-
వెంటిలేటర్పైనే హీరోయిన్.. వేడుకుంటున్న అరుంధతి సోదరి
కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతుంది. మార్చి 14న ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గత కొద్దిరోజులుగా అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది. ఎవరైనా సాయం చేస్తే గానీ బతకదని తన సోదరి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇప్పటికే పలుమార్తు వేడుకున్నారు. అందుకోసం బ్యాంకు వివరాలను సైతం తన ఇన్స్టాగ్రామ్లో ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం త్రివేండ్రంలోని అనంతపూరి ఆస్పత్రిలో అరుంధతికి చికిత్స జరుగుతుందని ఆమె సోదరి ఆర్తీ చెప్పింది. ఇప్పుడు వెంటిలేటర్ సాయంతో అరుంధతి శ్వాస తీసుకుంటున్నట్లు తెలిపింది. వైద్యం కోసం రోజూ దాదాపు రూ. 2 లక్షలు ఖర్చు అవుతోందని, ఇప్పటికే అరుంధతి కోసం రూ. 40 లక్షలు ఆస్పత్రి బిల్లులు చెల్లించామని అర్తీ చెబుతుంది. అరుంధతి తల, వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడమే కాకుండా మెదడులో రక్తం గడ్డకట్టింది. అందుకు సంబంధించిన బ్రెయిన్ సర్జరీ ప్రస్తుతం పూర్తి అయినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడు కూడా కదలలేని స్థితిలో వెంటిలేటర్ మీదే అరుంధతి చికిత్స పొందుతున్నట్లు ఆర్తీ ఆవేధన చెందుతుంది. 90 రోజులు దాటినా తర్వాత కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం క్లారిటీగా చెప్పలేమని వైద్యులు అన్నట్లు ఆర్తీ పేర్కొంది. ప్రస్తుతం అరుంధతికి పక్కటెముకలకి సంబంధించిన శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది కాబట్టి తమకు సాయం చేయాలని ఆమె కోరింది. ఇప్పటికే పలువురు మళయాల నటీమణులు కూడా ఆమెకు సాయం చేయాలని పలు వీడియోల ద్వారా అభ్యర్థిస్తున్నారు. అరుంధతి నాయర్ తమిళ చిత్రం అయిన 'పొంగి ఎజు మనోహర'తో అరుంధతి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన 'సైతాన్' (తెలుగులో భేతాళుడు)లో హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by ❣️A S W A T H Y.R A H U L👸👑❣️ (@__aswathy__sr21__official__) -
చావుబతుకుల మధ్య పోరాటం.. వారం రోజులుగా ఐసీయూలో హీరోయిన్ (ఫోటోలు)
-
మా అక్కను కాపాడండి.. మరోసారి సాయం కోరిన హీరోయిన్ సోదరి
కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతుంది. సుమారు ఆరు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది. ఎవరైనా సాయం చేస్తే గానీ బతకదని తన సోదరి ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. అందుకోసం బ్యాంకు వివరాలను సైతం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థికసాయం కోరుతూ అరుంధతి సోదరి ఆర్తి మీడియా ముందుకువచ్చారు. 'నా సోదరి తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రి బిల్లులు చెల్లించడానికి కూడా మా వద్ద డబ్బుల్లేవు. దాంతో మేము ఫండ్ రైజింగ్ మొదలుపెట్టాం. ఇదొక పెద్ద స్కామ్ అంటూ చాలామంది ట్రోల్ చేశారు. ఆస్పత్రి చుట్టూ మేము పరుగులు పెడుతుంటే ఇలాంటి నెగెటివిటీ వస్తుందనుకోలేదు' అన్నారు. ప్రస్తుతం అరుంధతికి బ్రెయిన్ సర్జరీ చేపించాలని ఆర్తి తెలిపింది. అందు కోసం త్రివేండ్రంలోని అనంతపూరి ఆస్పత్రిలో చేర్పించామని ఆమె చెప్పుకొచ్చింది. కదలలేని స్థితిలో వెంటిలేటర్ మీద అరుంధతి ఉన్నట్లు ఆమె పేర్కొంది. ఇప్పటికే సుమారు రూ. 5 లక్షలకు పైగా ఖర్చు పెట్టామని ఆమె తెలిపింది. ట్రీట్మెంట్ పూర్తయ్యేసరికి ఖర్చు ఎంత అవుతుందో చెప్పలేమని.. అందుకు కావాల్సిన డబ్బు తమ వద్ద లేదని ఆమె వాపోయింది. సాయం చేయాలనుకునే వారి కోసం తన బ్యాంకు ఖాతా వివరాలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అరుంధతి స్నేహితురాలు, సహనటి రమ్య మాట్లాడుతూ.. 'కోలీవుడ్లో తెరకెక్కిన పలు చిత్రాల్లో అరుంధతి హీరోయిన్గా నటించారు. ఆమె తలకు తీవ్రంగా గాయమైంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, లేదా నడిగర్ సంఘం సభ్యులు ఒక్కరూ సాయం చేయడానికి ఆసక్తి చూపించలేదు. కనీసం మాట్లాడనూ లేదు. తన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోలేదు.సహ నటీనటులు కొంతవరకు మాత్రమే సాయం చేయగలరు. ఎందుకంటే, మేము రూ.కోట్లలో సంపాదించడం లేదు.' అని వాపోయారు. తమిళ చిత్రం అయిన 'పొంగి ఎజు మనోహర'తో అరుంధతి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన 'సైతాన్'లో హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Arathy Nair (@aaraty.nairr) -
మృత్యువుతో పోరాడుతున్న హీరోయిన్.. కనీసం ఫోన్ కూడా చేయలేదు!
హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన ఆమెను తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చేర్పించగా ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఓ ఇంటర్వ్కకు హాజరైన ఆమె అనంతరం తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సాయం కోసం నటి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని మరో నటి గోపిక అనిల్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు బ్యాంకు వివరాలను సైతం పొందు పరిచింది. అయితే ఇప్పటివరకు తమిళ ఇండస్ట్రీ సభ్యుల నుంచి ఎలాంటి సాయం అందలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితురాలు, బుల్లితెర నటి రెమ్యా జోసెఫ్ వెల్లడించారు. ఇంతవరకు వారి కుటుంబ సభ్యులను నడిగర్ సంఘం సభ్యులు కూడా సంప్రదించలేదని తెలిపింది. కనీసం ఫోన్ చేసి కూడా ఎవరూ ఆరా తీయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఆర్థిక సాయం కోరితే చాలామంది ట్రోల్ చేశారని అరుంధతి సోదరి ఆరతి వెల్లడించింది. ఇప్పటికే వైద్యానికి దాదాపు రూ.5 లక్షల ఖర్చు అయిందని పేర్కొంది. ప్రస్తుతం బ్రెయిన్ సర్జరీకి డాక్టర్లు సిద్ధమవుతున్నారని ఆరతి తెలిపారు. సినీ కెరీర్.. కాగా 'పొంగి ఎలు మనోహర(2014)' సినిమాతో నటిగా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టిందీ అరుంధతి. విరుమాండికుమ్ శివానందికమ్, సైతాన్, పిస్తా, ఆయిరం పోర్కాసుకల్ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఒట్టకోరు కాముకన్ చిత్రంతో మలయాళ చిత్రసీమకు పరిచయమైంది. పద్మిని, డోంట్ థింక్ అనే వెబ్ సిరీస్ల్లోనూ యాక్ట్ చేసింది. -
స్కూటీపై వెళ్తుండగా యాక్సిడెంట్.. ఐసీయూలో హీరోయిన్..
హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చేర్పించగా ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. వెంటిలేటర్పై హీరోయిన్ ఈ విషయాన్ని నటి గోపిక అనిల్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 'అరుంధతి వెంటిలేటర్పై పోరాడుతోంది. ఆమె కుటుంబానికి ఆస్పత్రి ఖర్చులు భరించే స్థోమత లేదు. మా వంతు మేము సాయం చేశాం. కానీ అది సరిపోవడం లేదు. మీరు కూడా తోచినంత సాయం చేస్తే అది ఆమె మెరుగైన చికిత్సకు ఉపయోగపడుతుంది' అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. ఈ మేరకు బ్యాంకు వివరాలను సైతం పొందు పరిచింది. కెరీర్.. కాగా 'పొంగి ఎలు మనోహర(2014)' సినిమాతో నటిగా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టిందీ అరుంధతి. విరుమాండికుమ్ శివానందికమ్, సైతాన్, పిస్తా, ఆయిరం పోర్కాసుకల్ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఒట్టకోరు కాముకన్ చిత్రంతో మలయాళ చిత్రసీమకు పరిచయమైంది. పద్మిని, డోంట్ థింక్ అనే వెబ్ సిరీస్ల్లోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Gopika Anil (@gops_gopikaanil) చదవండి: ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఏవి ఎందులో అంటే?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement