-
ఏడాది పూర్తయినా..
విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులు కొన్ని చోట్ల విత్తనాలు కూడా వేసేశారు. మరి కొంతమంది విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో చాలామంది రైతులు చేతిలో డబ్బుల్లేక అవస్థలు పడుతున్నారు. గతేడాది రైతులకు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాయితీ ఇంతవరకు చెల్లించలేదు. పంట ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ అయినా సకాలంలో ఇస్తే ఈ ఖరీఫ్కు సీజన్కు అవసరమైన విత్తనాలు కొనుగోలు చేసుకునేవారమని రైతులు అంటున్నారు. గతేడాది ఖరీఫ్లో జిల్లాలోని ఆరు మండలాల్లో కరువు ఏర్పడింది. దీంతో ప్రభుత్వం గంట్యాడ, విజయనగరం, మెంటాడ, దత్తిరాజేరు, కొత్తవలస , వేపాడ మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2108.5 హెక్టార్లలో పంట పోవడంతో 73,057 మంది రైతులకు పంపిణీ చేయడానికి రూ. 3.16 కోట్లు అవసరమని వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రతిపాదనలు పంపి ఏడాదవుతున్నా ప్రభుత్వం ఇంతవరకు నిధులు విదల్చలేదు. వెతుకులాట.. గతేడాది పరిహారం ఇంతవరకు అందకపోగా, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు చేతిలో చిల్లగవ్వ లేకపోవడంతో ఆరు మండలాల రైతులు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా ముందు ఏడాది పండిన పంటలో కొంత ఉంచుకుని దాన్ని మరుచటి ఏడాది అమ్ముతారు. ఆ డబ్బును వ్యవసాయ ఖర్చులకు వినియోగిస్తారు. అయితే గతేడాది ఖరీఫ్లో పంట లేకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది ప్రైవేట్ వ్యాపారుల వద్ద డబ్బులు అప్పులు తీసుకుని సాగు చేపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిహారం మంజూరు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పలువురు రైతులు కోరుతున్నారు. -
మోదీని కేసీఆర్ కలిశాకే ఆ అవకాశం
పాత నోట్లతో రైతులకు విత్తనాల కొనుగోలు వెసులుబాటుపై పల్లా సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రాలకు జరిగిన నష్టాన్ని ప్రధానికి తెలిపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మోదీని కేసీఆర్ కలసిన తర్వాతే రైతులకు పెద్ద నోట్లతో విత్తనాలు కొనే అవకాశం లభించిందని తెలిపారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేక దిద్దుబాటు చర్యలు తీసుకుందన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడకుండా చర్యలు చేపట్టామని, ఈ విషయంలో కేసీఆర్ నిర్మాణాత్మక వైఖరిని అవలంబిస్తున్నారని చెప్పారు. మహిళలు పోపు డబ్బాలో దాచుకున్న మొత్తాలను నల్లడబ్బుగా పరిగణించవద్దని కేసీఆర్ మోదీని కోరి దేశవ్యాప్తంగా మహిళల అభిమానాన్ని చూరగొన్నారన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మంత్రి కేటీఆర్ మాట్లాడిన తర్వాతే దేశవ్యాప్తంగా పాతనోట్లతో మున్సిపల్, ఇతర బిల్లులు కట్టేందుకు అవకాశం లభించిందన్నారు. కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఇప్పటికే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని, ఇంకా అవాకులు చవాకులు పేలితే భూస్థాపితం చేయడం ఖాయమన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement