-
స్టార్ హీరో సినిమా రీరిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న సతీమణి
పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ పుట్టినరోజు సందర్భంగా 'జాకీ' సినిమా కర్ణాటక వ్యాప్తంగా మళ్లీ విడుదలైంది. ఈ చిత్రాన్ని KRG స్టూడియో రాష్ట్రవ్యాప్తంగా 120కి పైగా స్క్రీన్లలో విడుదల చేసింది. మార్చి 17న పునీత్ రాజ్కుమార్ పుట్టినరోజు ఉంది. దీంతో ఆయన అభిమానుల కోరిక మేరకు జాకీ చిత్రాన్ని నేడు రిలీజ్ చేశారు. పునీత్ రాజ్కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. పునీత్ రాజ్కుమార్ మరణించిన తర్వాత ఆయన నుంచి రీరిలీజ అయిన తొలి సినిమా జాకీ కావడంతో చాలా వరకు థియేటర్లలో పూలతో అలంకరించారు. తెల్లవారుజామున 4.30 నుంచి 'జాకీ' స్పెషల్ షోలు వేశారు. అభిమానులతో పాటు సినిమాను చూసేందుకు పునీత్ సతీమణి అశ్విని కూడా వెళ్లారు. వెండితెరపై తన భర్తను చూసి ఆమె భావోద్వేగానికి లోనైంది. కొన్నిసార్లు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారుజ ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అశ్వినితో పాటు పునీత్ రాజ్కుమార్ కుటుంబ సభ్యులు కూడా సినిమా చూశారు. దునియా సూరి డైరెక్షన్లో 2010లో జాకీ సినిమా విడుదల అయింది. కన్నడ ఇండస్ట్రీలో ట్రెండ్సెట్టింగ్ చిత్రాలలో ఒకటిగా, పునీత్ రాజ్కుమార్ కెరీర్లో ల్యాండ్మార్క్ సినిమాల్లో ఒకటిగా జాకీ చిత్రం నిలిచింది. పునీత్ రాజ్కుమార్ సరసన భావన ఇందులో నటించింది. Best ever Fan Show For me 🥺🔥👑 Stadium gintha jasthi soun ithu 🔥#Jackie #DrPuneethRajkumar pic.twitter.com/8HnpUMZDeP — Venka appu (@Venkaappu777) March 15, 2024 -
పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడంటే.. బిగ్ బాస్ 'అశ్విని' కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్-7లో వైల్డ్ కార్డ్తో ఎంట్రీ ఇచ్చిన అశ్విని శ్రీ మంచి పాపులారిటీని తెచ్చుకుంది. 5వ వారంలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన గ్లామర్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్లో టాస్క్ల పరంగా పెద్దగా మెప్పించకపోయిన తన అందాలతో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. హౌస్లో భోలే షావళితో మంచి పెయిర్గా తన ఆటను కొనసాగించిన ఈ బ్యూటీ 12వ వారంలో ఎలిమినేట్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విని హీరో పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తాను గబ్బర్ సింగ్లో నటించిన సమయంలో పవన్తో తనుకున్న పరిచియాన్ని తెలిపింది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఫ్రెండ్గా నటించిన అశ్విని మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ OG సినిమా హిట్ కావాలని ఆమె కోరుకుంది. పవన్ కల్యాణ్ ఎప్పుడూ నా వాడే.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పింది. పవన్ కల్యాణ్ను మళ్లీ కలిసే అవకాశం వస్తే మీ రియాక్షన్ ఏంటని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది. ' పవన్తో దాదాపు 3 నెలలు జర్నీ చేశాను. షూటింగ్ సమయంలో పక్కన కూర్చొపెట్టుకుని పవన్ సార్ మాట్లాడేవారు. సెట్స్లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ తింటున్న డ్రై ఫ్రూట్స్ కూడా తినమ్మా అంటూ నాకు ఇచ్చేవారు. అశ్విని కమాన్ అని ఎంకరేజ్ చేసేవారు. ఆయనకి ఎప్పుడైనా బోర్ కొడితే నన్నే పిలిచేవారు.. ఆపై మాతో పాటలు, డ్యాన్స్ చేపిస్తూ సరదాగా ఉంటారు. అందుకే పవన్ అంటే ఇష్టం. ఆయన నేను క్యారివాన్లో ఉండేవాళ్లం. షూటింగ్కి రోజులో ఒక్కోసారి మాత్రమే పిలిచేవారు. మిగిలిన టైం అంతా క్యారివాన్లోనే ఉండేదాన్ని. ఆయనపై ఉన్న ఇష్టం మాటల్లో చెప్పలేను. సంథింగ్ ఆయనలో ఏదో ఉంటుంది. గబ్బర్ సింగ్ టైంలో సార్తో షూటింగ్ చేసి ఇంటికెళ్లి పడుకున్న తర్వాత ఆయన నాకు కలలోకి వచ్చేవారు. ఆయనతో షూటింగ్ చేస్తున్నట్టుగానే డ్రీమ్స్ వచ్చేవి. ఆయనతో ఎక్కడికో వెళ్లినట్టుగా పిచ్చి పిచ్చి కలలు వచ్చేవి. సార్ నన్ను మర్చిపోయి ఉంటారు కానీ.. నేను ఎప్పటికీ మర్చిపోలేని అనూభూతులు ఆయనతో ఉన్నాయి.'అని ఆమె చెప్పింది. పవన్పై అశ్విని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో గబ్బర్ సింగ్తో పాటు రాజా ది గ్రేట్ వంటి చిత్రాల్లో నటించినా ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు.. మళ్లీ ఇప్పుడు బిగ్ బాస్ వల్ల మంచి గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
బిగ్ బాస్7 : సొట్టబుగ్గల సుందరి అశ్వినీ శ్రీ (ఫొటోలు)
-
రెండో రోజుకే చుక్కలు చూపించారు.. వెళ్లిపోతానని హాట్ బ్యూటీ గోల
బిగ్బాస్ హౌసులోకి వైల్డ్ కార్ట్ ఎంట్రీగా ఐదుగురు కొత్తోళ్లు వచ్చారు. వాళ్లలో ఓ హాటెస్ట్ బ్యూటీ ఉంది. ఆదివారం ఆమె ఒంపుసొంపులు చూసి అబ్బా సూపర్ అనుకున్న ప్రేక్షకులు.. సోమవారం ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అయ్యో రామా అనుకున్నారు. ఓ లేడీ కంటెస్టెంట్ వల్ల ఇలా జరిగింది. అలానే నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏమైందనేది Day 36 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్) పుల్ల పెట్టిన బిగ్బాస్ కొత్తగా వచ్చిన ఐదుగురు సభ్యులు ఇంట్లోకి వచ్చేయడంతో ఆదివారం ఎపిసోడ్ పూర్తయింది. వాళ్లని చూపించడంతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. ఇక ఉదయం లేవగానే బిగ్బాస్ ఫిట్టింగ్ పెట్టేశాడు. కొత్తగా వచ్చినవాళ్లని పోటుగాళ్లు.. ఇప్పటికే హౌసులో ఉన్నవాళ్లు ఆటగాళ్లు అని చెప్పాడు. అలానే హెడ్స్ ఆఫ్ లగేజ్ గేమ్లో భాగంగా హౌసులో ఉన్నవాళ్లందరికీ కలిపి కేవలం ఏడు వస్తువులు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని తిరకాసు పెట్టేశాడు. నామినేషన్స్ రచ్చ తొలుత పోటుగాళ్లు మాత్రమే నామినేషన్ చేస్తారని.. గత ఐదువారాలుగా ఉన్న ఇంటి సభ్యుల్ని మాత్రమే నామినేట్ చేయాలని బిగ్బాస్ చెప్పాడు. వీళ్లలో ఎవరు ఎవరిని నామినేట్ చేశారనేది కింద లిస్ట్ ఉంది. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? నయని పావని - తేజ, అమరదీప్ భోలె షావళి - అమరదీప్, సందీప్ అశ్విని - అమరదీప్, శోభాశెట్టి పూజామూర్తి - తేజ, యవర్ అర్జున్ - సందీప్, అమరదీప్ (ఇదీ చదవండి: ఆ స్టార్ డైరెక్టర్కి ఇంత అందమైన చెల్లెలు ఉందా? ఎవరో గుర్తుపట్టారా?) ఇకపోతే నామినేషన్స్లో భాగంగా అమరదీప్ స్వార్థంతో ఆడుతున్నాడని అశ్విని చెప్పింది. అలానే శోభాశెట్టి గ్రూపిజంతో ఆడుతోందని చెప్పింది. దీంతో శోభా ఫైర్ అయింది. అసలు గ్రూపిజం అంటే ఏంటి? నేను ఎవరితో గ్రూపులో ఉన్నానంటూ రెచ్చిపోయింది. ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ కన్ఫ్యూజ్ చేసి పడేసింది. పోటుగాళ్ల నామినేషన్ పూర్తయిన తర్వాత.. బట్టల విషయంలో అశ్విని- శోభాశెట్టి మధ్య గొడవ జరిగింది. దీంతో శోభా గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్కి తానే మహారాణి అనుకుంటుందా అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. హౌసులో ఆమె పాలిటిక్స్ నడిపిస్తోందని చెప్పింది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, వాళ్లందరూ మాట్లాడుకుని తనని సెపరేట్ చేసేశారని బోరున ఏడ్చేసింది. ట్విస్ట్ ఇచ్చిన బిగ్బాస్ ఇక పోటుగాళ్లు నామినేషన్స్ పూర్తిచేసిన తర్వాత ఆటగాళ్లకు ఛాన్స్ ఇస్తున్నట్లు బిగ్బాస్ చెప్పాడు. ఇందులో భాగంగా పోటుగాళ్లలో ఒకరిని, ఆటగాళ్లలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారనేది కింద లిస్ట్ ఉంది. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? అమరదీప్ - అశ్విని, యవర్ శోభాశెట్టి - అమరదీప్, అశ్విని శివాజీ - అమరదీప్, పూజామూర్తి తేజ - సందీప్, నయని పావని ప్రియాంక - తేజ, అశ్విని సందీప్ - తేజ, అర్జున్ యవర్ - శోభాశెట్టి, పూజామూర్తి ప్రశాంత్ - నయని పావని, అమరదీప్ ఈ నామినేషన్లో భాగంగా అమరదీప్, అశ్వినిని నామినేట్ చేశాడు. వీళ్లిద్దరి మధ్య వాదన జరుగుతున్నప్పుడు.. మీరు కన్నింగ్, సెల్ఫిష్ అని పదాలు నా గురించి వాడటం సరికాదని అశ్విని కామెంట్స్పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. మరోవైపు శోభాశెట్టి.. అశ్విని నామినేట్ చేసేసరికి ఆమె తట్టుకోలేకపోయింది. అందరూ తననే నామినేట్ చేస్తున్నారని గట్టిగా ఏడ్చేసింది. తనని పక్కనున్నవాళ్లు ఓదారుస్తున్నా సరే ఇంటికెళ్లిపోతా, ఎలిమినేట్ చేసేయండి అని చిన్నపిల్లలా ఏడ్చేసింది. అలా సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. అయితే ఆదివారం ఎపిసోడ్ లో హాట్హాట్గా కనిపించి వావ్ అనిపించిన అశ్విని.. ఎలిమినేషన్స్ అనేసరికి ఏడవటం చాలామంది కుర్రాళ్లు అవాక్కయ్యేలా చేసింది. (ఇదీ చదవండి: ఆర్.నారాయణమూర్తికి సారీ చెప్పిన యంగ్ హీరో!) -
కట్టుకున్న భర్తే కాలయముడు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement