-
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
ఐర్లాండ్తో తొలి టీ20లో ఓటమికి పాకిస్తాన్ బదలు తీర్చుకుంది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే 16.5 ఓవర్లలో చేధించింది.పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(75), ఫఖార్ జమాన్(78) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.ఐరీష్ బ్యాటర్లలో లారెన్ టక్కర్(51), టాక్టెర్(32) పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా.. అమీర్, నసీం షా తలా వికెట్ సాధించారు.బాబర్ ఆజం వరల్డ్ రికార్డు..ఇక మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక మ్యాచ్ల్లో విజయం సాధించిన కెప్టెన్గా బాబర్ రికార్డులకెక్కాడు. బాబర్ సారథ్యంలో ఇప్పటివరకు పాకిస్తాన్ 45 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఉగాండా కెప్టెన్ బ్రియాన్ మసాబా పేరిట ఉండేది. బ్రియాన్ మసాబా కెప్టెన్గా ఉగాండాకు 44 టీ20లు విజయాలు అందించాడు. తాజా విజయంతో మసాబా రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (42), మోర్గాన్ (42), ఆఫ్ఘనిస్థాన్ మాజీ సారథి అస్గర్ ఆఫ్ఘన్ (42), భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (41), రోహిత్ శర్మ (41) ఉన్నారు. -
టీ20లలో సరికొత్త చరిత్ర.. బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో ఇంత వరకు ఏ క్రికెటర్కూ సాధ్యం కాని ఘనత సాధించాడు. కాగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ జరిగింది. డబ్లిన్లో జరిగిన ఈ టీ20లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. ఓపెనర్ సయీం ఆయుబ్(29 బంతుల్లో 45)తో పాటు బాబర్ ఆజం(43 బంతుల్లో 57), ఇఫ్తికర్ అహ్మద్(15 బంతుల్లో 37*) రాణించారు.ఒక బంతి మిగిలి ఉండగానేఅయితే, పాక్ విధించిన లక్ష్యాన్ని ఐర్లాండ్ అనూహ్య రీతిలో ఛేదించింది. ఓపెనర్ ఆండ్రు బల్బిర్నీ(55 బంతుల్లో 77), హ్యారీ టెక్టర్(27 బంతుల్లో 36), జార్జ్ డాక్రెల్(12 బంతుల్లో 24) దుమ్ములేపడంతో ఒక బంతి మిగిలి ఉండగానే విజయ ఢంకా మోగించింది.ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసి సొంతగడ్డపై జయభేరి మోగించింది. సిరీస్లో 1-0తో ఆధిక్యం సాధించింది ఐర్లాండ్. దీంతో పాకిస్తాన్కు పరాభవం ఎదురైనా.. బాబర్ ఆజం మాత్రం వ్యక్తిగతంగా ఓ అరుదైన రికార్డు సాధించాడు.పిన్న వయస్కుడిగా బాబర్ ప్రపంచ రికార్డుపొట్టి ఫార్మాల్లో అత్యంత వేగంగా వందకు పైగా 50 ప్లస్ స్కోర్లు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా 29 ఏళ్ల బాబర్ ఆజం నిలిచాడు. ఓవరాల్గా ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉండగా.. క్రిస్ గేల్, విరాట్ కోహ్లి బాబర్ కంటే ముందున్నారు.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో బాబర్ ఆజం 50కి పైగా పరుగులు సాధించడం ఇది 38వసారి. తద్వారా విరాట్ కోహ్లి రికార్డును అతడు సమం చేశాడు.టీ20లలో వందకు పైగా 50 ప్లస్ స్కోర్లు సాధించిన టాప్-5 ఆటగాళ్లు👉1. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 377 మ్యాచ్లలో- 12,232 పరుగులు- 110(8 సెంచరీలు, 102 అర్ధ శతకాలు)👉2. క్రిస్ గేల్(వెస్టిండీస్)- 463 మ్యాచ్లలో- 14,562 పరుగులు- 110(22 సెంచరీలు, 88 అర్ధ శతకాలు)👉3.విరాట్ కోహ్లి(ఇండియా)- 388 మ్యాచ్లలో- 12,628 పరుగులు- 105(9 సెంచరీలు, 96 అర్ధ శతకాలు)👉4. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 296 మ్యాచ్లు- 10,677 పరుగులు- 100(11 సెంచరీలు, 89 అర్ధ శతకాలు)👉5. జోస్ బట్లర్(ఇంగ్లండ్)- 413 మ్యాచ్లు- 11,484 పరుగులు- 88(8 సెంచరీలు, 80 అర్ధ శతకాలు).చదవండి: Rohit Sharma: అది నా ఇల్లు.. కానీ ఇదే లాస్ట్: రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్IRELAND BEAT PAKISTAN!!! What an incredible series opener we've just witnessed! A historic victory for @cricketireland 🇮🇪👏👏👏..#IREvPAKonFanCode #IREvPAK #FanCode pic.twitter.com/prvSBt37L5— FanCode (@FanCode) May 10, 2024 -
IRE Vs PAK: పాకిస్తాన్ను చిత్తు చేసిన ఐర్లాండ్.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పసికూన ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది. డబ్లిన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన తొలి టీ20లో 5 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి ఐర్లాండ్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజం(57) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఓపెనర్ అయూబ్(45), ఇఫ్తికర్ ఆహ్మద్(37 నాటౌట్) పరుగులతో రాణించారు. ఐరీష్ బౌలర్లలో క్రెగ్ యంగ్ రెండు వికెట్లు, డెలానీ,అడైర్ తలా వికెట్ సాధించారు. అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఐర్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో చేధించింది. ఐర్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ బల్బర్నీ(77) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.ఆఖరిలో కాంఫ్హెర్(15), డెలానీ(10) ఆజేయంగా నిలిచి తమ జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించారు. పాక్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా, షాహీన్ అఫ్రిది, వసీం తలా వికెట్ సాధించారు. Babar Azam is a cursed captain #IREvPAK IRELAND PROVE TO BE TOOO MIGHTY FOR 🇵🇰 😪💀 MOYE MOYE pic.twitter.com/LBNvtAd0Q6— Shehryar Sajid Khan (@Sskwrites) May 10, 2024IRELAND BEAT PAKISTAN!!! What an incredible series opener we've just witnessed! A historic victory for @cricketireland 🇮🇪👏👏👏..#IREvPAKonFanCode #IREvPAK #FanCode pic.twitter.com/prvSBt37L5— FanCode (@FanCode) May 10, 2024 -
Pak vs NZ: చావో రేవో.. గట్టెక్కిన పాకిస్తాన్! ఆఖరికి..
న్యూజిలాండ్తో ఆఖరి టీ20లో పాకిస్తాన్ గట్టెక్కింది. తొమ్మిది పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది సిరీస్ను సమం చేసుకుంది. కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం కివీస్ జట్టు పాక్ పర్యటనకు వెళ్లింది.బాబర్ ఆజం కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్కు ఇదే తొలి సిరీస్. అది కూడా సొంతగడ్డపై జరుగుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ క్రమంలో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్లో ఆతిథ్య పాక్ విజయం సాధించింది. ఆ మరుసటి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసిన కివీస్.. నాలుగో టీ20లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు 1-2తో వెనుకబడింది. కివీస్ ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో బాబర్ ఆజం బృందంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరి టీ20లో పాక్ గెలుపొందింది. తద్వారా సిరీస్ను 2-2తో సమం చేయగలిగింది.లాహోర్లో టాస్ ఓడిన పాక్.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. బాబర్ ఆజం(44 బంతుల్లో 69), ఉస్మాన్ ఖాన్(24 బంతుల్లో 31), ఫఖర్ జమాన్(33 బంతుల్లో 43), షాబాద్ ఖాన్(5 బంతుల్లో 15 నాటౌట్) రాణించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్ తడబడింది. ఓపెనర్ టిమ్ సెఫార్ట్ (33 బంతుల్లో 52), జోష్ క్లార్క్సన్(26 బంతుల్లో 38 నాటౌట్) మాత్రమే మెరుగ్గా ఆడారు.మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 19.2 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొమ్మిది పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. నాలుగు వికెట్లతో రాణించిన షాహిన్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. Scenes in Lahore following the fifth T20I as the series is squared 🏆🤝#PAKvNZ | #AaTenuMatchDikhawan pic.twitter.com/pBm4SmQi7j— Pakistan Cricket (@TheRealPCB) April 27, 2024 -
బాబర్ ఆజం పెళ్లి చేసుకోవాలని కోరితే.. నా ఆన్సర్ ఇదే అన్నందుకు ట్రోలింగ్! (ఫొటోలు)
-
Pak Vs NZ: ఉత్కంఠ పోరులో పాక్ చిత్తు.. ఏడ్చేసిన ఫ్యాన్స్!
సొంతగడ్డపై పాకిస్తాన్కు మరో చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్తో నాలుగో టీ20లో స్వల్ప తేడాతో బాబర్ ఆజం బృందం ఓడిపోయింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో కివీస్ 2-1తో పాక్పై పైచేయి సాధించింది.కాగా బాబర్ ఆజం కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్ తొలుత స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఇందులో తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్లో పాక్ గెలిచింది.అయితే, మరుసటి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసిన కివీస్.. తాజాగా గురువారం నాటి మ్యాచ్లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు టిమ్ రాబిన్సన్(36 బంతుల్లో 51), టామ్ బ్లండెల్ (15 బంతుల్లో 28), వన్డౌన్ బ్యాటర్ ఫాక్స్క్రాఫ్ట్(26 బంతుల్లో 34), కెప్టెన్ మిచెల్ బ్రాస్వెల్(20 బంతుల్లో 27) రాణించారు.పాక్ బౌలర్లలో అబ్బాస్ ఆఫ్రిది అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. ఆమిర్, ఉసామా మిర్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ ఆమిర్, జమాన్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే సయీమ్ ఆయుబ్(20), బాబర్ ఆజం(5), ఉస్మాన్ ఖాన్(16) వికెట్లు కోల్పోయింది. అయితే, ఫఖర్ జమాన్ పట్టుదలగా నిలబడి 45 బంతుల్లో 61 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.ఇఫ్తికర్ అహ్మద్(20 బంతుల్లో 23), ఇమాద్ వసీం(11 బంతుల్లో 22 నాటౌట్) పోరాడాడు. కానీ ఆఖరి బంతికి పాక్ విజయానికి ఆరు పరుగులు అవసరం కాగా.. క్రీజులో ఉన్న ఇమాద్ వసీం జెమ్మీ నీషం బౌలింగ్లో ఒక్క పరుగు మాత్రమే తీయగలిగాడు. ఫలితంగా నాలుగు పరుగుల తేడాతో పాక్ ఓటమిపాలైంది. దీంతో లాహోర్ ప్రేక్షకుల హృదయాలు ముక్కలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ మ్యాచ్లో మూడు కీలక వికెట్లు తీసి కివీస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన 22 ఏళ్ల పేసర్ విలియం రూర్కీకి ప్లేయర్ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
‘బాబర్ ఆజం పెళ్లి చేసుకోవాలనుకుంటే?.. ఒప్పుకోను!’
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజంకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వన్డేల్లో సుదీర్ఘకాలం పాటు నంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇటీవలే తిరిగి పరిమిత ఓవర్ల కెప్టెన్గా పునర్నియమితుడయ్యాడు.ఇక బాబర్ ఆజంకు తరచూ ఎదురయ్యే ప్రశ్నల్లో పెళ్లి గురించి తప్పక ప్రస్తావన ఉంటుంది. వరల్డ్క్లాస్ క్రికెటర్గా ఎదిగిన 29 ఏళ్ల ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరిని పెళ్లాడబోతున్నాడన్న అంశంపై గాసిప్రాయుళ్లు కథనాలు అల్లేస్తుంటారు కూడా! ఈ విషయమై పాకిస్తాన్కు చెందిన ఓ నటికి చేదు అనుభవం ఎదురైంది. బాబర్ ఫ్యాన్స్ దెబ్బకు ఆమె అకౌంట్ను కాసేపు ప్రైవేట్ అకౌంట్గా మార్చుకోవాల్సి వచ్చింది. నజీష్ జహంగీర్ అనే బుల్లితెర నటికి ఇన్స్టాగ్రామ్లో 12 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.ఈ క్రమంలో ఓ అభిమాని ఆమెను.. ‘‘బాబర్ ఆజం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాన’’ని అడిగితే ఏం చెప్తారు? అని అడిగాడు. ఇందుకు బదులుగా.. ‘‘సారీ చెప్తాను’’ అంటూ సున్నితంగా తిరస్కరిస్తాననే అర్థంలో సమాధానమిచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్ను ఆమె తన ఇన్స్టాస్టోరీలో పోస్ట్ చేసిందన్న వార్త వైరల్ అయింది.అంతేకాదు.. ‘‘బాబర్ మాకు సోదరుడి వంటి వాడు. కానీ అతడి అభిమానులు ఇలా నెగిటివిటీ ప్రచారం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు’’ అని నజీష్ ఆగ్రహం వ్యక్తం చేసిందన్నట్లు మరో ఇన్స్టా స్టోరీ కూడా తెరమీదకు వచ్చింది.ఈ క్రమంలో బాబర్ ఫ్యాన్స్ ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేయగా.. వేధింపులను తట్టుకోలేక నజీష్ తన అకౌంట్ను సోమవారం కాసేపు ప్రైవేట్గా పెట్టినట్లు సామా టీవీ వెల్లడించింది. అయితే, మరుసటి రోజే ఆమె మళ్లీ తన అకౌంట్ను పబ్లిక్ చేసేసింది. కాగా వన్డే వరల్డ్కప్-2023 వైఫల్యం తర్వాత బాబర్ ఆజం పాక్ కెప్టెన్గా వైదొలిగాడు.దీంతో అతడి స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్గా ఎంపికయ్యారు. అయితే, వీరి సారథ్యంలో జట్టు ఘోర వైఫల్యాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో షాహిన్పై వేటు వేసిన పాక్ బోర్డు.. పగ్గాలను తిరిగి బాబర్ ఆజంకు అప్పగించింది. షాన్ మసూద్ను మాత్రం టెస్టుల సారథిగా కొనసాగిస్తోంది. ఇక మళ్లీ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాబర్ సొంతగడ్డపై న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్తో బిజీ అయ్యాడు. వర్షం కారణంగా తొలి టీ20 రద్దు కాగా.. రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచింది. ఇరుజట్ల మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. -
పాకిస్తాన్ జట్టు ప్రకటన! 4 ఏళ్ల తర్వాత స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ
స్వదేశంలో న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్న పేసర్ మహ్మద్ అమీర్, ఆల్రౌండర్ ఇమాద్ వసీంకు ఈ జట్టులో చోటు దక్కింది. వీరిద్దరితో పాటు యువ ఆటగాడు ఉస్మాన్ ఖాన్, అన్క్యాప్డ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. అదే విధంగా ఈ సిరీస్తో బాబర్ ఆజం మళ్లీ పాకిస్తాన్ టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు పాకిస్తాన్ సూపర్ లీగ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన యువ ఓపెనర్ సైమ్ అయూబ్ను సైతం సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక మహ్మద్ అమీర్ పాకిస్తాన్ తరపున చివరగా 2020లో ఆడాడు. ఆ తర్వాత బోర్డుతో విభేదాల కారణంగా అంతర్జాతీయ క్రికెట్కు అమీర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇప్పుడు బోర్డు కొత్త చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ సూచనల మెరకు అమీర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. మరోవైపు ఇమాద్ వసీం కూడా గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికాడు. కానీ పీసీబీ అధికారులతో చర్చలు జరిపి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరికి వహాబ్ రియాజ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఏప్రిల్ 18 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కివీస్తో టీ20లకు పాక్ జట్టు బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ అమీర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఉసామా మీర్, ఉస్మాన్ ఖాన్, జమాన్ ఖాన్ నాన్ ట్రావెలింగ్ రిజర్వ్లు: హసీబుల్లా, మొహమ్మద్ అలీ, మొహమ్మద్ వాసిం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్ మరియు సల్మాన్ అలీ అఘా -
'బుమ్రా కాదు.. అతడే ఆఖరి ఓవర్లో 10 రన్స్ డిఫెండ్ చేయగలడు'
టీ20 వరల్డ్కప్-2024కు పాకిస్తాన్ క్రికెట్ జట్టు అన్ని విధాల సన్నద్దమవుతోంది. అంతేకంటే ముందు వరల్డ్కప్ సన్నహాకాల్లో భాగంగా స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాక్ తలపడనుంది. టీ20 వరల్డ్కప్ నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్నెస్పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రధానంగా దృష్టిసారించింది. ఈ క్రమంలో తమ జాతీయ జట్టు సభ్యులందరికీ పాకిస్థాన్ సైన్యంతో పీసీబీ కఠిన శిక్షణ ఇప్పిస్తోంది. కాకుల్ ఆర్మీ క్యాంపులో పాకిస్తాన్ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదే విధంగా టీ20ల్లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్గా బాబర్ ఆజం మళ్లీ బాధ్యతలు చేపట్టాడు. ఏప్రిల్ 18 నుంచి న్యూజిలాండ్తో జరగనున్న టీ20 సిరీస్తో బాబర్ మళ్లీ పాక్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఇక తిరిగి పాక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన బాబర్ ఆజం ఓ పోడ్కాస్ట్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో పోడ్కాస్ట్ హోస్ట్ నుంచి బాబర్కు ఓ ప్రశ్న ఎదురైంది. "టీ20 మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే మిగిలి ఉంది. ప్రత్యర్ధి జట్టు విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు కావాలి. మీ వద్ద రెండు బౌలింగ్ ఆప్షన్ ఉన్నాయి. ఒకరు నసీమ్ షా, మరొకరు జస్ప్రీత్ బుమ్రా. అటువంటి అప్పుడు 10 పరుగులను కాపాడుకోవడానికి మీరు ఎవరికి బౌలింగ్ ఇస్తారన్న" ప్రశ్న హోస్ట్ అడిగాడు. బాబర్ ఏమీ ఆలోచించకుండా నసీం షా పేరును చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన భారత అభిమానులు బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలరని, నసీం షాకు అంత సీను లేదని కామెంట్లు చేస్తున్నారు. -
బాబర్ ఆజమ్కు మళ్లీ పాక్ జట్టు పగ్గాలు
మరో రెండు నెలల్లో టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... పాకిస్తాన్ క్రికెట్ జట్టు వన్డే, టి20 జట్లకు కెప్టెన్ గా మళ్లీ బాబర్ ఆజమ్ను నియమించారు. గత ఏడాది వన్డే ప్రపంచకప్లో పాక్ జట్టు విఫలమయ్యాక బాబర్ కెప్టెన్సీ కోల్పోయాడు. టి20 జట్టుకు షాహీన్ అఫ్రిదిని, టెస్టు జట్టుకు షాన్ మసూద్ను కెపె్టన్లుగా నియమించారు. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టి20 సిరీస్ను పాక్ జట్టు 1–4తో చేజార్చుకుంది. దాంతో సెలెక్టర్లు కెప్టెన్సీ విషయంలో బాబర్ వైపు మొగ్గారు. -
Official: షాహిన్పై వేటు.. పాక్ కెప్టెన్గా మళ్లీ బాబర్ ఆజం
PCB Announces Babar Azam appointed as white-ball captain: పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్గా స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పునర్నియమితుడయ్యాడు. వన్డే, టీ20 జట్ల సారథిగా మరోసారి పగ్గాలు చేపట్టనున్నాడు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెలక్షన్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం మేరకు బాబర్ ఆజంను తిరిగి కెప్టెన్గా నియమించినట్లు తెలిపింది. సెమీస్ కూడా చేరకుండా నిష్క్రమించడంతో కాగా వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ దారుణ వైఫల్యం నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో బ్యాటర్గానూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో.. బాబర్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ మాజీ క్రికెటర్లు సూచించారు. అప్పటి పీసీబీ పెద్దలు సైతం బాబర్ ఆజంకు మద్దతుగా నిలవకపోవడంతో అతడు కెప్టెన్గా తప్పుకొన్నాడు. అతడి స్థానంలో టీ20లకు కెప్టెన్గా ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది, టెస్టులకు షాన్ మసూద్లను సారథులుగా ఎంపిక చేశారు. ఘోర పరాజయాలు ఈ క్రమంలో షాన్ మసూద్ నేతృత్వంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్.. కంగారూల చేతిలో టెస్టు సిరీస్లో 3-0తో వైట్వాష్కు గురైంది. అదే విధంగా షాహిన్ సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్లో 4-1తో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో పీసీబీ నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి. ఆఫ్రిదిపై వేటు.. మసూద్ కొనసాగింపు! ఇక షాహిన్ ఆఫ్రిది పాకిస్తాన్ సూపర్ లీగ్లోనూ పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో పీసీబీ చీఫ్గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మొహ్సిన్ నఖ్వీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సెలక్షన్ కమిటీ సిఫారసు మేరకు బాబర్ ఆజంను వన్డే, టీ20ల కెప్టెన్గా ఎంపిక చేసినట్లు ప్రకటించాడు. అయితే, టెస్టులకు మాత్రం షాన్ మసూద్నే సారథిగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. కాగా పాకిస్తాన్ జట్టు తదుపరి ఏప్రిల్ 18 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్తో బాబర్ ఆజం నాయకుడిగా తన ప్రస్థానాన్ని తిరిగి మొదలుపెట్టనున్నాడు. చదవండి: #Mayank Yadav: ఐపీఎల్లో ఫాస్టెస్ట్ డెలివరీ.. ఎవరీ మయాంక్ యాదవ్? Babar Azam appointed as white-ball captain Following unanimous recommendation from the PCB’s selection committee, Chairman PCB Mohsin Naqvi has appointed Babar Azam as white-ball (ODI and T20I) captain of the Pakistan men's cricket team. pic.twitter.com/ad4KLJYRMK — Pakistan Cricket (@TheRealPCB) March 31, 2024 -
పాకిస్తాన్ కెప్టెన్సీకి షాహీన్ షా ఆఫ్రిది గుడ్ బై..? కొత్త సారథి ఎవరంటే?
పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్సీ నుంచి షాహీన్ షా ఆఫ్రిది తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. తన కెప్టెన్సీలో ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత బాధ్యత వహిస్తూ అఫ్రిది తన పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా అఫ్రిదికి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పిసిబి) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ,జాతీయ సెలెక్టర్ల మధ్య పెద్దగా కమ్యూనికేషన్ కూడా లేనిట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పీసీబీ తీరు పట్ల అఫ్రిది ఆంసృప్తితో ఉన్నట్లు పలురిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కెప్టెన్సీకి గుడ్బై చెప్పి సాధారణ ఆటగాడిగా కొనసాగాలని షాహీన్ నిర్ణయించుకున్నట్లు వినికిడి. పాకిస్తాన్ కెప్టెన్ గా మళ్లీ బాబర్ ఆజాం పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. వచ్చేనెల 18నుంచి స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్తో బాబర్ తిరిగి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నట్టు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. కాగా గత ఏడాది భారత్లో జరిగిన వన్డే వరల్డ్కప్లో జట్టు దారుణ వైఫల్యం తర్వాత మూడు ఫార్మాట్లలో ఆజమ్ కెప్టెన్సీపై వేటు పడింది. ఆ తర్వాత టీ20 కెప్టెన్గా షాహీన్ షా అఫ్రిది, టెస్టు కెప్టెన్గా షాన్ మసూద్ను పీసీబీ నియమించింది. కానీ వీరిద్దరూ తమ మార్క్ చూపిచండంలో విఫలమయ్యారు. మసూద్ సారధ్యంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ను పాక్ కోల్పోగా.. షాహీన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్పై పాకిస్తాన్ 4-1 సిరీస్ ఓటమిని చవిచూసింది. -
పాక్ కెప్టెన్గా మళ్లీ బాబర్!.. అల్లుడికి అండగా షాహిద్ ఆఫ్రిది
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును ఆ దేశ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది విమర్శించాడు. బోర్డు పెద్దలు మారినప్పుడల్లా వారికి అనుగుణంగా నిర్ణయాలు మారిపోతూ ఉంటాయని.. తమ క్రికెట్ వ్యవస్థలో ఉన్న అతిపెద్ద సమస్య ఇదేనని పేర్కొన్నాడు. కాగా పీసీబీ యాజమాన్యం తరచూ మారుతున్న విషయం తెలిసిందే. ప్రధాని షాబాజ్ జోక్యం నేపథ్యంలో రమీజ్ రాజాను అధ్యక్షుడిగా తప్పించి.. నజమ్ సేథీని తాత్కాలిక చైర్మన్గా నియమించారు. అనంతరం నజమ్ సేథీ కూడా వైదొలగడంతో.. అతడి స్థానంలో జకా అష్రాఫ్ బాధ్యతలు చేపట్టాడు. అతడు కూడా రాజీనామా చేయడంతో సుప్రీం కోర్టు న్యాయవాది షా ఖవార్ నియమితులయ్యారు. తాత్కాలిక చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఆయన పీసీబీ ఎన్నికలు ముగిసే వరకు ఈ పదవిలో కొనసాగుతారని ప్రకటించారు. అనంతరం ఎలక్షన్లో గెలిచిన మొహ్సిన్ నఖ్వీ పీసీబీ బాస్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2023లో కనీసం సెమీస్ కూడా చేరుకుండా పాకిస్తాన్ నిష్క్రమించడంతో కెప్టెన్ బాబర్ ఆజంపై వేటు వేశారు. అతడి స్థానంలో టెస్టు కెప్టెన్గా షాన్ మసూద్, టీ20 కెప్టెన్గా షాహిన్ ఆఫ్రిదిని నియమించారు. అయితే, వీరిద్దరి సారథ్యంలో తొలి సిరీస్లలోనే పాకిస్తాన్ ఘోర పరాజయాలు మూటగట్టుకుంది. ఈ క్రమంలో కొత్త సెలక్షన్ కమిటీ బాబర్ ఆజంను తిరిగి కెప్టెన్ చేయాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీ20లకు షాహిన్ ఆఫ్రిదిని తప్పించి బాబర్తో భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలపై స్పందించిన షాహిద్ ఆఫ్రిది.. తన అల్లుడు షాహిన్ ఆఫ్రిదికి అండగా నిలిచాడు. ‘‘ఒకరిని కెప్టెన్గా నియమించినపుడు తనను తాను నిరూపించుకునేందుకు కొంత సమయం కూడా ఇవ్వాలి. అంతేగానీ కొత్త వాళ్లు రాగానే మళ్లీ మార్పులు చేస్తాం అంటే.. సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ఒక ఆటగాడిని సారథిని చేసి వెంటనే తొలగించాలనుకుంటున్నారంటే ఆ నిర్ణయం తప్పుడైది ఉండాలి. లేదంటే మళ్లీ మార్చాలనుకున్న నిర్ణయమైన సరైంది కాకపోయి ఉండాలి’’ అని పీసీబీ తీరును విమర్శించాడు. తన అల్లుడు షాహిన్కు మరికొంత సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. -
బాబర్ ఆజం, డేవిడ్ వార్నర్కు ఘోర అవమానం..
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్లకు మరోసారి ఘోర అవమానం ఎదురైంది. ఇంగ్లండ్ ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీ ది హండ్రెడ్ లీగ్లో వరుసగా మూడోసారి ఈ పాక్ స్టార్ క్రికెటర్లు అమ్ముడుపోలేదు. ది హండ్రెడ్ లీగ్ 2024 సీజన్ డ్రాఫ్ట్లో బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లను సొంతం చేసుకోవడానికి ఏ ప్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. వీరితో పాటు ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్, ఆసీస్ యువ సంచలనం టిమ్ డేవిడ్లు సైతం అమ్ముడు పోలేదు. అయితే ఈ డ్రాఫ్ట్లో బాబర్, రిజ్వాన్ను ఎవరూ పట్టించుకో పోయినప్పటికి.. తమ సహాచర ఆటగాళ్లు షాహీన్ అఫ్రిది, నసీం షా, ఇమాద్ వసీం మాత్రం అమ్ముడుపోయారు. షాహీన్ ఆఫ్రిదీని లక్ష పౌండ్ల(పాకిస్తాన్ కరెన్సీలో 3 కోట్ల 48 లక్షల రూపాయలు)కు వెల్ష్ ఫైర్ ప్రాంచైజీ సొంతం చేసుకుంది. గత సీజన్లో కూడా షాహీన్.. వెల్ష్ ఫైర్ ప్రాంచైజీకే ప్రాతినిథ్యం వహించాడు. ఇమాద్ వసీంను ట్రెంట్ రాకెట్స్, నసీం షాను బర్మింగ్హామ్ ఫీనిక్స్ దక్కించుకుంది. కాగా ఈ డ్రాప్ట్లో వెస్టిండీస్ ఆటగాళ్లకు బారీ డిమాండ్ నెలకొంది. నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, హెట్మైర్ వంటి విండీస్ ఆటగాళ్లు తొలి రౌండ్లోనే అమ్ముడుపోయారు. పూరన్ను నార్తర్న్ సూపర్ఛార్జర్స్ సెలక్ట్ చేసుకోగా.. ఆండ్రీ రస్సెల్, షిమ్రాన్ హెట్మెయర్ లండన్ స్పిరిట్కు ఆడనున్నారు. వీరితో పాటు విండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ సదరన్ బ్రేవ్ జట్టుకు, రోవ్మాన్ పావెల్ ట్రెంట్ రాకెట్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించనున్నారు. మరోవైపు మహిళల ది హండ్రెడ్ లీగ్ డ్రాప్ట్లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అయితే భారత స్టార్ క్రికెటర్లు స్మృతి మంధాన, రిచ్ ఘోష్లను మాత్రం ఈ డ్రాప్ట్లో ఎంపికయ్యారు. మంధానను సదరన్ బ్రేవ్ సొంతం చేసుకోగా.. రిచా ఘోష్ను బర్మింగ్హామ్ ఫీనిక్స్ ఎంపిక చేసింది. -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 సీజన్కు ఎండ్ కార్డ్ పడింది. ఈ ఏడాది పీఎస్ఎల్ ఛాంపియన్స్గా ఇస్లామాబాద్ యునైటడ్ నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో ముల్తాన్ సూల్తాన్స్ను 2 వికెట్ల తేడాతో ఓడించిన ఇస్లామాబాద్.. మూడో సారి ఛాంపియన్స్గా అవతరించింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్లో పెషెవర్ జెల్మీ టైటిల్ సాధించకపోయినప్పటికి ఆ జట్టు కెప్టెన్, పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం మాత్రం అరుదైన ఘనతను సాధించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో మూడు సార్లు హనీఫ్ మొహమ్మద్ క్యాప్ సొంతం చేసుకున్న మొదటి క్రికెటర్గా బాబర్ రికార్డులకెక్కాడు. పీఎస్ఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి హనీఫ్ మొహమ్మద్ క్యాప్(గ్రీన్ క్యాప్)ను అందిస్తారు. ఇప్పుడు వరకు మూడు పీఎస్ఎల్ సీజన్లలో లీడింగ్ రన్ స్కోరర్గా బాబర్ నిలిచాడు. 2020 సీజన్లో 473 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచిన బాబర్.. ఆ తర్వాత 2021 సీజన్లోనూ 554 పరుగులతో గ్రీన్ క్యాప్ను తన వద్దే ఉంచుకున్నాడు. ఇప్పుడు పీఎస్ఎల్-2024లోనూ 569 పరుగులతో టాప్ రన్స్కోరర్గా నిలిచాడు. 11 మ్యాచ్ల్లో 569 పరుగులు చేశాడు. అందులో 5 ఫిప్టీలతో పాటు ఓ సెంచరీ కూడా ఉంది. -
సూపర్ మ్యాన్లా.. గాల్లోకి ఎగురుతూ? బాబర్కు ఫ్యూజ్లు ఔట్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 లీగ్ ఫైనల్లో ఇస్లామాబాద్ యునైటెడ్ అడుగుపెట్టింది. శనివారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో పెషావర్ జల్మీపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇస్లామాబాద్ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో ఇస్లామాబాద్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ సంచలన క్యాచ్తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్తో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజంను పెవిలియన్కు పంపాడు. పెషావర్ ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన నసీమ్ షా 4వ బంతిని బాబర్కు ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బాబర్ కొంచెం రూమ్ తీసుకుని మిడ్ ఆఫ్ మీదగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో మిడ్ ఆఫ్లో ఉన్న షాదాబ్ ఖాన్.. ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకున్నాడు. ఇది చూసిన బాబర్ షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. A bird, a plane? No, it's SUPERMAN SHADAB KHAN 😱#HBLPSL9 | #KhulKeKhel | #PZvIU pic.twitter.com/PZFbd2ZNHV — PakistanSuperLeague (@thePSLt20) March 16, 2024 -
నిరాశపరిచిన బాబర్.. ఫైనల్కు చేరిన షాదాబ్ ఖాన్ జట్టు
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో పెషావర్ జల్మీ కథ ముగిసింది. ఈ లీగ్లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్తో జరిగిన ఎలిమినేటర్లో 5 వికెట్ల తేడాతో పెషావర్ ఓటమి పాలైంది. దీంతో ఈ లీగ్ నుంచి బాబర్ ఆజం సారథ్యంలోని పెషావర్ ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జల్మీ బ్యాటర్లలో సైమ్ అయూబ్(44 బంతుల్లో 73,6 ఫోర్లు, 4 సిక్స్లు) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు మహ్మద్ హ్యారిస్(40) పరుగులతో రాణించాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో నసీం షా 3 వికెట్లు పడగొట్టగా.. మెకాయ్, షాదాబ్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో మిడిలార్డర్ బ్యాటర్లు ఇమాద్ వసీం(59 నాటౌట్), హైదర్ అలీ(52 నాటౌట్) పరుగులతో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. పెషావర్ బౌలర్లలో అయూబ్ రెండు వికెట్లు పడగొట్టగా.. వుడ్, ముమ్టాజ్, కుర్రామ్ తలా వికెట్ సాధించారు. ఇక మార్చి 18న కరాచీ వేదికగా జరగనున్న ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్తో ఇస్లామాబాద్ యూనైటడ్ తలపడనుంది. -
మరోసారి చెలరేగిన బాబర్ ఆజమ్.. వరుసగా మూడో హాఫ్ సెంచరీ
పాకిస్తాన్ సూపర్ లీగ్ చివరి దశకు చేరింది. లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారయ్యాయి. పెషావర్ జల్మీ, ముల్తాన్ సుల్తాన్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, క్వెట్టా గ్లాడియేటర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకోగా.. కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. నిన్న జరిగిన నామమాత్రపు లీగ్ మ్యాచ్లో పెషావర్ జల్మీ.. కరాచీ కింగ్స్ను 2 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (51) మరోసారి చెలరేగడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. బాబర్కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. పెషావర్ ఇన్నింగ్స్లో రోవ్మన్ పావెల్ (30) ఓ మోస్తరుగా రాణించాడు. కరాచీ బౌలర్లు డేనియల్ సామ్స్, జహీద్ మహమూద్, ఆరాఫత్, హసన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ.. పెషావర్ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నవీన్ ఉల్ హాక్ తన కోటా 4 ఓవర్లలో ఓ మెయిడిన్తో పాటు 2 వికెట్లు పడగొట్టగా.. వుడ్, ఆమెర్ జమాల్, సైమ్ అయూబ్ పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. టిమ్ సీఫర్ట్ (41), ఇర్ఫాన్ ఖాన్ (39 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించినా కరాచీని గెలిపించలేకపోయారు. -
బాబర్ ఆజమ్ పరుగుల ప్రవాహం కొనసాగింపు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో పెషావర్ జల్మీ సారధి బాబర్ ఆజమ్ పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ఈ ఎడిషన్లో ఇప్పటికే లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్న బాబర్.. తాజాగా క్వెట్టా గ్లాడియేటర్స్తో జరుగుతున్న మ్యాచ్లో మరో హాఫ్ సెంచరీ చేసి తన పరుగుల సంఖ్యను మరింత పెంచుకున్నాడు. క్వెట్టతో జరుగుతున్న మ్యాచ్లో 30 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 53 పరుగులు చేసిన బాబర్.. ప్రస్తుత ఎడిషన్లో తన పరుగుల సంఖ్యను 447కి పెంచుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన బాబర్.. సెంచరీ, 4 అర్దసెంచరీలు చేశాడు. క్వెట్టాతో మ్యాచ్లో బాబర్ రాణించడంతో పెషావర్ జల్మీ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. 15 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 156 పరుగులుగా ఉంది. జల్మీ ఇన్నింగ్స్లో బాబర్తో పాటు సైమ్ అయూబ్ (12 బంతుల్లో 30), మొహమ్మద్ హరీస్ (13 బంతుల్లో 20), కోహ్లెర్ కాడ్మోర్ (19 బంతుల్లో 33) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. రోవ్మన్ పావెల్ (6), ఆమెర్ జమాల్ (5) క్రీజ్లో కొనసాగుతున్నారు. -
సత్తా చాటిన బాబర్.. మరోసారి బ్యాట్ ఝులిపించిన ఆమెర్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో పెషావర్ జల్మీ మరోసారి భారీ స్కోర్ సాధించింది. ముల్తాన్ సుల్తాన్స్తో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్లో పెషావర్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్కు ఓపెనర్లు సైమ్ అయూబ్ (22 బంతుల్లో 46;3 ఫోర్లు, 5 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (40 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరికి వికెట్కీపర్ హసీబుల్లా ఖాన్ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్), రోవ్మన్ పావెల్ (15 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ఆసిఫ్ అలీ (10 బంతుల్లో 11; 2 ఫోర్లు) తోడయ్యారు. ఆఖర్లో ఆమెర్ జమాల్ (5 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) గత మ్యాచ్ తరహాలో (జమాల్ నిన్న ఇస్తామాబాద్తో జరిగిన మ్యాచ్లో పూనకం వచ్చినట్లు ఊగిపోయి 49 బంతుల్లో 8 ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు) రెచ్చిపోయాడు. సుల్తాన్స్ బౌలర్లలో ఉసామా మిర్, క్రిస్ జోర్డన్లు పెషావర్ బ్యాటర్లకు అడ్డుకట్ట వేయగలిగారు. ఉసామా 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. జోర్డన్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. వీరిద్దరు మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మొహ్మద్ అలీ 3 ఓవర్లలో 46, డేవిడ్ విల్లే 4 ఓవర్లలో 36, ఇఫ్తికార్ ఓవర్లో 12, ఖుష్దిల్ షా ఓవర్లో 13, అఫ్తాబ్ 3 ఓవర్లలో 30 పరుగులు సమర్పించుకున్నారు. -
అఫ్గానిస్తాన్ కెప్టెన్గా బాబర్ ఆజం..!?
పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజం మళ్లీ టెస్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. అయితే ఈసారి పాక్ జట్టుకు కాకుండా భిన్నంగా అఫ్గానిస్తాన్ టెస్టు జట్టు సారథిగా బాబర్ కన్పించాడు. ఏంటి ఇది వినడానికి షాకింగ్గా ఉందా? అసలేం జరిగిందో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. అబుదాబి వేదికగా బుధవారం ఐర్లాండ్-అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు అధికారిక బ్రాడ్క్రాస్టర్లు ఘోర తప్పిదం చేశారు. బ్రాడ్క్రాస్టర్లు అఫ్గానిస్తాన్ కెప్టెన్గా హస్మతుల్లా షాహిది బదులుగా బాబర్ ఆజంను స్క్రీన్పై చూపించారు. ఇది చూసిన అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత తమ తప్పిదాన్ని గమనించిన ప్రసారకర్తలు బాబర్ స్ధానంలో షాహిదిని రిప్లేస్ చేశారు. అయితే అప్పటికే స్క్రీన్ షాట్లు తీసిన నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో అఫ్గానిస్తాన్కు ఎప్పుడు వెళ్లావు బాబర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో ఘోర ప్రదర్శన అనంతరం అన్ని ఫార్మాట్లలో పాక్ కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. బాబర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో బీజీగా ఉన్నాడు. చదవండి: యశస్వికి ‘డబుల్’...శ్రేయస్, కిషన్ అవుట్ He's everywhere🥰😂 Jalwa hai Hamara😎#BabarAzam𓃵 pic.twitter.com/LdFqunZM5i — 𝑨𝙗𝒅𝙪𝒍𝙡𝒂𝙝 𝙎𝒖𝙡𝒕𝙖𝒏⁵⁶ (@Abdullahs_56) February 28, 2024 -
బాబర్ ఆజమ్ విధ్వంసం.. టీ20ల్లో 11వ శతకం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజమ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఇస్లామాబాద్ యునైటెడ్తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్లో బాబర్.. 59 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ మ్యాచ్లో మొత్తం 63 బంతులను ఎదుర్కొన్న బాబర్.. 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 111 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.పెషావర్ ఇన్నింగ్స్లో బాబర్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. సైమ్ అయూబ్ (38) కాస్త పర్వాలేదనిపించగా.. మొహమ్మద్ హరీస్ (2), హసీబుల్లా ఖాన్ (0), పాల్ వాల్టర్ (19), రోవ్మన్ పావెల్ (8) విఫలమయ్యారు. ఆఖర్లో ఆసిఫ్ అలీ (17 నాటౌట్) వేగంగా పరుగులు సాధించాడు.ఈ మ్యాచ్లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 42 బంతులు తీసుకున్న బాబర్.. ఆతర్వాతి హాఫ్ సెంచరీని కేవలం 21 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2, నసీం షా, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, పొట్టి క్రికెట్లో 11వ సెంచరీ (284 మ్యాచ్ల్లో) పూర్తి చేసుకున్న బాబర్.. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీల రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఈ ఫార్మాట్లో గేల్ అత్యధికంగా 22 సెంచరీలు (463 మ్యాచ్ల్లో) చేశాడు. -
దమ్ముంటే ఇక్కడకు రా.. కట్టలు తెంచుకున్న బాబర్ ఆగ్రహం
Angry Babar Azam Fumes At Ill Mannered Fans: పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంకు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఆకతాయి బాబర్ ఆట తీరును కించపరిచేలా కామెంట్ చేశాడు. దీంతో సహనం కోల్పోయిన ఈ మాజీ కెప్టెన్ అతడి పైకి బాటిల్ విసిరాలని చూశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందంటే.. పెషావర్ జల్మీ కెప్టెన్గా ఉన్న బాబర్ ఆజం.. ముల్తాన్ సుల్తాన్స్తో మ్యాచ్లో 31 పరుగులు చేశాడు. ముల్తాన్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బాబర్ ఆజం తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పెషావర్ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 37 పరుగులతో హసీబుల్లా ఖాన్ జల్మీ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలవగా.. బాబర్ 31 పరుగులతో అతడి తర్వాతి స్థానంలో నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనలో ముల్తాన్ సుల్తాన్స్ 174 పరుగులకే కుప్పకూలడంతో పెషావర్ జల్మీ 5 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. మ్యాచ్ సంగతి ఇలా ఉంటే.. డగౌట్లో కూర్చున్న సమయంలో బాబర్ ఆజంను ఉద్దేశించి ఓ ప్రేక్షకుడు ‘జింబాబర్’ అంటూ అరిచాడు. This is really unacceptable, Never expected this from Multan fans.. 🤦♂️ pic.twitter.com/MgZWQlO8oR — Nibraz Ramzan (@nibraz88cricket) February 24, 2024 దీంతో బాబర్కు చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఏయ్ దమ్ముంటే.. ఇక్కడకు రా’’ అంటూ సైగ చేసిన బాబర్ ఆజం.. తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ విసిరేస్తానంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన బ్యాటింగ్ నైపుణ్యాలను తక్కువ చేసి మాట్లాడినందుకు తగిన బుద్ధి చెప్తానన్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘జింబాబర్’ అని ఎందుకన్నాడు? టీమిండియా స్టార్ బ్యాటర్, రన్మెషీన్ విరాట్ కోహ్లితో పోల్చదగిన సమకాలీన క్రికెటర్లలో ఒకడు బాబర్ ఆజం అని పలువురు పాక్ మాజీ క్రికెటర్ల అభిప్రాయం. అందుకు తగ్గట్లుగానే అంతర్జాతీయ స్థాయిలో అద్బుత ఇన్నింగ్స్తో మెరిశాడు ఈ రైట్హ్యాండ్ బ్యాటర్. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ప్రదర్శనతో బాబర్ సతమతమవుతున్నాడు. ముఖ్యంగా పటిష్ట జట్ల మీద మెరుగైన స్కోర్లు సాధించలేకపోతున్నాడు. జింబాబ్వే వంటి పసికూన జట్లపై మాత్రం సెంచరీలు బాదాడు. ఈ నేపథ్యంలో చాలాకాలంగా.. ‘‘జింబాబర్’’అంటూ నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పీఎస్ఎల్ మ్యాచ్లోనూ ఇలాగే ఆటపట్టించే ప్రయత్నం చేయగా.. బాబర్ కోపోద్రిక్తుడయ్యాడు. Kalesh b/w Babar Azam And One of guy from Crowd over he was Calling him "Zimbabar" during PSL match pic.twitter.com/mtR99WDmoW — Ghar Ke Kalesh (@gharkekalesh) February 24, 2024 -
పూనకాలు తెప్పించిన పోలార్డ్.. బాబర్ వరల్డ్ రికార్డు ఇన్నింగ్స్ వృధా
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో కరాచీ కింగ్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర యోధుడు కీరన్ పోలార్డ్ రెచ్చిపోయాడు. పెషావర్ జల్మీతో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో పూర్వంలా పూనకాలు తెప్పించాడు. 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 49 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. 𝑽𝒊𝒏𝒕𝒂𝒈𝒆 𝑷𝒐𝒍𝒍𝒚 𝒊𝒏 𝑷𝑺𝑳 𝟐𝟎𝟐𝟒🔥 📸: Fan Code pic.twitter.com/uUMO58x5Sj — CricTracker (@Cricketracker) February 21, 2024 పోలార్డ్ సుడిగాలి ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో ప్రత్యర్ది బ్యాటర్ బాబర్ ఆజమ్ (పెషావర్) వరల్డ్ రికార్డు ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఈ మ్యాచ్లో 51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 72 పరుగులు చేసిన బాబర్.. టీ20ల్లో అత్యంత వేగంగా (271 ఇన్నింగ్స్ల్లో) 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. He's still got it 🥶pic.twitter.com/kthsVbhdf3 — CricTracker (@Cricketracker) February 21, 2024 పోలార్డ్తో పాటు జేమ్స్ విన్స్ (30 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), ముహమ్మద్ అక్లక్ (13 బంతుల్లో 24; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షోయబ్ మాలిక్ (29 బంతుల్లో 29; ఫోర్, సిక్స్) రాణించడంతో పెషావర్ నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని కరాచీ 16.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పెషావర్ బౌలర్లలో లూక్ వుడ్ (3.5-1-20-2) ఒక్కడే కరాచీ బ్యాటర్లను కాస్త ఇబ్బంది పెట్టాడు. సలాంకీల్ వికెట్ తీసినప్పటికీ (4-0-54-1) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. బాబర్ ఆజమ్ (72) రాణించడంతో 154 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ (19.5 ఓవర్లలో ఆలౌట్) చేయగలిగింది. పెషావర్ ఇన్నింగ్స్లో బాబర్తో పాటు రోవ్మన్ పావెల్ (39), ఆసిఫ్ అలీ (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, హసన్ అలీ చెరో 3 వికెట్లు, డేనియల్ సామ్స్ 2, షోయబ్ మాలిక్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ పడగొట్టారు. -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్ల పరంగా) 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో భాగంగా కరాచీ కింగ్స్తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరుగుతున్న మ్యాచ్లో బాబర్ (పెషావర్ జల్మీ) ఈ రికార్డును సాధించాడు. బాబర్కు ముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ ఈ మార్కును తాకేందుకు 285 ఇన్నింగ్స్లు తీసుకోగా.. బాబర్ కేవలం 271 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్, గేల్ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (299 మ్యాచ్లు), డేవిడ్ వార్నర్ (303), ఆరోన్ ఫించ్ (327) ఉన్నారు. ఓవరాల్గా టీ20ల్లో 10000 పరుగుల మార్కును ఇప్పటివరకు 12 మంది (బాబర్ సహా) క్రాస్ చేశారు. పాక్ తరఫున షోయబ్ మాలిక్, బాబర్ ఆజమ్ ఈ ఘనతను సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 10,000 పరుగుల మార్కును తాకిన బాబర్ 51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. పెషావర్ ఇన్నింగ్స్లో బాబరే టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. బాబర్ ఒక్కడే రాణించడంతో 154 పరుగులకు ఆలౌటైంది. బాబర్తో పాటు రోవ్మన్ పావెల్ (39), ఆసిఫ్ అలీ (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. పెషావర్ ఇన్నింగ్స్లో ముగ్గురు (సైమ్ అయూబ్, జీషన్, సలాంకీల్) డకౌట్లయ్యారు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, హసన్ అలీ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ సామ్స్ 2, షోయబ్ మాలిక్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
యశ్ దయాల్పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
టీడీపీపై బొత్స సెటైర్లు
తప్పక చదవండి
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement