-
ఎయిర్ కోస్టాకు మళ్లీ రెక్కలు?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెక్కలు తెగి ఆగిపోయిన ఎయిర్ కోస్టా... మళ్లీ రెక్కలు తొడుక్కోనుందా? 50 విమానాల కోసం ఎయిర్ కోస్టా ఇచ్చిన ఆర్డరింకా రద్దు కాలేదని ఎంబ్రాయిర్ సంస్థ స్పష్టం చేయడంతో ఈ ఊహాగానాలు నిజం కావచ్చనే అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రారంభం అయిన తొలి విమానయాన సంస్థ ఎయిర్ కోస్టా.. నిధుల సమస్యతో 2016 జూలై నుంచి తన సర్వీసులను నిలిపేయటం తెలిసిందే. సమస్య నుంచి బయట పడేందుకు ఎయిర్ కోస్టా ప్రయత్నిస్తోందని ఎంబ్రాయిర్ కమర్షియల్ ఏవియేషన్ ఆసియా పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ పెరీరా వెల్లడించారు. ఇక్కడ జరుగుతున్న వింగ్స్ ఇండియా 2018లో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో ఈ విషయాలు చెప్పారు. ‘50 విమానాల కోసం ఎయిర్ కోస్టా ఇచ్చిన ఆర్డరింకా మా పుస్తకాల్లో ఉంది. రద్దు కాలేదు. ఆ సంస్థ తిరిగి సర్వీసులు ప్రారంభించవచ్చు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే తప్ప ఆర్డరు రద్దు చేయం. ఆ సంస్థతో సంప్రతింపులు జరుపుతున్నాం. సమస్య నుంచి బయటపడేందుకు ఎయిర్ కోస్టా కృషి చేస్తోంది. ఆ సంస్థ ఆర్డర్లు వేరే కంపెనీకి బదిలీ చేయలేదు’ అని పేర్కొన్నారు. యెస్.. నిజమే: ఎయిర్ కోస్టా.. విజయవాడకు చెందిన లింగమనేని గ్రూప్ ఎయిర్ కోస్టాను ప్రమోట్ చేస్తోంది. పెరీరా వ్యాఖ్యలు నిజమేనని ఎల్ఈపీఎల్ ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘మీరు విన్నది నిజమే. త్వరలోనే ఎయిర్ కోస్టాకు రెక్కలు రానున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాదే సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. ఎంబ్రాయిర్తో సంప్రతింపులు కొనసాగుతున్నాయని ధ్రువీకరించారు. -
ఎయిర్ కోస్టా చేజారిన విమానాలు
⇒ ఉన్న రెండూ జీఈ క్యాపిటల్ వద్ద లీజుకు తీసుకున్నవే ⇒ జీఈ అభ్యర్థనతో రద్దు చేసిన డీజీసీఏ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ ఎయిర్ కోస్టాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎయిర్ కోస్టా పేరున నమోదైన రెండు విమానాలను కేంద్ర పౌర విమానయాన శాఖ (డీజీసీఏ) రద్దు చేసింది. ఇప్పటికే పైలట్లతో సహా సగానికిపైగా సిబ్బంది కంపెనీకి గుడ్బై చెప్పేసిన సంగతి తెలిసిందే. తాజాగా డీజీసీఏ తీసుకున్న నిర్ణయం కంపెనీకి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. 112 సీట్లున్న ఎంబ్రార్ ఈ–190 రకానికి చెందిన ఈ విమానాలను జీఈ క్యాపిటల్ ఏవియేషన్ సర్వీసెస్ సమకూర్చింది. విమానాలను లీజుకు తీసుకున్న ఎయిర్ కోస్టా అద్దె చెల్లించకపోవడంతో జీఈ అభ్యర్థన మేరకు డీజీసీఏ తాజా నిర్ణయం తీసుకుంది. రెండు విమానాలను జీఈ తన స్వాధీనంలోకి తీసుకుంది. 2017 ఫిబ్రవరి 28 నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మే 31 వరకు సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ఎయిర్ కోస్టా ఇది వరకే ప్రకటించింది. ఆందోళనకు సిబ్బంది రెడీ..: ఉద్యోగులకు చెల్లించాల్సిన జనవరి, ఫిబ్రవరి వేతనాలను కంపెనీ ఇప్పటికీ చెల్లించలేదు. మొత్తం 600 మంది ఉద్యోగుల్లో సగానికి పైగా కంపెనీకి రాజీనామా చేశారు. మిగిలినవారూ ఒక్కరొక్కరుగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. 40 మంది పైలట్లు సైతం ఇతర సంస్థల్లో చేరిపోయారు. వేతనాలు ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో మిగిలిన ఉద్యోగులు పోరాటానికి దిగాలని నిర్ణయించినట్టు ఒక సీనియర్ ఉద్యోగి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. విజయవాడలోని కంపెనీ కార్యాలయం ముందు నిరసన తెలియజేయనున్నట్లు చెప్పారాయన. ఇంత జరుగుతున్నా ఎల్ఈపీఎల్ ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. మే 31 తర్వాత కూడా ఎయిర్ కోస్టా సర్వీసులు పునరుద్ధరించే చాన్స్ లేదని స్పష్టమవుతోందన్నారు. -
ఎయిర్ కోస్టా ఎత్తేస్తారా?
► పైలట్లందరూ కంపెనీకి గుడ్బై ► 300 మందికిపైగా ఉద్యోగుల రాజీనామా ► రెండు నెలలుగా సిబ్బందికి జీతాల్లేవ్ ► మరో కింగ్ఫిషర్ అంటున్న సిబ్బంది హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రపంచ దేశాల్లో రెక్కలు వాల్చాలని ఆశగా ఎదురు చూసిన ఎయిర్ కోస్టా శకం ముగిసినట్టే కనిపిస్తోంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న సంస్థను ఆదుకోవడానికి ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రాకపోవటంతో కంపెనీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జనవరి నుంచి తమకు జీతాలు చెల్లించటం లేదని, ఇది మరో కింగ్ఫిషర్గా మారుతోందని కొందరు ఉద్యోగులు గట్టిగానే చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఎయిర్కోస్టా విమానాలు ఎగరటం నిలిచిపోయాయి. మొదట్లో ఈ అవాంతరాలు రెండు మూడు రోజులే ఉంటాయని చెబుతూ వచ్చిన సంస్థ ప్రమోటర్లు... ఇప్పటికీ విమాన సర్వీసుల పునరుద్ధరణ జరగకపోయినా మౌనం వీడటం లేదు. వీటన్నిటికీ తోడు ఉద్యోగులు ఒక్కరొక్కరుగా రాజీనామా చేస్తున్నా... ప్రధానంగా పైలట్లు కంపెనీని విడిచి పోతున్నా... వారిని నిలువరించే ప్రయత్నాలు కూడా చేయటం లేదు. ‘‘ఇదంతా చూస్తుంటే సంస్థను మూసివేయటానికే ప్రమోటర్లు ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్కొక్కరుగా సీనియర్ ఉద్యోగులంతా వెళ్లిపోతున్నా ఒక్కరిని కూడా ఆపే ప్రయత్నాలు చేయటం లేదు’’ అని కంపెనీలో కీలక స్థానంలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. రాజీనామాలు చేసిన వెంటనే వాటిని ఆమోదించడం చకచకా జరిగిపోతున్నట్లు తెలియజేశారు. ఏడాదిగా వేతనాలు సరిగా రావడం లేదని ఆయన వాపోయారు. ‘‘కొత్త ఇన్వెస్టర్ వస్తేనే విమానాలు ఎగురుతాయని కంపెనీ చెబుతున్నప్పటికీ ఇప్పట్లో ఇది సాధ్యపడే అవకాశాలు కనిపించటం లేదు. ఎందుకంటే కంపెనీకి ఉన్నపళంగా రూ.250 కోట్లదాకా నిధులు కావాలి. ఆ స్థాయిలో పెట్టేందుకు ఎవ్వరూ ముందుకొచ్చే అవకాశాలు లేవు’’ అని ఆయన వివరించారు. బాధితులుగా మిగిలిపోయాం.. కంపెనీలో 40 మంది వరకు పైలట్లు ఉండేవారు. దాదాపుగా వీరందరూ వేరే విమానయాన కంపెనీల్లో చేరిపోయారు. అలాగే ఇతర విభాగాల్లో దాదాపు 600 మంది ఉద్యోగులు పనిచేసేవారు. ఇప్పుడీ సంఖ్య సగానికంటేపైగా తగ్గిపోయింది. మిగిలిన ఉద్యోగులు కూడా ఇతర అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. చాన్స్ రాగానే జంప్ అవుతా రని ఇంకా కంపెనీలోనే ఉన్న మరో ఉద్యోగి తెలియజేశారు. ప్రమోటర్లకు, ఉద్యోగులకు మధ్య అంతరం ఉందని చెప్పారాయన. ‘రాజీనామాలు చేస్తుంటే వద్దని ఎవరూ వారించడం లేదు. ఇప్పటి వరకు కంపెనీలో ఏం జరుగుతోందో పత్రికలు, వార్తా చానెళ్ల ద్వారానే తెలుస్తోంది. ప్రమోటర్లు ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కవి చౌరాసియా మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కింగ్ఫిషర్ విషయంలో విజయ్ మాల్యా కనీసం అప్పుడప్పుడైనా మాట్లాడారు. ఎయిర్ కోస్టా విషయంలో అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వానికి అంతా తెలుసు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎవరికీ పట్టడం లేదు. మేము ఇప్పుడు బాధితులుగా మిగిలిపోయాం’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎగిరే అవకాశం లేదు.. వేలాది మంది కస్టమర్లు ఎయిర్ కోస్టా టికెట్లు బుక్ చేసుకున్నారు. సర్వీసులు రద్దు అయిన తర్వాత కస్టమర్ల సొమ్ము తిరిగి చెల్లించేందుకు కంపెనీ ఏర్పాట్లేవీ చేయలేదని మరో ఉద్యోగి చెప్పారు. కస్టమర్ కేర్ నంబరు సైతం మూగబోయింది. విమానాశ్రయాల్లో కంపెనీ ఏర్పాటు చేసిన ఆఫీసులను ఉద్యోగులు తెరుస్తున్నారా లేదా అన్న విషయమూ కంపెనీ పట్టించుకోవడం లేదని మరో ఉద్యోగి చెప్పారు. కస్టమర్తో మాట్లాడేందుకు ఉద్యోగులు ఎవరూ లేరని చెప్పారు. ఎయిర్ కోస్టా బ్రాండ్ కథ ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు ముందుకు వచ్చినా కంపెనీ నిలబడుతుందో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. 2017 మే 31 వరకు సర్వీసులు నిలిపివేసినట్టు కంపెనీ చెబుతున్నా.. మరో నాలుగైదు నెలల దాకా విమానాలు ఎగిరే అవకాశం లేదని, ఆ తరవాతా అనుమానమేనని ఆయన స్పష్టం చేశారు. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ విమానాశ్రయానికి రూ. కోటి, జైపూర్ విమానాశ్రయానికి రూ.40 లక్షలు బాకీ ఉన్నట్టు తెలిసింది. ఉద్యోగులకేగాక ఎయిర్ కోస్టాకు సర్వీసులు అందించే అన్ని కంపెనీలకు బకాయిలు పేరుకు పోయాయి. ఇంకా ఇన్వెస్టర్ల వేట.. మరో మూడు నెలల దాకా విమానాలు ఎగిరే అవకాశం లేదని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కవి చౌరాసియా స్పష్టం చేశారు. ఇన్వెస్టర్ల అన్వేషణ కొనసాగుతోందని వెల్ల డించారు. ఇన్వెస్టర్ ఎవరైనా ముందుకు వచ్చారా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని పేర్కొన్నారు. 250 మంది కంపెనీని విడిచి Ðð ళ్లినట్టు తెలిపారు. ఏడాదిలో రూ.130 కోట్ల నష్టం వివిధ వర్గాల సమాచారం మేరకు... జనవరి నెలకు రూ.2.5 కోట్లు, ఫిబ్రవరికి రూ.3 కోట్ల వేతనాలు కంపెనీ బకాయి పడింది. ఉన్న ఉద్యోగుల్లో యాజమాన్యానికి బాగా కావాల్సిన అతి కొద్ది మందికే జనవరి వేతనాలు అందాయి. ఉద్యోగుల ఖాతాల్లో పీఎఫ్ జమ కూడా నిలిచిపోయింది. అందరికీ మార్చి 15 నాటికల్లా బకాయిలు చెల్లిస్తానని చెప్పిన కంపెనీ... 20వ తేదీ నాటికి కూడా అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్న ఎల్ఈపీఎల్ గ్రూప్నకు జీతాల మొత్తం పెద్ద భారం కాదని, అయినా చెల్లించకపోవటంతో కంపెనీ తీరు అనుమానాలకు తావిస్తోందని సీనియర్ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు. పౌర విమానయాన శాఖకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎయిర్ కోస్టా 2015–16లో రూ.327 కోట్ల టర్నోవరుపై రూ.130 కోట్ల నష్టం చవిచూసింది. నిర్వహణ వ్యయాలు రూ.457 కోట్లుగా ఉన్నాయి. ఎయిర్ కోస్టాకు జీఈ క్యాపిటల్ ఏవియేషన్ సర్వీసెస్ మొత్తం మూడు విమానాలను అద్దెకు సమకూర్చింది. ఈ కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలపై వివాదం తలెత్తడంతో 20 రోజులుగా విమానాలు ఎగరడం లేదు. ఇలాంటి వివాదంతోనే 2016 ఆగస్టు తొలివారంలో ఒక రోజు పూర్తిగా, మరోరోజు పాక్షికంగా సర్వీసులను ఎయిర్ కోస్టా నిలిపివేసింది. -
ఎగరాలంటే పార్టనర్ రావాలి
-
ఎగరాలంటే పార్టనర్ రావాలి
అందుకు సమయం పడుతుంది:ఎయిర్ కోసా అంత వరకు బుకింగ్లు రద్దు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : విమానయాన సంస్థ ఎయిర్ కోస్టాకు కష్టాలు తీరేందుకు మరికొన్ని రోజులు పట్టేలా ఉంది. గత వారం నుంచి సంస్థ విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. విమానాలు మళ్లీ ఎప్పుడు ఎగిరేది అన్న విషయంలో ఇంకా సంధిగ్ధత నెలకొంది. ప్రస్తుతానికి ఎటువంటి బుకింగ్లను కంపెనీ స్వీకరించడం లేదు. కంపెనీ తన వెబ్సైట్ ద్వారా ఏప్రిల్ నెలకు కూడా బుకింగ్లను తీసుకోవట్లేదు. నిధుల లేమితో కంపెనీ సతమతమవుతోంది. ఎయిర్ కోస్టాలోకి కొత్త భాగస్వామి వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని సంస్థ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కవి చౌరాసియా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘భాగస్వామ్యం తీసుకునే ప్రక్రియ సాధారణ విషయం కాదు. వాటా విక్రయం విషయంలో ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. ఒక రోజులో అంతా పూర్తి అయ్యేదీ అసలే కాదు. ఇందుకు సమయం పడుతుంది’ అని వివరించారు. మార్చి 15కల్లా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. అన్ సీజన్లో ఇలా.. సంక్రాంతి తర్వాత నుంచి భారత విమానయాన రంగంలో అన్ సీజన్ మొదలవుతుంది. తిరిగి వేసవి సెలవులు ప్రారంభం అయితేనే సీజన్ మొదలయ్యేది. కొన్ని సంస్థల దూకుడుతో ఇప్పటికే ఇతర కంపెనీల విమానాల్లో సీట్లు నిండడం లేదు. నూరు శాతం సీట్లతో నడిస్తేనే విమాన కంపెనీలకు లాభాలు వస్తాయని ఎయిర్ కోస్టా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఉన్నత తరగతి రైలు టికెట్ల కంటే విమాన ప్రయాణం ఇప్పుడు చవక. దేశంలో ధరల యుద్ధం జరుగుతోంది. అసలే అన్ సీజన్. విమానాలు అద్దెకు ఇచ్చిన కంపెనీకి చెల్లించాల్సిన మొత్తం బాకీ పడ్డాం. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీకి సమస్య రావడం దురదృష్టకరం. త్వరలోనే గట్టెక్కుతామన్న ధీమా ఉంది’ అని వ్యాఖ్యానించారు. జీఈ కొనసాగుతుంది.. పౌర విమానయాన శాఖకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎయిర్ కోస్టాకు 2015–16లో రూ.327 కోట్ల ఆదాయంపై సుమారు రూ.130 కోట్ల నష్టం వాటిల్లింది. నిర్వహణ వ్యయాలు రూ.457 కోట్లుగా ఉంది. జీఈ క్యాపిటల్ ఏవియేషన్ సర్వీసెస్ సమకూర్చిన రెండు విమానాలను కంపెనీ నడుపుతోంది. ఈ కంపెనీతో ఎటువంటి వివాదం లేదని ఎయిర్ కోస్టా ప్రతినిధి స్పష్టం చేశారు. తమ కంపెనీలో వాటా తీసుకోవడానికి ఒక భాగస్వామి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వాటా విక్రయానంతరం కూడా జీఈ విమానాలే నడుస్తాయని ఆయన వివరించారు. ఇప్పటికే ఎయిర్ కోస్టా 50 ఎంబ్రార్ విమానాలకు ఆర్డరు ఇచ్చింది. 2018 నుంచి ఇవి జతకూడనున్నాయి. దేశవ్యాప్తంగా సర్వీసులు అందించేందుకు లైసెన్సు కూడా దక్కించుకుంది. వచ్చే ఏడాది విదేశాలకు విమానాలు నడపాలన్నది కంపెనీ ఆశయం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
Advertisement