-
ఛాలెంజింగ్గా ఉంది
కాకినాడ క్రైం :కోనసీమ, మెట్ట, మైదాన ప్రాంతాలతో వైవిధ్యానికి నెలవైన తూర్పు గోదావరి జిల్లాకు రావడం ఛాలెంజింగ్గా ఉందని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కరణం సత్యనారాయ ణ నుంచి సోమవారం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోనూ శాంతిభద్రతల పరిరక్షణకు పాటు పడతామన్నారు. చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే కోనసీమలో అలాంటిది పునరావృతం కాకుండా చూస్తామన్నారు. రాష్ట్ర విభజనతో భద్రాచలం డివిజన్లోని ఆరు మండలాలు విలీనం కావడంతో జిల్లాపై మావోయిస్టుల ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లా ఎస్పీ, ఓఎస్డీలతోనూ చర్చించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది అవసరమని, రిక్రూట్మెంట్ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. జిల్లా ఏజెన్సీలోని రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగలతో పాటు మెట్ట ప్రాంతాల్లో గంజాయి సాగు, రవాణాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. రంపచోడవరం ఏఎస్పీతో దీనిపై ఇప్పటికే చర్చించిన ట్టు తెలిపారు. నకిలీ కరెన్సీ చలామణీని అరికడతాం.. బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి నకిలీ కరెన్సీ రాకపై నిఘా మరింత పెంచుతామని, స్థానికంగా జిరాక్స్ తీసి దొంగనోట్లు చలామణీ చేసేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. పెట్రో కారిడార్, సెజ్తో పాటు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనలను సామరస్యంగా పరిష్కరించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రాఫిక్, ఈవ్టీజింగ్ నిరోధంతో పా టు విజిబుల్ పోలీసింగ్కు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. స్టేషన్లలో సుహృద్భావ వాతావరణ ం ఉండేలా, ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసేలా చూస్తామని చెప్పారు. వివిధ శాఖల అధికారులు, ప్రజల సహకారంతో ముందు కు వెళ్తామన్నారు. జిల్లా 78వ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రవిప్రకాష్ను ఓ ఎస్డీ ప్రకాష్ జాదవ్, డీఎస్పీలు ఆర్.విజయభాస్కర రెడ్డి, ఎం.వీరారెడ్డి, వి.అరవింద్బాబు, బి.రవీంద్రనాథ్, సీఐలు, ఎస్సైలు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. -
‘ముంపు’పై 30 నుంచి ఆందోళనలు
భద్రాచలం: ముంపు మండలాలను ఆంధ్రలో కలుపుతూ జారీ చేసిన ఆర్డినెన్స్ను రద్దు చేయాలనే డిమాండ్తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు చెప్పారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరిగిన పోలవరం వ్యతిరేక ఐక్యకార్యాచరణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్తో ముంపు మండలాల్లో తీవ్రమైన ఆందోళన నెలకొన్నప్పటికీ, దీనిపై ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయకపోవటంఢ దారుణమన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనందున తమ పిల్లలను ఎఢక్కడ చదివించుకోవాలో తెలియక ముంపు మండలాల ప్రజానీకం అయోమయంలో ఉన్నారన్నారు. ఈ నెలాఖరున ముంపు మండలాల్లో పదవీ విరమణ చేసే ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ముంపు మండలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని స్పష్టం చేశారు. కమిటీ చైర్మన్ వట్టం నారాయణ మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి వరుసగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఏడు మండలాల్లో బంద్లు, విద్యాసంస్థల బంద్లకు పిలుపునివ్వనున్నట్లు చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీలు, గిరిజన, ప్రజా సంఘాల వారు పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
ముంపు.. ముప్పు..
భద్రాచలం, న్యూస్లైన్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం తీసుకున్న ముంపు మండలాల బదలాయింపు నిర్ణయంతో జిల్లాలోని ఆదివాసీల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఏకంగా ఏడు మండలాలను జిల్లా నుంచి వేరు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయటంతో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. భద్రాచలం డివిజన్లోని కూనవరం, వీఆర్పురం, చింతూరు, భద్రాచలం(భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా)మండలాలు, పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు,బూర్గంపాడు( ఖమ్మం నుంచి భద్రాచలం వచ్చేందుకు రోడ్ కనెక్టవిటీ నిమిత్తం 12 గ్రామాలు తెలంగాణలోనే ఉంచారు) మండలాల్లో గల 87 పంచాయితీలు, 324 రెవెన్యూ గ్రామాలు ఆంధ్రలో కలుస్తున్నాయి. ఈ గ్రామాల్లో నివసిస్తున్న 1,91,792 మంది జనాభా తెలంగాణ నుంచి వేరుచేయబడుతున్నారు. అపాయింటెండ్ డే అయిన జూన్ 2 తరువాత ఈ గ్రామాలను జిల్లా నుంచి వేరు చేస్తూ సరిహద్దులు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే ఈ పరిణామాలను ఈ ప్రాంత వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముంపు వాసులకు కష్టకాలమే... ముంపు మండలాల్లో ముందున్నదంతా కష్టకాలమేనని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వచ్చేది వర్షాకాలం.. మూడు నెలల పాటు గోదావరి పరివాహక వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక అంటువ్యాధులు కూడా విజృంభిస్తుంటాయి. రాష్ట్రంలో మలేరియా వ్యాధి పీడితులు సంఖ్య ఎక్కువగా నమోదయ్యేది ముంపు మండలాల్లోనే. గోదావరి వరదల సమయంలో ఈ మండలాలకు దారీ తెన్నూ ఉండదు. ఈ సమయంలో పునరావాస చర్యలకు అధికార యంత్రాంగం కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంటుంది. జూన్ 2 తరువాత తమను జిల్లా నుంచి వేరుచేస్తుండడంతో ఈ కష్టాలన్నీ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ముంపు ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం కేంద్రంగా చేపట్టే పునరావాస చర్యలే అంతంత మాత్రంగా ఉంటే, ఇక కాకినాడ లేదా రంపచోడవరం, పాల్వంచ డివిజన్ వాసులకు కోటరామచంద్రాపురం నుంచి చేపట్టే సహాయక చర్యలు ఏ మేరకు ఉంటాయోనని వారు భయాందోళనలకు గురవుతున్నారు. ఎన్నో చిక్కులు... రామాలయాన్ని దృష్టిలో పెట్టుకొని భద్రాచలం రెవెన్యూ గ్రామాన్ని మాత్రమే తెలంగాణలో ఉంచుతున్నారు. పట్టణంలో అంతర్భాగంగా ఉన్న రాజుపేట, శ్రీరామ్న గర్ కాలనీలు ఆంధ్రలో కలసిపోతున్నాయి. రాజుపేట కాలనీలో ఇంటి పన్నులు సైతం భద్రాచలం పంచాయతీ వారే వసూలు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో ఈ కాలనీ సీమాంధ్రలోకి వెళుతుంది. భద్రాచలం నుంచి తెలంగాణలోనే ఉండే దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు ఆంధ్రలో ఉన్న గ్రామాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. పట్టణానికి అనుకొని ఉన్న ఎటపాక, పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామాల పరిధిలోనే ఎక్కువగా విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్తుండడంతో ఇక్కడి విద్యార్థులకు అడ్మిషన్లు ఉంటాయా లేదా అనే సందిగ్ధిత ఏర్పడింది. రామాలయం తెలంగాణలో ఉండగా, దీనికి సంబంధించి పట్టణానికి ఆనుకొని ఉన్న దేవస్థానం భూములన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. భద్రాచలం మండల కేంధ్రం తెలంగాణలో ఉంటుండగా, మిగతా గ్రామాలన్నీ ఆంధ్రలోకి వెళ్తాయి. ఇక్కడి విద్యార్థులకు ఈ ఏడాది అడ్మిషన్లకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ఎవరు జారీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. బూర్గంపాడు మండలంలోనూ ఇదే పరిస్థితి. ఇక ముంపు మండలాల్లో పనిచేసే ఉద్యోగులు డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎక్కడి వారు అక్కడే అంటుండటంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన తాము ఆంధ్రలో పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం... తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భద్రాచలం జిల్లా కేంద్రం అవుతుందని అంతా భావించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా భద్రాచలాన్ని జిల్లా కేంద్రం చేస్తామని ప్రకటించారు. కానీ డివిజన్లో నాలుగు మండలాలు వేరు కానుండటంతో ఇది భద్రాచలం అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏజెన్సీ కేంద్రంగా ఉన్న భద్రాచలంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ భవిష్యత్లో వేరే చోటకు తరలిపోయే ప్రమాదం ఉంది. ఏజెన్సీలో గిరిజనులు ఎక్కువగా నివసించే చింతూరు, వీఆర్పురం, కూనవరం, వేలేరుపాడు వంటి మండలాలు ఆంధ్రలోకి పోతుండటంతో ఐటీడీఏను కూడా తరలిస్తారనే చర్చ సాగుతోంది. అధికారులు సైతం ఈ విషయంలో అవుననే అంటున్నారు. ఇలా ముంపు మండలాల బదలాయింపుతో భద్రాచలం అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. -
విభజన తిప్పలు!
సరిహద్దుల ఏర్పాటుపై తప్పని ఇబ్బందులు ముంపు ప్రాంత ఉద్యోగుల్లో ఆవేదన భద్రాచలం, న్యూస్లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో.. పోలవరం ముంపు పరిధిలోకి వచ్చే 211 గ్రామాలను ఖమ్మం జిల్లా నుంచి వేరు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి విలీనం చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావటంతో జిల్లా అధికారయంత్రాంగమంతా విభజన నివేదికల తయారీలో తలమునకలయ్యారు. జిల్లాలోని భద్రాచలం డివిజన్లోని భద్రాచలం, కూనవరం, వీఆర్పురం, చింతూరు మండలాల్లో గల 98 రెవెన్యూ గ్రామాలు(123 హేబిటేషన్లు) తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయనున్నారు. అదే విధంగా పాల్వంచ డివిజన్లోని 38 రెవెన్యూ గ్రామాలు (88 హేబిటేషన్లు) జిల్లా నుంచి వేరు చేసి పశ్చిమగోదావరిలో కలపనున్నారు. మొత్తంగా జిల్లా నుంచి ఏడు మండలాల్లో గల 1,16,796 మందిని ఉభయగోదావరి జిల్లాల్లో కలిపేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. అయితే ముంపు పరిధిలో ఉన్న గ్రామాలకు సరిహద్దుల ఏర్పాటుపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. భద్రాచలం, చింతూరు, బూర్గంపాడు మండలాల్లో సరిహద్దు బోర్డుల ఏర్పాటు కత్తిమీద సామేనని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. బూర్గంపాడు రెవెన్యూ గ్రామాన్ని బిల్లులో చేర్చటంతో దీని పరిధిలో ఉన్న లక్ష్మీపురాన్ని కూడా వేరు చేయాల్సి ఉంటుంది. ఖమ్మం నుంచి కొత్తగూడెం, పాల్వంచ మీదుగా భద్రాచలానికి వచ్చేందుకు లక్ష్మీపురాన్ని దాటాల్సి ఉంటుంది. ఇది ఒకరకంగా ఇబ్బందికరమైన సమస్యే. అదే విధంగా చింతూరు మండలంలో ఆంధ్రప్రదేశ్లో కలిసే చింతూరు, చట్టి గ్రామాలను దాటుకొని తెలంగాణలో ఉండే మోతుగూడెం వైపు గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఎక్కడ రాష్ట్ర సరిహద్దు ఏర్పాటు చేయాలనే దానిపై కూడా అధికారులు సైతం ఆలోచనలో పడ్డారు. కాగా, విభజన నేపథ్యంలో జూన్ 2 తరువాత జిల్లాలోని 7 మండలాల్లో గల 211 గ్రామాల పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి వేరు చేస్తారు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పనిచేయాల్సి ఉంటుంది. ముంపు పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. -
కేంద్రం చర్యపై సుప్రీం కోర్టుకెళ్తాం: కేసీఆర్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement