-
రిత్విక్–నిక్కీ జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: సాన్ లూయిస్ ఓపెన్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ డబుల్స్ టైటిల్ను సాధించాడు. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీలో రెండో సీడ్ రిత్విక్–నిక్కీ కలియంద పునాచా (భారత్) ద్వయం చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో రిత్విక్–నిక్కీ జంట 6–3, 6–2తో ఆంటోనీ బెలీర్–మార్క్ హ్యుస్లెర్ (స్విట్జర్లాండ్) జోడీపై గెలిచి 4,665 డాలర్ల (రూ. 3 లక్షల 88 వేలు)ప్రైజ్మనీతోపాటు 75 ర్యాంకింగ్ పాయింట్లను సొంతం చేసుకుంది. రిత్విక్ కెరీర్లో ఇది రెండో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. గత ఏడాది అక్టోబర్లో ఇటలీలో జరిగిన ఒల్బ్లా ఓపెన్లో అర్జున్ ఖడేతో కలిసి రిత్విక్ తొలిసారి చాలెంజర్ డబుల్స్ టైటిల్ను గెలిచాడు. -
జొకోవిచ్ రికార్డు విజయం
టురిన్ (ఇటలీ): అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్లో సెర్బియా దిగ్గజం, ప్రపంచ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్గా 36 ఏళ్ల జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఇటలీ ప్లేయర్ యానిక్ సినెర్తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–3తో నెగ్గి ఈ టోర్నీని రికార్డుస్థాయిలో ఏడోసారి సొంతం చేసుకున్న తొలి ప్లేయర్గా ఘనత సాధించాడు. గతంలో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) ఆరుసార్లు ఏటీపీ ఫైనల్స్ టైటిల్ను గెల్చుకున్నాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్కు విన్నర్స్ ట్రోఫీతోపాటు 44,11,500 డాలర్ల (రూ. 36 కోట్ల 77 లక్షలు) ప్రైజ్మనీ, 1300 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. జొకోవిచ్ 2008, 2012, 2013, 2014, 2015, 2022లలో కూడా ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో చాంపియన్ గా నిలిచాడు. ఓవరాల్గా ఈ ఏడా ది జొకోవిచ్ ఏడు టైటిల్స్ను దక్కించుకున్నాడు. అడిలైడ్ ఓపెన్లో విజేతగా నిలిచిన జొకోవిచ్ ఆ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ టోర్నీ, యూఎస్ ఓపెన్, పారిస్ ఓపెన్ మాస్టర్స్ టోర్నీ, ఏటీపీ ఫైనల్స్లో టైటిల్ సాధించాడు. కెరీర్లో 98వ సింగిల్స్ టైటిల్తో జొకోవిచ్ టెన్నిస్ చరిత్రలో 400 వారాలు ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో నిలిచిన తొలి ప్లేయర్గా గుర్తింపు పొందాడు. -
రిత్విక్–అర్జున్ జోడీకి ఏటీపీ చాలెంజర్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్లో హైదరాబాద్ యువ క్రీడాకారుడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ కెరీర్లో తొలి చాలెంజర్ డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఇటలీలో జరిగిన ఒల్బియా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో రిత్విక్–అర్జున్ ద్వయం 6–1, 6–3తో ఇవాన్ సబనోవ్–మాతెజ్ సబనోవ్ (సెర్బియా) జంటపై గెలిచింది. ఈ ఏడాది రిత్విక్ –అర్జున్ జోడీ పోర్టో ఓపెన్, బ్రాన్òÙ్వగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలలో ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీలతో సంతృప్తి పడ్డారు. మూడో ప్రయత్నంలో ఈ జంట తొలి టైటిల్ను కైవసం చేసుకుంది. తొలి రౌండ్లో రిత్విక్–అర్జున్ 6–3, 6–4తో శ్రీరామ్ బాలాజీ (భారత్)–ఆండ్రీ బెగెమన్ (జర్మనీ)లపై... క్వార్టర్ ఫైనల్లో 6–3, 6–4తో ఆండ్రూ హారిస్–జాన్ ప్యాట్రిక్ (ఆ్రస్టేలియా)లపై... సెమీఫైనల్లో 2–6, 7–6 (11/9), 10–7తో జెబవి–జెడెనెక్ (చెక్ రిపబ్లిక్)లపై గెలుపొందారు. టైటిల్ నెగ్గిన రిత్విక్–అర్జున్ జోడీకి 8,420 యూరోల (రూ. 7 లక్షల 41 వేలు) ప్రైజ్మనీ, 125 పాయింట్లు లభించాయి. -
యూకీ బాంబ్రీకి తొలి ఏటీపీ టైటిల్
మలోర్కా (స్పెయిన్): భారత అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ తన కెరీర్లో తొలి ఏటీపీ టోర్నీ డబుల్స్ టైటిల్ సాధించాడు. మలోర్కా చాంపియన్షిప్ ఏటీపీ–250 టోర్నీ లో యూకీ బాంబ్రీ (భారత్) –లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా) ద్వయం విజేతగా నిలి చింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో యూకీ–హారిస్ జోడీ 6–3, 6–4తో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)–ఒస్వాల్డ్ (ఆస్ట్రియా) జంటను ఓడించింది. విజేతగా నిలిచిన యూకీ–హారిస్ జోడీకి 48,380 యూరోల (రూ. 43 లక్షల 31 వేలు) ప్రైజ్మనీ లభించింది. -
రాఫెల్ నాదల్కు చుక్కెదురు.. తొలి మ్యాచ్లోనే ఓటమి
పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్లో రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్కు తొలి లీగ్ మ్యాచ్లో చుక్కెదురైంది. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో గ్రీన్ గ్రూప్ లీగ్ మ్యాచ్లో తొమ్మిదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 7–6 (7/3), 6–1తో నాదల్ (స్పెయిన్)ను ఓడించి శుభారంభం చేశాడు. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఫ్రిట్జ్ ఎనిమిది ఏస్లు సంధించడంతోపాటు నాదల్ సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. మళ్లీ నంబర్వన్ ర్యాంక్ అందుకోవాలంటే నాదల్ ఈ టోర్నీలో విజేతగా నిలవాల్సి ఉంటుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement