-
రైతు దగ్గర రూ.82 వేలు కొట్టేసిన ఏటీఎం దొంగ!
ఖమ్మం: అవసర నిమిత్తం నగదు డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్ కు వచ్చిన రైతు దగ్గర నుంచి మోసం 82 వేల రూపాయిలు డ్రా చేసుకున్నా కేటుగాడుని ఖమ్మం త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. రైతుకు డబ్బులు డ్రా చేయడం తెలవక పోవడంతో వెనుక ఉన్న వ్యక్తి నేను తిసిస్తాను అని చెప్పడంతో నమ్మి తన ఏటీఎం కార్డు ఇచ్చినట్లు రైతు పేర్కొన్నారు. ఎంతో తెలివిగా ఏటీఎం కార్డు మార్చి 82వేల రూపాయలను కేటుగాడు డ్రా చేసుకున్నాడు. అయితే, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని దొంగను పట్టుకున్నారు. పూర్తీ వివరాల్లోకి వెళ్లితే.. మహబూబాబాద్ జిల్లా పెరుమాళ్ళ సంకీస గ్రామానికి చెందిన బోబ్బ వెంకటరెడ్డి అనే రైతు పురుగు మందులు కొనుగోలు చేసేందుకు ఇటీవల ఖమ్మంకు వచ్చాడు. తన అవసరాల కోసం నగదు డ్రా చేసుకునేందుకు నగరంలోని గాంధీచౌక్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వచ్చాడు. అక్కడ ఉన్న ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తున్న క్రమంలో డబ్బులు రాక పోవడంతో వెనుకనే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి నేను ట్రై చేస్తానని చెప్పి డబ్బులు రావడం లేదని చెప్పి తన కార్డ్ కు బదులు వేరే ఏటీఎం కార్డ్ ఇచ్చి మోసం చేసి తన ఖాతా నుండి 82 వేల రూపాయిలు డ్రా చేసుకున్నట్లు బాధితుడు ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఏటీఎం సెంటర్ సిసి ఫుటేజ్, మోసం చేసి రైతుకు ఇచ్చిన ఏటీఎం కార్డ్ చిరునామా ప్రకారం పోలీసలు విచారణ చేపట్టారు. సిసి ఫుటేజ్ విజువల్స్ అనుమానం గల వ్యక్తి(కొండబోయిన నరసింహారావు) ఆదివారం అనుమానాస్పదంగా గాంధీచౌక్ పరిసరాలలో తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు చేసిన నేరం ఒప్ప్పుకున్నాడు. ఈ నేరంతో పాటు ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మూడు నేరాలు, ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, ఇల్లందులో రెండు నేరాలు చేసినట్లు నిందితుడు అంగీకరించారు. అతనిని అరెస్టు చేసే సమయంలో అతని వద్ద ఉన్న 36,000/- రూపాయల నగదు, పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీన పర్చుకోని రిమాండ్ కు పంపారు. ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసుకునే సమయంలో ఖాతాదారులు జాగ్రత్త లు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. డబ్బులు డ్రా చేయడం తెలియకపోతే ఇంట్లొ సంబంధించిన వ్యక్తులను వెంట తీసుకొని ఏటీఎం సెంటర్ కి వెళ్లాలే తప్పితే గుర్తుతెలియని వ్యక్తుల సహకారం తీసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చదవండి: మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవు -
ఏటీఎం మోసగాడి అరెస్టు
గుంటూరు ఈస్ట్: ప్రియురాలికి బహుమతులు ఇచ్చేందుకు ఏటీఎం వద్ద అమాయకుల్ని మోసం చేసి దోచుకుంటున్న కేటుగాడిని లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. లాలాపేట పోలీస్టేషన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ కండే శ్రీనివాసులు, ఎస్హెచ్వో మురళీకృష్ణలు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన వేల్పుల రాజేష్ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెకు గుంటూరులోని ఓ నర్సింగ్ కళాశాలలో సీటు రావడంతో చేరింది. దీంతో రాజేష్ గుంటూరు మంగళదాస్ నగర్లో అద్దె గదిలో ఉంటూ ప్రేమాయణం కొనసాగించాడు. తన ఖర్చులకు, ప్రియురాలికి బహుమతులు అందించేందుకు అడ్డదారులు తొక్కాడు. అక్టోబర్ మొదటి వారంలో ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసేందుకు ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తిని గుర్తించి మాయమాటలు చెప్పి కార్డు కాజేశాడు. అతని ఖాతాలో రూ.8 వేలు డ్రా చేశాడు. అక్టోబర్ 10వ తేదీ ఆర్టీసీ బస్టాండ్లోని ఎస్బీఐ ఏటీఎం వద్ద ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమె కార్డుతో రూ. 64 వేలు డ్రా చేశాడు. నవంబర్ 4వ తేదీన చందన బ్రదర్స్ పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో ఓ వృద్ధుడికి డబ్బులు డ్రా చేసేందుకు సహాయపడినట్లుగా నటించి తన వద్ద ఉన్న నకిలీ కార్డు ఇచ్చి మోసం చేశాడు. అనంతరం వృద్ధుడి ఖాతాలోని రూ. 72 వేలు లాగేశాడు. వరుస సంఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేసి, వేల్పుల రాజేష్ను అరెస్టు చేశారు. చోరీ చేసిన రూ. 1.36 లక్షలతో అతడు 23 గ్రాముల బంగారు ఆభరణాలు కొనుగోలు చేశాడు. వాటితో పాటు రూ. 40 వేల నగదు, 7 నకిలీ ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. -
పోలీస్ కస్టడీకి మధుకర్రెడ్డి
ధర్మవరం అర్బన్ : అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగ మధుకర్రెడ్డిని కోర్టు అనుమతి మేరకు ధర్మవరం పట్టణ పోలీసులు ఆదివారం తమ కస్టడీకి తీసుకున్నారు. అంతకుముందు ప్రభుత్వ ఆస్పత్రిలో అతడికి వైద్యపరీక్షలు చేయించారు. మధుకర్రెడ్డి ధర్మవరంలో 2013 నవంబర్ 10న చంద్రబాబునగర్కు చెందిన ప్రమీలమ్మను హత్య చేసి ఆమె వద్దనున్న రెండు ఏటీఎంలు, జత కమ్మలను ఎత్తుకెళ్లాడు. అప్పట్లో అతనిపై హత్య కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం మధుకర్రెడ్డిని పట్టణ సీఐ హరినాథ్ ఆధ్వర్యంలో నాలుగురోజులపాటు పోలీసు కస్టడీకి తీసుకున్నారు. -
అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగకు 15 రోజుల రిమాండ్
ధర్మవరం అర్బన్ : అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగ మధుకర్రెడ్డికి ధర్మవరం కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగ మధుకర్రెడ్డిని పదిరోజుల క్రితం చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏటీఎం దొంగ మధుకర్రెడ్డి ధర్మవరంలో 2013 అక్టోబర్ 11న చంద్రబాబునగర్కు చెందిన ప్రమీలమ్మను హత్య చేసి, ఆమె వద్దనున్న రెండు ఏటీఎంలు, జత కమ్మలు ఎత్తుకెళ్లాడు. అప్పట్లో హత్య కేసు నమోదైంది. ఆ హత్య కేసుకు సంబంధించి పట్టణ సీఐ హరినాథ్ తమకు అగించాలని పిటీష¯ŒS వేసి మధుకర్రెడ్డిని ధర్మవరానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సీఐ హరినాథ్ మాట్లాడుతూ ధర్మవరంలో ఏటీఎంలో దొంగతనం, హత్య కేసులో మధుకర్రెడ్డి ప్రధాన నిందితుడని తెలిపారు. మధుకర్రెడ్డిని ధర్మవరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచామని, న్యాయమూర్తి ఈనెల 27వతేదీ వరకు అతనికి రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. -
మధుకరా.. ఎంత పనిచేశావురా..!
– 4 హత్యలు.. 3 హత్యాయత్నాలు – పదుల సంఖ్యలో దోపిడీలు – నాలుగు రాష్ట్రాల ఖాకీలకు ముప్పుతిప్పలు – చివరకు చిత్తూరు జిల్లా పోలీసులకు చిక్కిన వైనం చిత్తూరు (అర్బన్) / కదిరి/ అనంతపురం సెంట్రల్ : హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలతో దక్షిణాది రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టి తప్పించుకు తిరుగుతున్న ఘరానా నేరస్తుడిని చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఏటీఎం సెంటర్లలో డబ్బు డ్రా చేయడానికి వచ్చిన ఖాతాదారులపై దాడికి తెగబడి సంచలనం సృష్టించిన నిందితుడు కొండయ్యగారి మధుకర్రెడ్డిని అరెస్టు చేశారు. నాలుగు హత్యలు, మూడు హత్యాయత్నాలు, పదుల సంఖ్యలో దోపిడీలతో నేర చరిత కలిగిన మధుకర్రెడ్డి వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బాలిరెడ్డిగారి పంచాయతీ దిగువపల్లెకు చెందిన కె.రామచంద్రారెడ్డి కుమారుడే మధుకర్రెడ్డి (38). పదో తరగతి చదువుకున్న ఇతనికి పెద్దలు పెళ్లి చేసినా.. ప్రవర్తన నచ్చక భార్య వదిలి వెళ్లిపోయింది. 2005లో దిగువపల్లెలో నీటి విషయమై ఆనందరెడ్డిపై బాంబులు వేసి చంపడంతో న్యాయస్థానం ఇతనికి జైలుశిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తూ కడప జైలు నుంచి తప్పించుకున్న ఇతను నేరాలు చేయడమే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తంబళ్లపల్లె కాకుండా హైదరాబాద్, మహబూబ్నగర్, పీలేరు ప్రాంతాల్లో మూడు హత్యలు చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అనంతపురం, కదిరి, ధర్మవరం, బెంగళూరు, జడ్చర్ల ప్రాంతాల్లో హత్యాయత్నాలు చేశాడు. మదనపల్లెలో తన తల్లితండ్రులకు చెందిన ఓ ఇల్లు ఉండటంతో తరచూ అక్కడి వస్తూ పోలీసులకు చిక్కాడు. పోలీసులకు షాక్... మధుకర్రెడ్డి కడప జైలు నుంచి తప్పించుకున్న విషయం మాత్రమే తొలుత పోలీసులకు తెలుసు. ఇటీవల పాత నేరస్తుల వేలి ముద్రలను ట్యాబ్లలో అప్లోడ్ చేసి వాళ్లను గుర్తించే సాఫ్ట్వేర్ను అమల్లోకి తీసుకొచ్చారు. ఈక్రమంలో జనవరి 30న మదనపల్లెలో గస్తీలో ఉన్న ఎస్ఐ తిప్పానాయక్ సిబ్బంది శ్రీనివాసులు, రాఘవలతో పాటు ఓ సీపీవోలు మధుకర్రెడ్డిను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల పాటు ఇతన్ని విచారించిన పోలీసులకు దిమ్మదిరిగే వాస్తవాలు తెలియడంతో తేరుకోలేకపోయారు. నిందితుడు చెప్పిన విషయాలతో పీలేరులో యశోదమ్మ హత్య తరువాత కదిరిలోని ఏటీఎంలో డబ్బులు తీస్తున్న ఫుటేజీలను పోలీసులు గుర్తించారు. ఇక హైదరాబాద్, జడ్చర్ల, కదిరి, కేరళ, కర్ణాటక పోలీసులు ఇతన్ని పీటీ వారెంట్పై తీసుకుని దర్యాప్తు చేయనున్నారు. దీంతో పాటు పదుల సంఖ్యలో మధుకర్రెడ్డిపై ఉన్న దోపిడీ కేసులను సైతం పోలీసులు విచారించాల్సి ఉంది. మదనపల్లి పోలీసులను అభినందించిన ఎస్పీ మధుకర్రెడ్డిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపించిన మదనపల్లె పోలీసుల్ని ఎస్పీ అభినందించారు. సీఐ హనుమంతప్పనాయక్తో పాటు ఎస్ఐ తిప్పానాయక్, సిబ్బంది శ్రీనివాస్, రాఘవ, నర్శింహులు, మొహీద్దీన్లను అభినందించారు. ఈ సమావేశంలో మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, చిత్తూరు డీఎస్పీలు రామక్రిష్ణ, లక్ష్మీనాయుడు, సీఐ నాగరాజు, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. మధుకర్ నేరాల్లో.. మచ్చుకు కొన్ని.. - బెంగుళూరు కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బు డ్రా చేయడానికి వెళ్లిన బ్యాంక్ మేనేజర్ జ్యోతి ఉదయ్పై 2013 నవంబర్ 19న మధుకర్ కత్తితో దాడి చేసి పరారయ్యాడు. - 2013 నవంబర్ 11, 12 తేదీల్లో కదిరి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం కేంద్రంలో రూ.3,700 డ్రా చేశారు. - నవంబర్ 10వ తేదీన ధర్మవరంలో ప్రమీలమ్మ అనే మహిళను చంపి, ఆమె నుంచి లాక్కున్న రెండు ఏటీఎం కార్డులతోనే కదిరిలో ఆ మరుసటి దినం ఉదయం 10.36 గంటలకు రూ.3,500, 12న ఉదయాన్నే 5.54 గంటలకు అదే ఏటీఎం సెంటర్లో ఒక సారి రూ.500, ఇంకోసారి రూ.200 డ్రా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతను డ్రా చేసినది ఒకటి ఎస్బీఐ ఏటీఎం కార్డు కాగా.. మరొకటి హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సంబంధించినదిగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement