-
మేము సైతం
కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహంలో భోజనం మానేసి ఖాళీ పళ్లాలను గరిటెలతో ధ్వనింపజేస్తూ ప్రభుత్వ వైఖరికి నిరసన తెలుపుతున్న కుమార్తె క్రాంతి, కోడలు త్రినేత్రి, మనవరాలు భాగ్యశ్రీ. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్నది నానుడి. ఒక మనిషి విజయం వెనుక ఒక కుటుంబం ఉంటుందనడానికి కిర్లంపూడి సాక్షి. ఇదే విషయాన్ని అక్కడంతా ఇప్పుడు ‘కంచం’కంఠంతో చెబుతున్నారు. ఒకరు చేస్తే తపస్సు... ఇద్దరు చేస్తే దీక్ష... ఒక కుటుంబం అంతా చేస్తే అదో యజ్ఞం! అలాంటి యజ్ఞంలో తమ వంతు సామాజిక బాధ్యతను పోషిస్తున్నారు సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులు. కాపులకు రిజర్వేషన్లు, సంక్షేమ నిధి తదితర డిమాండ్లతో శుక్రవారం సతీమణి సహా నిరాహార దీక్ష చేపట్టిన ముద్రగడ పట్టుదల గురించి అందరికీ తెలిసిందే. అటువంటి అకుంఠిత దీక్షాదక్షుని వెనుక ప్రజాకుటుంబమే కాదు సొంత కుటుంబం వెన్నుదన్నుగా ఉంది. వారిలో కుమార్తె క్రాంతి, కోడలు త్రినేత్రిలది కీలకపాత్ర. దీక్ష ప్రారంభమైన ఫిబ్రవరి 5న పద్మనాభం దంపతుల దీక్షకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తమ ఇంటికి తరలివచ్చిన కార్యకర్తలతో వీరిద్దరూ కలిసి వారు నినాదాలు చేశారు. ఇంటి పెద్దల దీక్షలో భాగంగా మధ్యాహ్నం భోజనం మానేసి ఖాళీ కంచాలను గరిటెలతో మోగిస్తూ వినూత్న ఉద్యమ ధ్వనికి నాంది పలికారు. ఆ సందర్భంగా ఆ ఫ్యామిలీని ‘సాక్షి ఫ్యామిలీ’ పలకరించింది. నాన్న ఏం చేసినా ప్రజల కోసమే ‘నాన్న ఏం చేసినా ప్రజల కోసమే. పట్టుదల చాలా ఎక్కువ. ఏ పని తలపెట్టినా దానిని విజయవంతం చేయడానికి తీవ్రంగా శ్రమిస్తారు. నేను చిన్నప్పటి నుంచి నాన్నలో గమనించిన ముఖ్య లక్షణం ఇదే..’ అని చెప్పారు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి. ‘నాన్నకు మా నానమ్మ అంటే చాలా ఇష్టం. నా అసలు పేరు సత్యవతి నానమ్మ పేరే. నానమ్మను నాలో చూసుకుంటారు. నాకూ నాన్న అంటే అంతే ఇష్టం. రాజకీయాల్లో ఎలాంటి టెన్షన్లు ఉన్నా ఇంట్లో మాత్రం మాతో సరదాగానే ఉంటారు. పిల్లలతో హాయిగా ఆడుకుంటారు. కానీ ఉద్యమాలు వస్తే మాత్రం సీరియస్ అయిపోతూంటారు. నేను చాలా దగ్గర్నుంచి చూస్తున్నా. గతంలో నాన్న చేపట్టిన ఐదు ఉద్యమాలూ గమనించా. కానీ నిరాహార దీక్ష అనేటప్పటికీ నా మనస్సులో ఆందోళన ఉంటుంది. నాన్నతోపాటు అమ్మ కూడా దీక్ష చేస్తుంది. గతంలోనే ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. మళ్లీ ఇప్పుడు నాన్నతోపాటు దీక్షకు కూర్చుంది. మాకు మాత్రం అమ్మానాన్న ఆరోగ్యం ఏమవుతుందోననే బెంగ ఉంది. అయినా, ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి పని కోసం వారు దీక్ష చేస్తూంటే వారి గొప్పతనం ఏమిటో మాకు అర్థమవుతోంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా నాన్న పని చేశారు. ఏ రోజూ సొంత ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. ప్రజల కోసమే ఆలోచిస్తారు. ఆ మనోధైర్యంతోనే ఎన్ని కేసులైనా ఎదుర్కొంటారు. అనుకున్నది సాధించేవరకూ వెనక్కు తగ్గరు. కాపుల కోసం నాన్న చేసిన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరిస్తే దీక్ష విరమిస్తారు. ఆయన ఆరోగ్యం తిరిగి కోలుకొనే వరకూ కుటుంబ సభ్యులమంతా కంటికి రెప్పలా చూసుకుంటాం’ అని చెప్పారు క్రాంతి. అంతే కాదు, ‘నాన్న దీక్ష విజ యవంతమై, ఆయన ఆరోగ్యం కుదు టపడ్డాక నాన్నకు ఎంతో ఇష్టమైన బిర్యానీ, చికెన్-65 నేనే స్వయంగా చేసిపెడతా’ అని చెప్పారు క్రాంతి. మాకు చాలా గర్వంగా ఉంది నేను పుట్టి పెరిగింది తూర్పు గోదావరి జిల్లా తునిలోనే. ముద్రగడ పద్మనాభంగారి గురించి నా చిన్నప్పటి నుంచీ మా ఇంట్లో చాలా విషయాలు మాట్లాడుకునేవారు. ఆయన ఇంటికే కోడలుగా వెళ్తానని ఊహించలేదు. నాలుగేళ్ల క్రితం కిర్లంపూడిలో అత్తారింట అడుగుపెట్టా. మా మామగారు నన్ను సొంత కూతురులా చూసుకుంటారు. చాలా గౌరవిస్తారు. ఈ విషయంలో మేమంతా చాలా అదృష్టవంతులం’ అని అన్నారు పద్మనాభం చిన్న కుమారుడు గిరి భార్య త్రినేత్రి. ‘మా మామగారు ప్రజల కోసం ఇలాంటి ఉద్యమం చేయడం చాలా గర్వంగా ఉంది. ఈ నాలుగేళ్లలో అత్తామామల దీక్ష చూడటం నాకిదే తొలిసారి. వారి ఆరోగ్యం గురించి మాకందరికీ దిగులు ఉంది. కానీ ప్రజల శ్రేయస్సు కోసం దీక్ష చేస్తున్నవారికి ఏమీ కాదనే నమ్మకం మాకందరికీ ఉంది’ అని చెప్పారు. - అల్లు సూరిబాబు సాక్షి ప్రతినిధి, కాకినాడ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం, ఆయన సతీమణి పద్మావతి. పక్కన కోడలు త్రినేత్రి, మనుమరాలు భాగ్యశ్రీ, కుమార్తె క్రాంతి. ఊరంతా ఏకతాటిపై! దీక్షలో ఉన్న ముద్రగడ దంపతులు అన్నం ముట్టలేదని ఊరంతా వంటావార్పు మాని సంఘీభావం తెలుపుతున్నారు. ముద్రగడ నిరసన ఏదైనా అది వారికి సమ్మతమే. అందుకే కులాలకు అతీతంగా కిర్లంపూడిలో ఆ కుటుంబానికి మద్దతు లభిస్తోంది. రాజకీయంగా మహిళలకు ప్రోత్సాహం... మహిళలను రాజకీయాల్లో పద్మనాభంగారు ప్రోత్సహిస్తారనడానికి నేనే ఉదాహరణ. ఇరవయేళ్ల క్రితమే నేను జగపతినగరం గ్రామ పంచాయతీకి సర్పంచి (1995-2000) అయ్యా. కిర్లంపూడి ఈ పంచాయతీలో భాగం. మేము బీసీల్లోని గవర కులస్థులం. కానీ గ్రామంలో పద్మనాభం గారి అభిమానులుగా అందరూ ఒకటిగా ఉంటాం. వారి కుటుంబం దీక్షలో ఉండటం వల్ల పంచాయతీలోని 16 వేల మంది ఇళ్లల్లో వంటావార్పూ మానేసి మద్దతు పలికాం. - రాపేటి వర్ధనమ్మ, మాజీ సర్పంచి, జగపతినగరం వైఎస్తో మాట్లాడి రుణమాఫీ చేయించారు పద్మనాభంగారి మాటతో నా భర్త రత్నాజీ కిర్లంపూడి పీఏసీఎస్ అధ్యక్షుడిగా నాలుగు దఫాలు ఏకగ్రీవంగా పనిచేశారు. మూడుసార్లు కరువొచ్చి పీఏసీఎస్లో తీసుకున్న పంట రుణాలు రైతులు చెల్లించలేకపోయారు. వైఎస్ రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీ ప్రకటించినప్పుడు పద్మనాభంగారు మాట్లాడి మా గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేశారు. నా భర్త అనారోగ్యంతో చనిపోయిన తర్వాత నన్ను పీఏసీఎస్ అధ్యక్షురాలిగా పద్మనాభంగారే ఏకగ్రీవం చేయించారు. - ఆడారి సూర్యకుమారి, అధ్యక్షురాలు, కిర్లంపూడి పీఏసీఎస్ శుభకార్యం కార్డులో పద్మనాభంగారి పేరు మా గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా మేము వెళ్లేది పద్మనాభంగారి ఇంటికే. ఆయన వీలును బట్టి తేదీ నిర్ణయించుకుంటాం. పెళ్లికార్డులోనూ పద్మనాభంగారి ఆశీస్సులతో... అని పేరు వేసుకుంటాం. ఏ ఇంట్లో శుభకార్యమైనా దంపతులిద్దరూ వస్తారు. అలాంటివారు ఇప్పుడు దీక్షలో కూర్చున్నారంటే వారి ఆరోగ్యంపై మేమంతా దిగులు చెందుతున్నాం. మా గురించి ఆయన చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే మహిళలమంతా నిరసన గళమెత్తుతాం. - చల్లా సత్యవతి, గృహిణి, కిర్లంపూడి మాది ఆకలి పోరాటం పద్మనాభంగారి దీక్ష మాలాంటి విద్యార్థుల కోసం చేస్తున్నారు. రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఆర్థిక స్థోమత సరిపోక ఉన్నత విద్యకు, ఉపకార వేతనాలకు ఎంతోమంది దూరమవుతున్నారు. భారీగా రుసుం చెల్లించి ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా కటాఫ్ మార్కుల వ్యత్యాసంతో అవకాశాలు కోల్పోతున్నాం. అందుకే పద్మనాభంగారి దీక్షకు ఒక్క కిర్లంపూడిలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల మద్దతు ఉంటుంది. ఎందుకంటే మాది ఆకలి పోరాటం. మాకు ఉద్యోగాలు కావాలి. ఉపాధి కావాలి. - వింజరపు శాంతి, ఎంఎస్సీ, బీఈడీ విద్యార్థిని, కిర్లంపూడి పద్మావతి గారి ఆరోగ్యంపైనే ఆందోళన పద్మనాభంగారి భార్య పద్మావతి గారు చాన్నాళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆమె ఎక్కువసేపు దీక్షలో కూర్చోవడం మంచిది కాదని చెప్పాను. షుగర్ లెవెల్స్ కూడా ఆందోళనకరంగానే ఉన్నాయి. పదిహేనేళ్లుగా పద్మనాభంగారి కుటుంబంతో మాకు సాన్నిహిత్యం ఉంది. గ్రామంలో మేము ఆసుపత్రి నిర్మించాలనే మా ఆలోచన చెప్పిన వెంటనే ఆయన ఎంతగానే సంతోషించారు. ఏ అవసరం వచ్చినా తన సహాయం ఉంటుందని చెప్పడం మాకు కొండంత అండ. - డాక్టర్ ఏబీ జ్యోతిర్మయి, గైనకాలజిస్టు, కిర్లంపూడి అన్నివిధాలుగా అండదండలు మేము ఏ పని చేసినా పద్మనాభంగారి అండదండలు ఉంటాయి. అంగన్వాడీ వర్కర్లకు జీతం పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇచ్చారు. ఆ జీవో విడుదల కోసమే విజయవాడ వెళ్లాం. అందుకని మా ఉద్యోగాలు తీసేస్తారని వార్తలొస్తే మేము పద్మనాభంగారి దృష్టికి తీసుకెళ్లాం. మాకు తండ్రిలా ధైర్యం చెప్పారు. మేము కనిపిస్తే చాలు... అంగన్వాడీ కేంద్రంలో పిల్లల బాగోగులు, సరుకులు మంజూరు గురించి అడిగి తెలుసుకుంటారు. - చింతపల్లి రత్నం, అంగన్వాడీ వర్కర్, కిర్లంపూడి -
మదర్ మధు
తల్లిదండ్రులే వద్దనుకున్నవారు కొందరైతే... విధి ఆడిన నాటకంలో అనాథలైన వారు మరికొందరు. వారికి ఇపుడొక అమ్మ ఆసరా దొరికింది. అమ్మ కాని ఆ అమ్మ మధు టుగ్నైడ్! బుద్ధిమాంద్యం, శారీరకవైకల్యం ఉన్న పదకొండు మంది చిన్నారులను దత్తత తీసుకొని కంటిపాపలా చూసుకుంటున్నారామె. వారికోసం నగర రణగొణ ధ్వనులకు, కాలుష్యానికి దూరంగా విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవకు ఆనుకొని ‘ఇచ్ఛ’ ఆశ్రమం నిర్మించారు. ఈ ప్రస్థానంలో ఆమె ప్రారంభపుటడుగులు, ఎదురైన అనుభవాలు ఆమె మాటల్లోనే... ‘‘మా స్వస్థలం ఢిల్లీ. నాన్న మిలట్రీ ఉద్యోగి. నేను పెరిగిందంతా ముంబైలోనే. నా భర్త టుగ్నైడ్ నేవీలో కమాండర్. ఆయనకు 1987లో ముంబై నుంచి కోచికి, అక్కడి నుంచి 1989లో వైజాగ్కు ట్రాన్స్ఫర్ అయ్యింది. బీచ్రోడ్డులోనే మా ఫ్లాట్. మా అబ్బాయి రోహిత్ ఎంటీవీలో ఉద్యోగి. పెళ్లి చేసుకొని ఢిల్లీలోనే ఉంటున్నాడు. టుగ్నైడ్ కూడా రిటైర్ అయ్యాక డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో కన్సెల్టెంట్గా హాల్దియాలో పనిచేస్తున్నారు. ఆ నవ్వే నడిపించింది... ఓ ఇద్దరు అనాథలనైనా దత్తత తీసుకోవాలని ఇరవై ఏళ్ల క్రితమే అనుకున్నా. కానీ ఆర్థిక పరిస్థితుల రీత్యా అపుడు వెనక్కుత గ్గవలసి వచ్చింది. తర్వాత కొంతకాలం ఫ్యాషన్ డిజైనర్గా వైజాగ్ సిరిపురం జంక్షన్లో బొటిక్ నడిపాను. ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్న తర్వాత 2012లో పిల్లలను దత్తత తీసుకోవడానికి ‘శిశుగృహ’ అనాథ శరణాలయానికి వెళ్లాను. అయితే వైకల్యంతో ఉన్న అక్కడి పిల్లలను తీసుకోవడానికి మొదట కొద్దిగా సంశయించాను. కానీ అక్కడున్న రెండేళ్ల మహేశ్ నా వేలు పట్టుకున్నాడు. ఊయలలో ఉన్న సాయి నావైపు చూసి చిరునవ్వు నవ్వాడు. వారిద్దర్నీ చూశాక నా సంశయం పటాపంచలైపోయింది. వారిద్దరితో పాటు అల్కాను దత్తత తీసుకున్నాను. ఇంట్లోనే ఏడాది పాటు వారి సంరక్షణను, బాగోగులను చూసుకున్నాను. కానీ ఏదో వెలితి. ఇంకా ఇలాంటి వారి కోసం ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. బ్యాంకు లాకర్లోని నగలు అమ్మేస్తే వచ్చిన రూ. 11 లక్షలతో స్థలం కొన్నాను. ఆశ్రమం నిర్మించడానికి పుణెలో మాకు ఉన్న ఫ్లాట్ అమ్మేశాను. గతంలో కొండకర్ల ఆవకు మా కుటుంబం అంతా చాలాసార్లు పిక్నిక్కు వచ్చాం. ఇక్కడి వాతావరణం నాకెంతో నచ్చింది. అందుకే ఇక్కడ స్థలం కొని 2013లో ఆశ్రమం ఏర్పాటు చేశాను. ఈ ఆశ్రమానికి, స్వచ్ఛంద సంస్థకూ ‘ఇచ్ఛ-’ అని పేరు పెట్టుకున్నాను. ఇచ్చ అంటే కోరిక. పిల్లలకు అమ్మానాన్న, ఇల్లు కావాలనే కోరిక సహజం కదా! ఇపుడు ఆశ్రమంలో పిల్లల సంఖ్య పదకొండుకు చేరింది. మిగతా పిల్లలతోపోల్చితే వీరి సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓర్పూ నేర్పూ ఉండాలి. నాతో పాటు ఒక ఫిజియోథెరఫిస్ట్, ముగ్గురు కేర్టేకర్స్ వారినీ నిరంతరం కనిపెట్టుకొని ఉంటాం. నెలవారీ డొనేషన్ ఉండాలి... ఆశ్రమం దినసరి నిర్వహణతో పాటు వైద్యచికిత్సలకూ ఖర్చు పెరుగుతోంది. అయినప్పటికీ ఇక్కడే ఒక పూర్తిస్థాయి స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్, ఫిజియోథెరఫీ సెక్షన్, వాటర్ థెరఫీ కోసం హైడ్రోప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాను. దాతలు ఒకేసారి డొనేషన్ మొత్తం ఇచ్చే కంటే నెలనెలా కొంత కచ్చితంగా వచ్చేలా ఏర్పాటు చేస్తే మా ప్లానింగ్ సులువవుతుంది’’. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య మహేశ్ (4ఏళ్లు): చెవుడు లేదు. మూగ మాత్రమే ఉంది. వారానికి రెండ్రోజుల పాటు స్పీచ్ థెరఫీ ఇప్పిస్తున్నారు. అల్కా (3): రెండ్రోజుల శిశువుగా ఉన్నపుడు విశాఖ రైల్వేస్టేషన్లో వదిలేశారు. ఆమె మెదడు ద్రవస్థితిలో ఉండటంతో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. సాయి (3): అవాంఛిత గర్భం వల్ల ఓ అవివాహిత ఈ బిడ్డను ఓ న్యాయవాది ఇంటి వద్ద వదిలివెళ్లిపోయింది. అతను రెండు నెలల తర్వాత శిశుకేంద్రానికి అప్పగించారు. దత్తత తీసుకున్నపుడు ఆర్నెల్ల వయసు. నరాల సమస్య వల్ల నడవలేడు, కూర్చోలేడు, ఏమీ తినలేడు. ఫిజియోథెరఫీ చేయడం వల్ల ప్రస్తుతం మార్పు కనిపిస్తోంది. రాణి (2): పెద్ద తల, చిన్న శరీరం, తక్కువ బరువుతో అనకాపల్లి ఆసుపత్రిలో పుట్టిన ఈ పాపను తల్లిదండ్రులు అక్కడే వదిలేశారు. రాణికి ఒక చేయి లేదు. మరో చేతి వేళ్లు అంటుకుపోయాయి. పెదవి కూడా గ్రహణం మొర్రు ఉండటంతో ఇటీవలే శస్త్రచికిత్సతో సరిచేశారు. తేజ (7): బుద్ధిమాంద్యం, హెపటైటిస్-బితో బాధపడుతోన్న ఈమెను తల్లిదండ్రులు రైల్వేస్టేషన్ ప్లాట్ఫాంపై వదిలేశారు. తేజశ్రీ (4): కొండకర్ల గ్రామానికి చెందిన తేజశ్రీ తల్లి ఆత్మహత్య చేసుకుంది. తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు బుద్ధిమాంద్యంతో పాటు ప్రమాదకరమైన మయోపిట్స్ సమస్య ఉంది. బషీరా (8): మెదడులో సమస్య ఉండటంతో ఏదీ రిజిస్టర్ కాదు. క్షణ క్షణానికి ఆమె ప్రవర్తన మారిపోతుంటుంది. తండ్రి ఎటో వెళ్లిపోవడంతో వైజాగ్లో ఉంటోన్న తల్లి ఆమెను తనవద్ద ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. తనూశ్రీ (7 నెలలు): గత జూలై 18న రెండు నెలల పాపగా ఆశ్రమానికి వచ్చింది. ఈమెకు జననేంద్రియాలు రెండూ కలిసిపోయి ఉన్నాయి. వైద్యులతో పరీక్ష చేయిస్తే బాలిక లక్షణాలే ఎక్కువగా ఉన్నాయని, కొద్దిగా వయసు వచ్చిన తర్వాత శస్త్రచికిత్స చేస్తే సరిపోతుందని తేలింది. శ్యామ్ (5): అనకాపల్లి రైల్వేస్టేషన్లో తల్లిదండ్రులు చాపలో చుట్టి వదిలేశారు. నరాల సమస్య వల్ల కూర్చోలేదు, నడవలేదు, గొంతులో సమస్యతో ద్రవ పదార్థమే ఆహారం. గిరిజ (8) : ఆశ్రమంలో చేరేటపుడు చాలా సన్నంగా, పెద్ద పొట్టతో ఉండేది. లివర్ సమస్య ఉంది. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. తార (3): కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలులో ఎవరో వదిలివెళ్లిపోయిన ఆమెను చైల్డ్లైన్ అధికారులు గత నెలలోనే ఆశ్రమంలో చేర్పించారు. మెదడు బాగానే ఉన్నా కాళ్లూచేతుల్లో సత్తువ లేదు. నరాల సమస్యతో బాధపడుతోంది. - అల్లు సూరిబాబు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement