-
5జీ రేసు: అదానీ,జియోపై ఎయిర్టెల్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: 5జీ స్పెక్ట్రమ్ దక్కించుకుని టెలికాం రంగంలోకి అదానీ గ్రూప్ ప్రవేశించిన నేపథ్యంలో ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదాని గ్రూపు ఎంట్రీతో తమకేమీ ఇబ్బంది లేదని, సంస్థకు ఎలాంటి నష్టం ఉందని మిట్టల్ పేర్కొన్నారు. 5జీ సేవల రేసులో పోటీదారులను తాను స్వాగతిస్తానని వ్యాఖ్యానించారు. అలాగే మూలధనం విషయంలో తాము జియోతో పోటీపడలేక పోయినా టెక్నాలజీ, 5జీ సేవల్లో మాత్రం తామే ముందు ఉంటామని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన బిజినెస్ టుడే ‘ఇడియా ఎట్100 ఎకానమీ సమ్మిట్’ లో సునీల్ మిట్టల్ మాట్లాడారు. బడా పోటీదారులొచ్చినా 5జీ సేవల్లో ఎయిర్టెల్ అత్యుత్తమ సేవలందిస్తుందనే విశ్వాసాన్ని ఆయన ప్రకటించారు. అంతేకాదు ఈ రేసులో పోటీదారులను స్వాగతిస్తానన్నారు. అలాగే స్పెక్ట్రమ్ రేసులో అదానీ గ్రూప్నకు సేవ చేయడానికి ఇష్టపడతానన్నారు. తమ సాయం తీసుకోపోయినా ఫర్వాలేదు, కానీ తన అభిప్రాయం ప్రకారం.. అదానీ నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఇతర పారిశ్రామిక అవసరాలకు తాము సేవలందిస్తాం. నిజానికి మరింత మెరుగ్గా చేయగలమని భావిస్తున్నామని మిట్టల్ వ్యాఖ్యానించారు. (ఫెస్టివ్ సీజన్: గుడ్న్యూస్ 75 వేల ఉద్యోగాలు) ఈ సందర్భంగా జర్మనీలో సొంత స్పెక్ట్రమ్ ఉన్నప్పటికీ బీఎండబ్ల్యూ వోడాఫోన్తో జతకట్టిందని గుర్తు చేశారు. సాంకేతికపరమైన సేవలందిస్తోంది. తామూ కూడా అలాగే అదానీ గ్రూపునకు చేయగలమని ఎయిర్టెల్ చైర్మన్ చెప్పారు. గత 25 ఏళ్లుగా టెలికాం రంగంలో ఉన్న తాము..ఇప్పుడు డామినెంట్ పీపుల్ మార్కెట్లోకి వస్తారనే భయంతో మార్కెట్ప్లేస్ గెలవలేకపోతే, ఇక తమకు ఈ వ్యాపారంలో ఉండే హక్కు ఉండదని కూడా మిట్టల్ వ్యాఖ్యానించారు. మార్కెట్లో అత్యుత్తమ 5జీ సేవలందిస్తాం. మిగిలినవారు తమను ఫాలో అవుతారన్నారు. (Priyanka Chopra Jonas: భారీ ప్లాన్స్, నా బ్యూటీకి దేశీ సాంప్రదాయ ఉత్పత్తులనే వాడతా) టెలికాం మార్కెట్లో జియో ఆధిపత్యం గురించి మాట్లాడిన మిట్టల్, తమ క్యాపిటల్ జియోతో సరిపోలకపోవచ్చు, అయితే టెక్నాలజీ, సేవల పరంగా ఎయిర్టెల్ జియోకు గట్టి పోటీ ఇస్తుందన్నారు. అంతేకాదు ప్రస్తుతం ప్రపంచంలో స్పెక్ట్రమ్ వ్యాపారంలో కేవలం ఇద్దరం మాత్రమే ఉన్నాం. ఒకరు అమెరికా క్రెయిగ్ మెక్కావ్ అయితే, మరొకటి భారతి ఎయిర్టెల్ అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టెలికాం వ్యాపారం డీప్ పాకెట్ ఉన్న వ్యక్తులకు మాత్రమేనని ఆయన వివరించారు. కాగా ఇటీవల జరిగిన 5జీవేలంలో 400 MHz స్పెక్ట్రమ్ను కొనుగోలుతో అదానీ గ్రూప్ 5జీ రంగంలోకి ప్రవేశించింది. 26 GHz బ్యాండ్లో స్పెక్ట్రమ్ కోసం 212 కోట్ల రూపాయలు వెచ్చించింది. తమ వ్యాపారాలను డిజిటల్గా ఏకీకృతం చేసి, డేటాసెంటర్లను లింక్ చేస్తామని, ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద పారిశ్రామిక క్లౌడ్ కార్యకలాపాలను నిర్మిస్తామని, 400 మిలియన్ల కస్టమర్ బేస్లో సేవలను అందించడానికి సూపర్ యాప్ను అభివృద్ధి చేస్తామని అదానీ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
భారతీ ఎంటర్ప్రైజెస్ ఆస్తుల విక్రయం
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం భారతీ ఎంటర్ప్రైజెస్ దేశ రాజధానిలోని వరల్డ్మార్క్సహా నాలుగు వాణిజ్య ఆస్తులను విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా వీటిలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్రూక్ఫీల్డ్ 51 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. రూ. 5,000 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ కుదిరినట్లు భారతీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. మొత్తం 3.3 మిలియన్ చదరపు అడుగుల ఈ నాలుగు ఆస్తులపై భాగస్వామ్య(జేవీ) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఆస్తుల జాబితాలో వరల్డ్మార్క్ ఏరోసిటీ(ఢిల్లీ), వరల్డ్మార్క్ 65, ఎయిర్టెల్ సెంటర్(గుర్గావ్), పెవిలియన్ మాల్(లూథియానా) ఉన్నట్లు పేర్కొంది. ఒప్పందంలో భాగంగా బ్రూక్ఫీల్డ్ రియల్టీ ఫండ్ 51 శాతం వాటాను పొందనుండగా.. మిగిలిన 49 శాతం వాటాతో భారతీ ఎంటర్ప్రైజెస్ కొనసాగనుంది. ఎంటర్ప్రైజ్ విలువ మదింపులో రుణభారాన్ని సైతం పరిగణించినట్లు కంపెనీ తెలియజేసిం ది. అయితే కచ్చితమైన ఒప్పంద విలు వను వెల్లడించలేదు. నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి లావాదేవీ అమలుకానుంది. ఆస్తులను బ్రూక్ఫీల్డ్ అనుబంధ సంస్థ బ్రూక్ఫీల్డ్ ప్రాప ర్టీస్ మేనేజ్ చేయనున్నట్లు భారతీ వెల్లడించింది. ఆస్తుల వివరాలు: 1.43 మిలియన్ చదరపు అడుగుల వరల్డ్మార్క్ ఏరోసిటీ మిశ్రమ వినియోగ ఆస్తికాగా.. 7 లక్షల ఎస్ఎఫ్టీగల ఎయిర్టెల్ సెంటర్ కార్పొరేట్ సౌకర్యాలను కలిగి ఉంది. ఇక వరల్డ్మార్క్ 65 సైతం 7 లక్షల ఎస్ఎఫ్టీలో మిశ్రమ వినియోగానికి అనువుగా నూతనంగా నిర్మాణమైంది. దేశీయంగా బ్రూక్ఫీల్డ్ పలు నగరాలలో 47 మిలియన్ చదరపు అడుగుల వాణిజ్య రియల్టీ ఆస్తులను నిర్వహిస్తోంది. గతేడాది రూ. 3,800 కోట్ల ఐపీవో ద్వారా దేశీయంగా రియల్ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఆర్ఈఐటీ)ను ఆవిష్కరించింది. -
విప్రో, ప్రేమ్జీ ఫౌండేషన్ 1,125 కోట్లు
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఏర్పడిన ముప్పును అధిగమించేందుకు విప్రో కంపెనీ, విప్రో ఎంటర్ప్రైజెస్, ఆ సంస్థల ప్రమోటర్కు చెందిన అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ సంయుక్తంగా రూ.1,125 కోట్లను ఖర్చు చేసేందుకు సంసిద్ధత ప్రకటించాయి. ఇందులో విప్రో కంపెనీ రూ.100 కోట్లు, విప్రో ఎంటర్ప్రైజెస్ రూ.25 కోట్లు, అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ రూ.1,000 కోట్లను ఖర్చు పెట్టనున్నాయి. విప్రో వార్షికంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద చేసే ఖర్చుకు అదనంగా ఈ మొత్తాన్ని వెచ్చించనుంది. భారతీ ఎంటర్ప్రైజెస్ రూ.100 కోట్లు కరోనాపై పోరులో భారతీ ఎంటర్ప్రైజెస్ కూడా చేరిపోయింది. రూ.100 కోట్ల సాయాన్ని ప్రకటించింది. ప్రభుత్వరంగ పవర్గ్రిడ్ సంస్థ కూడా పీఎం కేర్స్కు తొలి విడతగా రూ.130 కోట్లను అందించింది. మరో రూ.70 కోట్లను 2020–21లో ఇవ్వనున్నట్టు తెలిపింది. అలాగే, ఇఫ్కో రూ.25 కోట్లు, క్రిబ్కో రూ.2 కోట్లు, ఎన్ఎఫ్ఎల్–కిసాన్ రూ.64 లక్షలు, కల్యాణి గ్రూపు రూ.25 కోట్లను పీఎంకేర్స్కు ప్రకటించాయి. ఎల్ఐసీ రూ.105 కోట్లు.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కరోనాపై యుద్ధంలో పాలుపంచుకుంటోంది. పీఎం–కేర్స్ ఫండ్కు రూ.105 కోట్ల విరాళం ఇచ్చినట్టు ప్రకటించింది. మొత్తం విరాళంలో రూ.5 కోట్లు గోల్డెన్ జూబ్లీ ఫండ్ నుంచి సమకూర్చినట్టు ఎల్ఐసీ చైర్మన్ ఎం.ఆర్.కుమార్ తెలిపారు. ఎస్బీఐ రూ.100 కోట్లు.. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు, ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సైతం రూ.100 కోట్లను పీఎంకేర్స్కు ప్రకటించింది. ఎల్జీ ఉచిత భోజన ఏర్పాట్లు.. లాక్డౌన్ నేపథ్యంలో దినసరి కూలీలు, వలస కార్మికుల సహాయార్థం కన్జ్యూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్ ఎల్జీ దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి భోజన ఏర్పాట్లను అందిస్తుంది. ఈ మేరకు అక్షయ పాత్ర ఫౌండేషన్తో ఒప్పందం చేసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంపిక చేసిన 50 రాష్ట్రాల్లోని ఆయా ఆసుపత్రుల్లో ఐసోలేషన్, క్వారంటైన్ వార్డుల్లో వాటర్ ప్యూరిఫయర్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లను అందించనున్నట్లు ఎల్జీ ఇండియా ఎండీ యంగ్ లాక్ కిమ్ తెలిపారు. పుణేలో మెర్సిడెజ్ బెంజ్ కోవిడ్ ఆసుపత్రి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మెర్సిడెజ్ బెంజ్ పుణేలో తాత్కాలిక కరోనా ఆసుపత్రిని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. చకాన్ ఖేడ్లోని మహలుంగే–ఇంగాలే గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఈ హాస్పటల్లో 1,500 మంది కరోనా రోగులకు చికిత్స అందించవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కు మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఉద్యోగుల ఒకరోజు వేతనాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. రామ్కో ఐసోలేషన్ సెంటర్లు రామ్కో సిమెంట్స్ లిమిటెడ్ తయారీ కేంద్రాల్లో పనిచేసే కార్మికులకు, వలస కూలీలకు మాస్క్లు, బియ్యం, కూరగాయలు వంటి నిత్యావసరాలను అందిస్తున్నట్లు తెలిపింది. తమిళనాడు, ఒడిశాలోని రామ్కో ప్లాంట్ వద్ద ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి కార్మికులకు, స్థానిక గ్రామస్తులకు వైద్య సేవలు అందిస్తుంది. రూ.3 కోట్ల వ్యయంతో వైద్య పరికరాలు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఓలెక్ట్రా రూ.17 లక్షలు.. కరోన కట్టడిలో భాగంగా ప్రభుత్వానికి సాయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్టెక్ నడుం బిగించింది. పీఎం కేర్స్ ఫండ్కు రూ.17.26 లక్షల మొత్తాన్ని విరాళంగా అందించింది. ఇందులో ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.7.26 లక్షలు, కంపెనీ రూ.10 లక్షలు సమకూర్చిందని ఓలెక్ట్రా ఈడీ ఎన్.నాగసత్యం తెలిపారు. -
మెగా విలీనానికి భారతీ ఎంటర్ప్రైజ్ చెక్
న్యూఢిల్లీ : భారతీ ఎయిర్ టెల్, టాటా గ్రూప్ కంపెనీలతో చేసుకోబోతున్న మెగా విలీనానికి గండిపడింది. టాటా గ్రూప్ టెలికాం, ఓవర్సీస్ కేబుల్, ఎంటర్ప్రైజ్ సర్వీసెస్, డీటీహెచ్ టీవీ వ్యాపారాలతో మెగా డీల్ కుదుర్చుకోవాలని ప్లాన్ను భారతీ ఎంటర్ప్రైజ్ విరమించుకుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. సునిల్ మిట్టల్కు చెందిన భారతీ ఇప్పటికే తలకు మించిన అప్పులతో కొట్టుమిట్టాడుతుందని, దీంతో టాటా గ్రూప్తో మెగావిలీన ప్లాన్లను విరమించుకుని, కేవలం టవర్ సంస్థ భారతీ ఇన్ఫ్రాటెల్ వాటా విక్రయం, టెలినార్ ఇండియా టేకోవర్ వంటి విషయాలపై ప్రస్తుతం దృష్టిసారించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. టెలినార్ ఇండియాను సొంతం చేసుకోబోతున్న ఎయిర్టెల్, టెలికాం మార్కెట్లో తీవ్ర పోటీ వాతావరణాన్ని సృష్టించబోతుంది. మరోవైపు ఐడియా, వొడాఫోన్లు ఓ విలీన సంస్థగా ఏర్పడబోతున్నాయి. భారతీ ఎయిర్టెల్లో మూడోవంతు కన్నా ఎక్కువ కలిగి ఉన్న సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్, టాటా టెలిసర్వీసెస్, టాటా కమ్యూనికేషన్ వ్యాపారాలపై ఎక్కువ శ్రద్ధ చూపిందని, కానీ ప్రజా షేర్హోల్డర్స్, ప్రభుత్వం కలిగి ఉన్న వాటాదారుల విషయంలో మేజర్ 'మల్టి-ప్లాన్' కొనుగోళ్లను చేపడుతూ సంక్లిష్టతలు తీసుకురాకూడదని అనుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే భారతీ బోర్డే ఈ మెగా విలీనాన్ని తిరస్కరించిందా? అనేది ఇంకా తెలియరాలేదు. లిస్టెడ్ కాని టాటా టెలిసర్వీసెస్, టాటా స్కై, లిస్టు అయిన టాటా కమ్యూనికేషన్లను భారతీ ఎయిర్టెల్తో విలీనం చేయాలని ఇరువైపుల చర్చలు జరిగాయని తెలిసింది. టాటా సన్స్ చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ పదవిలోకి వచ్చాక ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. ఎప్పడికప్పుడూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నామని, కానీ ప్రస్తుతం ఏమీ లేనట్టు భారతీ ఎయిర్టెల్ అధికార ప్రతినిధి చెప్పారు. టాటా గ్రూప్ అధికార ప్రతినిధి దీనిపై స్పందించడానికి తిరస్కరించారు. మార్కెట్ రూమర్లపై తామేమీ కామెంట్ చేయమని సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. టాటా టెలీ ఎయిర్వేస్ను ఎయిర్టెల్ దక్కించుకోవాలంటే 1.7 బిలియన్ డాలర్లను అది చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక ఒత్తిళ్లతో కొనసాగుతున్న ఈ సంస్థకు ఇది అతిపెద్ద సవాలని ఇండస్ట్రి అధికారులు చెప్పారు. నష్టాల్లో ఉన్న టెలికాం వ్యాపారాలను అతిపెద్ద కంపెనీలో కలుపడం టాటాలకు ఓ అవకాశంగా పేర్కొన్నారు. గత కొన్ని ఏళ్లుగా ఈ వ్యాపారాల నుంచి వైదొలగాలని టాటాలు చూస్తున్నారు. వొడాఫోన్తో కూడా చర్చలు జరిపారు. కానీ అవి సఫలం కాలేదు. ప్రస్తుతం చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చైర్మన్గా వచ్చాక ఈ చర్చలకు తెరతీశారు. -
రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార మంగళం బిర్లా, విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ, అడాగ్ చీఫ్ అనిల్ అంబానీ, ఎయిర్బస్ సీఈవో బెర్న్హార్డ్ గెర్వర్ట్ తదితర దేశ విదేశ దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 18 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేలా డిజిటల్ రంగంపై సుమారు రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 7 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు బిర్లా, రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు మిట్టల్ తెలిపారు. డిజిటల్, క్లౌడ్, టెలికం తదితర రంగాల్లో రాబోయే కొన్నేళ్లలో రూ. 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు అనిల్ అంబానీ వివరించారు. వచ్చే ఐదేళ్లలో నెట్వర్క్ విస్తరణ, బ్రాడ్బ్యాండ్ తదితర విభాగాలపై 7 బిలియన్ డాలర్లు, డిజిటల్ ఇండియా ప్రాజెక్టుల కింద మరో 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు కుమార మంగళం బిర్లా వెల్లడించారు. డిజిటల్ ఇండియా వీక్కు సాంకేతికపరమైన తోడ్పాటు అందిస్తామని వీడియో సందేశంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. తైవాన్ కంపెనీ డెల్టా ఎలక్ట్రానిక్స్ వర్గాలు 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించాయి. రూ. 2.5 లక్షల కోట్లు వెచ్చిస్తాం... ‘‘డిజిటల్ ఇండియా సాకారంలో భాగంగా మా సంస్థలు రూ.2.5 లక్షల కోట్లు పెట్టుబడి పెడతాయి. మౌలిక సదుపాయాల విషయానికొస్తే మేం ప్రపంచంలోనే అత్యుత్తమమైన తదుపరి తరం ఇంటర్నెట్ ప్రొటోకాల్ను దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ ఆరంభిస్తున్నాం. లక్షన్నర మంది ఎలక్ట్రానిక్ రిటైలర్లు స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ పరికరాలు సర్వీసు చేసేలా రిలయన్స్ జియో ద్వారా దేశవ్యాప్త డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను ఏర్పాటు చే స్తాం. వీటిని ఇండియాలోనే తయారుచేసి అందుబాటు ధరలకు అందించేందుకు ప్రధాన తయారీదారులతో మాట్లాడుతున్నాం. ఇక ఈ-గవర్నెన్స్, ఈ-విద్య, ఈ-ఆరోగ్యం, స్మార్ట్ సిటీలు, గ్రామీణ డిజిటల్ సేవల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పెట్టుబడి పెట్టడానికి సిద్ధం. కీలక నగరాలు, పట్టణాల్లో జియో డిజిటల్ ఇండియా స్టార్టప్ నిధిని ఏర్పాటు చేస్తాం. వీటన్నిటిద్వారా మేం 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామనేది నా అంచనా’’ - ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ ఫలాలు
పదేళ్ల మోదీ పాలన అవినీతిమయం
ఆరు గ్యారంటీల పేరుతో 420 అబద్ధాలు
పాలమూరు అభివృద్ధి కోసం ఓటేయండి
మోదీ హయాంలోనే దేశాభివృద్ధి
ఎంపీగా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
నేడు రాహుల్గాంధీ రాక
డీకే అరుణ గెలుపు కోసం కష్టపడాలి
ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యం..: మధుసూదన్రెడ్డి
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement