-
రికవరీ రేటు 96.59 శాతం
ముంబై: మహారాష్ట్రలో కరోనా బాధితుల రికవరీ రేటు పెరుగుతోంది. గురువారం రికవరీ రేటు 96.59 శాతానికి చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. మరణాల రేటు 2.01 శాతంగా ఉంది. గత నెలలో రికవరీ రేటు 93 శాతంగానే ఉంది. అలాగే ఒక్కరోజే 11,124 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 60,75,888కి పెరిగింది. ఇక కొత్తగా 7,242 కోవిడ్ కేసులు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 62,90,156కి చేరుకుంది. గత 24 గంటల్లో 190 మంది కరోనాతో పోరాడుతూ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 1,32,335కి చేరుకుంది. బుధవారం రాష్ట్రంలో 6,857 కొత్త కేసులు, 286 మరణాలు నమోదైన సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో 1,90,181 కరోనావైరస్ పరీక్షలు జరిగాయి, ఇప్పటివరకు అధికారులు రాష్ట్రంలో 4,75,59,938 కరోనా టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం 78,562 క్రియాశీల కేసులు ఉన్నాయి. 4,87,704 మంది గృహ నిర్బంధంలో 3,245 మంది సంస్థాగత నిర్బంధంలో ఉన్నారు. క్రియాశీల రోగులలో పుణే జిల్లాలో అత్యధికంగా 16,177 కేసులు ఉన్నాయి. అలాగే అదే జిల్లాలో అత్యధికంగా 10,52,367 మంది రోగులు కోలుకున్నారు. రాజధానిలో 341 కేసులు.. గత 24 గంటల్లో రాజధాని ముంబైలోనే కొత్తగా 341 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇక్కడ కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,35,505 అయింది. ముంబైలో 13 మంది కరోనాతో చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 15,808గా నమోదైంది. ముంబై, ఉపగ్రహ పట్టణాలతో కూడిన ముంబై డివిజన్లో ఒక్కరోజులో 1,011 కేసులు నమోదయ్యాయి. పుణే డివిజన్లో 2,801 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. లాతూర్ డివిజన్లో కొత్తగా 375 కరోనా కేసులు నమోదైతే ఔరంగాబాద్ డివిజన్లో 94, కొల్లాపూర్ డివిజన్లో 1,847 కేసులు నమోదయ్యాయి. కొల్హాపూర్ ప్రాంతంలో 48 మరణాలు నమోదయ్యాయి, తరువాత పుణే, ముంబై పరిసర ప్రాంతాలలో వరుసగా 40, 31 మరణాలు సంభవించాయి. అకోలా డివిజన్లో 28, నాగ్పూర్ డివిజన్లో 32 కేసులు నమోదయ్యాయి. నాసిక్ డివిజన్లో తాజాగా 1,054 కేసులు నమోదయ్యాయి. భండారా, నందుర్బార్ జిల్లాలతో పాటు పర్భని మునిసిపల్ కార్పొరేషన్ ఏరియాలో గురువారం ఎలాంటి కొత్త కరోనా వైరస్ కేసులు రాలేదు. ఔరంగాబాద్, నాసిక్, లాతూర్, నాగ్పూర్, అకోలా ప్రాంతాలలో వరుసగా 26, 17,12, 9, 7 తాజా కరోనా మరణాలు నమోదయ్యాయి. థానేలో 292 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయని, మొత్తం కేసుల సంఖ్య 5,43,814కి చేరుకుందని జిల్లా వైద్యాధికారి తెలిపారు. గత 24 గంటల్లో జిల్లాలో 11 మంది కోవిడ్ కారణంగా మరణించారని ప్రకటించారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 11,009కి చేరిందని తెలిపారు. జిల్లాలో మరణాల రేటు 2.02 శాతంగా ఉంది. రికవరీ, క్రియాశీల కేసుల వివరాలను జిల్లా యంత్రాంగం అందించలేదు. పాల్ఘర్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 1,29,488కి చేరుకోగా మరణాల సంఖ్య 3,190గా ఉందని అధికారులు తెలిపారు. -
ప్రత్యేక హోదా ప్రకటన రాకుంటే జైల్ భరో
ప్రత్యేక హోదాపై రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమానికి పిలుపునిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం నిరంతర పోరాట కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిట్లు రామకృష్ణ తెలిపారు. అక్టోబర్ రెండో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు, ఎనిమిదో తేదీ నుంచి పాదయాత్ర కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తామని వివరించారు. రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధానికి ప్రత్యేక హోదా కోసం సామూహిక రాయబారం చేయనున్నామని తెలిపారు. -
దుర్గగుడి ఖాతాలో సర్కారు ఉగాది ఖర్చు!
25 లక్షలు ఇవ్వాలంటూ ఆదేశాలు ఆలయంలో ఉగాది ఉత్సవాలకు కోత తూతూ మంత్రంగా అమ్మవారి చైత్ర మాసోత్సవాలు? ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు సాక్షి, విజయవాడ: ఉగాది వేడుకలను రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసిన తుళ్లూరులో నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా రాజధానికి భూములిచ్చిన రైతులకు సత్కారాలు చేయడంతోపాటు వేదపండితులతో పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సీఎం చంద్రబాబుతోపాటు ఆయన మందీమార్బలమంతా తరలిరానుంది. దీనికయ్యే ఖర్చు రూ.25 లక్షలను ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఈ ఖర్చు భారమంతటినీ విజయవాడ కనక దుర్గమ్మపైన పెట్టారు. ఈ మేరకు తుళ్లూరులో అయిన ఖర్చులన్నింటినీ దేవస్థానం నుంచి విడుదల చేయాలని ఆలయ అధికారులకు ఆదేశాలందినట్లు సమాచారం. దేవస్థానంలో ఉగాది ఉత్సవాలకు కోత.. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఉగాది పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కొత్త సంవత్సరం తొలిరోజు కావడంతో దేవస్థానానికి భక్తులు కూడా పెద్దసంఖ్యలో తరలివస్తారు. ఉగాది పండుగరోజు నుంచే 18 రోజులపాటు దేవస్థానంలో అమ్మవారి చైత్ర మాసోత్సవాలు(వసంత నవరాత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కల్యాణ మహోత్సవాలు) నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఈ ఏడాది ఉగాది వేడుకలకు, చైత్ర మాసోత్సవాలకు సుమారు రూ.6 లక్షలు ఖర్చవుతాయని దేవస్థానం అధికారులు అంచనాలు తయారు చేశారు. అయితే తుళ్లూరులో ప్రభుత్వం నిర్వహించే ఉగాది వేడుకల ఖర్చు భారం దేవస్థానంపై పడటంతో దుర్గగుడిలో జరిపే ఉగాది వేడుకలు, చైత్ర మాసోత్సవాల ఖర్చును తగ్గించాలని దేవస్థానం అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో అంచనాలు వేసిన రూ.6 లక్షల్లో సగానికి కోత పెట్టి రూ.3 లక్షలు ఖర్చు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అమ్మవారి సొమ్ముతో ప్రభుత్వం సోకులా? భక్తులు అమ్మవారిపై నమ్మకంతో కానుకలు, మొక్కుబడులు సమర్పిస్తారు. ఈ నిధుల్ని దేవస్థానం అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకు మాత్రమే ఖర్చు చేయాలి. అందుకు భిన్నంగా ప్రభుత్వం నిర్వహించే ఉగాది ఉత్సవాలకు దేవస్థానం నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారికి చేసే ఉత్సవాల్లో కోతలు విధించి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. -
‘గ్రేటర్’లో మరో 8 స్వైన్ఫ్లూ కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో స్వైన్ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. గ్రేటర్ పరిధిలో కేవలం 17 రోజుల్లో ఏడుగురు చనిపోగా, 136 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆదివారం మరో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. హోలిస్టిక్ ఆస్పత్రిలో 39 ఏళ్ల వ్యక్తి, బసవతారకం ఆసుపత్రిలో 57 ఏళ్ల మహిళ, రెయిన్బో ఆస్పత్రిలో 8 ఏళ్ల బాలిక, కేర్లో 28 ఏళ్ల మహిళతో పాటు 25 ఏళ్ల యువకుడు చికిత్స పొందుతున్నారు. అవేర్గ్లోబల్ ఆస్పత్రిలో ఇద్దరు వ్యక్తులు, కాంటినెంటల్ ఆస్పత్రిలో 38 ఏళ్ల మహిళ స్వైన్ ఫ్లూ లక్షణాలతో చేరారు. -
సింగపూర్ ప్రభుత్వమే నిర్మించే రాజధాని తుళ్లూరు
నేలపాడు(తుళ్లూరు) : పూర్తిస్థాయిలో సింగపూర్ ప్రభుత్వం నిర్మించే రాజధాని నవ్యాంధ్రప్రదేశ్ మాత్రమేనని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పి. నారాయణ వెల్లడించారు. సీఆర్డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్తో కలసి శుక్రవారం నేలపాడు వచ్చిన మంత్రి భూ సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఒక్కరోజు 40 మంది రైతులు తమ 106.48 ఎకరాల భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ మంత్రికి అంగీకార పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడారు. నేలపాడులో మొత్తం 1470 ఎకరాల భూమి ఉందన్నారు. దీనిలో 1206 ఎకరాల పట్టాభూమిని మొత్తం 685 మంది రైతులు రాజధానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ భూసేకరణ చట్టం ద్వారా భూములు తీసుకుంటే రైతులకు తీవ్ర నష్టం వస్తుందని భావించిన సీఎం ల్యాండ్ పూలింగ్ చేపట్టినట్టు తెలిపారు. నూతన రాజధానిలో మొదటి లబ్ధి ఈ ప్రాంత రైతులకే దక్కుతుందన్నారు. జూన్లో సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ప్లాన్ ఇస్తే వెంటనే మంచి రోజు చూసుకుని రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.తొలి దశ పనులు మూడేళ్లలో పూర్తి కాగలవని అంచనా వేశామన్నారు. మురుగు నీరు బయటకు వెళ్లే అవకాశం లేని నేలపాడు గ్రామాన్ని ప్రభుత్వం తీసు కోవాలని ఓ రైతు కోరగా ప్రస్తుతం గ్రామాలను కదిలించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు, వివాదాలను పరిష్కరిస్తూ రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ అనుమతి ప్రతాలను తీసుకునేందుకు డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసమూర్తిని భూ సమీకృత అధికారిగా నియమిస్తున్నట్లు చెప్పి ఆయనను రైతులకు పరిచయం చేశారు. అనంతరం మంత్రి, సీఆర్డీఏ కమిషనర్ భూములు ఇచ్చే రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుని రశీదులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్దండే, జేసీ చెరుకూరి శ్రీధర్,ఆర్డీవో భాస్కరనాయుడు, తహశీల్దార్ సుధీర్బాబు తదితరులు పాల్గొన్నారు. భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలు అందజేసిన రైతులు కొమ్మినేని ఆదిలక్ష్మి 3.5 ఎకరాలు, కాటా అప్పారావు ఎకరం, ధనేకుల రామారావు 11 ఎకరాలు, భూక్యా సాలి 80 సెంట్లు, కొమ్మినేని శేషగిరిరావు 5 ఎకరాలు, ఇందుర్తి నాగమల్లేశ్వరరావు 55 సెంట్లు, గుజ్జర్లపూడి తిరుపతిరావు ఎకరం, కణతరపు సాంబశివరావు 4.75 ఎకరాలు, పారా పార్వతి 95 సెంట్లు, ఆలూరి వెంకటేశ్వరరావు 6 ఎకరాలు, మూల్పూరి రాంబాబు 5.75 ఎకరాలు, కె.రాఘవయ్య 5 ఎకరాలు, ఇందుర్తి వెంకటేశ్వరరావు 55 సెంట్లు, యంపరాల నవత 1.50 ఎకరాలు, కొమ్మగూర ఇసాక్ 1.70 ఎకరాలు, కణతరపు శ్రీమన్నారాయణ 3.5 ఎకరాలు. ఇంకా పలువురు ఉన్నారు. తొలిరోజు 106.48 ఎకరాలు నేలపాడులో శుక్రవారం జరిగిన ల్యాండ్ పూలింగ్ కార్యక్రమంలో 106ఎకరాల 48 సెంట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు 40 మంది రైతులు అంగీకార పత్రాలను సమర్పించారు. మొదటి రోజు కనీసం 500 ఎకరాలకు అంగీకార పత్రాలు తీసుకోవాలనే లక్ష్యంతో అధికారులు, మంత్రి, సీఆర్డీఏ కమిషనర్ గ్రామానికి వచ్చారు. అయితే శుక్రవారం కావడం ఒక కారణమైతే, మరోవైపు భారీ వర్షం కురవడంతో రైతులు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. దీనిపై తహశీల్దార్ సుధీర్బాబు మాట్లాడుతూ తొలిరోజు 40 మంది రైతులు ముందుకు రావడం ఆశించదగిన పరిణామం అన్నారు. శనివారం ఎక్కువ మంది రైతులు వచ్చే అవకాశం వుందని అన్నారు. వారంలోపు నేలపాడులో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement