-
అంధులపై ఎందుకీ బ్రహ్మాస్త్రం! అసలేం జరిగింది?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తిరుమల–రాజ్కుమార్ దంపతులు అంధులు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీలోని జెడ్పీహెచ్ఎస్లో తిరుమల క్లర్కు. ఆమెకు జూనియర్ అసిస్టెంట్ విధులు కేటాయించారు. సాయం కోసం (స్క్రైబ్) తన భర్త రాజ్కుమార్ను తోడుగా తెచ్చుకునేది. వీరిద్దరికీ 80శాతం చూపులేదు. కనీసం నాలుగు అంగుళాల దగ్గరగా ఉంటే తప్ప చూడలేరు. వ్యక్తులను కేవలం గొంతు ఆధారంగా గుర్తు పడతారు. కానీ, దాదాపు రూ.10 లక్షల వరకు టీచ ర్ల సొమ్ము ప్రభుత్వానికి జమ చేయకుండా జేబులో వేసుకున్నారని హెడ్మాస్టర్ ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపై నాన్బెయిలబుల్ కేసులు నమోదయ్యా యి. దీంతో, టీచర్ల లోకం భగ్గుమంది. పోలీసుల తీరుపై మండి పడుతోంది. చూపులేని వారు తమ వేతనాలు ఎలా కాజేస్తారు? ఆ విషయాన్ని పోలీసులు ఎలా నమ్మారు? అసలు ప్రాథమిక విచారణ జరిగిందా? అని ప్రశ్నిస్తున్నారు. తమను స్కూల్ హెడ్మాస్టర్ రాజభాను చంద్రప్రకాశ్ ఈ కేసులో ఇరికించారని, ఎదుటి వ్యక్తిని చూడలేని తాము రూ.లక్షలు ఎలా తీసుకుంటామని ఆ అంధ దంపతులు అంటున్నారు. అసలేం జరిగింది? ఈ వ్యవహారంలో అంధ దంపతులు ‘సాక్షి’ని ఆశ్రయించి జరిగింది మొత్తం వివరించారు. వారెమన్నారంటే.. ‘ఎల్ఎండీ కాలనీ జెడ్పీ హైస్కూల్లో రాజ భాను చంద్రప్రకాశ్ హెడ్మాస్టర్. ప్రతినెలా పాఠశాలలో పనిచేసే టీచర్ల జీతాలు ఇతనే ప్రిపేర్ చేసి, పంపిస్తారు. ఇక్కడి ఉపాధ్యాయుల్లో చాలామంది వివిధ వ్యక్తిగత కారణాలతో సెలవు (మెడికల్/చైల్డ్ కేర్ తదితర లీవు)లు పెడుతుంటారు. కానీ, హెచ్ఎం వారు సెలవులో ఉన్నట్లు కాకుండా పని చేసినట్లు రికార్డులో నమోదు చేస్తారు. ఆయా పని దినాలకు వేతనం లెక్కగట్టి, ఉన్నతాధికారులకు పంపుతారు. వేతనం టీచర్ల ఖాతాలో క్రెడిట్ కాగానే వారి కి ఫోన్ చేసి, పొరపాటున సెలవు దినాలకు జీతం యాడ్ అయిందని, దాన్ని వెనక్కి పంపితే చలానా రూపంలో తిరిగి ప్రభుత్వానికి పంపుతానని నమ్మబలుకుతారు. ఇలా 2021 నుంచి 2024 వరకు దాదాపు రూ.10 లక్షల వరకు వేతనాలను క్రెడిట్ చేయడం, అనంతరం వారి నుంచి తీసుకోవడం, వాటిని తన జేబులో వేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఎవరైనా అడిగితే నకిలీ చలానాలు చూపేవారు. ఐటీ రిటర్నుల విషయంలోనూ ఇలాగే చేసి, డబ్బులు వసూలు చేసేవారు’ అని అంధ దంపతులు బోరుమన్నారు. ప్రతీసారి టీచర్ల డబ్బును తెలి విగా తమకు ఫోన్ పే/గూగుల్ పే చేయించేవారని, వాటిని తాము డ్రా చేసి నగదు రూపంలో హెడ్మాస్టర్కు అందజేసేవారమని చెప్పారు. ఇటీవల కొందరు టీచర్లకు అనుమానం వచ్చి, నిలదీసేసరికి విషయాన్ని తమపైకి నెట్టాడని వాపోయారు. రూ.7 లక్షలు అడిగితే ఇచ్చాం.. ఈ నెల మొదటివారంలో తమ వద్దకు వచ్చిన హెడ్మాస్టర్ తమను బెదిరించి, బలవంతంగా తామే ఈ నేరానికి పాల్పడినట్లు లెటర్ తీసుకున్నారని తిరుమల–రాజ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం పోకుండా ఉండాలంటే రూ.7 లక్షలు కట్టాలని బెదిరిస్తే.. అప్పు చేసి ఇచ్చామన్నారు. ఆ తర్వాత జరిగిన వ్యవహారంలో ఎక్కడా ఆయన పాత్ర లేకుండా చూపేందుకు ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి, సమాజంలో తమను దోషులను చేశాడని వాపోయారు. తమకు ఇద్దరు పిల్లలని, ఇప్పుడు ఈ కేసులో జైలుకు పంపి, తమ కుటుంబాన్ని నాశనం చేసే కుట్రకు తెరతీశారని కన్నీరు పెట్టుకున్నారు. అమెరికా వెళ్లినా జీతం క్లెయిమ్.. తిమ్మాపూర్లో ఓ టీచర్ 2022 సెప్టెంబర్లో అమెరికా వెళ్లారని, ఇందుకోసం 6 నెలలపాటు ముందస్తుగా డీఈవో వద్ద అనుమతి పొందారని తెలిపారు. నవంబర్ జీతం డిసెంబర్లో ఆమెకు బ్యాంకు ఖాతాలో పడిందన్నారు. వెంటనే హెడ్మాస్టర్ సదరు టీచర్ను సంప్రదించి, మొత్తం వేతనం వెనక్కి తెప్పించారని, ఈ వ్యవహారంలో సదరు టీచర్ హెచ్ఎం తీరుపై మండిపడి, నిలదీశారని తెలిపారు. కాగా ఈ విషయమై పాఠశాల హెచ్ఎంను సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. విదేశాలకు వెళ్లిన టీచర్కు డీఈవో అనుమతి కనికరం లేని పోలీసులు.. పోలీసులు కేసు నమోదు చేసే క్రమంలో కనీసం తమను సంప్రదించలేదని, అసలు 80 శాతం చూపులేని తమకు హెడ్మాస్టర్ ముఖమే తెలి యదని, సంతకాలు ఎలా ఫోర్జరీ చేస్తామని ఆ అంధ దంపతులు అన్నారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా తమపై కేసు నమో దు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేసు విషయంలో నిజానిజాలు తెలుసుకునేందుకు తిమ్మాపూర్ పోలీస్స్టేషన్కు వెళ్తే తమను పట్టించుకోలేదని వాపోయారు. కంటిచూపులేని వారమన్న కనికరమైనా చూపకుండా హెచ్ఎంపై ఫిర్యాదు తీసుకోకపోవడం దారుణమన్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులను, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. హెచ్ఎం రాజభాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రతీచోట తాము అంధులమని పేర్కొన్న విషయాన్ని గమనించాలని కోరారు. ఇవి చదవండి: ఏఆర్ డీఎస్పీ ఇంటి ఎదుట భార్య ఆందోళన -
‘నీ గొంతు గుర్తు పట్టాను సుమా’.. అంధుడి ముఖంపై చిరునవ్వు
మానవ సంబంధాలు చాలా చిత్రమైనవి.. ఎప్పుడు ఎలా ఏర్పడతాయో.. పెనవేసుకుపోతాయో... విరిగి.. కరిగి పోతాయో అందరికీ అర్థమయ్యే విషయం కాదు.. కావాలంటే ఈ రీల్ చూడండి. ముంబై మహా నగరంలో ఓ వర్ధమాన నటి చేసిన రీల్ ఇది. రోజూ ఎక్కే ట్రెయిన్లో తను.. తనతోపాటే అదే రైల్లో పాటలు పాడుతూ నాలుగు డబ్బులు కోరుకునే దివ్యాంగుడు! కళ్లు లేని ఆ దివ్యాంగుడి పాటకు.. తన మాటను జత చేసింది.. ఇరువురూ తమదైన ప్రపంచాల్లో డ్యూయెట్ పాడారు.. చివరగా ఆ అంధుడి ముఖంపై ఓ చిరునవ్వు.. నీ గొంతు గుర్తు పట్టాను సుమా అని! ఇదీ ఓ బంధమే. అపురూపమైంది! ఇష్టమైన వారితో మన్పర్ధలొస్తే.. గొడవలు పడితే.. ఒక్కసారి చూసేయండి. అన్నీ మరచిపోతారు! View this post on Instagram A post shared by Priya Gamree (@gamreepriya) -
కళ్లకు గంతలు కట్టుకుని మరీ రంగోలీ ముగ్గు!
అయోధ్యలో భవ్య రామమందిరం జనవరి 22న ప్రారంభవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ దైన శైలిలో తమ భక్తి భావాన్ని చాటుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో పంథాలో అసాధ్యకరమైన పనులతో తమ భక్తి శక్తిని చాటుతూ విస్తుపోయేలే చేస్తున్నారు. ఆ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఇంకొద్ది రోజుల్లో జరగనుండగా ఒక వైపు నుంచి అయోధ్యకు ఎంతో విలువైన కానుకలు వస్తున్నాయి. దీంతోపాటు రామ అన్న పేరుకి శక్తి ఏంటో తెలిసేలా ఒక్కో విశేషం రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తోంది. ఇలాంటి వింతలు, విచిత్రాలు చేస్తుంటే ఆ లీలా స్వరూపుడే ఇలా తన భక్తులచే అసాధ్యమైన వాటిని చేయించుకుంటున్నాడా అన్నంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అలాంటి అనితర సాధ్యకరమైన ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అదేంటో వింటే మాత్రం ఆశ్చర్యపోవడం ఖాయం. బీహార్లోని దర్భంగాకు చెందిన మోనికా గుప్తా అనే అమ్మాయి కళ్లకు గంతలు కట్టుకుని మరీ రంగోలీ వేసింది. అదికూడా రామ మందిరాన్ని ముగ్గు రూపంలో వేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రామ భక్తితో ఎంతటి అసాధ్యమైన కార్యాన్ని అయినా సాధించొచ్చు అని నిరూపించింది మోనికా. ఆమె కళ్లకు గంతలు కట్టుకుని ఏ మాత్రం తడబడకుండా చాలా చాకచక్యంగా పెట్టింది. మాములుగా గీసినా.. ఎన్నో సార్లు చెరిపి.. చెరిపి..గీస్తాం అలాంటిది. చూడకుండా ముగ్గు వేయడం అంటే మాటలు కాదు. కానీ జనవరి 22న అయెధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆమె బిహార్ నుంచి అయోధ్యకు వచ్చి మరీ ఇలా అసాధ్యకరమైన రీతీలో ముగ్గు వేయడం విశేషం. ఈ మేరకు మౌనిక మాట్లాడుతూ.. తాను ఎంఎస్సీ చదువుతున్నట్లు పేర్కొంది. తనకున్న ధ్యానం చేసే అలవాటు కారణంగానే ఇంతలా సునాయాసంగా చూడకుండా ముగ్గు వేయగలిగానని చెప్పుకొచ్చింది. ఈ ఘనత సాధించగలిగేందుకు కారణం తాను తల్లి వద్ద విన్నా మహాభారత గాథేనని చెబుతోంది. ఆ ఇతిహాసంలో దృతరాష్ట్రుడికి కళ్లకు కనిపించేలా సంజయుడు వివరించిన కౌరవులు పాండవుల యుద్ధ ఘట్టం. అలాగే మత్సయంత్రాన్ని చేధించటంలో అర్జునుడు కనబర్చిన ప్రతిభ పాటవలు తనను ఇలాంటి ఘనత సాధించేందుకు ప్రేరణ ఇచ్చాయని చెప్పుకొచ్చింది. ఇలా కళ్లకు గంతలు కట్టుకుని రంగోలీలు వేయడాన్ని నాలుగేళ్ల ప్రాయం నుంచే ప్రారంభించానని, ఏడేళ్లు వచ్చేటప్పటికీ ధ్యాన సాధనతో దానిపై పూర్తిగా పట్టు సాధించగలిగానని చెప్పింది. ఇలా చూడకుండా మనోనేత్రంతో గీయ గలిగే సామర్థ్యాన్ని సిక్త్స్ సెన్స్ యాక్టివేషన్ లేదా థర్డ్ ఐ యాక్టివేషన్గా అభివర్ణించింది మౌనిక. కాగా ఈ రామమందిర ప్రారంభోత్సవానికి ఎంతో మంది ప్రముఖులు, సెలబ్రెటీలు హాజరుకానున్నారు. (చదవండి: శని దోషాలు పోయి, సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి! ) -
అయోధ్యలో శ్రీరాముణ్ణి కీర్తించనున్న దివ్యాంగ కవి
ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ముందుగానే అయోధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈనెల 14న అయోధ్యలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి దివ్యాంగ కవి అక్బర్ తాజ్ను జగద్గురు సంత్ రామభద్రాచార్య ఆహ్వానించారు. అక్బర్ తాజ్ మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలోని హప్లా-దీప్లా గ్రామానికి చెందిన దివ్యాంగ కవి. ఆయన కవితలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా అక్బర్ తాజ్ శ్రీరాముని గుణగణాలను కీర్తిస్తూ పలు రచనలు చేశారు. శ్రీరాముడు అందరికీ చెందినవాడని అక్బర్ తాజ్ చెబుతుంటారు. 44 ఏళ్ల అక్బర్ తాజ్ దృష్టిలోపంతో బాధపడుతున్నారు. బ్రెయిలీ లిపిని కూడా అక్బర్ తాజ్ నేర్చుకోలేదు. అయినప్పటికీ అక్బర్ తాజ్ తన మనసులోని భావాలను ఇతరుల చేత రాయిస్తుంటారు. ఆయన దేశవ్యాప్తంగా పలు వేదికలపై తన హిందీ, ఉర్దూ రచనలను వినిపించారు. రామునిపై ఆయన చేసిన రచనలు ఆయనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని అక్బర్ తెలిపారు. -
ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మరెన్నో చేస్తాం
సాక్షి, హైదరాబాద్: అంధులకు చారిత్రక ప్రదేశాల సందర్శన అనుభూతిని కలిగించాలన్న ఆలోచన ఆ హిస్టోరియన్లకు వచ్చింది. దీంతో పలువురు అంధులను ఒక చోటచేర్చి చార్మినార్కు దగ్గరలోని పైగా టూంబ్స్కు తీసుకువెళ్లి వారికి టూంబ్స్లోని అద్భుత కట్టడాలను పరిచయం చేశారు. వారంతా నిజాం కాలం నాటి పైగా టూంబ్స్ కట్టడాలను తాకుతూ అప్పటి నిర్మాణశైలి గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ వీడియోను మహ్మద్ హసీబ్ అహ్మద్ అనే చరిత్రకారుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తమకు ప్రభుత్వం సహకారం అందిస్తే ఇలాంటి ఈవెంట్లను మరిన్ని ఆర్గనైజ్ చేస్తామని మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్ను కోరారు. చార్మినార్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే పైగా టూంబ్స్ నిజాం కాలం నాటి పైగా కుటుంబం పవిత్రతను తెలియజేస్తాయి. పైగా కుటుంబీకులు అప్పట్లో నిజాంకు అత్యంత విధేయులుగా వ్యవహరించారు. నిజాంకు మంత్రులుగా కూడా ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న చారిత్రక ప్రదేశాల్లో ఆర్కిటెక్చర్ వండర్గా పైగా టూంబ్స్ ఖ్యాతికెక్కింది. Heritage Walk for Visually Impaired Individuals at Paigah Tombs. Small initiative by our team Beyond Hyderabad. @KTRBRS @arvindkumar_ias @Ravi_1836 @sselvan @tstourism spreading happiness. Looking for Govt support to implement more such events in coming days. @PaigahsofDeccan pic.twitter.com/ZLLeog3Ilu — Mohd haseeb ahmed (@historianhaseeb) November 27, 2023
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement