-
షాకింగ్: ఆ సినిమా కలెక్షన్లు ఫేక్ అట!
విజయ్ తాజా సినిమా ’మెర్సల్’ బాక్సాఫీస్ను నిజంగానే షేక్ చేస్తోందా? ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేసి.. రజనీకాంత్ ’రోబో’ (యంతిరన్) తర్వాత ఈ ఘనత సొంతం చేసుకున్న రెండో తమిళ సినిమాగా చరిత్ర సృష్టించిందని కోలీవుడ్లో ప్రచారం ఊపందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా చుట్టు రాజకీయ వివాదాలు ముసురుకోగా.. తాజాగా ఈ సినిమా వసూళ్లపై వివాదం ముసురుకుంది. ’మెర్సల్’ కలెక్షన్ రికార్డులు ఉత్త ఫేక్ అని ప్రముఖ పంపిణీదారుడు అబిరా రామనాథం కొట్టిపారేశారు. చెన్నైలోని ప్రముఖ మల్టీప్లెక్స్ మాల్ ఓనర్ అయిన ఆయన తాజాగా ’వుయ్టాకీస్’ తమిళ వెబ్సైట్తో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ’మెర్సల్’ వసూళ్ల లెక్కలు ఉత్త బూటకమని, ఈ సినిమా ఇంత భారీగా వసూళ్లు సాధించింది అనడానికి ప్రామాణికత ఏమీ లేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ఈ కల్పిత ప్రచారాన్ని సృష్టించారని, అయినా సినీ పరిశ్రమలో ఇలాంటి వ్యూహాన్ని చాలాకాలంగా పాటిస్తున్నారని ఆయన చెప్పారు. ’నేను 1976 నుంచి సినీ పరిశ్రమలో ఉన్నాను. టికెట్లను బ్లాక్లో అమ్మేందుకు అప్పట్లో మేమే ప్రజలను నియమించేవాళ్లం. టికెట్ ధరను పెంచి బ్లాక్లో అమ్ముతున్నారని తెలిసి ప్రజలు సినిమా చూసేందుకు ఆసక్తి చూపేవారు. ఇదే వ్యూహాన్ని ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. తమ సినిమా రూ. 200 కోట్లు వసూలు చేసిందని ప్రకటిస్తే.. సహజంగానే ఆ సినిమాలో ఏముందో చూడాలన్న ఉత్సుకత ప్రజల్లో ఏర్పడుతుంది. అంత భారీ మొత్తాన్ని కలెక్ట్ చేసిన సినిమాను మిస్ కావొద్దని ప్రజలు కోరుకుంటారు. ఒక డిస్ట్రిబ్యూటర్గా చెప్తున్న.. నిజానికి ఒక సినిమా థియెట్రికల్ రన్ ముగిసే వరకు ఎంత వసూళ్లు వచ్చాయో నిర్మాతకు తెలియదు’ అని ఆయన వివరించారు. అట్లీ దర్శకత్వంతో విజయ్ త్రిపాత్రాభినయం చేసిన ’మెర్సల్’ సినిమా ఇప్పటికే పలు వివాదాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ’మెర్సల్’ కలెక్షన్లు ఫేక్ అంటూ వ్యాఖ్యలు చేసిన డిస్ట్రిబ్యూటర్ అబిరా రామనాథంపై విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. -
వారెవ్వా 'మెర్సల్'.. కళ్లు చెదిరే వసూళ్లు!
విజయ్ తాజా సినిమా 'మెర్సల్'.. బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. బీజేపీ వాళ్లు ఎంత గగ్గోలు రేపినా.. ఈ సినిమాపై ఏమాత్రం ప్రభావం చూపలేదు సరికదా.. ఈ వివాదాలు 'మెర్సల్' వరంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారీ అంచనాలతో విడుదలైన 'మెర్సల్' సినిమా తొలిరోజు ఏకంగా రూ. 43.50 కోట్లు వసూలు చేసి.. ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది. దీపావళి కానుకగా విడుదలైన 'మెర్సల్' తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా అక్షరాల రూ. 170 కోట్లు వసూలు చేసిందని సమాచారం. వైద్య మాఫియాపై అస్త్రంగా తెరకెక్కిన 'మెర్సల్' సినిమాలో జీఎస్టీ, డిజిటల్ ఇండియా పథకాలపై విమర్శలు ఉండటం బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఆ డైలాగులు తొలగించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఈ వివాదం మీడియాలో పతాకశీర్షికలకు ఎక్కడం, పలువురు సినీ ప్రముఖులు, జాతీయ నాయకులు సినిమాకు అండగా నిలబడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాలో ఏముందో చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. దీంతో ఒక్క తమిళ వెర్షన్లోనే విడుదలైన 'మెర్సల్' ప్రపంచవ్యాప్తంగా మొదటివారంలో అసాధారణ వసూళ్లు రాబట్టింది. తొలిరోజు రూ. 43. 50 కోట్లు వసూలు చేసిన 'మెర్సల్'.. తొలిమూడురోజుల్లో రూ. 100 కోట్లు రాబట్టింది. మొత్తానికి తొలివారంలో ఈ సినిమా రూ. 170 కోట్లు రాబట్టిందని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' వెల్లడించింది. 'మెర్సల్' ఓవర్సీస్ వసూళ్లు కూడా కళ్లుచెదిరే రీతిలో ఉండటం గమనార్హం. తొలివారంలో ఈ సినిమా విదేశాల్లో రూ. 45 కోట్లు రాబట్టింది. కొన్నిరోజుల కిందట ఈ సినిమా రూ. 150 కోట్లు కలెక్ట్ చేసినట్టు సినిమా యూనిట్ ధ్రువీకరించింది. మొత్తం తొలివారం వసూళ్ల గురించి చిత్ర నిర్మాత కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఏదిఏమైనా 'మెర్సల్' విజయ్ కెరీర్లో రూ. 200 కోట్లు సాధించిన తొలి సినిమా రికార్డు దిశగా సాగుతోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయడుతున్నాయి. -
మూడోరోజు కలెక్షన్స్.. ఇంకాస్తా పెరిగాయ్!
నిత్యం వివాదాల్లో నిలిచే బాలీవుడ్ తార కంగన రనౌత్ తాజా సినిమా 'సిమ్రన్'.. ఈ సినిమా వసూళ్లు నిలకడగా పెరుగుతున్నాయి. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. వసూళ్లు మాత్రం క్రమంగా పెరిగాయి. తొలి రోజు శుక్రవారం రూ. 2.77 కోట్లు వసూలు చేసిన 'సిమ్రన్' రెండోరోజు రూ. 3.76 కోట్లు దక్కించుకుంది. ఇక మూడో రోజు ఆదివారం ఈ సినిమా వసూళ్లు ఇంకాస్తా మెరుగుపడ్డాయి. నాలుగోరోజు రూ. 4.12 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా తొలి వీకెండ్లో ఈ సినిమా రూ. 10.65 కోట్లను కలెక్ట్ చేసింది. వీక్ డేస్లోనూ ఇదే నిలకడను కొనసాగిస్తే ఈ సినిమా గౌరవప్రదమైన వసూళ్లు రాబట్టవచ్చునని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఈ సినిమా విడుదలకు ముందు పలు వివాదాలు కంగనను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఫైర్బ్రాండ్గా పేరుతెచ్చుకున్న కంగన.. బాలీవుడ్ అగ్ర హీరోలపై ధైర్యంగా విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో విడుదలైన 'సిమ్రన్' సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కంగన నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు వచ్చినా.. సినిమా కథ అంత గొప్పగా లేదని విమర్శలు వినిపించాయి. విమర్శకులు ఈ సినిమాపై పెదవివిరిచారు. ఇక ఫర్హాన్ అక్తర్ హీరోగా తెరకెక్కిన 'లక్నో సెంట్రల్' సినిమా బాక్సాపీస్ వద్ద నిరాశపరిచింది. ఈ సినిమా తొలి మూడురోజుల్లో రూ. 8.42 కోట్లు వసూలు చేసింది. -
మిక్స్డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ ఓకే!
నిత్యం వివాదాల్లో నిలిచే బాలీవుడ్ తార కంగన రనౌత్ తాజా సినిమా 'సిమ్రన్'.. ఈ సినిమా విడుదలకు ముందు పలు వివాదాలు కంగనను చుట్టుముట్టాయి. ఫైర్బ్రాండ్గా పేరుతెచ్చుకున్న కంగన.. బాలీవుడ్ అగ్ర హీరోలపై ధైర్యంగా విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో విడుదలైన 'సిమ్రన్' సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కంగన నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు వచ్చినా.. సినిమా అంత గొప్పగా లేదని విమర్శలు వినిపించాయి. విమర్శకులు ఈ సినిమాపై పెదవివిరిచారు. మిక్స్డ్ టాక్ నేపథ్యంలో తొలి రోజు శుక్రవారం రూ. 2.77 కోట్లు వసూలు చేసిన 'సిమ్రన్' రెండోరోజు వసూళ్లలో గణనీయంగా పుంజుకుంది. రెండోరోజూ వసూళ్లలో 35.74శాతం వృద్ధి నమోదు చేసి.. రూ. 3.76 కోట్లు దక్కించుకుంది. మొత్తంగా దేశంలో తొలి రెండు రోజుల్లో రూ. 6.53 కోట్లు వసూలు చేసింది. ఆదివారం ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. కలెక్షన్లు క్రమంగా పెరిగితే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించే అవకాశముందని భావిస్తున్నారు. ఇక ఫర్హాన్ అక్తర్ హీరోగా తెరకెక్కిన 'లక్నో సెంట్రల్' సినిమా రెండురోజుల్లో రూ. 4.86 కోట్లు వసూలు చేసి నిరాశపరిచింది. -
జీఎస్టీ తర్వాత వందకోట్లు దాటిన సినిమా!
సాక్షి, చెన్నై: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ 25వ సినిమా ‘వివేగం’ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబడుతోంది. ఆగస్టు 24న విడుదలైన ఈ సినిమా రెండో వారంలోనూ భారీ కలెక్షన్లు సాధించింది. చెన్నైలో కబాలి, బాహుబలి 2 రికార్డులను అధిగమించిన ఈ సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ కలెక్షన్లతో రూ.150 కోట్ల క్లబ్లో చేరినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఓపెనింగ్ వీకెండ్ నాటికే రూ. వంద కోట్లు వసూళ్లు దక్కించుకుంది. జీఎస్టీ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత టిక్కెట్ల ధరలు పెరగడంతో తమిళనాడులో ధియేటర్లు వెలవెలబోయాయి. అయితే ‘తలా’ దెబ్బకు ధియేటర్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రూ. వంద కోట్లుపైగా వసూళ్లు సాధించిన తొలి తమిళ సినిమాగా ‘వివేగం’ నిలిచింది. మీడియాలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమా బ్రహ్మరథం పట్టడం విశేషం. భారీ యాక్షన్, పవర్ఫుల్ డైలాగులు, అజిత్ అద్భుత నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. కాజల్ అగర్వాల్, వివేక్ ఒబరాయ్, అక్షర్ హాసన్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాను శివ తెరకెక్కించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement