం ⇒ ఆర్డినెన్సు జారీకి అనుమతివ్వని రాష్ట్రపతి ⇒ ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు వచ్చే అవకాశం లేదంటున్న అధికారులు ⇒ సర్కారు ఎత్తులు పారవంటున్న న్యాయ నిపుణులు సాక్షి, అమరావతి: కేంద్ర భూసేకరణ చట్టం–2013కు సవరణల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చట్ట సవరణ/ఆర్డినెన్సుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కేంద్ర భూసేకరణ చట్టంలోని అత్యంత ముఖ్యమైన సామాజిక ప్రభావ మదింపునకు తూట్లు పొడవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించే అవకాశం కనిపించడం లేదు. భూసేకరణవల్ల పర్యావరణ పరంగా, నిర్వాసితులకు సామాజికంగా, ఉపాధిపరంగా, ఆర్థికంగా కలిగే నష్టాలపై సామాజిక ప్రభావ మదింపు జరపాలన్న ఈ చట్టంలోని ప్రధాన నిబంధనను తొలగించాలని ప్రభుత్వం దొడ్డిదారి ప్రయత్నాలు ఆరంభించింది. ఇందులో భాగంగానే సామాజిక ప్రభావ మదింపు నిబంధనను కేంద్ర భూసేకరణ చట్టం–13 నుంచి మినహాయిస్తూ ఆర్డినెన్సు జారీ చేసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, హోంశాఖ ద్వారా వెళ్లిన ఈ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించకుండా పక్కన పెట్టేశారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా ఆమోదించిన ఈ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్సు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై న్యాయ నిపుణులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఇప్పటికి బ్రేక్ పడ్డట్లే... ప్రస్తుతానికి కేంద్ర భూసేకరణ చట్టం–13 సవరణకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్లేనని అధికారులు అంటున్నారు. ఈ చట్టం మూల లక్ష్యమైన సామాజిక ప్రభావ మదింపునకు తూట్లు పొడుస్తూ ఆర్డినెన్సు జారీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించి కేంద్రానికి పంపడాన్నే నిపుణులు తప్పుబడుతున్నారు. ‘ఈ చట్ట సవరణకు ఆర్డినెన్సు అనే పేరు ఉచ్చరించాలంటేనే జుగుప్సాకరంగా ఉందని నేను గతంలో వ్యాఖ్యానించాను. న్యాయ నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఉన్నారు’ అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అన్నారు. ‘ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టే అవకాశం లేదు. ఆర్డినెన్సు జారీకి కూడా రాష్ట్రపతి నుంచి ఆమోదం రాదు. దీంతో 2013 భూసేకరణ చట్ట సవరణ ప్రతిపాదన తాత్కాలికంగా ఆగిపోయినట్లే’ అని మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం త్వరలో ముగుస్తున్నందువల్ల ఆయన ఈ వివాదాం శాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించరని కేంద్ర న్యాయ శాఖకు చెందిన అధికారి రాష్ట్ర అధికారుల వద్ద వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మౌలిక సదుపాయాల కల్పన ముసుగులో పేదల భూములను బలవంతంగా లాక్కునేందుకే సామాజిక ప్రభావ మదింపు అంశాన్ని ఈ చట్టం నుంచి తొలగించాలని రాష్ట్ర సర్కారు కుట్ర పూరితంగా ప్రయత్నిస్తోందని, అవసరమైతే న్యాయ స్థానం ద్వారానైనా దీనిని అడ్డుకుంటామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. -
అది టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే
♦ ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరుగుదలపై వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ధ్వజం ♦ తెలంగాణ, ఏపీ సీఎంలకు భూమి పిచ్చి పట్టుకుంది: కొండా రాఘవరెడ్డి ♦ భూసేకరణ సవరణ చట్టంపై కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్రావు, చంద్రబాబు అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఇద్దరు సీఎం లకు భూమి పిచ్చి పట్టుకుందని దుయ్య బట్టింది. ఇరు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు, ఇతర అవసరాల కోసం భూసేకరణకు అనుసరి స్తున్న విధానాలేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. తెలంగాణలో ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ. 50–70 వేల కోట్ల నుంచి రూ. 2.44 లక్షల కోట్లకు పెరగడానికి ప్రాజెక్టుల నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వ జాప్యమే కారణమని ఆ పార్టీ ప్రధాన కార్య దర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. ఈ అంచనా వ్యయం రూ. 3.44 లక్షల కోట్లకు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని, ఇందుకు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. సోమవారం హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు. జీవో 123 మతలబు ఏమిటో, కేంద్ర భూసేకరణ చట్టం–2013 ఎందుకు వద్దో, రాష్ట్ర భూసేకరణ (సవరణ) చట్టం–2016 అవసరం ఏమిటో వివరిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాకుండా దీనిపై అర్థమయ్యేలా ప్రజలకు సీఎం కేసీఆర్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు జీవో 123 ప్రకారం ఎంత భూమిని సేకరించారో వెల్ల డించాలని డిమాండ్ చేశారు. కేంద్ర భూసేక రణ చట్టం–2013కు హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం సవరణ చట్టాన్ని తీసుకురావా ల్సిన అవసరమేమిటో చెప్పాలన్నారు. ప్రచారార్భాటాల కోసమే కేసీఆర్ ప్రభుత్వం శాసనసభ సమావేశాలను ఉపయోగించు కుంటోందని రాఘవరెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో రూ. 23 వేల కోట్ల వరకు కేటాయించి ఇప్పటివరకు కేవలం రూ. 11 వేల కోట్ల మేర మాత్రమే ఖర్చు చేశారన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 12 ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం, ఇతర అంశాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 75 వేల ఎకరాలను సేకరించాల్సి ఉండగా, కేవలం 5 వేల ఎకరాలే సేకరించినా ఆ ప్రాజెక్టు నుంచి 2018కల్లా నీరిస్తామని సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెద్ద ఎత్తున పెంచేసిన ప్రభుత్వం రైతులు, నిర్వాసితులకు రూ. 10–20 వేల కోట్ల వరకు పరిహారం చెల్లించేందుకు వెనకడుగు ఎందుకు వేస్తోందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్వాసితులంటే ప్రభుత్వానికి అంత కక్షసాధింపు ఎందుకని వైఎస్సార్ కాంగ్రెస్ నేత నిలదీశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement