-
భద్రాద్రిలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం (ఫొటోలు)
-
ఇక ఆన్లైన్లో రామయ్య సేవలు
లాక్డౌన్ విధించిన నేపథ్యంలో దేవస్థానంలోకి భక్తులను అనుమతించడం లేదు. భక్తులు లేనప్పుడు అన్నదానం నిర్వహించడం వల్ల సమస్యలు వస్తాయేమోనని దేవస్థానం అధికారులు నిత్యాన్నదానం కూడా నిలిపివేశారు. దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు దేవస్థానం పరిసరాల్లోని నిరాశ్రయులకు, యాచకులను అన్నదానం నిర్వహిస్తున్నాయి. బుధవారం నుంచి కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న రోజువారీ కూలీలు, యాచకుల కోసం మధ్యాహ్నం అన్నదానం ప్రారంభించేందుకు దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు. రోజూ అన్నం, సాంబారు, పెరుగుతో 300 మందికి అన్నదానం చేయనున్నారు. భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారమచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో రామయ్య పూజలు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతరాయలంలోకి భక్తులెవరినీ అనుమతించడం లేదు. ఆర్జిత సేవలను, నిత్యకల్యాణాలను నిలిపివేశారు. దీంతో స్వామివారి ఆదాయానికి భారీగా గండి పడింది. స్వామివారికి నిత్య కైంకర్యాలు యథావిధిగా అర్చకులు నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాలు కూడా నిరాడంబరంగా జరిగాయి. ఈ యేడాది సుమారు రెండు కోట్ల రూపాయల అంచనాలతో శ్రీరామ నవమి పనులను ప్రారంభించారు. కానీ కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉత్సవాలు ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించారు. ముత్యాల తలంబ్రాల అమ్మకాలు కూడా లేకపోవడంతో ఆదాయం రాలేదు. ఈ నేపథ్యంలో నేరుగా భద్రాచలం రాలేని భక్తుల సౌకర్యం కోసం ఆన్లైన్ సేవలను ప్రారంభించారు. భక్తులు ఆన్లైన్లో ఆయా సేవలను ఎంచుకుని, వారి గోత్ర నామాలు తెలిపినట్లయితే, వారి పేరున పూజలు జరిపి, మెసేజ్ రూపంలో వారికి తెలియపర్చుతామని దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. -
రామా.. ఎంత అపచారం!
మూలవరులను తాకిన భక్తులు భద్రాచలం: భద్రాచలం రామాలయంలో అపచారం జరిగింది. సోమవారం సాయంత్రం శ్రీ సీతారామచంద్రస్వామివారి దర్శనం కోసం వచ్చిన ఇద్దరు భక్తులు నేరుగా గర్భగుడిలోని మూలవరుల వద్దకు వెళ్లి, స్వామి మూర్తులను తాకినట్లుగా తెలిసింది. గర్భగుడిలోని మూలవరుల వద్దకు వెళ్లకూడదనే విషయం తెలియని సదరు భక్తులు, స్వామి సేవలో తరించాలనే అలా చేసి ఉంటారని ఆలయన అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో భద్రాద్రి ఆలయంలో ఇటువంటి ఘటనలు వరుసగా జరుగుతుండడం విమర్శలకు తావిస్తోంది. ఆ సమయంలో విధులు నిర్వహించే అర్చకులు అక్కడ లేకపోవడం గమనార్హం. విషయాన్ని కొంతమంది భక్తులు ఈవో రమేష్బాబు దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అర్చకులు, సిబ్బందికి మెమోలు జారీ చేస్తామని ఈవో తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement