-
కారు దొంగతనం.. డ్రైవింగ్ రాక 10 కి.మీ తోసుకెళ్లి... చివరికి!
ఉత్తర ప్రదేశ్లో వింత దొంగతనం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు కలిసి అడ్డదారిలో డబ్బు సంపాదించేదుకు ఓ కారును దొంగతనం చేయాలనుకున్నారు. అనుకున్నట్లే కారును దొంగిలించారు కానీ తరువాతే అసలు విషయం తెలిసింది. ముగ్గురిలో ఎవరికి కూడ డ్రైవింగ్ రాదని.. దీంతో చేసేదేం లేక కారును దాదాపు 10 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్లారు. అమినా చివరకు పోలీసులకు పట్టుబట్టారు. అసలేం జరిగిందంటే.. కాన్పూర్లోని దబౌలి ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అమన్ గౌతమ్, సత్యం కుమార్ కాలేజీ విద్యార్థులు. వీరికి అమిత్ వర్మతో పరిచయం ఏర్పడింది. ముగ్గురు కలిసి మే 7న కారు మారుతి వ్యాన్ను దొంగిలించాలని ప్లాన్ చేశారు. పథకం ప్రకారమే కారును దొంగిలించారు. అయితే అక్కడే ఈ ముగ్గురికి కష్టాలు మొదలయ్యాయి. ముగ్గురిలో ఎవరికి కారు డ్రైవింగ్ రాదని అర్థమైంది. అయినా కారును వదిలి వెళ్లాలని అనిపించలేదు. దీంతో కారును నెట్టుకుంటూ తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా రాత్రి 10 కిలోమీటర్లు దబౌలి నుంచి కళ్యాణ్పూర్ వరకు వ్యాన్ను తోసుకుంటూ వెళ్లారు. 10 కిలోమీటర్ల పాటు కారు తోయడంతో ఇక తమ వల్ల కాదని, నెంబర్ ప్లేట్ తొలగించి, ఓ నిర్మానుష్య ప్రాంతంలో దాచిపెట్టి అక్కడి నుంచి పారిపోయారు. తరువాత వచ్చి ఆ కారును అమ్మేయాలని కుట్ర పన్నారు. చివరికి ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో ముగ్గురు దొంగల్ని అరెస్ట్ చేశారు. ఈ దోపిడీకి అమిత్ స్కెచ్ వేయగా.. దీన్ని వెబ్ సైట్ ద్వారా అమ్మేందుకు సత్యం ప్లాన్ చేశాడని ఏసీపీ భేజ్ నారాయణ్ సింగ్ వెల్లడించారు. ఒకవేళ కారు కొనడానికి ఎవరూ దొరక్కపోతే.. వెబ్ సైట్ ద్వారా విక్రయించాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు. చదవండి: స్మార్ట్ టన్నెల్.. సెల్ సిగ్నల్ దొరక్క ప్రాణం పోయింది! -
అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు: చికోటి ప్రవీణ్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తన కారు చోరీ సాధారణ దొంగతనం కాదని, తనకు కేసీనో ఇండస్ట్రీలోని ప్రత్యర్ధుల నుండి ప్రాణహాని ఉందని కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ అన్నారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ, కొంత కాలంగా రెక్కి నిర్వహిస్తున్నారని, పోలీసులు విచారణ జరిపి సెక్యూరిటీ పెంచాలని కోరారు. ‘‘నేను రాజకీయాల్లోకి వస్తునాన్నని తెలిసి టార్గెట్ చేశారు. ఈడీ విచారణ మొదలైనప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈడీ విచారణ దర్యాప్తులో ఉందన్నారు. కేసీనో నిర్వహిస్తున్నానని, అది తన ప్రొఫెషన్ అన్న చికోటి.. ప్రభుత్వానికి టాక్స్లు చెల్లించి లీగల్ ఉన్న దగ్గరే కేసీనో నడుపుతున్నానన్నారు. హిందూత్వం కోసం కేసీనోను వదులుకోవడానికి తాను సిద్ధమని, అవకాశం ఉంటే రాజకీయాల్లోకి రావడానికి రెడీ అని చికోటి ప్రవీణ్ అన్నారు. కాగా, చీకోటి ప్రవీణ్ కారు చోరీకి గురైంది. సైదాబాద్ ఇంట్లో కారును దుండగులు దొంగిలించారు. ఇన్నోవా కార్ కీస్ వెతికి కారుతో పరారయ్యారు. సైదాబాద్ పీఎస్లో చికోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చదవండి: ఉపాధ్యాయుల వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త -
దొంగిలించిన కారులో వెళ్తుండగా ప్రమాదం.. చికిత్స పొందుతూ మరో బైక్ చోరీ
సాక్షి, ములుగు: కారును దొంగిలించి సొమ్ము చేసుకోవాలనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. తప్పించుకునే తొందరలో వేగంగా వెళ్లిన దొంగలకారు విద్యుత్ స్థంభానికి ఢీ కొట్టడంతో ఆస్పత్రిపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన సయ్యద్ అప్సర్ కారు తన ఇంటి వద్ద నిలిపి ఉండగా ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించి, కారును వేగంగా నడుపుతూ తీసుకెళ్తుండగా మంగపేట మండలం గంపోనిగూడెం వద్ద విద్యుత్ స్తంభానికి ఢీకొట్టారు. దీంతో ఇద్దరు గాయపడడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు తాడ్వాయి మండలం వీరాపురం గ్రామానికి చెందిన చీరల సందీప్ కాగా.. మరొకరు రాజ్కుమార్గా గు ర్తించారు. మంగపేట పోలీస్స్టేషన్లో రోడ్డు ప్రమా దం కేసు నమోదు కాగా, ఏటూరునాగారంలో కారు అపహరణ కేసు నమోదైంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఆ ఇద్దరిలో రాజ్కుమార్ ఏటూరునాగారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సామాజిక ఆస్పత్రి వద్ద విధులు నిర్వర్తిస్తున్న గడ్డం దశరథం 108 డ్రైవర్ బైక్ను తీసుకొని ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది, బైక్ యజమాని తలలు పట్టుకుంటున్నారు. ఒక కారుతో జరిగిన రోడ్డు ప్రమాదంలో వారి దొంగతనం బయటపడి పోలీసులకు చిక్కగా చికిత్స పొందుతూ మరో బైక్ను దొంగలించడం హాట్ టాపింగ్ మారింది. అంతేకాకుండా పోలీసులకు చిక్కినట్లే చిక్కి ఒక దొంగ పారిపోవడం గమనార్హం. ఇద్దరు దొంగలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. కానీ, సోమవారం రాత్రి వరకు కూడా బైక్పై పారిపోయిన వ్యక్తి వివరాలు తెలియలేదు. చదవండి: హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. యంగ్ జర్నలిస్ట్ మృతి -
సినీ నిర్మాత కారు చోరీ
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని పార్క్ హయత్ హోటల్లో ఫార్చునర్ కారు చోరీకి గురైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు సదాహల్లి మల్బరి మెడోస్ విల్లాస్లో ఉంటున్న ప్రముఖ వ్యాపారి, సినీ నిర్మాత వి.మంజునాథ్ ఈ నెల 22న హైదరాబాద్కు వచ్చి పార్క్హయత్ హోటల్లో బస చేశాడు. ఈ నెల 26న బయటికి వెళ్లి తిరిగివచ్చిన ఆయన తన కారును పార్కింగ్ చేశాడు. 27న ఉదయం బయటికి వెళ్లేందుకు కారు తీయడానికి వెళ్లగా పార్కింగ్ స్థలంలో కారు కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం కనిపించలేదు. కారులో చెక్బుక్లు, మొబైల్ఫోన్లు, బెంజికారు తాళాలు, ఖరీదైన డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు ఉన్నట్లు పేర్కొంటు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పార్కి ంగ్ ప్లేస్తో పాటు హోటల్ చుట్టూ సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
భర్తకు షాక్! భార్యతో సహా కారు దొంగతనం
ఛండీగఢ్ : భార్యను కారులో వదిలి వెళ్లిన ఓ భర్తకు షాక్ ఇచ్చారు దొంగలు. భర్యతో సహా వాహనాన్ని తీసుకెళ్లిపోయారు. ఈ సంఘటన పంజాబ్లోని డేరా బస్సిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం మధ్యాహ్నం డేరా బస్సికి చెందిన రాజీవ్ చంద్, రీతు దంపతులు తమ పిల్లల స్కూలు ఫీజు చెల్లించడానికి స్కూలు దగ్గరకు వచ్చారు. కారు తాళం చెవి అలాగే ఉంచి, రాజీవ్ స్కూల్లోకి వెళ్లాడు. రీతు కారు లోపలే ఉండి అతడి కోసం ఎదురుచూస్తోంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు వ్యక్తులు కారులోకి చొరబడ్డారు. ( రన్నింగ్ బస్సులోనుంచి దూకిన యువతులు ) ఒకరు డ్రైవింగ్ సీటులో కూర్చోగా.. మరొకరు రీతు నోరును గుడ్డ ముక్కతో మూసి, కారును తీసుకెళ్లిపోయారు. దాదాపు ఐదు కిలోమీటర్లు వెళ్లిన అనంతరం రీతును ఓ చోట కిందకు తోసి కారును తీసుకెళ్లిపోయారు. స్కూల్లో పని ముగించుకుని బయటకు వచ్చిన రాజీవ్ అక్కడ కారు కనిపించకపోయే సరికి కంగారుపడ్డాడు. భార్యకు ఫోన్ చేసినా స్పందించకపోయే సరికి పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు. కాగా, కొన్ని గంటల తర్వాత రీతు ఇంటికి చేరుకోవటంతో రాజీవ్ ఊపిరి పీల్చుకున్నాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement