-
అడవిబిడ్డలకు అండగా..
7, 8 తేదీల్లో వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ఏజెన్సీ పర్యటన పలుచోట్ల రోడ్షో, రేఖపల్లి బహిరంగసభలో ప్రసంగం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖీ కాళ్లవాపు, పౌష్టికాహార లోప మృతుల కుటుంబాలకు పరామర్శ వీఆర్పురం / మారేడుమిల్లి : పోలవరం ప్రాజెక్టును 2018లో పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇంత వరకు నిర్వాసితులకు నిర్దిష్టమైన ప్యాకేజీని ఇవ్వకుండా అయోమయంలో నెట్టివేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. దీంతో పాటు అనేక అంశాల్లో గిరిజనులకు భరోసా ఇచ్చి ప్రభుత్వంపై పోరాడేందుకుకే తమ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ఏజెన్సీ పర్యటనకువస్తున్నట్లు తెలిపారు. జగ¯ŒS ఈ నెల 7, 8 తేదీల్లో రంపచోడవరం నియోజకవర్గంతో పాటు విలీనమండలాల్లో చేయనున్న పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ఆదివారం కన్నబాబు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, కొమ్మిశెట్టి బాలకృష్ణ, రాష్ట్ర ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్లతో కలిసి పరిశీలించారు. మారేడుమిల్లిలో జగ¯ŒS బసచేసే అతిథిగృహాన్ని, రోడ్ షో నిర్వహించే ప్రాంతాలను పరిశీలించారు. వీఆర్ పురం మండలం రేఖపల్లి గ్రామంలో 8న జగ¯ŒS పాల్గొననున్న బహిరంగ సభా ప్రాంగణాన్ని సందర్శించారు. అనంత ఉదయభాస్కర్ సభాస్థలిలో ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, మండలాల వారీగా ప్రజల తరలింపు తదితర విషయాలను రఘురామ్కి వివరించారు. గిరిజనులంటే చంద్రబాబుకు చులకన.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయే రైతులను, నిర్వాసితులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కురసాల కన్నబాబు ఆరోపించారు. జగ¯ŒS పర్యటన ఏర్పాట్ల పరిశీలన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు అంటే చంద్రబాబు చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. ఇంత వరకు ఏజెన్సీలో నిర్వాసితులను గాని, కాళ్లవాపు మృతులను గాని పట్టించుకోలేదన్నారు. గిరిజనుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతంలో కాళ్లవాపుతో 12 మంది, పౌష్టికాహార లోపంతో 9 మంది శిశువులు, తల్లులు చనిపోతే ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. ఈ ప్రభుత్వం కళ్లు తెరిపించేలా జగ¯ŒS ఏజెన్సీ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. జెడ్పీటీసీ సత్తి సత్యనారాయణరెడ్డి, గొర్లె బాలాజీబాబు, పార్టీ వీఆర్ పురం మండల కన్వీనర్ పొడియం గోపాల్, జిల్లా నాయకులు ముత్యాల మురళి, ముప్పనశెట్టి శ్రీనివాస్, నక్కా మోహన్, తోట రాజేశ్వరావు, నండూరి గంగాధరరావు, ఆకిరి శ్రీనివాస్, చిక్కాల బాలు, రేవు బాలరాజు, చీమల కాంతారావు, మాచర్ల వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. జగ¯ŒS పర్యటన సాగేది ఇలా.. జగ¯ŒS 7న ఉదయం హైదరాబాద్ నుంచి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి కారులో రంపచోడవరం మండలం గోపవరం వస్తారు. అక్కడ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం సీతపల్లి మీదుగా రంపచోడవరం చేరుకుని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో దేవీపట్నం మండలానికి చెందిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత రైతులతో ముఖాముఖీగా మాట్లాడతారు. అనంతరం రాజవొమ్మంగి మండలంలో ఇటీవల సంభవించిన శిశు మరణాల బాధిత కుటుంబాలను రంపచోడవరంలోనే పరామర్శిస్తారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి బయలుదేరి దేవీగుడి సెంటర్లో రోడ్షోలో పాల్గొంటారు. అక్కడ నుంచి గెద్దాడ మీదుగా మారేడుమిల్లి చేరుకుని రోడ్షోలో పాల్గొంటారు. రాత్రికి మారేడుమిల్లిలో బస చేస్తారు. 8న ఉదయం మారేడుమిల్లి–భద్రాచలం ఘాట్ రోడ్డులో ప్రయాణించి చింతూరు మీదుగా కూనవరం మండలం చేరుకొంటారు. కూనవరం బ్రిడ్జి వద్ద ఆయనకు ఘనస్వాగతం పలుకుతారు. జగ¯ŒS రేఖపల్లి చేరుకొని అక్కడ పోలవరం నిర్వాసిత రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం ఇటీవల కాళ్లవాపు బారిన పడి మృతి చెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. తిరిగి కూనవరం మీదుగా ఎటపాక మండలానికి వెళ్లి అక్కడ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ చేరుకొంటారు. జగ¯ŒS పర్యటనను జయప్రదం చేయాలి మధురపూడి : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి జిల్లా పర్యటనను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ విజ్ఞప్తి చేశారు. కోరుకొండ మండలం గుమ్ములూరులో నిర్మించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి యోగ ముద్రలో ఉన్న విగ్రహాన్ని ఆయన ఆదివారం పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో కలిసి పరిశీలించారు. జగ¯ŒS బుధవారం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏజెన్సీలో, విలీన మండలాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాంబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, గుమ్ములూరు మాజీ సర్పంచ్ మట్టా పెద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
జగన్ పర్యటనను విజయవంతం చేయండి
వీఆర్ పురం : రంపచోడవరం నియోజక వర్గంతోపాటు విలీన మండలాల్లో ఈ నెల 7,8 తేదీల్లో వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహ¯ŒSరెడ్డి చేపట్టనున్న పర్యటనను విజయవంతం చేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్ (బాబు) విజ్ఞప్తి చేశారు. వీఆర్పురం మండలం రేఖపల్లిలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల కన్వీనర్లు పొడియం గోపాల్, టి.వాసు, ఆలూరి కోటేశ్వరావు, వై.రామలింగారెడ్డి, రాష్ట్ర నాయకులు ఆవుల మరియాదాస్, కొమ్మిశెట్టి బాలకృష్ణ, మాచర్ల గంగులు, చండ్ర కృష్ణార్జనరావు, జిల్లా నాయకులు ముత్యాల శ్రీనివాస్, ముత్యాల మురళి, పూసం ప్రసాద్, కొవ్వూరి శివ యాదవ్, కొవ్వూరి రాంబాబు, చిక్కాల బాలు, మామిడి బాలాజి, రేవు బాలరాజు, చింతూరు జెడ్పీటీసీ సోయం అరుణ, కరక లక్ష్మి, మడకం జోగమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
ఏఓబీలో భారీ ఎత్తున పోలీసు కూంబింగ్
వై.రామవరం : ఈనెల రెండో తేదీ నుంచి 8వ తేదీ వరకు గెరిల్లా ఆర్మీ ఆవిర్భావ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో తూర్పు గోదావరి జిల్లా పోలీసు యం త్రాంగం అప్రమ త్తమైంది. తెలంగాణ , చత్తీస్గఢ్, ఒడిషా రాష్రా ్టల సరిహద్దు తోపాటు విశాఖ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో విస్తృతంగా పోలీసు కూం బింగ్ నిర్వహిస్తున్నారు. చింతూరు మండల సరిహద్దు ప్రాం తంలో శుక్రవారం మావోయిస్టులు పెట్టిన మందుపాతరలను పోలీసులు వెలికి తీసిన విషయం విదితమే. అలాగే గత ఎ¯ŒSకౌంటర్లో గట్టి దెబ్బ తిన్న మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చుననే అభిప్రా యంతో, ముందు జాగ్రత్త చర్యగా మరింత అప్రమతం అయిన పోలీసు యంత్రాంగం ఒక పక్క తూర్పు, మరో పక్క విశాఖ జిల్లాల పోలీసు లతో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తూ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడు తున్నారు. అలగే ఏజన్సీ అన్ని పోలీసు స్టేషన్లలో భద్రతను మరింత పటిష్టం చేశారు. దీంట్లో భాగంగా వై.రామవరం మండలం మీదుగా శనివారం మరిన్ని పోలీసు బలగాలు సరిహద్దు అటవీ ప్రాంతంలోకి కూంబింగ్కు బయలుదేరి వెళ్లాయి. ఒకపక్క మావోల వారోత్సవాల పిలుపు, మరో పక్క పోలీసు కూంబింగ్లతో ఏఓబీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం సరిహద్దు అటవీ ప్రాంతంలో గ్రేహౌం డ్స్, ఏఎ¯ŒSఎస్, సీఆర్పీఎఫ్ పోలీçసులు అటవీ ప్రాం తాన్ని జల్లెడ పడుతున్నారు. మావోలు ఇచ్చిన వారోత్సవాల పిలుపుతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రధాన రహదారుల్లో శనివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. దీంట్లో భాగంగా అడ్డతీగల సీఐ ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో అడ్డతీగల–వై.రామవరం ప్రధాన రహదారిలో కల్వర్టులు, అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. అలాగే వేటమామిడి జంక్ష¯Œలో సీఐ వాహన తనిఖీలు నిర్వహించి, కేసులు నమోదు చేశారు. అనుమానితులు, అపరిచితులపై గట్టి నిఘా విధించారు. మావోయిస్టుల వసూళ్లంటూ కరపత్రాలు చింతూరు : మన్యంలో మావోయిస్టులు వారోత్సవాల పేరుతో హల్చల్ చేస్తున్న క్రమంలో వారి వ్యూహాలను తిప్పికొట్టేందుకు పోలీసులు ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలో యాంటీ నక్సల్ స్క్వాడ్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం చింతూరులో పలు వాహనాలపై విశాఖ మన్యంలో మావోయిస్టుల ఏడాది అక్రమ వసూళ్ల వివరాలతో కూడిన కరపత్రాలను అతికించారు. రహదారి కాంట్రాక్టర్లు, గంజాయి స్మగ్లర్లు, చిన్న వ్యాపారులు, క్వారీ యజమానులు, వాహన యజమానులు, బీడీ కాంట్రాక్టర్లు, వెదురు కాంట్రాక్టర్లు, సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి రూ. లక్షలు వసూలు చేశారంటూ కరపత్రాల్లో పేర్కొన్నారు. గిరిజ నుల నుంచి వారి పంట దిగుబడిలో వాటాలు తీసుకుంటున్నారని, గిరిజనులకు చెందాల్సిన సదరు సొమ్ము ఎక్కడికి పోతోంది, ఇందులో సంఘాల నేతల వాటాలెంత అంటూ కరపత్రాలు దర్శనమిచ్చాయి. -
మన్యంలో మావోయిస్టుల హల్చల్
పోలీసులు లక్ష్యంగా మందుపాతర్లు జాతీయ రహదారిపై కలకలం సరివెల(చింతూరు): పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేష¯ŒS గెరిల్లా ఆర్మీ) వారోత్సవాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు తొలిరోజే మన్యంలో హల్చల్ చేశారు. చింతూరు మండలం సరివెల వద్ద గురువారం అర్థరాత్రి జాతీయ రహదారిపై పోలీసులు లక్ష్యంగా మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాల అడుగున నాలుగు మందుపాతర్లను అమర్చారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి వాటిని నిర్వీర్యం చేయడంతో ప్రమాదం తప్పింది. ఈనెల 2 నుండి 8 వరకు పీఎల్జీఏ వారోత్సవాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సరివెల వద్ద జాతీయ రహదారిపై మావోయిస్టులు బ్యానర్లు, కరపత్రాలను వుంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ రహదారి గుండా వెళ్లే వాహనాలను కూనవరం మీదుగా దారి మళ్లించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యానర్లు, కరపత్రాల కింద మావోయిస్టులు మందుపాతర్లు అమర్చి వుంటారని అనుమానించి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సాయంతో తనిఖీ చేశారు. ఊహించినట్టే వాటికింద మావోయిస్టులు అమర్చిన మూడు టిఫి¯ŒS బాక్స్ బాంబులతో పాటు వెదురుతో తయారు చేసిన ఐఈడీని పోలీసులు గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు. సంఘటనా స్థలాన్ని ఓఎస్డీ డాక్టర్ ఫకీరప్ప, సీఐ దుర్గాప్రసాద్ పరిశీలించారు. మావోయిస్టుల కొత్త పంథా తాజా ఘటనా ద్వారా మావోయిస్టులు మన్యంలో కొత్త పంథాకు తెరలేపారు. గతంలో వారోత్సవాలు, బంద్లు నిర్వహించే సమయంలో మావోయిస్టులు కేవలం కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లు వేయడం పరిపాటి. కాగా తాజాగా వాటికింద మందుపాతర్లను అమర్చడం పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో ఛత్తీస్గఢ్లో ఎ¯ŒSకౌంటర్లు జరిగిన సమయంలో పోలీసులు మృతిచెందితే వారి మృతదేహాల కింద మావోయిస్టులు మందుపాతర్లను అమర్చేవారు. మృతదేహాలను తొలగించేందుకు వచ్చిన పోలీసులు వాటి బారిన పడి మృత్యువాత పడేవారు. వారోత్సవాలకు పిలుపునిచ్చిన మావోయిస్టులు ఇప్పటికే ఛత్తీస్గఢ్, తెలంగాణ లో పలుచోట్ల కరపత్రాలు, మందుపాతర్లను మావోయిస్టులు అమర్చారు. ఈ క్రమంలో ఆంధ్రా సరిహద్దుల్లోని తెలంగాణ రాష్ట్రం వెంకటాపురం వద్ద మావోయిస్టులు వుంచిన కరపత్రాలను తీసేందుకు ఓ ఆటోడ్రైవర్ ప్రయత్నించగా అది పేలడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. ప్రతీకారేఛ్ఛలో మావోయిస్టులు: ఇటీవల ఏవోబీలో జరిగిన భారీ ఎ¯ŒSకౌంటర్ ద్వారా 32 మందిని కోల్పోయిన మావోయిస్టులు వారోత్సవాల సందర్భంగా ప్రతీకార దాడులకు పాల్పడవచ్చని ఇప్పటికే నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ నేపధ్యంలో తొలిరోజే ఇటు ఆంధ్రాలో అటు తెలంగాణ , చత్తీస్గఢ్లో మందుపాతర్లు అమర్చడం ద్వారా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకున్నారు. వారోత్సవాల వేళ నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టులు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా పీఎల్జీఏ 16వ వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని, బూటకపు ఎ¯ŒSకౌంటర్లను వ్యతిరేకించాలని, 3వ గ్రీ¯ŒSహంట్కు వ్యతిరేకంగా పోరాడాలని సం«ఘటనా స్థలంలో శబరి ఏరియా కమిటీ పేరుతో వుంచిన కరపత్రాల్లో మావోయిస్టులు పేర్కొన్నారు. కూంబింగ్ను ముమ్మరం చేశాం మావోయిస్టులు వారోత్సవాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరుగకుండా సరిహద్దుల్లో కూంబింగ్ను ముమ్మరం చేశాం. జాతీయ రహదారిపై బ్యానర్లు, పోస్టర్లు వుంచిన విషయం తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేసి వాహనాల దారిని మళ్లించి వాటిని అక్కడినుండి తొలగించాం. వాటికింద అమర్చిన మందుపాతర్లను నిర్వీర్యం చేశాం. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. డాక్టర్ కె.ఫకీరప్ప, చింతూరు ఓఎస్డీ -
5 నుంచి ’అడవిలో హంతకుడు’ షూటింగ్
కొయ్యలగూడెం: ’అడవిలో హంతకుడు’ చిత్ర షూటింగ్ను ఈనెల 5వ తేదీ నుంచి కొయ్యలగూడెం, పోలవరం, బుట్టాయగూడెం మండలాల్లోని అటవీ ప్రాంతంలో చిత్రీకరిస్తున్నట్టు హీరో, దర్శక, నిర్మాత తగరం వంశీరాజు చెప్పారు. కొయ్యలగూడెంలో గురువారం చిత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఇందిరా ఆర్ట్ క్రియేషన్పై నలుగురు హీరోయిన్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. తన స్వగ్రామం కొయ్యలగూడెం కావడంతో పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో చిత్రీకరించేలా చిత్ర కథాంశాన్ని రూపొందించామన్నారు. తాను దర్శకులు రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, కోడి రామకృష్ణ, ఈవీవీ సత్యనారాయణ వద్ద పనిచేశానని చెప్పారు. పయనం, ఆకర్షణ, పాపే నాప్రాణం చిత్రాలకు దర్శకత్వం వహించానన్నారు. ఈ చిత్రంలో జబర్దస్త్ ఫేం అప్పారావు, ఆర్పీ దుర్గారావు, కాదంబరీ కిరణ్ నటిస్తున్నారన్నారు. తనకు నిర్మాత సి.కల్యాణ్ గాడ్ఫాదర్ లాంటివారన్నారు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement