-
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జైళ్లకు భయపడనని, ప్రాణాలైనా బలిపెట్టి పోరాడుతా కానీ తెలంగాణకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిని ప్రైవేటీకరించాలని కాంగ్రెస్, బీజేపీ చూస్తున్నాయని చెప్పారు. తెలంగాణ హక్కులు కాపాడుకునేందుకు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. శనివారం సాయంత్రం మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. మోదీ గోదావరిని ఎత్తుకపోతుండు ‘గోదావరి నదిని ప్రధాని మోదీ ఎత్తుకొనిపోతున్నాడు. అన్యాయం చేస్తామంటున్నాడు. ఊకుందామా? కృష్ణానదిని అప్పగించినా ఈ ముఖ్యమంత్రికి కుయ్యి, కుట్కు లేదు. గోదావరిని తమిళనాడుకు అప్పగిస్తే నోరు తెరుస్తలేడు. అడ్డగోలుగా మాట్లాడుతూ గుడ్లు పీకుతా, పేగులు మెడలేసుకుంటా, లాగుల తొండలు జొర్రగొడుతా, జైల్లో వేస్తా అంటున్నాడు. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన. ఈ జైళ్లకు నేను భయపడతానా? భయపడితే ఈ రాష్ట్రమొచ్చేదా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. శిఖలు పట్టుకుని కొట్టుకుంటున్నారు ‘రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయి. కరెంట్ లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. కరెంటు ఎందుకు పోతోంది. పట్టణాల్లో ఒక రూపాయికే పరిశుభ్రమైన నీరు, రైతుబంధు, బీమా, కల్యాణలక్ష్మి ఎందుకు రావడం లేదు? విదేశీ విద్యా రుణం లేదు.. మెడికల్ కాలేజీల పర్మీషన్లు లేవు. వసతిగృహాల్లో విద్యార్థులు కలుíÙతాహారంతో చనిపోతున్నారు. నాలుగు నెలల దాకా వచ్చినవన్నీ ఇప్పుడు యాడికి పోయినయి. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, సీఎంఆర్ఎఫ్ ఏడపాయె. రైతులకు బోనస్ రూ.500, తులం బంగారం, మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సులు పెడితే ఆడవాళ్లు శిఖలు పట్టుకుని కొట్టుకుంటున్నారు. ఆటో కార్మీకులు ఆగమయ్యారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి మాత్రం నోటికి ఏది వస్తే అది చెబుతున్నారు. ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడిపై ఒట్లు పెడుతున్నారు. రుణమాఫీ చేయాలని అడిగితే డిసెంబర్ 9, వంద రోజులు, ఆగస్టు 15 అంటున్నారు..’ అని మాజీ సీఎం ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు ‘మేం పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేసినం. ఇప్పుడు హరితహారాల్లో చెట్లు ఎండిపోతున్నాయి. క్రీడా ప్రాంగణాల్లో చెట్లు మొలుస్తున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో చెత్త పేరుకుపోతోంది. బీఆర్ఎస్ పనులన్నీ నిలిపివేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఇప్పుడు పంటలను కొనే దిక్కులేదు. ఐదెకరాలకే రైతుబంధు అంటున్నారు. ఆరు, ఏడు ఎకరాలు ఉన్నవాళ్లు ఏం పాపం చేశారు?’ అని కేసీఆర్ నిలదీశారు. బీజేపీకి ఓటేస్తే గోదాట్లో వేసినట్లే.. ‘నరేంద్ర మోదీ నా మెడపై కత్తిపెట్టి ఆ్రస్టేలియా బొగ్గు కొనాలన్నా నేను కొనలే. కానీ ఈ ముఖ్యమంత్రి దావోస్, స్విట్జర్లాండ్ వెళ్లి మాట ముచ్చట చేసుకుని వచ్చాడు. మోదీ పదేళ్ల కిందట గెలిచినప్పుడు ఇంటికి పదిహేను లక్షలు ఇస్తానన్నాడు. ఇవ్వలేదు. బేటీ బచావో బేటీ పఢావో, సబ్ కా సాత్ సబ్ కా వికాస్.. ఏదీ జరగలేదు. మోదీది అంతా ఉత్త ‘గ్యాస్’ కంపెనీ తప్ప మరేం లేదు. కాంగ్రెస్ అన్నిట్లో వైఫల్యం చెందింది. బీజేపీతోటి ఒరిగిందేమీ లేదు. బీజేపీకి ఓటు వేస్తే గోదావరిలో వేసినట్లే. బీఆర్ఎస్తోనే తెలంగాణకు శ్రీరామరక్ష. మోసపోయి, గోసపడొద్దు..’ అని బీఆర్ఎస్ అధినేత కోరారు. మంచిర్యాల జిల్లా ఉండాలా? పోవాల్నా? ‘పాత ఆదిలాబాద్లో కొత్తగా మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలు ఏర్పాటు చేస్తే ఎలక్షన్ తెల్లారే ముఖ్యమంత్రి ఆ కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటున్నారు. మంచిర్యాల జిల్లా ఉండాలా? పోవల్నా? ఇక్కడ ఆగర్భ శ్రీమంతుడు, భూగర్భ కార్మికుడు పోటీలో ఉన్నారు. కార్మీకుడు గెలవాలా? శ్రీమంతుడు గెలవాల్నా? జిల్లా ఉండాలంటే ఎంపీగా కొప్పుల ఈశ్వర్ గెలవాలి. ఈశ్వర్ 26 ఏళ్లు కార్మీకుడిగా పని చేశారు. బ్యాలెట్ యుద్ధంలో మంచిర్యాల గుండెను చీల్చి ఈశ్వర్ను గెలిపించాలి..’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ రోడ్ షోలో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, దివాకర్రావు, పుట్ట మధు, నాయకులు విజిత్రావు పాల్గొన్నారు.కౌశిక్రెడ్డి ఇంట్లో కేసీఆర్ బస నేడు ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం వీణవంక (హుజూరాబాద్): మంచిర్యాల జిల్లాలో ఎన్నికల ప్రచారం తర్వాత కేసీఆర్ శనివారం రాత్రి కరీంనగర్ జిల్లా వీణవంకలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇక్కడే రాత్రి బస చేయనున్న మాజీ సీఎం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు కార్యకర్తలు, ప్రజలతో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఈ మేరకు కౌశిక్రెడ్డి ఇంటి పరిసరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 20 వేల మంది పాల్గొనేలా సమీకరణ జరుపుతున్నారు. ఆత్మీయ సమ్మేళనం తర్వాత కౌశిక్రెడ్డి ఇంటి నుంచి మెయిన్ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ తదితర నేతలు ఉన్నారు.గోదావరికి కేసీఆర్ పూజలుచీరసారె సమర్పించి మొక్కులు గోదావరిఖని: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం రాత్రి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీపంలోని గోదావరి నదికి పూజలు నిర్వహించారు. బస్సుయాత్రలో పాల్గొనడానికి శుక్రవారం సాయంత్రం హెలికాప్టర్లో గోదావరిఖని చేరుకున్న కేసీఆర్.. స్థానిక ప్రధాన చౌరస్తాలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం సింగరేణి ఇల్లెందు అతిథి గృహంలో బస చేశారు. శనివారం సాయంత్రం వరకు అక్కడే సేదదీరిన కేసీఆర్.. బస్సుయాత్ర కోసం మంచిర్యాల బయల్దేరి వెళ్లారు. మార్గమధ్యలో గోదావరినది వంతెన వద్ద కాన్వాయ్ ఆపారు. గోదావరి నదిలో పూలు జల్లి పూజలు చేసి.. చీరసారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కేసీఆర్ వెంట మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులున్నారు. మంచిర్యాలలో బస్సుయాత్ర ముగించుకున్న తర్వాత కేసీఆర్ గోదావరిఖనిలో కాసేపు ఆగారు. పోలీస్హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ నివాసానికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. దామోదర్ కుటుంబ సభ్యులతో ముచ్చటించి తేనీటివిందు స్వీకరించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా కరీంనగర్ బయలుదేరి వెళ్లారు. -
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తంగా 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా, మూడు ప్రధాన పార్టీల మధ్యే పోటీ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా, హైదరాబాద్ సిటీ పరిధిలో ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ కంటోన్మెంట్తో బోణీ కొట్టాలన్న కసితో ఉంది. ప్రత్యర్థులకంటే తామే ఇక్కడ బలంగా ఉన్నామని భావిస్తున్న బీఆర్ఎస్, సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో కంటోన్మెంట్లో తొలిసారిగా రెండో స్థానాన్ని దక్కించుకున్న బీజేపీ ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రయతి్నస్తోంది. మొత్తానికి మూడు పార్టీలూ ఉపఎన్నిక విజయమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో వచ్చిన ఉపఎన్నికలో ఆమె అక్క నివేదిత బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన శ్రీగణేశ్, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బీజేపీ ఈసారి కొత్త అభ్యర్థి అయిన డాక్టర్ టీఎన్ వంశ తిలక్కు పార్టీ టికెట్ కేటాయించింది. బీఆర్ఎస్.. నివేదితదివంగత ఎమ్మెల్యే సాయన్న 2014లో టీడీపీ నుంచి గెలిచి రెండేళ్లలోనే బీఆర్ఎస్లో చేరారు. అప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2018లో తొలిసారిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. గతేడాది ఫిబ్రవరిలో అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆయన స్థానంలో చిన్న కుమార్తె లాస్య నందిత 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఔటర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. దీంతో ఉపఎన్నిక అనివార్యం కాగా, బీఆర్ఎస్ మళ్లీ సాయన్న రెండో కుమార్తె నివేదితకు టికెట్ కేటాయించింది. అయితే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మన్నె కృషాంక్, గజ్జెల నాగేశ్, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్లు బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రచారానికి వారు దూరంగా ఉన్నారు. లాస్య నందిత గెలిచిన తర్వాత తమను పట్టించుకోవడం లేదంటూ పెద్దసంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా ఒకనాటి సాయన్న అనుచరులు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. బోర్డు మాజీ సభ్యులు మాత్రం అండగా నిలవగా, సాయన్న, సోదరి లాస్య సెంటిమెంట్పై ఆశలతో నివేదిత తన ప్రచారం కొనసాగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉన్న బీఆర్ఎస్ కేడర్, తండ్రి, సోదరి సెంటిమెంట్తో తన గెలుపు ఖాయం అన్న ధీమాలో ఉన్నారు.అనుకూలతలు» దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె కావడం » ఏడాదిలోనే ఎమ్మెల్యే హోదాలోనే తండ్రి, సోదరిని కోల్పోయిన సానుభూతి » పటిష్టమైన పార్టీ కేడర్ ప్రతికూలతలు»పెద్ద సంఖ్యలో నేతలు పార్టీని వీడటం » ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే గతానుభవాలు » కీలకనేతలు ప్రచారానికి దూరంగా ఉండటం కాంగ్రెస్.. శ్రీగణేశ్నారాయణ్ శ్రీగణేశ్ పదిహేనేళ్ల క్రితమే కాంగ్రెస్ యువ నాయకుడిగా కంటోన్మెంట్ రాజకీయాల్లోకి వచ్చారు. 2014, 2018లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే 2018లో ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలకతీతంగా శ్రీగణేశ్ ఫౌండేషన్ ద్వారా ప్రజాసేవతో కంటోన్మెంట్ ఓటర్లకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో 2023లో బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో మరోసారి బీజేపీ అభ్యర్థిగానే బరిలోకి దిగారు. బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందితకు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. తాజా ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న తలంపుతో అధికార కాంగ్రెస్ శ్రీగణేశ్ను పార్టీలోకి ఆహా్వనించింది. శ్రీగణేశ్ వ్యక్తిగత బలం, అధికార పార్టీ అండతో గెలుపు ఖాయం అన్న ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. చేరికల జోరుతో కాంగ్రెస్ శ్రేణులు సరికొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. అనుకూలతలు» అధికార పార్టీ అభ్యర్థి కావడం » ఓడిపోయినా ప్రజల్లోనే ఉండటం » పార్టీలకతీతంగా సొంత కేడర్ ప్రతికూలతలు» తరచూ పార్టీలు మారతాడన్న అపవాదు » పాతనేతలు, కొత్తగా చేరుతున్న వారిమధ్య సమన్వయలేమి » కొన్ని వార్డుల్లో పార్టీ బలహీనంగా ఉండటంబీజేపీ.. టీఎన్ వంశ తిలక్ ఉత్తరాది ప్రాంతాలకు చెందిన ఓటర్లు అధికంగా ఉండే కంటోన్మెంట్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎంపీ ఎన్నికల్లో రేవంత్రెడ్డి ఎంపీగా గెలిచినా, కంటోన్మెంట్లో మాత్రం బీజేపీ కాంగ్రెస్ను దాటి రెండో స్థానంలో నిలిచింది. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ రెండో స్థానం దక్కించుకుంది. అయితే ఆ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థి శ్రీగణేశ్ కాంగ్రెస్లోకి చేరడంతో మాజీ మంత్రి టీఎన్ సదాలక్ష్మి కుమారుడైన డాక్టర్ టీఎన్ వంశ తిలక్కు టికెట్ కేటాయించింది. కంటోన్మెంట్ నియోజకవర్గానికి కొత్త వ్యక్తి కావడంతో సీనియర్ నేతలపైనే ఆధారపడాల్సి వస్తోంది. బీజేపీలోని అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టలేకపోయారు. అయితే మాదిగ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలన్న తమ డిమాండ్కు తలొగ్గిన బీజేపీకి ఎమ్మార్పిఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రచారం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలతో కలిసి రావడంతో మోదీ చరిష్మాతో బీజేపీ ఈ స్థానంలో గెలుపుపై ఆశలు పెట్టుకుంది.అనుకూలతలు» పటిష్టమైన పార్టీ కేడర్ » ఎమ్మార్పిఎస్ సంపూర్ణ మద్దతు » మోదీ చరిష్మాతో ఉత్తరాది ఓట్లపై ఆశలు ప్రతికూలతలు » కంటోన్మెంట్కు పరిచయం లేని వ్యక్తి » పార్టీ నేతల మధ్య సమన్వయలేమి » ప్రచారంలో వెనుకబడిపోవడం -
కేసీఆర్ను అవమానిస్తే సహించం
దుబ్బాక: కేసీఆర్ను అవమానిస్తే సహించేది లేదని మాజీ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. ‘ఏదో అడ్డిమారి గుడ్డిదెబ్బలా గెలిచిన రేవంత్రెడ్డీ.. నీవు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మొదట అమలు చేయి.. చేతకాకపోతే నాతో కాదు అని ప్రజలకు క్షమాపణ చెప్పు’ అంటూ సవాల్ విసిరారు. శనివారం రాత్రి దుబ్బాకలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి హరీశ్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ జూటా మాటలతో గెలిచి ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఈ రివర్స్గేర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో ప్రజలు ప్రశ్నించాలని సూచించారు. ‘బీడీ కట్టలపై పుర్రె గుర్తు పెట్టింది కాంగ్రెస్ కాదా?.. జీఎస్టీ విధించింది బీజేపీ కాదా?..’ అని ప్రశ్నించారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చింది కేసీఆరేనని గుర్తుచేశారు. ‘పెన్షన్లు ఎటు పాయే.. ఆడబిడ్డలకు రూ.2,500, తులం బంగారం ఎటు పాయే’, ‘కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది.. మళ్లీ మోటార్లు కాలిపోయే కాలం వచ్చింది’ అంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్రావును దుబ్బాకలో ప్రజలు మడతపెట్టి ఉతికినట్టే ఈ ఎన్నికల్లోనూ మరోసారి ఉతికి ఆరేయాలన్నారు. -
రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్రావు చెప్పారు. రివర్స్ గేర్లో వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకునేందుకు బీఆర్ఎస్ గెలవాలని వారు భావిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో చెరో 8 లోక్సభ స్థానాలు గెలుచుకునేలా కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ఆంధ్రా మూలాలు కలిగిన సీఎం రేవంత్రెడ్డి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి మూటలు పంపడంపైనే శ్రద్ధ‘సీఎం రేవంత్ చెప్తున్న ప్రజాపాలన ఫార్స్గా మారింది. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ ఇచ్చిన బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయి. హామీల అమలుపై ప్రశ్నిస్తే ఓ వైపు దూషిస్తూ, మరోవైపు ఒట్లు పెడుతున్నారు. ప్రజలను నిరంతరం మోసగించడం సాధ్యం కాదనే విషయం గ్రహించి కేసీఆర్ను దుర్భాషలాడుతున్నారు. ఢిల్లీకి మూటలు పంపడంలో ఉన్న శ్రద్ధ హామీల అమలు, పరిపాలనపై లేదు.రాష్ట్రంలో పాలనకు బదులుగా పగలు, ప్రతీకారాలు నడుస్తున్నాయి. పాలన వికేంద్రీకరణ కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేయడం తిరోగమన ఆలోచన. ప్రజాపాలనలో వచ్చిన 3.50 లక్షల దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి..’ అని హరీశ్ డిమాండ్ చేశారు. ఉమ్మడి రాజధానికి రేవంత్ సహకరించే చాన్స్‘హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్య వాదులు కోరుతున్నారు. ఆంధ్రా మూలాలు కలిగిన రేవంత్రెడ్డి దానికి సహకరించే అవకాశముంది. గతంలో ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్దే ప్రధాన పాత్ర. తెలంగాణ ప్రయోజనాలను కాపా డటం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ, కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సీట్లలో గెలిపిస్తే బీఆర్ఎస్ కీలకంగా మారుతుంది..’ అని హరీశ్రావు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్న రేవంత్‘రాష్ట్రం దివాలా తీసిందంటూ సీఎం చేస్తున్న వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటు న్నాయి. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే అభివృద్ధి, పెట్టు బడుల సాధన, ఉద్యోగాల కల్పన ఎలా సాధ్యం? రేవంత్ తీరుతో పెట్టుబడుదారులు పునరా లోచనలో పడుతున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్క డమే పనిగా పెట్టుకున్న రేవంత్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తూ కేసులు పెడుతు న్నారు..’ అని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు‘దేవుడు పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు. మెడికల్, నర్సింగ్ కాలేజీలు, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం సహా ఏదీ ఇవ్వలేదు. బీజేపీ ఆదానీని మాత్రం ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలబెట్టింది. నల్ల చట్టాలతో రైతులపై దాడులు, ఎస్సీ వర్గీకరణ, పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు వంటి అనేక అంశాలు బీజేపీ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించిన కేసీఆర్ ఆధ్యాత్మికలో బీజేపీ కంటే రెండు అడుగులు ముందే ఉన్నారు..’ అని మాజీమంత్రి స్పష్టం చేశారు. -
చిల్లర మాటలు.. ఉద్దెర పనులు
సిరిసిల్ల/సుభాష్నగర్, రసూల్పుర (హైదరాబాద్): సీఎం రేవంత్రెడ్డి పాలన చిల్లర మాటలు.. ఉద్దెర పనులు అన్నట్లుగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు విమర్శించారు. ‘మోసపోతే గోస పడతామని కేసీఆర్ ముందే చెప్పారు.. ఇప్పుడు కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. బతుకమ్మ చీరలు లేవు.. రైతుబంధు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో దరిద్రం అడుగుపెట్టినట్లు అయ్యింది..’ అని ధ్వజమెత్తారు.ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10 నుండి 12 సీట్లు ఇస్తే ఆరు నెలల నుండి సంవత్సరం లోపే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు వస్తుందని చెప్పారు. కేటీఆర్ శనివారం సిరిసిల్లలో, హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్లోని షాపూర్, నగరంలోని కంటోన్మెంట్ ఏరియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.హామీలేమో కానీ లూటీలు షురూకేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు కష్టాలు లేవని, ప్రస్తుతం హైదరాబాదులో కరెంటు కోతలు ప్రారంభమై ఎక్కడ చూసినా వాటర్ ట్యాంకర్లు, జనరేటర్లు కనపడుతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి మహిళకు రూ.2,500, పెన్షన్ రూ.4 వేలు ఇస్తామని, రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని మోసపు హామీలు ఇచ్చి రేవంత్రెడ్డి ఓట్లు వేయించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీకి తేదీలు మార్చుతున్నాడని, ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేశామని తప్పుడు ప్రకటనలు ఇస్తున్నాడని విమర్శించారు.కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని, నాలుగు నెలల్లో లక్ష పెళ్లిళ్లు అయ్యి లక్ష తులాల బంగారం రేవంత్ బాకీ పడ్డాడని అన్నారు. గ్యారంటీల అమలు పక్కన పెడితే కాంగ్రెసోళ్లు లూటీలు చేయడం చాలూ అయ్యిందని, లూటీ చేయడం కాంగ్రెస్ వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కొత్త పరిశ్రమలు తేవడం ఏమో కానీ ఉన్న పరిశ్రమలు గుజరాత్, చెన్నై తరలిపోతున్నాయన్నా రు. ప్రభుత్వ ఆర్డర్లు లేక నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొత్త జిల్లాలపై స్పష్టత ఇవ్వాలిపరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చుకు న్నామని, కొన్ని జిల్లాలకు జయశంకర్ (భూపాలపల్లి), కొమురంభీం (ఆసిఫాబాద్) లాంటి మహానుభావుల పేర్లు పెట్టుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ కొత్త జిల్లాలు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, 33 జిల్లాల్లో ఏ జిల్లాలను ఉంచుతారో, ఏ జిల్లాలను తొలగిస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.బీజేపీని నమ్మి మోసపోవద్దుకొందరు దేవుడి పేరిట రాజకీయాలు చేస్తున్నారని, తెలంగాణలో కేసీఆర్ ఆధునిక దేవాలయాలైన జలాశయాలను నిర్మించి వాటికి దేవుళ్ల పేర్లు పెట్టారని కేటీఆర్ చెప్పారు. యాదాద్రిని కట్టించిన కేసీఆర్ ఏనాడూ దేవుడి పేరును ఓట్లకు వాడుకోలేదని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఛోటే భాయ్.. ప్రధాని మోదీ బడే భాయ్ అని ఎద్దేవా చేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ఇంతవరకు ఏమీ చేయలేదన్నారు.పదేళ్లలో హైదరాబాద్కు రూపాయి ఇవ్వలేని బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ప్రజల్లో మతం చిచ్చుపెట్టే బీజేపీని నమ్మి మోసపోవద్దని కోరారు. ‘రాష్ట్రంలో చెయ్యి విరగాలి.. పువ్వు వాడాలి.. కారు జోరు కొనసాగాలి..’ అని కేటీఆర్ కోరారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, కంటోన్మెంట్లో ఐదుసార్లు దివంగత ఎమ్మెల్యే సాయన్నను ఆదరించినట్లుగానే ఈసారి జరిగే ఎన్నికల్లో సాయన్న బిడ్డ నివేదితను ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఒకే ఏడాదిలో తండ్రిని, చెల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నివేదితను గుండెల్లో పెట్టుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి నివేదిత తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement