-
పునీత్కు బసవశ్రీ అవార్డు
సాక్షి, బళ్లారి, యశవంతపుర: దివంగత పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్కు మరణానంతరం చిత్రదుర్గ మురుఘ మఠం 2021 ఏడాదికిగాను ప్రతిష్టాత్మక బసవశ్రీ ప్రశస్తిని ప్రకటించడం తెలిసిందే. మంగళవారం బసవ జయంతి సందర్భంగా పునీత్ సతీమణి అశ్వినికి చిత్రదుర్గంలోని మురుఘ మఠంలో ప్రశస్తిని బహూకరించారు. అవార్డుతో పాటు రూ. 5 లక్షల చెక్కును పీఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుఘ స్వామి ఆమెకు అందజేశారు. మంత్రి బీసీ పాటిల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. (చదవండి: పునీత్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నమ్రత) -
బళ్లారిలో బసవ జయంతి
-
రగిలిన ఫైర్
బహిరంగంగా గవర్నర్, సీఎం పరస్పర విమర్శలు కరువు నివారణ పనుల్లో అలసత్వం : గవర్నర్ కోడ్ వల్లే ఆలస్యమని సీఎం చెబుతున్నారు కరువు పనులకు కోడ్ అడ్డుకాదు న్యాయశాఖ మంత్రిగా పనిచేశా.. కోడ్ గురించి నాకు తెలియదా? నెలన్నరగా పరిష్కారం కాని సమస్యలు ఇకనైనా మంత్రులు, అధికారులు స్పందించాలి సాక్షి, బెంగళూరు : రాష్ర్ట ప్రభుతం పనితీరుపై ఇన్నాళ్లూ నాలుగు గోడల మధ్య అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ హన్స్రాజ్ భరద్వాజ్ మొదటి సారిగా బహిరంగంగా సీఎం, మంత్రులను విమర్శించారు. వాటిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఘాటుగానే స్పందించారు. పరోక్షంగా గవర్నర్పై ఎదురుదాడికి దిగారు. బసవ జయంతి సందర్భంగా బెంగళూరులోని బసవేశ్వర సర్కిల్ వద్ద ఉన్న బసవణ్ణ విగ్రహానికి గవర్నర్ పూలమాల వేసి శుక్రవారం నివాళుర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు నివారణ పనులు సక్రమంగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రిని రాజ్భవన్కు పిలిపించుకుని మాట్లాడానని, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఆ పనులు చేపట్టడానికి వీలుకాలేదని సీఎం చెప్పుకొచ్చారని తెలిపారు. అయితే కరువు నివారణ పనులు చేపట్టడానికి కోడ్ అడ్డుకాదని, 15 ఏళ్ల పాటు కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన తనకు ఈ విషయం స్పష్టంగా తెలుసునని అన్నారు. రాష్ర్టంలో ప్రజాసమస్యలు దాదాపు నెలన్నరగా పరిష్కారం కావడం లేదని, ఇకనైనా మంత్రులు, అధికారులు వాటిపై దృష్టి సారించాలని ఘాటుగా విమర్శించారు. సీఎం ఎదురుదాడి.. గవర్నర్ విమర్శలపై సీఎం సిద్ధరామయ్య ఎదురుదాడికి దిగారు. కరువు నివారణ పనులు చేపట్టడంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక ప్రభుత్వం బాగా పనిచేస్తోందని తెలిపారు. బెంగళూరులో మీడియాతో ఆయన శుక్రవారం మాట్లాడారు. బసవణ్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధకశాఖ, రెవెన్యూ విభాగాలకు చెందిన మంత్రులు, అధికారులు ప్రజా సమస్య పరిష్కారం కోసం పగలు, రాత్రి అనే తేడా లేకుండా కృషి చేస్తున్నారన్నారు. ఈ విషయమై తమకు ఎవరి సర్టిఫికెట్టు అవసరం లేదని పరోక్షంగా గవర్నర్ను దెప్పిపొడిచారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.500 కోట్లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లను విడుదల చేసిందని గుర్తు చేశారు. మీడియా కూడా వాస్తవాలను తెలుసుకుని వార్తలు రాయాలని, గవర్నర్తో తాను భేటీ అయినప్పుడు తమ మధ్య నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయం ప్రస్తావనకే రాలేదని స్పష్టం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement