-
దేవాలయాన్ని కూల్చలేదని దుర్గగుడి ఈవో బదిలీ!
- గోశాలలో ఆంజనేయస్వామి గుడి తొలగింపు - జలభవన్ కూల్చకుండా నిలిపివేత విజయవాడ దేవాలయాలు కూల్చివేయడం ఒకవైపు సంచలనం కలిగిస్తుంటే మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా దేవాలయం కూల్చివేయలేదనే ఆగ్రహంతో కృష్ణాజిల్లా కలెక్టర్ అహ్మద్బాబు సూచనలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుర్గగుడి తాత్కాలిక ఈవో చంద్రశేఖర్ ఆజాద్ను బదిలీ చేశారనే సమాచారం నగరంలో హల్చల్ చేస్తోంది. అభివృద్ధి పనులు జరుగుతున్న తరుణంలో ఆజాద్ను బదిలీచేస్తే వివాదం అవుతుందని భావించిన ముఖ్యమంత్రి సమయస్ఫూర్తితో దుర్గగుడికి ఐఏఎస్ అధికారిని నియమించి ఆజాద్ను తాత్కాలిక బాధ్యతల నుంచి తప్పించారు. వివరాల్లోకి వెళితే... వారం రోజులుగా నగరంలో దేవాలయాలను అడ్డగోలుగా కూల్చివేశారు. ఇందులో భాగంగానే దుర్గగుడికి వెళ్లే అర్జున వీధిలోని గోశాలనులోని షెడ్లను, కృష్ణుడు మందిరాన్ని తొలగించారు. తొలుత అరవై అడుగులు మాత్రమే విస్తరించాలని ముఖ్యమంత్రి వద్ద గోశాల నిర్వాహకులు, మంత్రులకు మధ్య ఒప్పందం జరిగింది. అయితే దాన్ని తుంగలో తొక్కించి అర్జున వీధిని 100 అడుగులకు విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఆదేశాలను దుర్గగుడి ఈవో ఆజాద్తోపాటు కలెక్టర్ అహ్మద్బాబులు అమలుచేశారు. 106 అడుగుల దూరంలో ఆంజనేయస్వామి గుడి ఉంది. పనిలో పనిగా ఈ గుడిని కూడా పగలగొట్టించమంటూ కలెక్టర్ ఆదేశించారు. సిబ్బంది కొంతభాగం కూల్చిన తరువాత ఆజాద్ అంగీకరించలేదు. అది 106 అడుగులు ఉన్నందున, నిబంధనలకు విరుద్ధంగా తాను కూల్చబోనని చెప్పారు. ఇది తన ఆదేశమని, తక్షణం కూల్చించాలంటూ ఒత్తిడి చేశారు. ఇదేమీ ఆజాద్ పట్టించుకోకుండా మీరు రెవెన్యూ, నేను దేవాదాయ శాఖ ఉద్యోగినని, అంతగా కూల్చాలంటే తమ కమిషనర్తో చెప్పించాలంటూ తెగేసి చెప్పారట. ఆగ్రహించిన కలెక్టర్ అహ్మద్బాబు ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు చెవిన వేయడంతో 24 గంటలు గడిచేలోగా అజాద్కు బదులుగా ఐఏఎస్ అధికారికి దేవస్థానం బాధ్యతలు అప్పగించారు. కేవలం మాట వినలేదని ఆజాద్ను తొలగించడంపై ఇంద్రకీలాద్రి వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతున్నా మౌనంగా ఉన్నారు. రానున్నరోజుల్లోనైనా ఆంజనేయస్వామి గుడిని, గోశాలను పూర్తిగా తొలగిస్తారనే ప్రచారం నగరంలో జోరుగా సాగుతోంది. పురావస్తు శాఖకు చెందిన స్థలం స్వాధీనం... అర్జున వీధిలోని పురావస్తు శాఖకు చెందిన స్థలాన్ని ఆ శాఖ అధికారులు అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి ఆక్రమించుకున్నారు. అక్కన్నమాదన్న గుహలుగా పేరుపొందిన గుహలకు ముందున్న ప్రహరీని పగులగొట్టారు. లోపల ఉన్న లాన్ను ధ్వంసం చేశారు. తమ ప్రమేయం లేకుండా తమ స్థలాన్ని తీసుకున్నారంటూ కేంద్ర ప్రభుత్వం, పురావస్తుశాఖాధికారులు జిల్లా అధికార యంత్రాంగానికి నోటీసులు ఇచ్చారు. జలభవన్ కూల్చివేతకు బ్రేక్ అర్జున వీధి విస్తరణలో భాగంగా కేంద్ర జలభవన్ను గత వారంలో అధికారులు కూల్చివేయబోయారు. అందులో పనిచేసే ఒక ఉద్యోగి భవనాన్ని కూల్చివేస్తున్న విషయాన్ని తమ ఉన్నతాధికారులకు చెప్పేవరకు ఆగాలని కోరినా వినకుండా కొట్టివేయబోయారు. చివరకు రికార్డులు తీసుకోవాలని చెప్పడంతో తొలగించకుండా ఆపారు. ఈ విషయం తెలుసుకున్న జలవనరుల శాఖాధికారులు తమ అనుమతి లేకుండా జలభవన్ను కొట్టివేస్తున్నారంటూ హైకోర్టుకు ఫిర్యాదు చేయడంతో భవనం కూల్చవద్దంటూ స్టే ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ భవనం కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేశారు. -
కలెక్టర్ వింత పోకడలు మానుకోవాలి
విజయవాడ : కలెక్టర్ బాబు.ఎ వింత పోకడలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ దుయ్యబట్టారు. గురువారం ఆయన ఆంధ్రరత్న భవన్లో విలేకర్లతో మాట్లాడారు. ఈ-పోస్ విఫలమవడంతో సకాలంలో రేషన్ అందక లబ్ధిదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్డుల ఏరివేత కోసమే ఇన్ని కుతంత్రాలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి దగ్గరలో ఉందన్న సాకుతో స్వరాజ్య మైదానంలోని రైతుబజార్ను తరలించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. సాంబమూర్తి రోడ్డులోని రైవస్ కాల్వ ఒడ్డుకు మార్చడంపై ప్రజలు, రాజకీయపక్షాలు వ్యతిరేకిస్తున్నా కలెక్టర్ చెవికెక్కకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటీవలే కోటిన్నర ఖర్చు చేసి స్టాల్స్ నిర్మాణం చేశారని, ఇప్పుడు అదంతా వృథా అవుతోందన్నారు. కలెక్టర్ ధోరణి వల్ల వ్యవసాయ పారిశ్రామిక ఎగ్జిబిషన్ దూరమైందని, పుస్తక ప్రదర్శనపై గందరగోళం నెలకొందన్నారు. జాతీయ రహదారి విస్తరణలో కృష్ణలంక ఫీడర్ రోడ్డు కుంచించుకుపోతున్నా కలెక్టర్ పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని కొలనుకొండ తెలిపారు. తాగునీటి ఎద్దడితో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారన్నారని పేర్కొన్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ట్రాన్స్పోర్టు శాఖల్లో పెరుగుతున్న అవినీతి కలెక్టర్ పని తీరును ప్రశ్నిస్తోందని పేర్కొన్నారు. రానున్న ఆగస్టులో కృష్ణా పుష్కరాల నిర్వహణ విషయంలో కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పని తీరు మార్చుకోకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు ఖాయమని ఈ సందర్భంగా ఆయన జోస్యం చెప్పారు. -
ఆ నాలుగు గంటలు
ఆదిలాబాద్ రిమ్స్ : సరిగ్గా సంవత్సరం క్రితం.. ఇదే ఆగస్టు నెల.. అప్పటి కలెక్టర్ అహ్మద్ బాబు ఐదున్నర గంటలపాటు రిమ్స్లో కలియతిరిగి హడలెత్తించారు.. ఇప్పుడు మళ్లీ అదే పునరావృతమైంది. ఇప్పుడు బాబు కాదు.. కలెక్టర్ జగన్మోహన్. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆస్పత్రిలోని అన్ని వార్డులు తిరిగారు. రిమ్స్ అధికారులకు సమాచారం లేకుండా రిమ్స్కు వచ్చి రోగులను సేవల గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ వచ్చిన విషయం తెలుసుకున్న డెరైక్టర్, మిగతా అధికారులు అక్కడికి చేరుకున్నారు. రోగుల రిజిస్టర్, కేషీట్లు పరిశీలించారు. రోగులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధవహించాలని సూచించారు. కలెక్టర్ వెంట రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ శశిధర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్చంద్ర, ఆర్ఎంవో శోభపవార్ ఉన్నారు. అణువణువూ తనిఖీ ముందుగా కలెక్టర్ రిమ్స్ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఫిమేల్ ఆర్థ్రోపెడిక్ వార్డులో రిజిష్టర్ను పరిశీలించగా డిశ్చార్జ్ చేసిన వారి వివరాలు లేకపోవడంతో స్టాఫ్ నర్సులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడంతో సూపర్వైజర్పై మండిపడ్డారు. మరమ్మతులు చేపట్టాలని ఇంజినీరింగ్ ఏఈని ఆదేశించారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డెరైక్టర్కు సూచించారు. రేడియోలజీ విభాగంలో ఒక్కరే రేడియోలజిస్టు ఉండటంతో మరొకరిని నియమించాలని ఆదేశించారు. పిల్లల వార్డుకు వచ్చే పిల్లల కోసం మినీపార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని డెరైక్టర్కు సూచించారు. ఆస్పత్రి పరిసర ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు. అనంతరం రిమ్స్ వైద్య కళాశాలలలోని డెరైక్టర్ చాంబర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో అవసరమున్న పరికరాలు, సిబ్బంది, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే వీటికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని త్వరలో మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతామని తెలిపారు. ప్రొజేరియా చిన్నారికి పరామర్శ రిమ్స్ చిల్డ్రన్స్ వార్డులో ప్రొజేరియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కవితను కలెక్టర్ జగన్మోహన్ పరామర్శించారు. త్వరలో వ్యాధి నయమవుతుందని, బాధపడకుండా ధైర్యంగా ఉండాలని చిన్నారికి కలెక్టర్ ధైర్యం చెప్పారు. వ్యాధి నయమయ్యేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని రిమ్స్ డెరైక్టర్ను ఆదేశించారు. సస్పెన్షన్కు ఆదేశం ఆస్పత్రిలో లోపించిన పారిశుధ్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వార్డులో చూసినా అపరిశుభ్రతే కనిపిస్తోందని, ఈ నిర్లక్ష్యానికి కారణమైన హెల్త్సూపర్వైజర్తోపాటు తనకింద పనిచేసే ఐదుగురు సూపర్వైజర్లను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. రోగులతోపాటు ఆస్పత్రిలోని పరిశుభ్రతను పర్యవేక్షించాల్సిన బాధ్యత వైద్యులపై కూడా ఉందన్నారు. ఆస్పత్రిలో సక్రమంగా పనిచేయకుంటే ఎవరైనా ఇంటికి వెళ్లిపోవచ్చని హెచ్చరించారు. ఆస్పత్రిలో రోగులకు అందించే వైద్యసేవలపై, పారిశుధ్యంపై నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలు తప్పవన్నారు. -
కలెక్టర్ బదిలీపై నిరసనలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పాలనను గాడిలో పెట్టి జిల్లావాసుల మన్ననలను పొందిన కలెక్టర్ అహ్మద్బాబు ఆకస్మిక బదిలీపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ అధికార యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేసిన కలెక్టర్ను సర్కారు ఆకస్మికంగా బదిలీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది కాలం పనిచేయగా, మరో ఏడాదిపాటు ఇక్కడే పనిచేస్తారని భావించిన తరుణంలో ఆకస్మిక బదిలీ జిల్లావాసులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. పలుచోట్ల నిరసనలు కలెక్టర్ అహ్మద్బాబును బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రైతు, జేఏసీ, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పలు మండలాల్లో రాస్తారోకో నిర్వహించారు. నిర్మల్లో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందజేశారు. కలెక్టర్గా బాబును కొనసాగించాలంటూ మంచిర్యాలలో రైతు కూలీ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. చెన్నూరు రహదారిపై ఓవర్బ్రిడ్జి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దండేపల్లిలో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తాంసి మండల కేంద్రంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తలమడుగులో జేఏసీ, రైతులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాలను చేపట్టారు. అజయ్మిశ్రాను కలిసిన కలెక్టర్ బదిలీ ఉత్తర్వులు వెలువడిన వెంటనే అహ్మద్బాబు శు క్రవారం హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి ప్రభుత్వ కా ర్యదర్శి అజయ్మిశ్రాను కలిశారు. కాగా మరోవైపు తన బదిలీని నిలిపివేయాలని కోరుతూ కలెక్టర్ పరిపాలన ట్రిబ్యునల్ను ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ ఈ విషయాన్ని కలెక్టర్ కొట్టి పారేశారు. అలాంటి యోచన తనకు లేదని అహ్మ ద్బాబు ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు.జిల్లాలో విద్య, వైద్య రంగాల అభివృద్ధి పకడ్బందీ ప్రణాళిక రూపొం దించామని, ఈ ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలు చే సేందుకు మరో ఆరునెలల సమయం ఇచ్చినా బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా కొత్తగా జిల్లా కలెక్టర్గా నియమితులైన డాక్టర్ ఎం.జగన్మోహన్ మరో రెం డు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. -
రాత్రికి రాత్రే..
ఆదిలాబాద్ : కలెక్టర్ అహ్మద్ బాబు గురువారం బదిలీ అయ్యారన్న సమాచారంతో ఆదిలాబాద్ పట్టణంలో ఆక్రమణదారులు విజృంభించారు. పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ గోడకు ఆనుకొని గురువారం రాత్రికి రాత్రే స్తంభాలు పాతి కబ్జాలకు దిగారు. దీంతో పాటు గర్ల్స్ హైస్కూల్ పక్కన రోడ్డుకు ఇరుైవైపుల దారిపొడవున ఆక్రమణలు వెలిశాయి. కాగాఐదు నెలల క్రితం కలెక్టర్ చొరవతో పట్టణంలోని ప్రధాన, అంతర్గత రోడ్లకు ఇరువైపుల కబ్జాలను తొలగించడం జరిగింది. అధికార పార్టికి చెందిన ఓ నేత ప్రమేయంతోనే పలువురు కబ్జాదారులు తిరిగి ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయంతోనే ఈ వ్యవహారం రాత్రికి రాత్రే జరిగిందని చర్చించుకుంటున్నారు. పట్టణంలో ఎన్నో ఏళ్లుగా రోడ్డును దర్జాగా ఆక్రమించి పలువురు షెల్టర్లు వేసి వ్యాపారాలు కొనసాగించారు. వాటిని అద్దెకిచ్చుకుంటూ లాభాలు పొందారు. ప్రధానంగా ఈ ఆక్రమణలో రాజకీయ నాయకుల పాత్ర ఉందన్న చర్చ జోరుగా సాగుతున్నది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement